రివ్యూస్
How was the movie?
తారాగణం
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Gopichand_(actor).jpeg)
గోపీచంద్
జై![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Raashii_Khanna_DHMplDz7YGh8w586_250_250.jpeg)
రాశి ఖన్నా
సావిత్రి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Kabir_Duhan_Singh.jpeg)
కబీర్ దుహన్ సింగ్
చోటా నాయక్![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Harish_Uthaman_250_250.jpeg)
హరీష్ ఉత్తమన్
ACP A. పరశురాం![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Posani_Krishna_Murali.jpeg)
పోసాని కృష్ణ మురళి
నారాయణ![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Amit_Tiwari.jpeg)
అమిత్ తివారీ
నాయక్ సోదరుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Chalapathi_Rao.jpeg)
చలపతి రావు
జై మామయ్య![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Urvashi_250_250.jpeg)
ఊర్వశి
జై అత్త![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Brahmaji_250_250.jpeg)
బ్రహ్మాజీ
రంగనాథ్భరత్ రెడ్డి
అలీసుప్రీత్
ఘోర![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Srinivasa_Saambasiva_Avasarala_250_250.jpeg)
శ్రీనివాస్ అవసరాల
అజయ్![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Prabhas_Sreenu_250_250.jpeg)
ప్రభాస్ శ్రీను
శీనుఅనంత్ బాబు
డాక్టర్రవిప్రకాష్సావిత్రి తండ్రి
ఈశ్వర ఉదయ్ సాయి కిరణ్పేషెంట్
సిబ్బంది
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Radha_Krishna_Kumar_250_250.jpeg)
రాధా కృష్ణ కుమార్
దర్శకుడువి. వంశీ కృష్ణా రెడ్డినిర్మాత
ప్రమోద్ ఉప్పలపాటినిర్మాత
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Radha_Krishna_Kumar_250_250.jpeg)
రాధా కృష్ణ కుమార్
రచయిత![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/M_Ghibran_XlM6wJ8NPZYgwcwi_250_250.jpeg)
జిబ్రాన్
సంగీతకారుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sakthi_Saravanan_250_250.jpeg)
శక్తి శరవణన్
సినిమాటోగ్రాఫర్కోటగిరి వెంకటేశ్వరరావు
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
![EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్ చిత్రాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/03181733/Untitled-design-2024-05-03T181728.945.jpg)
EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్ చిత్రాలు ఇవే!
సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్కు తెలియజేశాయి. టాలీవుడ్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
పుష్ప (Pushpa)
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్ చేశాడు.
గుంటూరు కారం (Guntur Karam)
మహేష్ బాబు (Mahesh Babu) రీసెంట్ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.
బలగం (Balagam)
ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్ వేణు యెల్దండి డైరెక్షన్లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది
రంగస్థలం (Rangasthalam)
రామ్చరణ్-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్చరణ్ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.
దసరా (Dasara)
హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.
కలర్ఫొటో (Colour Photo)
కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్ తెలుగు ఆడియన్స్కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.
ఉప్పెన (Uppena)
యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.
కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam)
వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు.
విరాట పర్వం (Virata parvam)
హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.
ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar)
రామ్పోతినేని, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్గా చేసిన నభా నటేష్.. వరంగల్ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం.
కేర్ ఆఫ్ కంచరపాలెం (C/o కంచరపాలెం)
మహా వెంకటేష్ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.
రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru)
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు
టాలీవుడ్ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్ టైలర్’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్డ్రాప్తో వచ్చినవే.
.
మే 03 , 2024
![Mamita Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/14200523/page-5.jpg)
Mamita Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
మలయాళ నటి 'మమితా బైజు' (Mamita Baiju) పేరు ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. ఇటీవల వచ్చిన 'ప్రేమలు' (Premalu) చిత్రంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ రీనూగా కనిపించి యూత్లో మంచి క్రేజ్ సంపాదించింది. దీంతో నెట్టింట ఆమె పేరు తెగ ట్రెండ్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మమితా బైజు’ ఎవరు? ఆమె నటించిన చిత్రాలు ఏంటి? ఆమె కుటుంబ నేపథ్యం? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కేరళ కొట్టాయం జిల్లాలోని కిడంగూర్ ప్రాంతం.. మమితా బైజు స్వస్థలం. ఆమె తల్లిదండ్రులు డా.బైజు క్రిష్ణణ్, మిని. మమితా సోదరుడి పేరు మిథున్.
కిడంగూర్లోని మేరి మౌంట్ పబ్లిక్ స్కూల్, ఎన్.ఎస్.ఎస్ హైయర్ సెకండరీ స్కూల్స్లో మమిత పాఠశాల విద్యను అభ్యసించింది. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది.
పాఠశాల రోజుల నుంచి మమిత సాంస్కృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ సమయంలోనే 'సర్వోపరి పలక్కరన్' (2017) అనే మలయాళ చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చింది.
ఆమె రెండో చిత్రం ‘హనీ బీ 2: సెలబ్రేషన్స్’ కూడా అదే ఏడాదిలో విడుదలైంది. ‘డాకినీ’, ‘స్కూల్ డైరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’, ‘ఆపరేషన్ జావా’ వంటి విభిన్నతరహా చిత్రాల్లో మమిత నటించింది.
2021లో వచ్చిన ‘ఖోఖో’ సినిమాలో టీమ్ కెప్టెన్గా వైవిధ్యం ప్రదర్శించి, ఉత్తమ సహాయ నటిగా ‘కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు’ అందుకుంది.
గతేడాది ‘ప్రణయ విలాసం’, ‘రామచంద్ర బాక్ అండ్ కో’ సినిమాలతో మలయాళ ప్రేక్షకుల్ని అలరించింది.
'ఖోఖో' సినిమాలోని ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో 'కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్' అందుకుంది.
మమిత 16వ చిత్రం 'ప్రేమలు'.. మలయాళంతోపాటు తెలుగులోనూ ఘన విజయం అందుకుంది. ఇందులోని ఆమె అందం, నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ సినిమాని తెలుగులో రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ హక్కులు తీసుకొని విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా విజయం దిశగా దూసుకుపోతోంది.
ఈ సినిమా విడుదలైన తరువాత దర్శకధీరుడు రాజమౌళి.. మమితపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు అందరూ అంతర్జాలంలో వెతుకులాట ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ 'రెబల్' అనే చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.
తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని మమిత తాజా ఇంటర్యూలో తెలిపింది. తాను చూసిన తొలి తెలుగు చిత్రం ‘మగధీర’ అని పేర్కొంది. ‘మగధీర’ ‘ఈగ’ సినిమాలను ఎన్నోసార్లు చూశానని చెప్పింది.
తెలుగులో ఇష్టమైన నటుడు 'అల్లు అర్జున్' అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆయనతో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ సందర్భంలో తెలిపింది.
మమితకు కూచిపూడి నృత్యంలో ప్రవేశం ఉంది. ఓసారి స్కూల్లో ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించిన ఫొటో.. ఆమెకు తొలి చిత్రంలో అవకాశం తెచ్చిపెట్టిందట.
ఆమె తండ్రి బైజు క్రిష్ణన్ వైద్యుడు కావడంతో తనలాగే కుమార్తెనూ డాక్టర్ని చేయాలని ఆయన భావించారట. కానీ, మమితకు అది ఇష్టం లేదట. సినీ రంగంలోనే రాణిస్తానంటోంది.
మార్చి 14 , 2024
![Telangana Folk Singers: తెలంగాణలో గద్దర్ లాంటి విప్లవ కళాకారులు ఉన్నారా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/08/10165701/renowned-telangana-folk-singer-gummadi-vittal-rao-popularly-known-as-gaddar-passes-away-1.png)
Telangana Folk Singers: తెలంగాణలో గద్దర్ లాంటి విప్లవ కళాకారులు ఉన్నారా?
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇటీవల కన్నుమూశారు. విప్లవానికి కళం, గళం తోడైతే అది గద్దర్లా ఉంటుంది. గద్దరన్న ఎన్నో పాటలతో జాతిని జాగృతం చేశాడు. ఆయన చూపించిన విప్లవ పంథా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గద్దరన్నతో పాటు ఎంతో మంది విప్లవ కళాకారులు ప్రజలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. పాట, ఆట రూపంలో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించిన వారున్నారు. మరి, ఆ కళాకారులు ఎవరో తెలుసుకుందాం.
