![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/b00b3cad-6cce-43c1-b463-b277dd556c63.jpeg)
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Netflix
Watch
స్ట్రీమింగ్ ఆన్Aha
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Varun_Tej_250_250.jpeg)
వరుణ్ తేజ్
వరుణ్![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sai_Pallavi_250_250.jpeg)
సాయి పల్లవి
భానుమతిసాయి చంద్
భానుమతి తండ్రి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Satyam_Rajesh_250_250.jpeg)
సత్యం రాజేష్
వరుణ్ స్నేహితుడుధాశ్యం గీతా భాస్కర్భానుమతి అత్త
మనీషా ఈరాబతిని
వరుణ్ కజిన్![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Harshvardhan_Rane_250_250.jpeg)
హర్షవర్ధన్ రాణే
భానుమతి పొరుగు/దావాదారుకటారినా రిక్టర్సుజీ
కవిత చంద్రశేఖర్
గౌరీ ప్రియ
సిబ్బంది
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sekhar_Kammula_250_250.jpeg)
శేఖర్ కమ్ముల
దర్శకుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Dil_Raju.jpeg)
దిల్ రాజు
నిర్మాతశక్తికాంత్ కార్తీక్సంగీతకారుడు
విజయ్ సి. కుమార్
సినిమాటోగ్రాఫర్![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/68f78281-7c5e-41ce-bcc2-758c0854fd55.jpeg)
మార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
![Actress Neha Shetty: ‘బెదురులంక’ బ్యూటీకి టాలీవుడ్ ఫిదా..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/08/28123401/cropped-ws_369869190_18289623478131740_4969254074008443209_n.jpg)
Actress Neha Shetty: ‘బెదురులంక’ బ్యూటీకి టాలీవుడ్ ఫిదా..!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
ఆగస్టు 28 , 2023
![BABY: తెలుగింటి అందం వైష్ణవీ చైతన్య లేలేత సొగసులకు ఫిదా కావాల్సిందే.. ఇంతకు ఈమె ఎవరంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/07/11191654/Untitled-design-2023-07-11T191649.450.png)
BABY: తెలుగింటి అందం వైష్ణవీ చైతన్య లేలేత సొగసులకు ఫిదా కావాల్సిందే.. ఇంతకు ఈమె ఎవరంటే?
కుర్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె నటించిన 'బేబీ' చిత్రం జులై 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలిసి ఈ చిన్నది ప్రమోషన్స్లో బిజీ బీజీగా గడుపుతోంది. దీంతో వైష్ణవి పాప ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఈ ముద్దుగుమ్మ బ్యాక్గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వైష్ణవీ చైతన్య తెలుగు అమ్మాయే. 1996లో జనవరి 4న 1996 విజయవాడలో జన్మించింది.
యాక్టింగ్లోకి రాకముందు.. ఈ చక్కని గుమ్మ యూట్యూబ్లో పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించి ఫేమస్ అయింది
యుట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్ సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సీరిస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
అలవైకుంఠాపురంలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఇంకా పలు వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తూ కెరీర్లో జెట్ వేగంతో దూసుకెళ్తోంది
నటిగా, మోడల్గా , డ్యాన్సర్గా బహుముఖ పాటవాన్ని చూపుతూ తాజాగా హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ విజయవాడ పిల్ల
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఫాలోవర్లు ఈ మధ్య భారీగానే పెంచుకుంటోంది. లెలేత అందాల ప్రదర్శనతో కుర్రకారుకు వల విసురుతోంది.
చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసిన ఈ అమ్మడి అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
మరో మూడు రోజుల్లో బేబీ చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.
ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ జోడీగా నటిస్తోంది
ఇప్పటికే బేబీ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్ను క్రియేట్ చేశాయి. సాంగ్స్ కూడా మంచి ఆదరణ పొందాయి.
ఇద్దరు యువకుల ప్రేమ మధ్యలో నలిగిపోయే యువతి పాత్రలో వైష్ణవీ కనిపించనుంది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం అయితే తెరకెక్కింది.
ఇప్పటికే ఈ చిత్రం బృందం వినూత్నంగా ప్రచారాన్ని మొదలు పెట్టింది.
సోమవారం హైదరాబాద్- బోరబండలో ఆటో డ్రైవర్లతో కలిసి సినిమా విశేషాలను పంచుకుంది.
జూలై 11 , 2023
![ALLU ARJUN SON: “ఇక నా పిల్లల చేత శ్రీవల్లి పాట పాడిస్తా”.. అయాన్ టాలెంట్కు షారుక్ ఫిదా!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/02/26180238/Untitled-design-2024-02-26T180217.572.jpg)
ALLU ARJUN SON: “ఇక నా పిల్లల చేత శ్రీవల్లి పాట పాడిస్తా”.. అయాన్ టాలెంట్కు షారుక్ ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పాడిన ఓ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ డుంకీ చిత్రంలోని లుట్ ఫుట్ గయా పాటను మంచి రిదమ్తో పాడాడు. ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేయగా SRK ఫ్యాన్స్తో పాటు బన్నీ ఫ్యాన్స్ సైతం అయాన్ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ వైరల్ వీడియో షారుఖ్ ఖాన్కు చేరింది. అయాన్ టాలెంట్పై SRK స్పందిస్తూ.. నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన బుడ్డోడివి అంటూ ప్రశంసించాడు.
అల్లు అర్జున్ కొడుకు అయాన్.. సెలబ్రెటీ కిడ్ మాదిరిలా కాకుండా చాలా ఫ్రీగా ఉంటాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లలోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ తన టాలెంట్ను చాటుతుంటాడు. తన తండ్రి స్టార్ డమ్ను ఏమాత్రం తనపై ప్రభావం లేకుండా చాలా స్వేచ్ఛగా మాట్లాడుతుంటాడు.
