UATelugu
ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
చైతన్య రావువాస్తు
రాగ్ మయూర్లాంచం
బ్రహ్మానందం
తరుణ్ భాస్కర్
నాయుడుజీవన్ కుమార్జీవన్
విష్ణు ఓయీసికందర్
రవీంద్ర విజయ్
సియిఒరఘు రామ్
షాట్లుహరి కాంత్
సిబ్బంది
తరుణ్ భాస్కర్
దర్శకుడుఉపేంద్ర వర్మనిర్మాత
శ్రీనివాస్ కౌశిక్నిర్మాత
వివేక్ సుధాంషునిర్మాత
వివేక్ సాగర్
సంగీతకారుడుఎ జె ఆరోన్సినిమాటోగ్రాఫర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్ భాస్కర్ హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్
నిర్మాతలు: కె.వివేక్, సాయికృష్ణ, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్, ఉపేంద్ర వర్మ
సమర్పణ: రానా దగ్గుబాటి
విడుదల: 03-11-2023
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ కథలను అందించడంలో తనకు సాటి లేరని చాటి చెప్పారు. సున్నితమైన కథలతో వల్గారిటీ లేని కామెడీని పుట్టించి తరుణ్ తెలుగు ఆడియన్స్కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా యూత్లో మంచి క్రేజ్ సంపాదించాడు. అటువంటి తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన మరో చిత్రం 'కీడా కీలా' (Keeda Cola). ఈ చిత్రం ఇవాళ (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందా? తరుణ్ భాస్కర్ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? వంటి ప్రశ్నలకు ఈ రివ్యూలో సమాధానాలు తెలుసుకుందాం.
కథ
వాస్తు (చైతన్యరావు), వరదరాజు (బ్రహ్మానందం) తాత మనవళ్లు. లాయర్ అయిన కౌశిక్ (రాగ్ మయూర్)తో కలిసి డబ్బు కోసం ఓ ప్లాన్ వేస్తారు. తాత కోసం కొన్న శీతల పానీయం కీడా కోలా బాటిల్లో బొద్దింకని చూపించి యజమానిని బ్లాక్మెయిల్ చేయాలని పన్నాగం పన్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేరసారాలు మొదలవుతాయి. మరోవైపు జీవన్ కార్పొరేటర్ కావాలని ఆశపడుతుంటాడు. 20 ఏళ్లు జైల్లో ఉండి బయటికి వచ్చిన తన అన్న నాయుడు (Tharun bhascker) అండతో ఆ ప్రయత్నాల్లోకి దిగుతాడు. వీరికి కూడా డబ్బు అవసరం పడటంతో నాయుడు, జీవన్ కూడా ఓ వ్యూహం పన్నుతారు. మరి వీళ్లందరి ప్రయత్నాలు ఫలించాయా? డబ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్, జీవన్ గ్యాంగ్ ఎలా కలిశారు? తదితర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎలా సాగిందంటే
సరదా సరదా సన్నివేశాలతో ప్రథమార్ధం వేగంగా పూర్తవుతుంది. నాయుడుగా తరుణ్ భాస్కర్ ఎంట్రీతో కథలో మరింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయన చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. ఇక ద్వితీయార్ధం మరింత సందడిగా అనిపిస్తుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటనల్లో నటిస్తూ హీరోగా గెటప్ శీను చేసే సందడి, వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని సరెండర్ అంటూ చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. నాయుడుని అంతం చేయడానికి వచ్చిన షార్ప్ షూటర్స్ చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్గా నిలుస్తాయి. బ్రహ్మానందం పాత్ర వీల్ ఛెయిర్కే పరిమితమైనా సందర్భానుసారంగా నవ్విస్తుంది.
ఎవరెలా చేశారంటే?