ఎపూరు సోమన్న
అయోధ్య అంటే గుర్తొస్తడు రామన్న. పల్లె పాట అంటే యాదికొస్తడు ఏపూరు సోమన్న. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం వెలిశాలలో జన్మించాడు ఏపూరు సోమన్న. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా నానమ్మ సంరక్షణలో పెరిగాడు. సోమన్న పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఏ పాట పాడినా అది శ్రోతలను ఆకట్టుకుంటుంది. పాటే తన జీవితంగా బతుకుతున్నాడు. ‘జోరు సాగుతుందిరా కొడకా.. తెలంగాణ హోరు సాగుతుందిరా’, ‘ఎవడిపాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ?’ అంటూ రాగమెత్తితే ఉద్యమ స్ఫూర్తి రగలాల్సిందే.
https://www.youtube.com/watch?v=JigfoYaKt5Y&t=33s
గోరేటి వెంకన్న
గోరేటి వెంకన్న కవి, గాయకుడు. ప్రస్తుతమున్న నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో జన్మించాడు గోరేటి వెంకన్న. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’ అంటూ తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించాడు. వివిధ సినిమాల్లో పాటలు రాసి కుబుసం సినిమాలోని ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అంటూ గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించాడు. వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది. ప్రస్తుతం వెంకన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు.
https://www.youtube.com/watch?v=kU344_l7S-U&t=4s
రసమయి బాలకిషన్
గజ్జె కట్టి, మైకు పట్టి.. గొంతెత్తి కాలు కదిపిన రసమయి బాలకిషన్ విప్లవ కళాకారుడే. రసమయి సిద్దిపేట జిల్లాలోని రావురూకులలో జన్మించాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ‘తెలంగాణ ధూం ధాం’ కార్యక్రమానికి పురుడు పోసింది రసమయినే. ‘ఓ యమ్మ నా పల్లె సీమ.. ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామా?’ అంటూ ఎన్నో పాటలకు జీవం పోశాడు. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి ప్రజలను ఏకం చేశాడు.
Oyamma Telangana- Rasamayi Balakishan Telangana Song || Folk Song Telugu || Folk songs
ఆర్.నారాయణమూర్తి
సామాజిక కళాకారుడిగా ఆర్ నారాయణ మూర్తి అందరికీ సుపరిచితం. క్రోనీ క్యాపిటలిజం, నిరుద్యోగిత, సామాజిక సమస్యలపై తన గళం విప్పిన వ్యక్తి. తన సినిమాలతో వివిధ అంశాలను స్పృశిస్తూ ప్రజలను మేల్కొలిపాడు. అందుకే ఈయణ్ను పీపుల్స్ స్టార్ అని పిలుస్తుంటారు. నటుడిగా, గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సేవలు అందించాడు. ఎన్నో సినిమాలను తీశాడు. ‘బంజారే బంజో’, ‘ఆపుర రిక్షోడా’, ‘ఎర్ర జెండ.. ఎర్ర జెండ’ వంటి పాటలతో పోరాట స్ఫూర్తిని రగిల్చాడు.
https://www.youtube.com/watch?v=pwV92lAeq_w&t=1119s
విమలక్క
భువనగిరి జిల్లా ఆలేరులో జన్మించింది విమలక్క. తెలంగాణను జాగృతం చేసే ఎన్నో పాటలను పాడింది. ‘అసైదులా హారతి’, ‘పల్లె పల్లెనా’, ‘ఏడు గడిసి పాయె.. దినము ఒడిసి పాయె’ వంటి పాటలను పాడి ప్రజల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. మానవ హక్కుల సంరక్షణకు కదం తొక్కారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కళాకారులతో కలిసి కార్యక్రమాలను నిర్వహించినందుకు నాలుగు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించింది.
https://www.youtube.com/watch?v=e33k9zFzk18&t=5s
బెళ్లి లలిత
‘తెలంగాణ గాన కోకిల’గా బిరుదు పొందిన బెళ్లి లలిత ఉద్యమ కళాకారిణి. అణచివేతకు, అధికారానికి వ్యతిరేకంగా గొంతెత్తి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వనిత. తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకురాలు. నాడు ఈమె ఎలుగెత్తిన తీరుకు అధికార నేతలే హడలిపోయారు. ప్రజలను సంఘటితం చేయడాన్ని చూసి వణికిపోయారు. సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. అయితే, పుట్టిన భువనగిరిలోనే లలితక్కను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి 18 ముక్కులుగా నరికేశారు. ఈమె మరణంపై ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=wLsc-0JvUf4
పయిలం సంతోష్
తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా పనిచేశాడు పయిలం సంతోష్. సంతోష్ అసలు పేరు అడూరి బ్రహ్మయ్య. జానపద కళాకారుడు. ఉద్యమ సమయంలో గొంతెత్తి ప్రజలను సంఘటితం చేశాడు. తెలంగాణ నుంచి బొంబాయికి వలస పోతున్న ప్రజలను ఉద్దేశించి సంతోష్ ‘పైలం’ అనే ఆల్బమ్ విడుదల చేశాడు. అప్పటి నుంచి పైలం సంతోష్గా పేరుపొందాడు. సూర్యాపేట వెలిదండలో పుట్టిన సంతోష్.. నల్గొండలోని దుగునెల్లిలో పెరిగాడు. 2020లో అకాల మరణం పొందాడు.
https://www.youtube.com/watch?v=XXQTnLMJP6g&t=3s
సాయిచంద్
తెలంగాణ ఉద్యమ సమయంలో గొంతుకు సానబెట్టిన కళాకారుడు సాయిచంద్. వనపర్తి జిల్లాలోని అమరచింతలో జన్మించిన సాయిచంద్ ఎంతో చురుగ్గా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం, అధికార పార్టీకి పనిచేశాడు. చనిపోయేంత వరకు వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఉన్నాడు.
https://www.youtube.com/watch?v=KHtwovGCU9g&t=2s
ఆగస్టు 10 , 2023
![Sarath Babu: శరత్ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్-10 చిత్రాలు ఇవే..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/05/22173242/Untitled-design-38-1.png)
Sarath Babu: శరత్ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్-10 చిత్రాలు ఇవే..!
టాలీవుడ్లోని అతి తక్కువ మంది విలక్షణ నటుల్లో శరత్బాబు ఒకరు. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, మోసకారిగా, విలన్గా ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించి తిరుగులేని నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన శరత్బాబు 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో తెరంగేట్రం చేశారు. 300లకు పైగా సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్బాబు (71).. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన చివరిగా నరేష్- పవిత్ర జంటగా చేసిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించారు. శరత్బాబు మరణం నేపథ్యంలో ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన టాప్-10 చిత్రాలు మీకోసం..
1. సీతాకోక చిలుక
1981లో వచ్చిన ‘సీతాకోక చిలుక’ సినిమా నటుడిగా శరత్ బాబుకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. ఇందులో హీరోయిన్ కరుణకు అన్నగా శరత్ బాబు అద్భుతంగా నటించారు. జాలి, దయ, ప్రేమ, కరుణ లేని డేవిడ్ పాత్రలో శరత్బాబు ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా విజయంలోనూ శరత్బాబు కీలక పాత్ర పోషించారు. అప్పట్లో సీతాకోక చిలుక చిత్రం ఒక ప్రభంజనమే సృష్టించింది.
https://www.youtube.com/watch?v=lPf-cPdYjq0
2. అన్వేషణ
1985లో వచ్చిన ‘అన్వేషణ’ చిత్రం అప్పట్లో సూపర్హిట్గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాలో జేమ్స్ అనే ఫారెస్టు రేంజ్ అధికారి పాత్రను శరత్ బాబు పోషించారు. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత నుంచి శరత్ బాబుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
3. సితార
1980వ దశకంలో వచ్చిన ‘సితార’ చిత్రం శరత్ బాబు నటనా పాఠవాలను తెలియజేసింది. ఇందులో హీరోయిన్కు అన్నగా శరత్ బాబు నటించారు. చందర్ పాత్రలో ఒదిగిపోయాడు. చెల్లిని అమితంగా ఇష్టపడే అన్నగా.. కోర్టు గొడవలతో సతమతమయ్యే వ్యక్తిగా శరత్బాబు ఎంతో వైవిధ్యంతో నటించారు.