అయితే ఈ మధ్య అల్లు అర్జున్తో కారులో ట్రావెలింగ్ చేస్తున్న క్రమంలో తనకు ఇష్టమైన సాంగ్ను పాడుతా అంటూ బన్నీకి చెప్పాడు. రీసెంట్ మూవీ డుంకీ చిత్రంలోని "లుట్ ఫుట్ గయా" అంటూ తనదైన స్వాగ్లో అయాన్ హమ్ చేశాడు. బ్లాక్, వైట్ అండ్ ఎల్లో జెర్సీ వేసుకున్న అయాన్ చివర్లో షారుక్ ఖాన్ స్టైల్లో ఓ లుక్ ఇస్తూ ముగించాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ ఫ్యాన్ పేజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేశారు. అయాన్కు గొప్ప భవిష్యత్ ఉందంటూ అతని ప్రతిభ ప్రశంసిస్తూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు.
https://twitter.com/SRKUniverse/status/1761332479590297791?s=20
ఈ వైరల్ వీడియోపై బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ స్పందించారు. "నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన వ్యక్తివి అంటూ ప్రశంసించారు. అలాగే పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను తన పిల్లల చేత త్వరలో పాడిస్తానని ఎక్స్లో చెప్పుకొచ్చాడు. షారుక్ స్పందించడంపై అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు అగ్రహీరోల మధ్య జరిగిన ఈ స్వీట్ కాన్వర్జేషన్ ఫ్యాన్స్ను ఆకర్షించింది.
https://twitter.com/iamsrk/status/1761701819687030986?s=20
టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. గతంలో జవాన్ సినిమా విడుదలైన సమయంలో షారుక్ నటనను ప్రశంసిస్తూ బన్నీ కామెంట్ చేశాడు. మాస్ అవతార్లో షారుక్ లుక్ అదిరిపోయిందని, జవాన్ చిత్రం అతి పెద్ద బ్లాక్ బాస్టర్ అంటూ ప్రశంసించాడు. ఆ చిత్ర యూనిట్గా ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఈ పోస్ట్పై SRK సైతం స్పందించి థ్యాంక్స్ చెప్పాడు. తాను పుష్ప సినిమాను మూడు రోజుల్లో మూడు సార్లు చూసినట్లు చెప్పుకొచ్చాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా కలుస్తానని పేర్కొన్నాడు.
https://twitter.com/iamsrk/status/1702214179212411127?s=20
తాజాగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ వీడియో అదేస్థాయిలో షారుక్ స్పందించడం విశేషం. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు షారుక్ ఖాన్ డుంకీ తర్వాత తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించాడు.
ఫిబ్రవరి 26 , 2024
![Disha Patani: ఎద పొంగులతో రెచ్చిపోయిన దిశా పటాని.. హాట్ ట్రీట్తో ఫిదా అవుతున్న నెటిజన్లు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/23111603/Untitled-design-2023-09-23T111550.778.jpg)
Disha Patani: ఎద పొంగులతో రెచ్చిపోయిన దిశా పటాని.. హాట్ ట్రీట్తో ఫిదా అవుతున్న నెటిజన్లు!
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తన అందాల ఆరబోతతో నెటిజన్లను ఉక్కబోతకు గురిచేస్తోంది.
ఎద హోయలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ భామ పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
తాజా ఫొటోల్లో ఈ బ్యూటీ ఎద పొంగులతో రెచ్చిపోయింది. టైట్ ఫిట్ డ్రెస్లో తన ఎదలను ఉబికేలా చేసింది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్ ఇంత హాటా అని కామెంట్లు పెడుతున్నారు.
దిశా పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్లో నిలవడం గత కొంతకాలంగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
లోఫర్ సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘యోధ’ చిత్రంలో దిశా హీరోయిన్గా చేసింది. ఈ మూవీ డిసెంబర్ 15న రిలీజ్ కాబోతోంది.
పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది.
సెప్టెంబర్ 23 , 2023
![Baby Movie Review: యూత్ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/07/14111134/Untitled-design-1.jpg)
Baby Movie Review: యూత్ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా?
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, తదితరులు
డైరెక్టర్: సాయి రాజేశ్
నిర్మాత: శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్)
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
కలర్ ఫొటో వంటి సినిమాకు కథ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ సినిమా తర్వాత స్వయంగా కథ రాసుకుని డైరెక్షన్ వహించిన సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్, మ్యూజిక్తో సినిమాపై అంచనాలు పెరిగాయి. చిత్రబృందం కూడా పూర్తి నమ్మకంతో ఉంది. మరి, ఈ మూవీ ప్రేక్షకుడిని మెప్పించిందా? ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యాడా? అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్కి దగ్గరవుతుంది. శారీరకంగానూ ఒకటవ్వాల్సి వస్తుంది. మరి, వైష్ణవి ఎవరిని ప్రేమించింది? ఆనంద్ ఏమయ్యాడు? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
ప్రచార చిత్రాలను బట్టే సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమైపోయింది. సినిమా చివరికి విషాదాంతమవుతుందని సూచిస్తూ డైరెక్టర్ సినిమాని మొదలు పెట్టాడు. తొలుత ఆనంద్, వైషూల మధ్య వచ్చే స్కూల్ డేస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పెద్దగా డైలాగులు లేకుండా కేవలం హావభావాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సాగే ఈ సీక్వెన్స్ ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు చప్పట్లు కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్లో కథలో వేగం పెరుగుతుంది. ఆనంద్కి తెలియకుండా విరాజ్తో వైష్ణవి బంధాన్ని కొనసాగించడం, విరాజ్ అసలు వ్యక్తిత్వాన్ని ఆలస్యంగా తెలుసుకోవడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ ఎమోషనల్గా సాగుతుంది. యూత్ ఆలోచనకు తగ్గట్టు సన్నివేశాలు సాగడంతో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే?
సినిమాకు ఆనంద్, వైష్ణవి ప్రాణం పోశారు. ఇద్దరూ తమ తమ పాత్రల్లో పోటీ పడి మరీ నటించారు. ఆటోడ్రైవర్గా ఆనంద్ చక్కటి అభినయం ప్రదర్శించాడు. ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేసినా చివర్లో కాస్త తడబడినట్లు అనిపించింది. ఇక బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గర్ల్గా వైష్ణవి చక్కగా చేసింది. లుక్స్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. ఒక రకంగా వైష్ణవి పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణ. బోల్డ్ సన్నివేశాల్లో అందాలు ఒలికించి.. భావోద్వేగ భరిత సీన్లకు న్యాయం చేసింది. ఇక విరాజ్ అశ్విన్, నాగబాబు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్గా..