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో నటుడిగానూ అద్భుత నటన కనబరిచాడు. నాయుడుగా ఆయన కనిపించిన విధానం, నటన, కామెడీ టైమింగ్ సినిమాకి ప్రధానబలం. బ్రహ్మానందం పాత్ర పరిధి తక్కువే అయినా చివరి వరకూ సినిమాపై ఆయన పాత్ర ప్రభావం కనిపిస్తుంటుంది. హీరో చైతన్యరావు వైకల్యం ఉన్న యువకుడిగా కనిపించాడు. మాటల్ని సరిగ్గా పలకలేని పాత్రలో మంచి నటనని ప్రదర్శించాడు. రాగ్మయూర్, జీవన్, విష్ణు, రఘు, రవీంద్ర విజయ్, గెటప్ శీను కీలక పాత్రల్లో కనిపిస్తారు. చిన్న చిన్న పాత్రలు కూడా సినిమాలో నవ్విస్తాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
తరుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ చిత్రమిది. ఈ కథని నడిపించిన విధానం, రచనలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్, సంగీతం, మాటలు, పాత్రల హావభావాలతో ఆయన నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే తరుణ్ భాస్కర్ గత చిత్రాలకీ ఈ సినిమాకీ పోలిక ఉండదు. తొలి రెండు సినిమాల్ని వాస్తవికతకి పెద్ద పీట వేస్తూ ఆయన సన్నివేశాల్ని నడిపించారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా, నవ్వించడమే టార్గెట్ అన్నట్టుగా స్వేచ్ఛగా ఇందులో సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. చెప్పుకోదగ్గ కథ లేకపోయినా, కొన్ని సన్నివేశాలు ఊహకు తగ్గట్టుగా సాగుతున్నా ప్రేక్షకుల్ని మాత్రం కడుపుబ్బా నవ్వించడంలో తరుణ్ భాస్కర్ మరోమారు విజయం సాధించాడు.
టెక్నికల్గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. తరుణ్ భాస్కర్ తెలివైన రచన ఇందులో చాలా చోట్ల కనిపిస్తుంది. కొన్ని మాటల్ని హెడ్ఫోన్లో వినిపించే పాటలతో తనే సెన్సార్ చేస్తూ నవ్వించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటులు హాస్య సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
ఊహకందే కథనంరొటిన్ స్టోరీ
రేటింగ్ : 3.5/5
నవంబర్ 03 , 2023
This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్సిరీస్లు ఇవే!
గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో రిలీజయ్యే చిత్రాలు
కీడా కోలా
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్భాస్కర్, రాగ్మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మా ఊరి పొలిమేర 2
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. నవంబరు 3న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో సత్యం రాజేష్, కామాక్షి, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. మూవీ తొలి పార్ట్ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్-2పై అంచనాలు పెరిగిపోయాయి. తొలి భాగానికి మించిన థ్రిల్ ఇందులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
విధి
రోహిత్ నందా, ఆనంది జంటగా చేసిన చిత్రం ‘విధి’ (Vidhi). శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
12 ఫెయిల్
విక్రాంత్ మస్సే హీరోగా విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్’. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఘోస్ట్
కన్నడ స్టార్ శివ రాజ్కుమార్(Shiva Rajkumar) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్’ (Ghost). ఈ మూవీకి శ్రీని దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పింది.
ఓటీటీలో స్ట్రీమింగ్కానున్న చిత్రాలు/వెబ్సిరీస్లు
స్కంద
యంగ్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ 'స్కంద' ఈ వారం ఓటీటీలోకి రానుంది. నవంబర్ 2 నుంచి డిస్నీ+హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్లో క్లారిటీ ఇచ్చాడు.
ఫ్లాట్ఫామ్ వారీగా ఓటీటీ విడుదలలు…
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateP.I. MeenaWeb SeriesHindiAmazon PrimeNov 3Scam 2003 ; Part-2Web SeriesHindiSony LIVNov 3Are You Ok Baby?MovieTamilAhaOctober 31Locked InMovieEnglishNetflixNov 1JawanMovieHindiNetflixNov 2
అక్టోబర్ 30 , 2023
Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
అక్టోబర్లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్కేసరి, టైగర్నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్పూత్ నటించిన హరర్ మూవీ మంగళవారం సైతం నవంబర్లోనే విడుదల కానుంది. మరి నవంబర్ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి.
మా ఊరి పొలిమేర-2
సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.
కీడా కోలా
బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎర్ర చీర
శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆదికేశవ
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టైగర్ 3
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు.
మంగళవారం
పాయల్ రాజ్పూత్ లీడ్ రోల్లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది.
సప్తసాగరాలు దాటి- సైడ్ బీ
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్లో నవంబర్ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హేమంత్ రావు డైరెక్ట్ చేశారు. రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది.
డెవిల్
నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు.