https://www.youtube.com/watch?v=ZK4qaJMWwoc
4. సంసారం చదరంగం
‘సంసారం చదరంగం’ సినిమా కూడా శరత్బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో అప్పల నరసయ్య కుమారుడి పాత్రలో శరత్ కుమార్ నటించారు. డబ్బు విషయంలో కచ్చితంగా ఉండే ప్రకాష్ పాత్రలో ఆయన అలరించాడు. ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాల్లో శరత్ బాబు అద్భుతమే చేశాడు. తన నటన ఎంత లోతైనదో చూపించాడు.
https://www.youtube.com/watch?v=esucI1zKcM4
5. సాగర సంగమం
కె. విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘సాగర సంగమం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్ హసన్ కెరీర్లో మరుపురాని చిత్రంగా ఇది మిగిలిపోయింది. ఇందులో రఘుపతి పాత్ర పోషించిన శరత్బాబుకు కూడా ఈ సినిమా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. కమల్కు స్నేహితుడిగా ఇందులో శరత్బాబు నటించారు.
https://www.youtube.com/watch?v=CtBi8524GAc
6. స్వాతి ముత్యం
కమల్ హాసన్ కథానాయకుడిగా చేసిన ‘స్వాతి ముత్యం’ సినిమాలోనూ శరత్బాబు నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సోదరుడు చలపతి పాత్రలో శరత్బాబు అత్యుత్తమ నటన కనబరిచాడు. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కురిశాయి.
7. ముత్తు
రజనీకాంత్ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో ‘ముత్తు’ ఒకటి. ఇందులో జమీందారైన రాజా పాత్రలో శరత్బాబు ఆకట్టుకున్నాడు. రజనీకాంత్తో పోటీ పడి మరీ నటించాడు. రజనీ - శరత్బాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శరత్బాబు అత్యుత్తమ నటన కనబరిచిన సినిమాల్లో ముత్తు కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.
https://www.youtube.com/watch?v=0h6qh6ABmdk
8. అన్నయ్య
చిరంజీవి, సౌందర్య జంటగా నటించిన అన్నయ్య సినిమాలో శరత్బాబు విలన్ పాత్ర పోషించారు.
సోదరులను అడ్డుపెట్టుకొని చిరంజీవిపై పగ తీర్చుకునే రంగారావు పాత్రలో శరత్బాబు మంచి నటన కనబరిచాడు.
https://www.youtube.com/watch?v=Deoo7_CQFdg
9. మగధీర
రామ్చరణ్ - రాజమౌళి కాంబో వచ్చిన మగధీర చిత్రంలోనూ శరత్ కుమార్ నటించారు. కాజల్కు తండ్రిగా, విక్రమ్ సింగ్ మహారాజ్గా మెప్పించాడు.
https://www.youtube.com/watch?v=G7haVu5g-Qw
10. వకీల్సాబ్
పవన్ కల్యాణ్ రీసెంట్ మూవీ వకీల్సాబ్ సినిమాలోనూ శరత్కుమార్ కనిపించారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా ఆయన నటించారు. పవన్ను ఉద్దేశిస్తూ ‘ఇప్పుడు జనాలకు నీ అవసరం ఉంది’ అని శరత్ బాబు చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది.
మే 22 , 2023
![<strong>Bahishkarana Series Review: వేశ్య పాత్రలో అంజలి మెప్పించిందా! సిరీస్ ఎలా ఉందంటే?</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/19141926/GS0RXmnbYAAj_Zz.jpg)
Bahishkarana Series Review: వేశ్య పాత్రలో అంజలి మెప్పించిందా! సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు : అంజలి, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, రవీంద్ర విజయ్, షణ్ముఖ్, మహబూబ్ బాషా, శ్రీతేజ్, బేబీ చైత్ర, సమ్మెట గాంధీ తదితరులు
దర్శకత్వం : ముఖేష్ ప్రజాపతి
సినిమాటోగ్రఫీ : ప్రసన్న ఎస్. కుమార్
సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని
ఎడిటింగ్ : రవితేజ గిరిజల
నిర్మాత : ప్రశాంత్ మలిశెట్టి
ఓటీటీ వేదిక : జీ 5
విడుదల తేదీ : 19-07-2024
ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్ 'బహిష్కరణ'. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ను ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సిరీస్ అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో జులై 19న ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. జీ 5 వేదికగా మెుత్తం ఆరు ఎపిసోడ్స్తో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1990 దశకంలో కథ సాగుతుంది. గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్) ప్రెసిడెంట్గా ఉంటాడు. ఊర్లో ఆయన మాటే శాసనం. డబ్బు, అధికారం అడ్డుపెట్టుకొని మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. పుష్ప (అంజలి) అతడి ఉంపుడుగత్తెగా ఉంటుంది. శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్) పుష్పను ప్రేమిస్తాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. ఇందుకు శివయ్య ఒప్పుకున్నట్లే నటించి తెలివిగా అడ్డుకుంటాడు. దర్శికి మరదలు లక్ష్మీ (అనన్య నాగళ్ల)తో పెళ్లి జరిపిస్తాడు. ఈ క్రమంలోనే దర్శి ఓ కేసులో ఇరుక్కుంటాడు. అసలు దర్శిని ఇరికించింది ఎవరు? శివయ్యకు దర్శి ఎందుకు ఎదురుతిరిగాడు? దానివల్ల దర్శికి పట్టిన గతి ఏంటి? దర్శి భార్య లక్ష్మీ సాయంతో శివయ్యపై పుష్ప ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది ఈ సిరీస్ స్టోరీ. ‘
ఎవరెలా చేశారంటే
వేశ్య పాత్రలో నటి అంజలి అదరగొట్టింది. తన డైలాగ్స్, మ్యానరిజమ్స్తో మిస్మరైజ్ చేసింది. ఇష్టంలేని జీవితాన్ని గడిపే వేశ్యగా, ప్రియుడి ప్రేమ కోసం పరితపించే మహిళగా చక్కటి వేరియేషన్స్ చూపించింది. ఇక యాక్షన్ సీక్వెన్స్లోనూ అంజలి దుమ్మురేపింది. క్లైమాక్స్లో విశ్వరూపం చూపించింది. అటు దర్శిగా శ్రీతేజ్ నటన ఆకట్టుకుంది. అన్యాయాలను సహించలేని అట్టడుగు వర్గానికి చెందిన యువకుడి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. అటు లక్ష్మీ పాత్రలో అనన్య నాగళ్ల సహజమైన నటన కనబరిచింది. విలన్గా శివయ్య పాత్రలో రవీంద్ర విజయ్ సెటిల్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. తన డైలాగ్స్, లుక్స్తో ఎంతో పవర్ఫుల్గా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు యాక్ట్ చేసి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పిరియాడికల్ బ్యాక్డ్రాప్లో సాగే రివేంజ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్ను రూపొందించారు. తన ప్రియుడికి జరిగిన అన్యాయంపై ఓ వేశ్య ఏ విధంగా పోరాడింది అన్న కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. ఒకప్పుడు గ్రామాల్లో కులాల పట్టింపులు ఎలా ఉండేవో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు తక్కువ జాతిని వారిని ఎలా అణిచివేశారో చూపించారు. ముఖ్యంగా మహిళలు ఏ విధంగా అణిచివేయబడ్డారన్నది రా అండ్ రస్టిక్గా దర్శకుడు చూపించారు. క్యాస్ట్, అంటరానితనం వంటి సున్నితమైన అంశాలను టచ్ చేశారు. డ్రామా, ఎమోషన్స్కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే కాన్సెప్ట్ బాగున్నా ప్రజెంటేషన్ మాత్రం రొటీన్గా అనిపిస్తుంది. సిరీస్ మొత్తం పెద్ద మలుపులేమి లేకుండా ఫ్లాట్గా సాగిపోతుంది. వేశ్య బ్యాక్డ్రాప్ కొత్తగా ఉన్న మిగిలిన స్టోరీలైన్ పాత సినిమాలను గుర్తుకు తెస్తుంటుంది. కొన్ని డిస్టబింగ్ సన్నివేశాలను పక్కన పెడితే ‘బహిష్కరణ’ మిమ్మల్ని తప్పుకండా ఎంటర్టైన్ చేస్తుంది.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ ప్రసన్న ఎస్. కుమార్ చక్కటి పనితీరు కనబరిచాడు. తన కెమెరా నైపుణ్యంతో ఆడియన్స్ 90వ దశకంలోకి తీసుకెళ్లారు. సిద్ధార్థ్ సదాశివుని అందించిన నేపథ్య సంగీతం సిరీస్కు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్ను ఓ రెంజ్లో ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అంజలి నటనపిరియాడికల్ రివేంజ్ డ్రామానేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ట్విస్టులు లేకపోవడంకొన్ని బోరింగ్ సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
జూలై 19 , 2024
![Ruhani Sharma Hot: మరోసారి రుహానీ శర్మ పరువాల దాడి.. కుర్రకారు హార్ట్ బీట్ ఢమాల్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/01160636/123.-2024-06-01T160508.090.jpg)
Ruhani Sharma Hot: మరోసారి రుహానీ శర్మ పరువాల దాడి.. కుర్రకారు హార్ట్ బీట్ ఢమాల్!