తెలిసిన కథే అయినప్పటికీ సినిమాను చక్కగా, ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్ సాయిరాజేశ్. డైలాగ్స్తో ప్రేక్షకుడ్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. నేటి యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లేను ప్రజెంట్ చేశాడు. ఎమోషనల్ సీన్లను చక్కగా తీశాడు. అయితే, క్లైమాక్స్లో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్లను పేలవంగా ముగించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా సీన్లను సాగదీసినట్లు ఉంటుంది. ఇక, విజయ్ బుల్గానిని మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాల్ రెడ్డి అందించిన విజువల్స్ సహజంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథనం, డైలాగ్స్
నిర్మాణ విలువలు
యూత్ ఎలిమెంట్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
సాగతీత సన్నివేశాలు
క్లైమాక్స్
చివరగా.. యూత్ మనసును కట్టిపడేసే చిత్రమే ‘బేబీ’
రేటింగ్: 3/5
https://www.youtube.com/watch?v=_npN4uwDMLk
జూలై 14 , 2023
![సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/08122519/123.-77.jpg)
సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
సాయి పల్లవి తెలుగులో ఫిదా చిత్రంతో పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతకు ముందు ఆమె మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాలో మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. మరి సాయి పల్లవి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about Sai Pallavi) విషయాలు ఇప్పుడు చూద్దాం.
సాయి పల్లవి ముద్దు పేరు?
మలార్
సాయి పల్లవి పేరు ఎవరు పెట్టారు?
సాయి పల్లవి పేరును పుట్టపర్తి సాయిబాబా పెట్టారు
సాయి పల్లవి వయస్సు ఎంత?
1992, మే 9న జన్మించింది
సాయి పల్లవి తెలుగులో నటించిన తొలి సినిమా?
ఫిదా
సాయి పల్లవి ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
సాయి పల్లవి ఎక్కడ పుట్టింది?
కోటగిరి, తమిళనాడు
సాయి పల్లవి ఏం చదివింది?
MBBS
సాయి పల్లవి అభిరుచులు?
డ్యాన్సింగ్, సింగింగ్
సాయి పల్లవికి ఇష్టమైన ఆహారం?
చాకోలెట్స్, స్వీట్స్
పూజా హెగ్డేకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
సాయి పల్లవికి ఇష్టమైన హీరో?
కమల్ హాసన్, మమ్మాటి
సాయి పల్లవికి ఇష్టమైన హీరోయిన్?
జ్యోతిక, సిమ్రాన్
సాయి పల్లవి పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
సాయి పల్లవి తల్లిదండ్రుల పేరు?
సెంతమార కన్నన్, రాధ కన్నన్
సాయి పల్లవి రాకముందు ఏం చేసేది?
సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు పలు డ్యాన్స్ షోల్లో పాల్గొంది. ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షోలో కూడా సాయి పల్లవి పార్టిసిపేట్ చేసింది.
సాయి పల్లవి ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/saipallavi.senthamarai/
సాయి పల్లవి నికర ఆస్తుల విలువ?
రూ.30కోట్లు
https://www.youtube.com/watch?v=1OtXtXJWTVg
ఏప్రిల్ 16 , 2024
![Sriya Reddy: సలార్ ముద్దుగుమ్మ శ్రియా రెడ్డి అందాలు చూస్తే మతిపోవాల్సిందే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/12/26150148/Untitled-design-2023-12-26T150133.630.jpg)
Sriya Reddy: సలార్ ముద్దుగుమ్మ శ్రియా రెడ్డి అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
శ్రియా రెడ్డి అందానికి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
సలార్లో ఓ పవర్ఫుల్ రోల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ నటనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రియారెడ్డి గతంలో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు... కానీ ఈమె మరెవరో కాదు హీరో విశాల్కు స్వయాన వదిన.
హీరో విశాల్ సోదరుడు విక్రమ్ను పెళ్లి చేసుకున్న ఈ సుందరాంగి.. సినిమాల్లో నటిస్తూ రాణిస్తోంది.
లేటు వయసులోనూ తన ఒద్దికైన ఫిజిక్తో పెద్దసంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.
సలార్ సినిమాలో శ్రియా రెడ్డి.. పృథ్విరాజ్ సవతి తల్లి కూతురిగా నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఆమె అందానికి కుర్రకారు దాసోహమంటున్నారు.
40ఏళ్ల వయసులోనూ ఈ ఘాటు అందాలు ఏంటని నెటిజన్స్ తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.
2002 నుంచి ఇండస్ట్రీలో ఉన్న శ్రియా రెడ్డికి అవకాశాలు అంతంత మాత్రమే వచ్చినా... తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది.
ప్రస్తుతం ఈ బామ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రియా రెడ్డి, హాట్ ఫోటో షూట్తో కుర్రకారుకు కనువిందు చేస్తుంటుంది.
ముఖ్యంగా చీర కట్టులో ఎద అందాల ఆరబోతతో కవ్విస్తుంటుంది.
చీరలోనో కాదు మోడ్రన్ డ్రెస్లోనూ కావాల్సినంత అందాన్ని అప్పనంగా అభిమానులకు అందిస్తుంటుంది.
పదునైన చూపులతో గాలం వేస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది.
ప్రస్తుతం శ్రియారెడ్డి ఇన్స్టాలో ఫాలోవర్ల సంఖ్య 1.6మిలియన్ దాటింది.
సలార్ మూవీ హిట్తో ఈ కుందనపు బొమ్మకు అవకాశాలు దక్షిణాదిలో వెల్లువెత్తుతున్నాయి.
మరి భవిష్యత్లో ఈ ఘాటు అందం ఎన్ని సంచలనాలకు వేదిక కానుందో చూడాలి.
డిసెంబర్ 26 , 2023
![WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్ ప్యాక్డ్ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/07123219/cropped-ws_cbe-cb-ae-in-arundhati-1365325849.jpg)
WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్ ప్యాక్డ్ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
]చంద్రముఖిచంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
మార్చి 07 , 2023
![<strong>Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్కు సెల్యూట్ చేయాల్సిందే!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/27113140/Untitled-design-2024-06-27T113012.407.jpg)
Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్కు సెల్యూట్ చేయాల్సిందే!
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్ కల్కి టీమ్కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
40 ఏళ్ల తర్వాత..
కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాష్కిన్ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్హాసన్ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.
కమల్ లుక్ కష్టాలు..