అక్టోబర్ 26 , 2023
Tollywood: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా? కొత్త డైరెక్టర్ల దెబ్బకు ఈ స్టార్ డైరెక్టర్లు ఫసక్!
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ డైరెక్టర్ల పదును తగ్గిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన శ్రీను వైట్ల, తేజ, వి.వి.వినాయక్ వంటి దర్శకులు ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నారు. అనుభవాన్ని రంగరించినా ఒక హిట్ కొట్టలేక నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు, కొత్తగా మెగాఫోన్ పట్టుకున్న కుర్రాళ్లు అదరగొడుతున్నారు. విభిన్న కథాంశాలతో ముందుకు వచ్చి ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేస్తున్నారు. టాలీవుడ్లో ఈ తరహా డైరెక్టర్ల జాబితా పెరిగిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్లదే హవా కానుందని చర్చ నడుస్తోంది.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్గానే కాకుండా డైలాగ్ రైటర్గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ‘కీడా కోలా’ అనే యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తరుణ్. బ్రహ్మానందం లీడ్ రోల్లో 8 మంది స్టార్లు ఇందులో నటిస్తున్నారు.
శైలేష్ కొలను
హిట్ యూనివర్స్తో సినీ జర్నీని విభిన్నంగా స్టార్ట్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ని కథాంశంగా తీసుకుని సినిమాలు తీస్తున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో రెండో సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. ఇప్పుడు వెంకటేశ్ సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ నాని హీరోగా హిట్3 తీయనున్నాడు. ఇలా వరుసగా సినిమాలను ట్రాక్లో పెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. వెంకటేశ్ సైంధవ్ సినిమాపై శైలేష్ తెగ కష్టపడుతున్నాడు.
బుచ్చిబాబు సానా
కరోనా సమయంలో ఉప్పెన సినిమాతో వచ్చి థియేటర్లలో కాస్త అలజడి తీసుకొచ్చాడు బుచ్చిబాబు సానా. సుకుమార్ శిష్యుడిగా పరిచయమై మెగాఫోన్ పట్టుకున్నాడు. మంచి కథాంశాన్ని ఎంచుకుని కొత్త యాక్టర్లతో సినిమాను మలిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి ఫోన్ వచ్చేసింది. రామ్చరణ్తో సినిమా చేసే అవకాశాన్ని బుచ్చిబాబు కొట్టేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. క్లైమాక్స్ రైటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. ఈ ఏడాది నవంబర్లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
గౌతమ్ తిన్ననూరి
నాని హీరోగా వచ్చిన చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాని నటనకు ఎన్ని ప్రశంసలు దక్కాయో గౌతమ్ డైరెక్షన్కీ ఆ స్థాయిలో గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. రామ్చరణ్కి ఓ కథ వినిపించాడు. స్టోరీ బాగానే ఉన్నా చెర్రీకి కుదరలేదు. దీంతో విజయ్ దేవరకొండని ఒప్పించి సినిమా తెరకెక్కిస్తున్నాడీ జెర్సీ డైరెక్టర్. రౌడీ బాయ్ సరసన శ్రీలీల నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతోంది.
కేవీ అనుదీప్
జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ కేవీ అనుదీప్. 2016లోనే పిట్టగోడ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు. లాజిక్ లేని కామెడీకి కేరాఫ్ అనుదీప్. జాతిరత్నాలు తర్వాత శివ కార్తికేయన్తో ‘ప్రిన్స్’ సినిమా తీసి జాతిరత్నం అని నిరూపించుకున్నాడు. అయితే, ఇప్పటికే ఎంతో మంది ప్రొడ్యూసర్లు అనుదీప్కు అడ్వాన్స్ ఇచ్చారట. రామ్ పోతినేనితోనూ అనుదీప్ సినిమా తీయనున్నట్లు టాక్. రాపో కూడా అనుదీప్తో సినిమాకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.
ప్రశాంత్ వర్మ
అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు హనుమాన్ చిత్రంతో రాబోతున్నాడు. పాన్ వరల్డ్ చిత్రంగా ఇది రాబోతోంది. ఈ డైరెక్టర్ ఏకంగా ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ని ఏర్పాటు చేసి సినిమాలు తీయబోతున్నాడు. ఇందుకు ఆసక్తి కలిగిన వారిని రిక్రూట్ చేసుకుంటున్నాడు.