హాట్ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma) తన గ్లామర్ షోతో మరోమారు సోషల్ మీడియాను హీటెక్కించింది. రెడ్ కలర్ జాకెట్లో ఎద అందాలను ఆరబోసింది.
ఎర్రటి జాకెట్తో తెల్లటి అందాలను ప్రదర్శించి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఫొటోలకు స్మైలింగ్ ఎమోజీని క్యాప్షన్గా పెట్టి కుర్రకారుకు కొంటె వల విసిరింది.
రుహానీ శర్మ అందాలతో పాటు ఫిట్నెస్ కూడా ఈ ఫొటోల్లో కనిపించింది. ఆమె ఫిజిక్ అద్భుతంగా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మోడల్గా కెరీర్ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
2018లో వచ్చి 'చిలసౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్కు జోడీగా నటించి మెప్పించింది.
‘చిలసౌ’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది.
2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2020లో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది.
ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
గతేడాది 'హర్ ; చాప్టర్ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.
ఈ ఏడాది సంక్రాంతికి రీలైజన 'సైంధవ్' చిత్రంలో డా.రేణు పాత్రలో కనిపించి రుహానీ ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ రీసెంట్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. రుహాని శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తాజాగా ‘శ్రీరంగ నీతులు’ అనే సినిమాలోనూ ఈ ముద్దుగమ్మ నటించింది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూహానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం రుహానీ.. హిందీలో ‘బ్లాకౌట్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
బ్లాక్ బాస్టర్ హిట్స్ రానప్పటికీ రుహానీ శర్మకు సోషల్ మీడియాలో ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ అమ్మడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
జూన్ 01 , 2024
![Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/21142654/Untitled-design-2024-05-21T142646.733.jpg)
Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్!
టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఎంతటి పేరు ప్రఖ్యాతలు సాధించినా బన్నీ మాత్రం చాలా సింపుల్గా ఉండేందుకే ఇష్టపడుతుంటాడు. సామాన్యుడిగా జీవించేందుకు ఏమాత్రం సంకోచించడు. వివాదంలో చిక్కుకుంటానని తెలిసినా స్నేహం కోసం ఇటీవల వైకాపా నాయకుడి ఇంటికి వెళ్లి మరి బన్నీ మద్దతు ప్రకటించాడు. ఇటువంటి సందర్భాలు బన్నీ లైఫ్లో చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బన్నీకి సంబంధించి ఓ ఫొటో బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బన్నీ.. సింప్లిసిటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో అల్లు అర్జున్, అతని భార్య ఓ సాధారణ హోటల్లో టేబుల్పై కూర్చొని భోజనం చేస్తూ కనిపించారు. దీనిని అక్కడ ఉన్న ఓ వ్యక్తి రహాస్యంగా ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్.. తమ హీరో సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. లైఫ్లో ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలన్న జీవిత పాఠాన్ని బన్నీ పాటిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోను షేర్ చేస్తూ ట్రెండింగ్లో చేస్తున్నారు.
.@alluarjun anna & sneha garu🤨😯❤️❤️Spotted at road side dhaba SIMPLICITY LEVEL. Man 🫡 pic.twitter.com/KoI7NOLfmF— Trend_AlluArjun_FC™ (@Trend_AA_FC) May 21, 2024
ఎక్కడ జరిగిందంటే?
ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల జిల్లాలో పర్యటించాడు. అక్కడ వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్కు అభివాదం చేసి.. కొద్ది సేపటికే బన్నీ తిరిగి హైదరాబాద్ బయలుదేరాడు. ఈ సందర్భంగా దారిలో ఓ దాబా వద్ద బన్నీ ఆగినట్లు తెలుస్తోంది. అక్కడ తన భార్యతో కలిసి భోజనం చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పుడు తీసిన ఫొటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు సమాచారం.
గతంలోనూ ఇలాగే..!
గతంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్ సందర్భంలోనూ బన్నీ రోడ్డు పక్కన టిఫిన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రంపచోడవరంలో తెల్లవారు జామున షూటింగ్కు వెళ్తూ బన్నీ మార్గం మధ్యలో ఓ కాకా హోటల్ దగ్గర కారు ఆపాడు. ఎంచక్కా పాకలోకి వెళ్లి టిఫిన్ చేశాడు. బయటకొచ్చి తన అసిస్టెంట్ను డబ్బులు అడిగి హోటల్ యజమాని చేతికి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియో మళ్లీ ఓసారి చూసేయండి.
Icon Star #AlluArjun was having breakfast at road side tiffin centre near gokavaram.@alluarjun ❤️ #Pushpa pic.twitter.com/25OCuNGRB4— Allu Arjun Fan™ (@IamVenkateshRam) September 13, 2021
‘పుష్ప 2’తో బిజీ బిజీ..
ప్రస్తుతం బన్నీ.. ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ‘పుష్ప 2’ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా చేస్తుండగా.. ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.
మే 21 , 2024
![Ruhani Sharma: జాకెట్ లేకుండా రుహాని శర్మ అందాల షో.. తట్టుకోవడం కష్టమే](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/16103550/123..png)
Ruhani Sharma: జాకెట్ లేకుండా రుహాని శర్మ అందాల షో.. తట్టుకోవడం కష్టమే
గ్లామర్ డాల్ రుహానీ శర్మ (Ruhani Sharma).. తన లేటెస్ట్ హాట్ ఫొటో షూట్తో సోషల్ మీడియాను అట్టుడికించింది. తన ఎద అందాలను బయటపెడుతూ చెమటలు పట్టించింది.
జాకెట్ లేకుండా చీర కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సమ్మర్లో తన అందంతో మరింత హీట్ పెంచేసింది.
తాజా ఫొటోల్లో క్రేజీ ఔట్ ఫిట్తో కనిపించిన ఈ అమ్మడు.. తన ఎద, నడుము అందాలతో మైండ్ బ్లాక్ చేసింది.
రుహానీ శర్మ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
మోడల్గా కెరీర్ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
2018లో వచ్చి 'చి ల సౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్కు జోడీగా నటించి మెప్పించింది.
చిలసౌ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది.
2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2020లో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది.
ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
గతేడాది 'హర్ ; చాప్టర్ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.
రీసెంట్గా 'సైంధవ్' చిత్రంలో డా. రేణు పాత్ర పోషించి ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది
ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. రుహాని శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తాజాగా ‘శ్రీరంగ నీతులు’ అనే చిత్రంలోనూ ఈ ముద్దుగమ్మ నటించింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
రుహాని శర్మ సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ.. టాలీవుడ్లో ఈ హాట్ డాల్కు అవకాశాలు మాత్రం దండిగానే వస్తున్నాయి.
మే 16 , 2024
![Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/12104919/123.-81.jpg)
Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
యంగ్ హీరోయిన్ రుహాని శర్మ (Ruhani Sharma).. టాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. రీసెంట్గా వెంకటేష్ ‘సైంధవ్’, వరుణ్తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాల్లో మెరిసిన ఈ భామ.. ఇప్పుడు ‘శ్రీరంగ నీతులు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ భామ దూకుడు చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. మరోవైపు యూత్.. రుహాని అందం, అభినయం చూసి ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రుహానీ శర్మ ఎవరు?
రుహానీ.. ప్రముఖ హీరోయిన్. తెలుగు, హిందీ మలయాళ చిత్రాల్లో ఆమె నటించింది.