‘కల్కి 2898 ఏడీ’ కమల్ హాసన్ చాలా డిఫరెంట్గా, యూనిక్గా ఉంటుంది. ఈ లుక్ ఫైనల్ చేసే క్రమంలో ఎన్నో గెటప్లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్ అశ్విన్ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసే మేకప్ నిపుణులను కల్కి టీమ్ సంప్రదించట. అలా కమల్ హాసన్ ప్రస్తుత లుక్ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.
మేకప్కు కోసం 5 గంటలు
కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్ మేకప్ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
బుజ్జి కోసం రూ.4 కోట్లు
‘కల్కి’లో ప్రభాస్ రైడ్ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్ వెహికల్ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
700VFX షాట్స్
కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్ అనే మూడు ఫ్యూచరిక్ ప్రపంచాలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్ఎక్స్నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉపయోగించినట్లు సమాచారం.
హాలీవుడ్ యంత్రాంగం
‘కల్కి 2898 ఏడీ’ విజువల్ వండర్గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్ వస్తోంది. హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలైన హ్యారీ పోటర్, ఇంటర్స్టెల్లర్, డ్యూన్, బ్లేడ్ రన్నర్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్ ‘కల్కి’ కోసం పనిచేసింది.
రికార్డు స్థాయి బడ్జెట్
భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట.
https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
జూన్ 27 , 2024
![<strong>Vishnupriya Bold Pics: ఇన్నర్ జాకెట్లో బయటపడ్డ విష్ణుప్రియ అందాలు!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/22165127/123.-2024-06-22T165123.408.jpg)
Vishnupriya Bold Pics: ఇన్నర్ జాకెట్లో బయటపడ్డ విష్ణుప్రియ అందాలు!
బుల్లితెరపై ఎంతో పాపులారిటి సంపాదించిన విష్ణుప్రియ (Vishnupriya).. తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తన ఘాటు హోయలతో స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఇచ్చిన హాట్ ట్రీట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
లేటెస్ట్గా గ్లామర్ ఫొటో షూట్ నిర్వహించిన విష్ణుప్రియ.. షర్ట్ బటన్స్ విప్పేసి బ్లాక్ కలర్ జాకెట్లో రెచ్చిపోయింది.
ఎద అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంత అందం చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ.. అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
విష్ణుప్రియ.. బుల్లితెర యాంకర్గా గుర్తింపు తెచ్చుకుంది. సుడిగాలి సుధీర్తో కలిసి ‘పోవే పోరా’ షో చేసి యూత్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత పలు షోలలో గెస్ట్గా, హోస్ట్గా కనిపించి తన అల్లరితో అందరి దృష్టిని ఆకర్షించింది. పలుమార్లు బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లోనూ నిలిచింది.
బిగ్బాస్ ఫేమ్ మానస్తో కలిసి విష్ణుప్రియ ఓ ప్రైవేట్ సాంగ్ చేసింది. ‘జారుతున్నవ్రో.. చేజారుతున్నావ్రో..’ అంటూ మానస్తో కలిసి ఆడిపాడింది.
ఈ పాటకు విశేష ఆదరణ లభించడంతో విష్ణుప్రియ పేరు మారుమోగింది. యూట్యూబ్లో మిలియన్కు పైగా వ్యూస్ వచ్చాయి.
ఆ మధ్య సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పి విష్ణుప్రియ అందరికి షాకిచ్చింది.
జేడీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానని.. ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి కూడా సిద్ధమేనని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే విష్ణుప్రియ ప్రపోజల్ను జేడీ చక్రవర్తి లైట్ తీసుకోవడంతో.. ఆమెది వన్ సైడ్ లవ్గా మారిపోయింది.
గత కొంతకాలంగా అటు బుల్లితెరపై, ఇటు సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది.
స్టార్ హీరోయిన్స్కు ఏమాత్రం తీసిపోని అందంతో ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటో షూట్లను నిర్వహిస్తోంది.
ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది విష్ణుప్రియ.
జూన్ 22 , 2024
![Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్ గురించి ఈ విశేషాలు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/11174217/123.-2024-05-11T174211.826.jpg)
Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
యంగ్ బ్యూటీ ‘అతిరా రాజ్’ పేరు.. ప్రస్తుతం టాలీవుడ్లో సెన్సేషన్గా మారింది.
‘కృష్ణమ్మ’ సినిమాలో ఈ అమ్మడి నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్కు మరో కొత్త హీరోయిన్ దొరికేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శుక్రవారం రిలీజైన (మే 11) ‘కృష్ణమ్మ’ సినిమాతో అతిరా రాజ్.. తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది.
ఇందులో సత్య దేవ్కు జోడీగా మీనా పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంటుంది.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉందంటూ అథిరాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
అథిరా రాజ్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఈ అమ్మడు 20 ఆగస్టు, 2001న కేరళలోని కన్నూర్లో జన్మించింది.
2021లో సినిమా రంగంలో అడుగుపెట్టిన ఈ అతిరా.. చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఎంటర్టైన్ చేసింది.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
2023లో వచ్చిన తమిళ చిత్రం ‘వీరన్’లో లీడ్ రోల్లో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మూవీలో సెల్వీ పాత్రలో కనిపించిన అతిరా.. తన నటనతో తమిళ ఆడియన్స్ను ముగ్దుల్ని చేసింది.
కాగా రీసెంట్గా తమిళంలో వచ్చిన ‘అమిగో గ్యారేజ్’ చిత్రంలోనూ అతిరా హీరోయిన్గా చేసింది.
చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగులో పలు సినిమాల్లో నటించి మాస్టర్ మహేంద్రన్కు జోడీగా నటించింది.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
అతిరా ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది.
ఎప్పటికప్పుడు ఫొటో షూట్లు నిర్వహిస్తూ నెట్టింట తన ఫాలోయింగ్ను మరింత పెంచుకుంటోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను 103K మంది ఫాలో అవుతున్నారు.
మే 11 , 2024
![Nikita Dutta: బికినీలో థండర్ థైస్ అందాలు చూపిస్తూ హద్దులు దాటేసిన నికితా దత్తా](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/26180314/123.-94.jpg)
Nikita Dutta: బికినీలో థండర్ థైస్ అందాలు చూపిస్తూ హద్దులు దాటేసిన నికితా దత్తా
బాలీవుడ్ బ్యూటీ నికితా దత్తా.. తన అంద చందాలతో మతి పోగొడుతోంది.
ఆరెంజ్ కలర్ బికినీలో తన ఒంపు సొంపులను ప్రదర్శించి కుర్రకారును ఫిదా చేసింది.