రుహానీ శర్మ ఎక్కడ పుట్టింది?
సోలన్, హిమాచల్ ప్రదేశ్
రుహానీ శర్మ ఎప్పుడు పుట్టింది?
18 సెప్టెంబర్, 1994
రుహానీ శర్మ తల్లిదండ్రులు ఎవరు?
సుభాష్ శర్మ, ప్రాణేశ్వరి శర్మకు రుహానీ జన్మించింది.
రుహానీ శర్మ ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు (165 సెం.మీ)
రుహానీ శర్మ వయసు ఎంత?
30 సంవత్సరాలు (2024)
రుహానీ శర్మకు తోబుట్టువులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఒక సిస్టర్ ఉంది. ఆమె పేరు సుబ్బి శర్మ. సోదరులు లేరు
రుహానీ శర్మ ఏం చదువుకుంది?
బీఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చేసింది.
రుహానీ శర్మ.. కెరీర్ ఎలా మెుదలైంది?
సినిమాల్లోకి రాకముందు రుహానీ.. మోడల్గా పనిచేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన 'కుడి టూ పటాకా' పంజాబి సాంగ్ యూట్యూబ్లో సూపర్ హిట్ అయ్యింది.
రుహానీ శర్మ.. మెుదటి చిత్రం?
2017లో తమిళంలో వచ్చిన 'కడైసి బెంచ్ కార్తీ' (Kadaisi Bench Karthi) చిత్రం ద్వారా రుహానీ తొలిసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
రుహానీ శర్మ.. తొలి తెలుగు చిత్రం ఏది?
2018లో వచ్చిన 'చి ల సౌ' (Chi La Sow) సినిమా ద్వారా రుహానీ తెలుగు ఆడియన్స్కు పరిచయం అయ్యింది.
రుహానీ శర్మ.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
‘చిలసౌ’, ‘హిట్: ది ఫస్ట్ కేసు’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హర్: ఛాప్టర్ 1’, ‘సైంధవ్’, ‘ఆపరేషన్ వాలెంటైన్’
రుహానీ శర్మ లేటెస్ట్ చిత్రం?
శ్రీరంగ నీతులు
రుహానీ శర్మ నటించిన ఇతర భాషా చిత్రాలు?
కడైసి బెంచ్ కార్తీ (తమిళం), ఆగ్రా (హిందీ), కమల (మలయాళం)
రుహానీ శర్మ ఫేవరేట్ హీరో ఎవరు?
టాలీవుడ్లో వెంకటేష్, బాలీవుడ్లో షారుక్ ఖాన్ అంటే తనకు చాలా ఇష్టమని రుహానీ తెలిపింది.
రుహానీ శర్మకు ఇష్టమైన కలర్స్ ఏవి?
బ్లాక్ (Black), గ్రే (Grey)
రుహానీ శర్మకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం?
ఫ్లోరిడా
రుహానీ శర్మకు ఇష్టమైన క్రీడ ఏది?
క్రికెట్
రుహానీ శర్మ ఇన్స్టాగ్రామ్ లింక్?
https://www.instagram.com/ruhanisharma94/?hl=en
https://www.youtube.com/watch?v=pTdgQNy8BxI
ఏప్రిల్ 12 , 2024
![Ruhani Sharma: స్ట్రాప్లెస్ బ్రాలో అందాలు ఆరబోసిన రుహానీ శర్మ..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/02/27193603/Feture-ruhani.jpg)
Ruhani Sharma: స్ట్రాప్లెస్ బ్రాలో అందాలు ఆరబోసిన రుహానీ శర్మ..!
యంగ్ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma).. తన లేటెస్ట్ హాట్ ఫొటో షూట్తో సోషల్ మీడియాను షేక్ చేసింది. తన ఎద పొంగులతో కుర్రకారు హృదయాలను మెలికలు తెప్పేసింది.
తాజా సెల్ఫీ ఫొటోల్లో క్రేజీ ఔట్ ఫిట్తో కనిపించిన ఈ అమ్మడు.. తన ఎద, నడుము అందాలతో యూత్ను మైండ్ బ్లాక్ చేసింది.
రుహానీ శర్మ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
మోడల్గా కెరీర్ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
2018లో వచ్చి 'చిలసౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్కు జోడీగా నటించి మెప్పించింది.
చిలసౌ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది.
2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2020లో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది.
ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
గతేడాది 'హర్ ; చాప్టర్ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.
రీసెంట్గా 'సైంధవ్' చిత్రంలో డా. రేణు పాత్ర పోషించి ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది.
అలాగే టాలీవుడ్లో ‘శ్రీరంగ నీతులు’ అనే మరో చిత్రంలోనూ ఈ బ్యూటీ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటూ రుహానీ బిజీ బిజీగా గడుపుతోంది.
ఫిబ్రవరి 27 , 2024
![#90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/16160049/Untitled-design-2024-01-16T160034.144.jpg)
#90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి?
నిన్నటి గతాన్ని భద్రపరిచి నేటి తరానికి అందిస్తూ.. ఆనాటి మంచి, చెడు, ఆనందాలు, సమస్యలు అన్నింటిని హానెస్ట్గా చూపించింది #90s MiddleClass Biopic. మిడ్ 2000ను ఒక కాలచక్రంలో బంధించి అందమైన పాత్రల భావోద్వేగాలను చూపిస్తుంది. వెబ్సిరీస్లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమి ఉండదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో డే టూ డే లైఫ్ను అద్భుతంగా తెరకెక్కించింది. సిల్లీ సండే మూమెంట్స్, పండుగలు, హాలిడే ఎంజాయ్మెంట్ను కళ్లకు అద్ధినట్లు చూపిస్తుంది. నిజానికి ఇదే కదా లైఫ్ అంటే. మనం బ్రతికేది ఆ మూమెంట్స్లోనే కదా! చాలా విషయాలు మనం ఏదొక అజెండాతో చేస్తాం. ఎలాంటి ఎజెండా లేకుండా మనం చేసే పనులే మన లైఫ్. సరిగ్గా అలాంటి విషయాలను దగ్గరకు తెచ్చినదే #90s MiddleClass Biopic. ఈ సిరీస్ చూస్తున్నంతసేపూ అన్ని సీన్లు మన నిజ జీవితంలో ఎక్కడొక్కడ మనకు తారసపడినవే. వాటినే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. లెడీస్ తాలుకు సెన్సిటివ్ విషయాలను చాలా సూపర్బ్గా షోలో క్యారీ చేయించాడు.
ఇక 90s A MiddleClass Biopic టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈటీవి విన్ ఫ్లాట్ఫాం నుంచి వచ్చిన ఈ వెబ్సిరీస్కు IMDB ఏకంగా 9.6 రేటింగ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఓ వెబ్సిరిస్కు ఈ స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్లో 90వ దశకం మధ్యతరగతి వాతావరణాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి పాత్ర ఆ కాలం నాటి సాధక బాధకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 90sలో పుట్టినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు ఈ వెబ్సిరీస్లోని ఏదొక సీన్తో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలను అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. మరి అంతలా అభిమానించే విధంగా ఆ వెబ్సిరీస్లో క్లారెక్టర్ల తాలుకు ఔచిత్యాన్ని ఓసారి విశ్లేషిద్దాం.
చంద్రశేఖర్(శివాజీ): ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టార్. మధ్యతరగతి మనస్తత్వం కలవాడు. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిపిస్తూ వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. ఖర్చు విషయంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెడుతుంటాడు. పిల్లల భవిష్యత్ గురించి కలలుగంటగా పనిచేస్తుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ క్యారెక్టర్ 90వ దశకంలో సగటు తండ్రి ఆలోచనలకు ప్రతినిధిగా కనిపిస్తాడు. పిల్లల పట్ల అతను వ్యవహరించే తీరు నవ్వు తెప్పిస్తుంది. కొన్ని చోట్ల వారి భవిష్యత్ గురించి సగటు తండ్రిగా శేఖర్ పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. ఆడ పిల్ల తండ్రి కావడంతో ఆమెకు ఏదో ఒకటి కూడ బెట్టాలన్న మధ్యతరగతి సమస్యలు కనిపిస్తుంటాయి. పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటూనే వారికి అందించాల్సి సౌకర్యాల కోసం ఆలోచిస్తుంటాడు.
https://twitter.com/sunny5boy/status/1745383429808517544?s=20
రాణి(వాసుకీ): ఈ వెబ్సిరీస్లో సగటు మధ్యతరగతి గృహిణిగా రాణి పాత్రలో వాసుకీ ఆనంద్ అద్భుతమైన నటన కనబర్చింది. నిరంతరం కుటుంబం కోసం ఆలోచించే గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. భర్త తెచ్చిచ్చే కాస్త డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటుంది. భర్తకు తన బాధ్యతలు గుర్తు చేస్తూ అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఆడపిల్ల ఉన్న ఇంట్లో మధ్యతరగతి గృహిణి భయాలు ఆమెలో స్పష్టంగా కనిపించాయి. పిల్లల కోరికలను తీర్చుతునే... అనవసరమైన ఆశలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆనాటి జీవనగతిని కళ్లకు కట్టింది.
https://twitter.com/Ga_ne_sh_5/status/1745774847375069388?s=20
ఆదిత్య: ముఖ్యంగా ఈ సినిమాకు నిజమైన హీరో మౌలి అనే చెప్పాలి. చిన్నవయసులోనే అద్భుతమైన నటన కనబరిచాడు. అతన్ని చూస్తుంటే ప్రతింట్లో ఉండే చిన్న కొడుకు మాదిరి కనిపిస్తాడు. సాధారణంగా ఇళ్లల్లో చిన్న కొడుకు గారాభంగా పెరుగుతుంటారు. వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో వంట నచ్చకపోతే మారం చేయడం, తోటి పిల్లలను ఆట పట్టించడం వంటి చేష్టలు హాస్యంగా కనిపిస్తాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు అమ్మ-నాన్న దగ్గర ఆదిత్య చెప్పే అబద్దాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంటికి ఎవరైన చుట్టాలు వచ్చినప్పుడు వారివద్ద చిన్నపిల్లలు చేసే సరదా చేష్టలు ఆదిత్య క్యారెక్టర్ 90s కాలాన్ని గుర్తు చేస్తాయి. ముఖ్యంగా ఆ వయసులో చిన్నపిల్లలు పడే మానసిక వ్యథ.. ఆదిత్య పాత్రలో ప్రతిబింబిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఆదిత్య- చంద్రశేఖర్ క్యారెక్టర్కు సంబంధించిన సీన్లు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయి.
https://twitter.com/Iharish999/status/1744674325352132686?s=20
ప్రశాంత్ &దివ్య:
పదోతరగతి చదువుతున్న ప్రశాంత్ టీనేజ్ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. బయట ఆడుకోవాలని ఉన్నా, తన తండ్రి మాట కోసం ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. 10thలో జిల్లా ఫస్ట్ రావాలనే తన తండ్రి కోరిక కోసం పరిశ్రమిస్తుంటాడు. అతని తమ్ముడు ఆదిత్యతో చేసే సరదా సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక దివ్య మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి పుడితే ఎలా పెరుగుతుందో అలాగే కనిపించింది. తల్లిద్రండ్రుల భయాల మధ్య వారి మాటకు అనుగుణంగా పెరుగుతూ కనిపిస్తుంది.
https://twitter.com/_Shivatweets/status/1745269317112119543?s=20
https://telugu.yousay.tv/90s-web-series-review-how-is-the-90s-series-a-reflection-of-middle-class-families.html
జనవరి 16 , 2024
![#90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్ ఎలా ఉందంటే? ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/05151700/Untitled-design-2024-01-05T150830.638.jpg)
#90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు
రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్
సంగీతం: సురేష్ బొబ్బలి
సినిమాటోగ్రఫీ: అజాజ్ మహ్మద్
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
నిర్మాత: రాజశేఖర్ మేడారం
శివాజీ, వాసుకి జంటగా నటించిన లెేటెస్ట్ వెబ్సిరీస్ ‘#90's. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్లైన్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక సిరీస్ను రాజశేఖర్ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిరీస్ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. కాగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ సిరీస్ ప్రసారంలోకి వచ్చింది. మరి దీని కథేంటి? లెక్కల మాస్టార్గా శివాజీ ఎలా నటించారు? ఇప్పుడు చూద్దాం.
కథ
చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎవరెలా చేశారంటే
చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా ఆయన కనిపించారు. మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె అద్భుత నటన కనబరిచారు. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతడు చక్కగా చేశాడు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో మెప్పిస్తారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథ రొటిన్గా అనిపించినప్పటికీ క్యూట్ & లిటిల్ మూమెంట్స్తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్తో ప్రేక్షకులను 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లి ఆ స్మృతులను ఆదిత్య గుర్తుచేశారు. కుటుంబ విలువలను సిరీస్లో చక్కగా చూపించారు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే '90స్' మధ్యతరగతి కుటుంబాన్ని కళ్లకు కట్టారు. ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఈ సిరీస్కు కనెక్ట్ అవుతాం. దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు.
టెక్నికల్గా
సాంకేతికంగా #90’s సిరీస్ బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి యూనిట్ పడిన కష్టం స్క్రీన్పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులుకథ, దర్శకత్వంసాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
రేటింగ్: 3/5
జనవరి 05 , 2024
![Mansi Taxak: యానిమల్లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/12/11165344/GA-QX53bMAA7U7r.jpg)
Mansi Taxak: యానిమల్లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
యానిమల్ సినిమాలో బాబీ డియోల్ మూడో భార్యగా నటించిన మాన్సి టాక్సాక్( Mansi Taxak ) ఇప్పుడో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువైనా ప్రేక్షకులపై చాలా ఇంపాక్ట్ కలిగించింది.
యానిమల్ సినిమాలో కొత్త పెళ్లి కూతురుగా అబ్రంను (బాబీ డియోల్) పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే అబ్రం.. అందరూ చూస్తుండగా ఆమెపై బలత్కారం చేసి తన క్రూరత్వాన్ని చూపిస్తాడు.
ప్రస్తుతం ఆమె గ్లామర్పై సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మాన్సి టాక్సక్ గురించి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.
ఆమె బ్యాక్గ్రౌండ్, ఏజ్, బాయ్ ఫ్రెండ్ వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు.
మాన్సి టాక్సక్ 1998 జులై 23న ముంబైలో కుల్దీప్ సింగ్ టాక్సాక్, కౌనిక టాక్సాక్ దంపతులకు జన్మించింది. ఆమె విద్యభ్యాసం అంతా గుజరాత్, ముంబైలో జరిగింది.
సినిమాల్లోకి రాకముందు మాన్సి టాక్సక్ మోడలింగ్ చేసేది. ఆమె 2019లో 'ఫెమినా మిస్ఇండియా' పోటీల్లో పాల్గొని 'మిస్ ఇండియా గుజరాత్' కిరిటం సాధించింది.
ఆ తర్వాత 2022లో ఐ ప్రామిస్ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా వెండి తెరకు పరిచయమైమంది. ఈ చిత్రం యూట్యూ ఛానెల్ క్యూనెట్లో రిలీజైంది.
ఈ సినిమా తర్వాత బాలీవుడ్ బాద్షా నటించిన పఠాన్ మూవీలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత ది కేరళ స్టోరీ, గదర్ 2 సినిమాల్లోనూ కనిపించింది.
మాన్సి నటించిన సినిమాలు బ్లాక్బాస్టర్ హిట్లు సాధించడం విశేషం.
https://twitter.com/TBSTwizzle/status/1733476252290302005
ఇక మాన్సి టాక్సాక్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఆమెకు 2 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడూ గ్లామర్ ఫోటో షూట్ చేస్తూ కనువిందు చేస్తుంటుంది
మాన్సి టాక్సాక్ కాలేజీ డేస్లో స్టేట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. అంతేకాదు జిల్లా స్థాయిలో అనేక బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని గెలిచింది.
మాన్సి టాక్సాక్కు భరత నాట్యం, బెల్లీ డ్యాన్స్లో మంచి ప్రావీణ్యం ఉంది.
మాన్సికి సామాజిక స్పృహా కూడా ఎక్కువే. దిలే సే ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది.
అంతేకాదు ఈ కుర్ర హీరోయిన్కు హిందీ, ఇంగ్లీష్తో పాటు స్పానీష్ భాషలో మంచి ప్రావీణ్యం ఉంది.