ముఖ్యంగా బీచ్లో ఈ అమ్మడి సొగసులను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు.
మరో పోస్టులో ఈ అమ్మడు మరింత రెచ్చిపోయింది. రెడ్ కలర్ బ్రాలో ఎద అందాలు ఆరబోసింది.
నికితా దత్తా వ్యక్తిగత విషయాలకు వస్తే.. కెరీర్ ప్రారంభంలో ఆమె మోడల్గా పని చేసింది.
‘ఫెమినా మిస్ ఇండియా-2012’ పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
బాలీవుడ్ చిత్రం 'లేఖర్ హమ్ దివానా' (2014) సినిమాతో నికితా తెరంగేట్రం చేసింది.
2015లో డ్రీమ్ గార్ల్ అనే సిరీయల్ ద్వారా బుల్లితెరలోనూ ఈ అమ్మడు అడుగుపెట్టింది.
2018లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'తో నికితా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత కబీర్ సింగ్ (2019)లో జియా పాత్రలో అందంగా కనిపించి మెప్పించింది.
మస్కా, ది బిగ్ బుల్, డైబ్బుక్, రాకెట్ గ్యాంగ్, దంగే చిత్రాలతో బాలీవుడ్లో స్టార్గా మారిపోయింది.
‘ఆఫత్’, ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ సిరీస్లలో నికితా దత్తా కీలక పాత్ర పోషించింది.
నికితా ప్రస్తుతం ‘జ్యూయల్ తీఫ్’, ‘ఘరాట్ గణపతి’, ‘గుల్ గుల్ బకావాలి’ చిత్రాల్లో నటిస్తోంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు బిజీ బిజీగా ఉంటోంది.
ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.
ఏప్రిల్ 26 , 2024
![Rebel on OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’ హీరోయిన్ లేటెస్ట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/06192902/GKeLY8DbsAAe7WE.jpg)
Rebel on OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’ హీరోయిన్ లేటెస్ట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
మలయాళ బ్యూటీ ‘మమితా బైజు’ (Mamita Baiju).. ‘ప్రేమలు’ (Premalu) చిత్రంలో తెలుగులోనూ స్టార్గా మారిపోయింది. ఇందులో మమిత నటనకు తెలుగు యూత్ ఫిదా అయ్యింది. తమ కలల రాణిగా మమితను మార్చుకుంది. మమితా బైజును ఏకంగా సాయిపల్లవితో ప్రశంసలు కూడా వచ్చాయి. ‘ప్రేమలు’ తర్వాత మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ మమితా బైజుకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల తమిళంలో ఆమె నటించిన రెబల్ చిత్రం విడుదలై పాజిటివ్ తెచ్చుకుందా. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ సైలెంట్గా ఓటీటీలోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంగీత దర్శకుడు జీవి ప్రకాష్, మమితా బైజు జంటగా నటించిన తమిళ మూవీ ‘రెబెల్’ (Rebel).. మార్చి 22న థియేటర్లలో రిలీజైంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంతోనే మమితా బైజు కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime).. విడుదలయ్యి రెండు వారాలు కాకుండానే ఈ సినిమాను స్ట్రీమింగ్లోకి తీసుకువచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటి?
కథిరేసన్ ఓ మలయాళీ కుర్రాడు. ఉన్నత చదువుల కోసం మున్నార్ నుంచి పాలక్కాడ్ వస్తాడు. అక్కడ కొందరు తమిళ స్టూడెంట్స్తో జరిగిన గొడవ కథిరేసన్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది. కాలేజీ గొడవగా మొదలైన ఈ ఇష్యూ.. రాజకీయ రంగును ఎలా పులుముకుంది? సారా అనే అమ్మాయితో అతడి ప్రేమ ట్రాక్ ఎలా మెుదలైంది? ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం అతడు ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది రెబెల్ మూవీ కథ.
https://twitter.com/i/status/1773963043392872495
సినిమా ఎలా ఉందంటే?
కేరళలోని మున్నార్కు చెందిన ఓ స్టూడెంట్ జీవితంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు నికేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. కేరళలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా కథను నడిపించి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. తమిళం, మలయాళ స్టూడెంట్స్ మధ్య తరచూ జరిగే గొడవలను డైరెక్టర్ కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. జీవి ప్రకాశ్ అద్భుతంగా నటించాడు. ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు నటనకు స్కోప్ దక్కింది. సినిమాలోని బీజీఎమ్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. సిద్ధూ కుమార్ మంచి సంగీతాన్ని ఈ చిత్రానికి అందించాడు. అరుణ్ రాధా కృష్ణన్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. కీలక సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. అయితే దర్శకుడు నికేష్ తాను అనుకున్న పాయింట్ను ప్రజెంట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. సెకండాఫ్లో భావోద్వేగాలను పండించే సన్నివేశాలకు అవకాశం ఉన్నప్పటికీ.. వాటిని తీసుకురాలేదు. తమిళ్, మలయాళం విద్యార్థుల మధ్య గోడవలకు గల అసలైన కారణాన్ని బాగా చెప్పలేదు. ఈ చిత్రం అంతిమంగా మత రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి నచ్చుతుంది. ఎందుకంటే చాలా సన్నివేశాలు అనేక రాజకీయ కోణాలతో ముడిపడి ఉంటాయి.
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 06 , 2024
![Actress Samantha: సోషల్ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్.. ఎందుకంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/17174323/Untitled-design-2024-01-17T174306.808.jpg)
Actress Samantha: సోషల్ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్.. ఎందుకంటే?
స్టార్ హీరోయిన్ సమంత మరోమారు తన క్యూట్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలుచటి శారీలో స్లివ్లెస్ జాకెట్లో కనిపించి ఫ్యాన్స్ను అలరించింది.
ఫెయిర్ లుక్లో తళతళ మెరిసిపోతున్న సామ్ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దగ్గర్లో సమంత చిత్రాలు లేకపోవడంతో ఇలా ఫొటోల్లో ఆమెను చూసుకుంటూ సంబరపడుతున్నారు.
తాజాగా సంక్రాంతికి తాను ఏం చేశానో చెప్తూ సామ్ పలు ఫొటోలు ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. తాను వేసిన ముగ్గు, గాలిపటంతో ఆటలు, పెంపుడు జంతువులు, లైటింగ్ డెకరేట్ చేసిన ఇల్లు.. ఇలా పలు ఫొటోలను షేర్ చేసింది.
గతేడాది ఖుషితో అలరించిన సమంత త్వరలో సిటాడెల్ (ఇండియన్ వెర్షన్) వెబ్సిరీస్తో సందడి చేయనున్నారు.
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సిటాడెల్ సిరీస్లో కీలక పాత్ర పోషించనున్నాడు. రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది. ‘ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్ తెలిపింది.
ఇదిలా ఉంటే తాజాగా సామ్ గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప2' చిత్రంలోనూ ఆమె ఐటెమ్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ రూమర్స్పై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 'పుష్ప' పార్ట్-1లో సామ్ చేసిన ఐటెమ్ సాంగ్ అప్పట్లో ఉర్రూతలూగించింది.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో సమంత సత్తా చాటింది. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్లలో సమంత రెండో స్థానంలో నిలిచింది.
బాలీవుడ్ భామ ఆలియా భట్ మెుదటి ప్లేస్ స్థానంలో నిలవగా.. దీపికా పదుకునే , కత్రినా కైఫ్, నయనతార వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్థానంలో రష్మిక నిలవడం గమనార్హం.
ప్రస్తుతం సామ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్కు టచ్లో ఉంటోంది. ఈ భామ ఇన్స్టా ఖాతాను 31.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
జనవరి 17 , 2024
![Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/05/09122316/9th-May-Sai-Pallavi-birthday-vertica-e1683615214893.jpg)
Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పాత్రలో గ్లామర్ డోస్ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. భోళా శంకర్ (Bhola Shankar)
చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్ చేస్తోంది. అయితే కీర్తి సురేష్ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్ను రిజెక్ట్ చేశానని స్పష్టం చేసింది. రీమేక్ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్గా ‘భోళా శంకర్’ వస్తోంది.
2. లియో (Leo)
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడు అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్ లేటెస్ట్ మూవీ ‘లియో’లో హీరోయిన్గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
3. ఛత్రపతి (Chatrapathi)
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్ వినిపించింది. గ్లామర్ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్ కానుంది.
4. వారసుడు (Varasudu)
విజయ్ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు.
5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)
మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
6. డియర్ కామ్రేడ్ (Dear Comrade)
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్ ఆఫర్ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్ ఉండటంతో నో చెప్పింది.
7. చెలియా (Cheliya)
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్నే తిరస్కరించింది. కార్తిక్ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు.
మే 09 , 2023
![Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఎగిరి గంతేసిన రాజమౌళి](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/13093533/rrr-scaled.jpg)
Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఎగిరి గంతేసిన రాజమౌళి
అనుకున్నదే అయింది. ఊహించినదే నిజమైంది. కల సాకారమైంది. ఇద్దరు తెలుగు వీరులు చేసిన డ్యాన్స్కి ఆస్కార్ ఫిదా అయింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును ‘నాటు నాటు’ గెలుచుకుంది. తెలుగు కీర్తి పతాకం విశ్వవ్యాప్తంగా రెపరెపలాడింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పాశ్చాత్య పాటలను తలదన్ని అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినిమా సత్తా ఏంటో విశ్వ వేడుకపై నిరూపించింది.
అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్..
ఆస్కార్ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం ‘ఇప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు’ అని కీరవాణి పాటపాడుతూ చెప్పడం గూస్బంప్స్ తెప్పించింది. ‘నాటు నాటు’ సాంగ్ని ప్రపంచంలోనే అత్యుత్తమమైన పాటగా తీర్చిదిద్దాలని భావించాం. ప్రతి భారతీయుడూ గర్వపడాలని ఆశించాం. అది జరిగింది. నాకు, రాజమౌళికి, మా ఫ్యామిలీకి ఉన్న చిరకాల కోరిక నేడు నెరవేరింది. అకాడమీకి ధన్యవాదాలు’ అంటూ కీరవాణి చెప్పారు. అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ ‘నమస్తే’ అని చెప్పారు.
https://twitter.com/fizzie_girl/status/1635114184982814721?s=20
https://twitter.com/HoneyRoseOffl_/status/1635120372013203456?s=20
ఎగిరి గంతేశారు..
‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డును ప్రకటించగానే బాల్కనీలో కూర్చొన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఎగిరి గంతేసింది. డైరెక్టర్ రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ చిన్నపిళ్లల్లా కేరింతలు కొట్టారు. రామ్చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ విజయ నినాదాలు చేశారు.
https://twitter.com/AndhraBoxOffice/status/1635114810651328513?s=20
‘నాటు నాటు’తోనే మొదలు..
ఆస్కార్ వేడుక ప్రారంభమైంది ‘నాటు నాటు’ సాంగ్తోనే. అవార్డుల ప్రదానోత్సవానికి ప్రజెంటర్గా ఎంపికైన ‘దీపిక పదుకొణె’ ‘నాటు నాటు’ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం సింగర్స్ని ఆహ్వానించింది. ‘మీరెప్పుడైనా నాటు నాటు పాటను చెవులారా విన్నారా? కళ్లారా చూశారా? లేకపోతే ఇదే అసలైన సమయం. నాటు నాటు పాటను తిలకిస్తూ ఎంజాయ్ చేయండి’ అంటూ దీపిక పదుకొణె ప్రకటించడం భారతీయ సినిమాకే గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతేగాకుండా ‘నాటు నాటు’ సాంగ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆస్కార్ వేడుకలో చప్పట్లు, ఈలలు వినిపించాయి. సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్లను ఆహ్వానించిన సమయంలో హాలీవుడ్ ప్రముఖులు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ మర్చిపోలేనిది.
https://twitter.com/THR/status/1635094319139893248?s=20
గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో..
‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అప్పుడు మొదలైన ‘నాటు నాటు’ మేనియా అవార్డు అందుకునే వరకూ జోరుగా కొనసాగింది. ఆస్కార్ వేడుకలో ‘నాటు నాటు’ ప్రభావం క్లియర్గా కనిపించింది.
‘నాటు నాటు’కు ప్రాణం..