యానిమల్ సినిమాలో ఈ అమ్మడి గ్లామర్కు ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు క్యూ కట్టారంట.
మరోవైపు యానిమల్ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియా వైడ్గా రూ.438 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఇప్పటివరకు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్రహీరోల సినిమాలు మాత్రమే రూ.500 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ఆ లిస్ట్లో రణ్బీర్ కపూర్ సినిమా యానిమల్ యాడ్ అయింది.
డిసెంబర్ 11 , 2023
![Pedda Kapu 1 Review: డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/29141016/Untitled-design-2023-09-29T140938.529.jpg)
Pedda Kapu 1 Review: డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్, నాగ బాబు, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్
డైరెక్టర్: శ్రీకాంత్ అడ్దాల
సంగీతం: మిక్కీ జే. మేయర్
సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు
నిర్మాత: మిర్యాల రమేష్, మిర్యాల సత్యనారాయణ
క్లాస్ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం.
కథ:
1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే?
ఫస్టాఫ్లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్గా నిలుస్తుంది. ఆ సీన్ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్లో డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
ఎవరేలా చేశారంటే
పెదకాపు పాత్ర చేసిన విరాట్ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్ సీన్స్లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్ ప్రగతి పాత్రకు యాక్టింగ్ స్కోప్ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.
టెక్నికల్గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్ఫుల్ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.
ప్లస్ పాయింట్స్
స్క్రీన్ ప్లేవిరాట్, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్పాటలు
రేటింగ్ : 3/5
సెప్టెంబర్ 29 , 2023
![August 15 Celebrity Birthdays: స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించిన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/08/14130833/Untitled-design-7.jpg)
August 15 Celebrity Birthdays: స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించిన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!
ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆ రోజును యావత్ భారతావని గౌరంవగా భావిస్తారు. ఆగస్టు 15న ఏ కార్యక్రమం జరిగినా గొప్పగా పేర్కొంటూ కలకాలం గుర్తించుకుంటారు. ఈనేపథ్యంలో ఆగస్టు 15న జన్మించిన సినీ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారో ఓసారి చూద్దాం..
సుహాసిని మణిరత్నం
సుహాసిని తమిళనాడులోని పరమకుమిడిలో 1961 ఆగస్టు 15న జన్మించింది. తమిళం , తెలుగు , మలయాళం, కన్నడ చిత్రాలలో నటించింది . కే బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన సింధు భైరవి (1985) లో తన నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది . తెలుగులో ఎగిరేపావురమా, సంసారం చదరంగం, చంటబ్బాయి, నువ్వునాకునచ్చావ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అర్జున్ సర్జా
అర్జున్ తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ నటుడు, దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాలలో నటించాడు. కొన్నింటికి తానే స్వయంగా డైరెక్ట్ చేశాడు. 1962 ఆగస్టు 15న కర్ణాటకలోని తుమకూర్లో జన్మించారు. అర్జున్కు ఇద్దరు ఆడ పిల్లలు, ఐష్వర్య సర్జా, అంజనా సర్జా. ఇతను హనుమంతుని వీర భక్తుడు. అందువల్లే శ్రీఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు.
అద్నాన్ సమి
అద్నాన్ సమి ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు. 1971 ఆగస్టు 15న లండన్లో సమి జన్మించారు. హిందీ, తెలుగు చిత్రాల్లో వందలాది సాంగ్స్ పాడారు. పలు సినిమాల్లోనూ నటుడిగా యాక్ట్ చేశారు. భజరంగ్ భాయ్ జాన్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించారు. 2016లో భారత పౌరసత్వం పొందారు. సంగీతంలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డుతో ఆయన్ను సత్కరించింది.
ఉత్తేజ్
ఉత్తేజ్ 1975, ఆగస్ట్ 15న నల్గొండ జిల్లాలోని సీతారాంపురంలో జన్మించారు. తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా, సంభాషణల రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు 197 సినిమాల్లో నటించారు. మనీ, మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ వంటి హిట్ చిత్రాలకు మాటలు రాశాడు. చందమామ సినిమాకు ఉత్తమ హాస్య నటునిగా నంది బహుమతి పొందాడు.
అయాన్ ముఖర్జి
అయాన్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు. 1983 ఆగస్టు 15న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు. బ్రహ్మాస్త్ర, వేకప్సిడ్, 'హే జవానిహై దివాని' వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర పార్ట్ 2 తెరకెక్కించి పనిలో ఉన్నారు. ఈ చిత్రం మూడు పార్ట్లలో రానుంది.
రాళ్లపల్లి
రాళ్ళపల్లి ప్రముఖ తెలుగు క్యారెక్టర్ అర్టిస్ట్. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లిలో 1945, ఆగస్టు 15 న జన్మించారు. రాళ్లపల్లి అసలు పేరు రాళ్లపల్లి నరసింగరావు. తెలుగులో ఆయన దాదాపు 800కు పై చిత్రాల్లో నటించారు. తనికెళ్ల భరణి వంటి రచయితలకు ఆయన మార్గదర్శి. నాటకరంగంలో 8వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.
ఆగస్టు 14 , 2023
![Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి! ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/04141403/Untitled-design-2024-05-04T141358.890.jpg)
Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!
ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతుండటంతో కొన్ని మూవీస్ ఆటోమేటిక్గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్తో వచ్చినా కూడా అవి అండర్ రేటెట్ ఫిల్మ్స్గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్లో వీక్షించవచ్చు.
కంచె (Kanche)
వరణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ కంచె. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్స్టార్లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్ తేజ్).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya)
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ.
పలాస 1978 (Palasa 1978)
రక్షిత్ అట్లూరి హీరోగా కరుణ కుమార్ డైరెక్షన్ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
మను (Manu)
బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్గా చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్ ఫండింగ్ రూపంలో నిర్మించారు. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీని చూడవచ్చు. కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
చక్రవ్యూహం: ది ట్రాప్ (Chakravyuham: The Trap)
అజయ్ లీడ్ రోల్లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్ (సుదీష్)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్, అమృత శ్రీనివాసన్ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్తో ఉండే హీరో లైఫ్లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
క్షణం (Kshanam)
అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
మే 04 , 2024
![Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/22111818/Untitled-design-2024-03-22T111449.759.jpg)
Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆరెంజ్ (Orange)
రామ్చరణ్ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్బాస్టర్ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.
అ! (Awe)
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్కు ఒక్కో క్యారెక్టర్ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్గా విజయం సాధించలేదు.
C/o కంచరపాలెం (C/o Kancharapalem)
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
అంటే సుందరానికి (Ante Sundaraniki)
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్గా విజయాన్ని సాధించలేకపోయింది.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.
కర్మ (Karma)
యంగ్ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్లో మంచి టీఆర్పీ రేటింగ్ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.
1: నేనొక్కడినే (1: Nenokkadine)
సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పడేసింది. ఆడియన్స్కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్లోకి వెళ్లిపోయింది. బోరింగ్ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఖలేజా (Khaleja)
ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.
విరాట పర్వం
సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ను అలరించింది. రొటిన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.
మార్చి 22 , 2024
![Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన చిత్రాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/13183101/Untitled-design-2024-03-13T183050.023.jpg)
Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన చిత్రాలు ఇవే!
సినిమాలు కేవలం వినోద మాద్యమం మాత్రమే కాదు. అవి వినోదాన్ని పంచడంతో పాటు సమాజంలోని స్థితిగతులను కూడా ప్రతిబింబిస్తాయి. తద్వారా ప్రజల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో గత కొంత కాలంగా పొలిటికల్ చిత్రాల హవా పెరిగింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రజల రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే విధంగా ఆ చిత్రాలు విడుదలవుతున్నాయి. టాలీవుడ్లో 2019 నుంచి ఈ పొలిటికల్ చిత్రాల ఒరవడి మెుదలవ్వగా.. 2024లోనూ అది కొనసాగుతూ వచ్చింది. ఆయా చిత్రాల విడుదల సందర్భంగా మెుదలయ్యే రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే మరికొన్ని సినిమాలు ఆదర్శనీయమైన రాజకీయ కథాంశాలతో వచ్చి సూపర్ హిట్గా నిలిచాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
యాత్ర (Yatra)
దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'యాత్ర' (Yatra). మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిచారు. వైఎస్ఆర్ పాదయాత్ర చేయడానికి గల కారణాలు? చంద్రబాబు 9ఏళ్ల పాలనను కాదని ప్రజలు వైఎస్ఆర్కు ఎందుకు పట్టం కట్టారు? అన్నది చూపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అప్పటి తెలుగు దేశం పార్టీని గద్దె దిగడానికి ఒకింత సాయం చేసిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపించింది.