‘నాటు నాటు’ సాంగ్ ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర కొరియోగ్రఫీదే. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు ‘నాటు నాటు’ను విశ్వవిజేతగా నిలిపాయి. గేయ రచయిత చంద్రబోస్ తెలుగుదనాన్ని మేళవించి రచించగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బీట్స్ జత చేయగా సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ గొంతెత్తి పాడగా రామ్చరణ్, ఎన్టీఆర్ ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ సాంగ్ని ఉక్రెయిన్లో షూట్ చేశారు.
https://www.youtube.com/watch?v=OsU0CGZoV8E
మార్చి 13 , 2023
![<strong>VD12 Leaked Pic: ‘VD12’ సెట్ నుంచి విజయ్ దేవరకొండ ఫొటో లీక్.. నెట్టింట రచ్చ రచ్చ! </strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/23154026/Untitled-design-2024-07-23T153952.224.jpg)
VD12 Leaked Pic: ‘VD12’ సెట్ నుంచి విజయ్ దేవరకొండ ఫొటో లీక్.. నెట్టింట రచ్చ రచ్చ!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు యూత్లో ఏ స్థాయి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్తో స్టార్ హీరోల స్థాయికి ఎదిగాడు. అయితే గత కాలంగా ఇండస్ట్రీలో విజయ్కు కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్దగా దారుణంగా విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెట్ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
విజయ్ పిక్ వైరల్!
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' చిత్రం రూపొందుతోంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో షూటింగ్ సెట్ నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో బైక్పై వెనక కూర్చుని మాస్ లుక్లో కనిపించాడు. తలపై లైట్ హెయిర్, ముఖాన గడ్డంతో మెస్మరైజ్ చేసేలా అతడి లుక్ ఉంది. ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్తో సంతోషంతో ఊగిపోతున్నారు. మరో బ్లాక్బాస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.
https://twitter.com/king_ntr9999/status/1815611065381896259
థియేటర్లు బద్దలే!
‘VD 12’ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ మాస్లుక్కు అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు తోడైతే ధియేటర్లు బద్దలు కావాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘VD 12’లో విజయ్ లుక్ చూస్తుంటే ‘యువ’ సినిమాలో మాధవన్ గుర్తుకు వస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో ఆమె ప్లేస్లో భాగ్యశ్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్లోనూ పాల్గొంటున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/Rebelstarpr/status/1815667163178656207
డ్యుయల్ రోల్లో రౌడీ బాయ్!
‘VD 12’ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్ పోస్టర్ను సైతం అధికారికంగా రిలీజ్ చేసింది. అయితే తాజాగా లీకైన ఫొటోను చూస్తే విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్లో కనిపించాడు. ఒక లోకల్ గ్యాంగ్స్టర్ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా లీకైనా విజయ్ లుక్ చూస్తే థియేటర్లో మాస్ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.
క్యూట్ లవ్స్టోరీ!
విజయ్ దేవరకొండ ‘VD 12’తో పాటు మరో ప్రాజెక్ట్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీకి దిల్రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్గా సాయిపల్లవి (Sai Pallavi) తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇటీవల టాలీవుడ్లో ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
జూలై 23 , 2024
![<strong>Disha Patani Hot: ఎద సొగసులతో హాట్ మీటర్లు బద్దలు కొడుతున్న దిశా పటానీ!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/12123653/123.-2024-07-12T123649.606.jpg)
Disha Patani Hot: ఎద సొగసులతో హాట్ మీటర్లు బద్దలు కొడుతున్న దిశా పటానీ!
‘కల్కి’ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) తన అందాల ఆరబోతతో మరోమారు నెటిజన్లను ఉక్కబోతకు గురిచేస్తోంది.
తాజాగా తన ఎద హోయలను చూపిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒంపు తిరిగిన నడుముతో కవ్వించింది. ఈ భామ పెట్టిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజా ఫొటోల్లో డిజైనర్ జాకెట్ ధరించిన దిశా ఎద పొంగులతో కుర్రకారును కవ్వించింది. మత్తెక్కించే ఫోజులతో రెచ్చగొట్టింది.
దిశా పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్లో నిలవడం కొంతకాలంగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
లోఫర్ (Loafer) సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
రీసెంట్గా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో దిశా పటానీ మెరిసింది. తన గ్లామర్తో అందరి దృష్టిని ఆకర్షించింది.
తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రంలోనూ దిశా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.
బాలీవుడ్లో 'వెల్కమ్ టూ ద జంగిల్' ఫిల్మ్లోనూ దిశా నటిస్తోంది. ఇందులో దిశా పాత్ర ఇప్పటివరకూ చేసిన వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని సమాచారం.
ఓవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా పోస్టులతో దిశా పటానీ.. బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 61.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
జూలై 12 , 2024
![<strong>Kalki 2898 AD OTT: ‘కల్కి 2898 ఏడీ’ స్ట్రీమింగ్ డేట్ లాక్? ఏకంగా రెండు ఓటీటీల్లో ప్రసారం!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/10154913/Untitled-design-2024-07-10T154910.278.jpg)
Kalki 2898 AD OTT: ‘కల్కి 2898 ఏడీ’ స్ట్రీమింగ్ డేట్ లాక్? ఏకంగా రెండు ఓటీటీల్లో ప్రసారం!
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం రెండు వారాలుగా థియేటర్లలో సక్సెస్ఫుల్గా ప్రదర్శితమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు ఇప్పటికీ కొనసాగుతోంది. అగ్రకథానాయకులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటనతో పాటు యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ క్యామియోలు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘కల్కి’ ఓటీటీ రిలీజ్కు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఈ మూవీ రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ రెండు ఓటీటీల్లోకి..
'కల్కి 2898 ఏడీ' చిత్రానికి థియేటర్లో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే థియేటర్లో చూసినప్పటికీ ఓటీటీలోనూ మరోమారు కల్కి చిత్రాన్ని వీక్షించాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ ఫ్లాట్ఫామ్, డిజిటల్ ప్రీమియర్ డేట్ అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కల్కి ఓటీటీ విడుదలకు సంబంధించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెండు ఓటీటీలో స్ట్రీమింగ్కు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), నెట్ఫ్లిక్స్ (Netflix) సంస్థలు ‘కల్కి’ ఓటీటీ హక్కులను కొనుగోలు చేశాయి. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల హక్కులను అమెజాన్ దక్కించుకోగా, హిందీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ రెండింటిలో కల్కి స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'కల్కి'ని థియేట్రికల్ రిలీజ్కు 7 లేదా 8 వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. దీని ప్రకారం ఆగస్టు 15న ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశముందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్వాతంత్ర దినోత్సవం కానుకగా కల్కిని స్ట్రీమింగ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లో స్ట్రీమింగ్ సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి కల్కిని ఓటీటీలో చూడాలని భావించేవారికి ఇంకో నెల రోజులు ఎదురుచూపులు తప్పకపోవచ్చు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రూ.1000 కోట్లు వచ్చినట్లేనా?
కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు వసూలు చేసినట్లు సోమవారం (జులై 8) చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూ.1000 కోట్ల క్లబ్లో చేరేందుకు రూ.100 కోట్ల దూరంలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే కల్కి కలెక్షన్స్కు సంబంధించి అధికారిక అనౌన్స్మెంట్ వచ్చి రెండ్రోజులు అవుతుంది. సోమ, మంగళవారం వసూళ్లు ఈ రూ.900 కోట్లకు యాడ్ కావాల్సి ఉంది. అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ రెండు రోజుల వసూళ్లు కలుపుకుంటే కల్కి రూ.1000 కోట్ల క్లబ్లో అలవోకగా చేరిపోనుంది. దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రావడమే తరువాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
హిందీలో వసూళ్ల ప్రభంజనం
'కల్కి 2898 ఏడీ' చిత్రానికి బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్లో ప్రభాస్కు ఉన్న క్రేజ్కు తోడు మహాభారతం కాన్సెప్ట్తో కల్కి రావడంతో అక్కడి ఆడియన్స్ విశేష ఆదరణ కనబరుస్తున్నారు. ఫలితంగా కల్కి హిందీ వెర్షన్ వసూళ్లు నేటితో (జులై 10) రూ.200 కోట్ల మార్క్ను అందుకుంటాయని ప్రముఖ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవాళ కల్కి చిత్రం రూ.225 కోట్ల (GROSS) మైల్స్టోన్ను అందుకుంటుందని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ స్పెషల్ పోస్టును పెట్టారు.
https://twitter.com/taran_adarsh/status/1810940499227742667
జూలై 10 , 2024
![<strong>Mokshagna Teja: అఖండ సీక్వెల్లో మోక్షజ్ఞ, పవర్ ఫుల్ రోల్ రాసిన బోయపాటి?</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/09141758/123.-2024-07-09T141755.432.jpg)
Mokshagna Teja: అఖండ సీక్వెల్లో మోక్షజ్ఞ, పవర్ ఫుల్ రోల్ రాసిన బోయపాటి?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో తనయుడ్ని తెరపై చూడాలని ఆరాటపడుపతున్నారు. మోక్షజ్ఞ తెరంగేట్రం విషయాన్ని ఈ మధ్య బాలయ్య సైతం కన్ఫార్మ్ చేయడంతో ఫ్యాన్స్లో జోష్ పెరిగింది. రీసెంట్గా మోక్షజ్ఞ స్టైలిష్, హ్యాండ్సమ్ ఫొటోలు బయటకురాగా తమ అప్కమింగ్ హీరో మేకోవర్కు అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి తాజాగా ఓ అప్డేట్ బయటకొచ్చింది. ఇది విన్న నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.
బాలయ్య సినిమాతో ఎంట్రీ?
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. వీరి కాంబోలో గతంలో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న 'అఖండ' (Akhanda) సినిమాకు సీక్వెల్గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ‘అఖండ 2’ సెట్స్పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో మోక్షజ్ఞ ఓ స్పెషల్ రోల్ చేయనున్నాడు. మోక్షజ్ఞ కోసం దర్శకుడు బోయపాటి ఓ రోల్ రాశారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్లో అతడి ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞపై టెస్ట్ షూట్ కూడా నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే తన తండ్రి బాలయ్య సినిమాతోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేసే అవకాశముంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.
హనుమాన్ దర్శకుడితో!
మరోవైపు హీరోగా మోక్షజ్ఞ ఫస్ట్ ఫిల్మ్ కోసం నందమూరి అభిమానులతో పాటు సగటు సినీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హనుమాన్’ (Hanuman) ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా లాక్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ వర్మ, బాలయ్య మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఆహాలో బాలయ్య చేసిన అన్స్టాపబుల్ షోకు దర్శకత్వ బాధ్యతలను ప్రశాంత్ వర్మనే నిర్వహించారు. అలా ఆయనతో ప్రశాంత్ వర్మకు మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ రిలేషన్తోనే బాలయ్య తన కొడుకు బాధ్యతలను ప్రశాంత్కు అప్పగించినట్లు తెలుస్తోంది.
హ్యాండ్సమ్ లుక్లో..
నందమూరి మోక్షజ్ఞ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నాడు. హ్యాండ్సమ్ లుక్లోకి మారిపోయాడు. హీరో కటౌట్తో ఉన్న మోక్షజ్ఞ ఫొటోలు ఇటీవల నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇందులో క్రేజీ లుక్స్తో మోక్షజ్ఞ మెస్మరైజ్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా పూర్తి ఫిట్గా కనిపించి ఆశ్చర్యపరిచాడు. తాను పక్కా స్టార్ హీరో మెటీరియల్ అని తన న్యూ లుక్ ఫొటోలతో చాటిచెప్పాడు. ఇక మోక్షజ్ఞ లేటేస్ట్ చిత్రాలను చూసి నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. బాలకృష్ణ తనయుడు ఎలా ఉండాలని తాము ఊహించుకున్నామో మోక్షజ్ఞ అలాగే మేకోవర్ అయినట్లు కామెంట్స్ చేశారు. మరో నందమూరి వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సమయం ఆసన్నమైందంటూ పోస్టులు పెట్టారు.
https://twitter.com/AKKINENI_9999/status/1808086164647153776
29 ఏళ్లకు తెరంగేట్రం!
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబంగా నందమూరి వంశం ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన జూ.ఎన్టీఆర్.. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించాడు. తారక్ 17 ఏళ్లకే ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 29 ఏళ్లు. తెలుగులో ఇంత లేటు వయసులో నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్న హీరో మోక్షజ్ఞనే కానున్నాడు. నిజానికి బాలకృష్ణ తన కుమారుడిని హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శరీరాకృతి మార్చుకునే క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమైంది. ఇన్నాళ్లకు హీరో మెటిరియల్గా మోక్షజ్ఞ లుక్ మారడం.. అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది.
జూలై 09 , 2024