ఎన్.టి.ఆర్. మహానాయకుడు (NTR Mahanayakudu)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్.టి.రామారావు.. రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటి విద్యా బాలన్.. ఎన్టీఆర్ భార్య బసవ తారకం పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాదెండ్ల భాస్కరరావు.. కేంద్రంలోని కాంగ్రెస్ సాయంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఇందులో చూపించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ బలంగా ప్రజల్లోకి, దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల దృష్టికి తీసుకెళ్లి తిరిగి అధికారంలోకి రావడాన్ని దర్శకుడు క్రిష్ తెరపై ఆవిష్కరించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ (Lakshmi's NTR)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది? ఆమె రాక తర్వాత ఎన్టీఆర్కు కుటుంబసభ్యులు ఎందుకు దూరమయ్యారు? ఎన్టీఆర్కు వెన్నుపోటు ఎలా జరిగింది? వంటి అంశాలను దర్శకుడు ఇందులో చూపించారు. ఈ మూవీపై అప్పటి తెలుగు దేశం పార్టీ కక్ష కట్టి విడుదల కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరకు థియేటర్స్లో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మూవీ అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు వర్మ తెలిపారు.
అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu)
2019 డిసెంబర్లో వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను కూడా దర్శకుడు రామ్గోపాల్ వర్మ.. ఏపీ రాజకీయాలను ఆధారంగా తీసుకొని రూపొందించాడు. సీఎం జగన్ అధికారం చేపట్టాక మాజీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ మనోవేదనకు గురై ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎలాంటి పన్నాగాలు చేశారు అన్న కాన్సెప్ట్తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా విడుదలకు ముందు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది.
జై బోలో తెలంగాణ (Jai Bholo Telangana)
తెలంగాణ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా (Jai Bolo Telangana) తెరకెక్కింది. ప్రత్యేక తెలంగాణ కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న ఓ కుటుంబం చుట్టూ కథ సాగుతుంది. ముఖ్యంగా ఉద్యమం సమయంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్, మీరానందన్ ప్రధాన పాత్రలు పోషించారు.
యాత్ర 2 (Yatra 2)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెమీ బయోపిక్గా ‘యాత్ర 2’ తెరకెక్కింది. వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి.. తన తండ్రి బాటలో నడవాలని జగన్ ఎందుకు నిర్ణయించుకున్నాడు.. ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
వ్యూహాం (Vyuham)
వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ.. ఈ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. వైఎస్ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్.. జగన్ను ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? వాటిని జగన్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఇందులో చూపించాడు.
శపథం (Sapadam)
'వ్యూహం' సినిమాకు కొనసాగింపుగా 'శపథం' మూవీని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జరిగిన పరిస్థితులను ఈ సినిమాలో తెరకెక్కించారు. జగన్ చేపట్టిన ప్రజా సంక్షేమాలను ఆపడానికి విపక్ష నేత చంద్రబాబు చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్ పరిస్థితి ఎలా ఉంది? అన్నది దర్శకుడు ఇందులో చూపించాడు.
రజాకార్ (Razakar)
సెప్టెంబర్ 17, 1948కి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం అణచివేత పాలనకు, రజాకార్ల అరాచకాల మధ్య ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు. వారి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించారు అన్న దానిని కథాంశంగా చేసుకొని దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు.
రాజధాని ఫైల్స్ (Rajadhani Files)
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భాను శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంల అఖిలన్ పుష్పరాజ్, విశాల్ పతి, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏపీ సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకొని నిర్మించడం గమనార్హం.
లీడర్ (Leader)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్’ చిత్రం.. బ్లాక్బాస్టర్గా నిలిచింది. ఈ సినిమాతోనే హీరో రానా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తండ్రి మరణించడంతో స్వార్థపరుడైన వ్యక్తికి అధికారం కట్టబెట్టడం ఇష్టం లేని అర్జున్ (రానా) సీఎం అవుతాడు. అతడు సమాజంలోని అవినీతి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశాడన్నది సినిమా. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.
భరత్ అనే నేను (Bharath Ane Nenu)
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కూడా మంచి విజయాన్ని సాధించింది. సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్ (మహేష్) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్ పెట్టాడు? అన్న కోణంలో ఈ సినిమా తెరకెక్కింది.
నోటా (Nota)
యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన తొలి పొలిటికల్ చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఓ రాష్ట్ర సీఎం కొడుకు అయిన వరుణ్ (విజయ్).. తండ్రి కేసులో ఇరుక్కోవడంతో పదవిలోకి వస్తాడు. ఆ తర్వాత సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు? తప్పుచేసిన తండ్రిని సైతం ఎలా శిక్షించాడు? అన్న కోణంలో సినిమా రూపొందింది. ఇందులో విజయ్కు జోడీగా మెహ్రీన్ చేసింది.
మార్చి 13 , 2024
![Telugu Heroines: టాలీవుడ్లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్ డేస్ తిరిగి వచ్చినట్లేనా? ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/06132243/Untitled-design-2024-03-06T132213.859.jpg)
Telugu Heroines: టాలీవుడ్లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్ డేస్ తిరిగి వచ్చినట్లేనా?
ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
గౌరి ప్రియ (Gouri Priya)
టాలీవుడ్లో ఇటీవల వచ్చి యూత్ఫుల్ ఎంటర్టైనర్లో ‘మ్యాడ్’ (MAD) చిత్రంలో హీరోయిన్గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్ను కట్టిపడేసింది. రీసెంట్గా తమిళ హీరో మణికందన్ పక్కన ‘లవర్’ సినిమాలో నటించి కోలీవుడ్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
https://www.youtube.com/watch?v=8dwrE0OCq40
ఆనందిని (Anandhi)
వరంగల్కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్ను తమిళ మూవీస్పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్ హీరోల సరసన హీరోయిన్గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్ హీరోగా చేసింది.
చాందిని చౌదరి (Chandini Chowdary)
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. 'కలర్ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్గా 'గామి' (Gaami)లో విష్వక్ సేన్ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్సిరీస్లు సైతం చేసింది.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ (Software Developer) సిరీస్తో ఒక్కసారిగా యూత్లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.
https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI
దివ్య శ్రీపాద (Divya Sripada)
టాలీవుడ్లో తమ క్రేజ్ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్గా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్ కామ్రేడ్’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala)
ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్, మేజర్, పొన్నిసెల్వన్ వంటి హిట్ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్ చిత్రం 'మంకీ మ్యాన్'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
రితు వర్మ (Ritu Varma)
హైదరాబాద్కు చెందిన ఈ సుందరి.. 'బాద్ షా' (Badshah) సినిమాలో కాజల్ ఫ్రెండ్ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్గా ‘మార్క్ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్గా చేసి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.
https://www.youtube.com/watch?v=4hNEsshEeN8
స్వాతి రెడ్డి (Swathi Reddy)
వైజాగ్కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్లో వరుసగా అష్టాచమ్మా, గోల్కొండ స్కూల్, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్గా 'మంత్ ఆఫ్ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.
https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE
డింపుల్ హయాతి (Dimple Hayathi)
ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్ హయాతి.. హైదరాబాద్లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606
శివాని నగరం (Shivani Nagaram)
ఇటీవల టాలీవుడ్లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి.
మానస చౌదరి (Maanasa Choudhary)
ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్గా ‘బబుల్గమ్’ సినిమాతో టాలీవుడ్లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.
https://twitter.com/i/status/1762802318934950146
అంజలి (Anjali)
తూర్పు గోదావరి జిల్లా రాజోల్లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్, సరైనోడు, వకీల్సాబ్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్లోనూ నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
మార్చి 06 , 2024
![జిమ్లో జాన్వీ కపూర్ అందాల సెగలు](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/02/14112044/cropped-ws_hjuku.jpeg)
జిమ్లో జాన్వీ కపూర్ అందాల సెగలు
]వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘ధావల్’ చిత్రంలోనూ మెరువనుంది.Download Our App
ఫిబ్రవరి 14 , 2023