వేణు యెల్దండి
కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు కూడా ఓ కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్లో ఉందని నాని కితాబిచ్చాడు.
జూన్ 14 , 2023
రీ రిలీజ్కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
టాలివుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అప్పట్లో ఆడని సినిమాలు కూడా ఇప్పుడు బ్లాక్బస్టర్లు అవుతున్నాయి. ఇదే అదనుగా హీరో క్రేజ్ను వాడుకుని నిర్మాతలు సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేసి కాసులు గడిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలయ్య, మహేశ్ బాబు ఇలా అందరి సినిమాలు రిలీజై రికార్డులు సృష్టించాయి. అప్పట్లో అట్టర్ ఫ్లాప్ అయిన రామ్ చరణ్ ‘ఆరెంజ్’ కూడా ఇటీవల విడుదల చేశారు. అది ఇప్పటికే రూ.3 కోట్లు వసూలు చేసి ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఇదే పంథా రానున్న రోజుల్లోనూ కొనసాగబోతోంది. అనేక మంది స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
దేశముదురు
అల్లు అర్జున్ను మాస్ హీరోగా చేసిన సినిమా దేశముదురు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా హీరో ఇంట్రో సీన్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 6, 8 తేదీల్లో దేశముదురు 4K థియేటర్లలో నడవబోతోంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్గా మారిన ఐకాన్ స్టార్ మేనియాను క్యాష్ చేసుకోబోతున్నారు. హన్సిక హీరోయిన్గా పరిచయమైంది కూడా ఈ సినిమాతోనే. వైశాలి పాత్రకు వచ్చిన క్రేజ్తోనే ఆ తర్వాత హన్సిక స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఆది
RRR స్టార్గా విశ్వవ్యాప్తం అయిన జూనియర్ ఎన్టీఆర్ ‘తొడ గొట్టు చిన్నా’ డైలాగ్ తెలుగు వారందరికీ తెలిసిందే. అప్పుడప్పుడే మీసాలు వస్తున్న వయసులో జూ.ఎన్టీఆర్ చేసిన బలమైన పాత్ర ‘ఆది’. ఫ్యాక్షన్ నేపథ్యంలో వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20న మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
సింహాద్రి
రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సింహాద్రి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇందులో ఉపయోగించిన కత్తి, కీరవాణి పాటలు అన్నీ అప్పట్లో జనాన్ని ఆకట్టుకున్నవే. మే 20న ‘ఆది’తో పాటే సింహాద్రి కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఇందులో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు.
మోసగాళ్లకు మోసగాడు
భారత సినీ చరిత్రలోనే తొలి కౌబాయ్ ఫిల్మ్ ‘మోసగాళ్లకు మోసగాడు’ 4K వెర్షన్ కూడా థియేటర్లో విడుదల కాబోతోంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా మే 31న మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. KSR దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, ఆరుద్ర స్క్రీన్ప్లే అందించారు. కృష్ణ సరసన విజయ నిర్మల నటించారు. ఇంగ్లీష్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత తమిళ హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది. ప్రస్తుతం 4K కు సినిమాను రీస్టోర్ చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు.
ఈ నగరానికి ఏమైంది
తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన “ఈ నగరానికి ఏమైంది?”(ENE)కి యూత్లో మామూలుగా క్రేజ్ ఉండదు. ఫ్రెష్ కాన్సెప్ట్, మ్యూజిక్, కథనం, కామెడీతో 2018లో కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా..ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్ కోసం సోషల్ మీడియాలో నిత్యం తరుణ్ భాస్కర్ను అడుగుతూనే ఉంటారు. త్వరలోనే తీస్తానని తరుణ్ భాస్కర్ కూడా చాలాసార్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ENE రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తరుణ్ భాస్కర్ వెల్లడించాడు. ఎప్పుడు రిలీజ్ చేస్తానన్న విషయం చెప్పలేదు గానీ త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తానని ఇన్స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ అనే సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే రీ రిలీజ్ అయిన ఖుషి ఏకంగా రూ.7.73 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రజినీకాంత్ కెరీర్లో ఫ్లాప్గా నిలిచిన ‘బాబా’ రూ.4.4 కోట్లు రాబట్టింది. ఈ సినిమా పరాజయం వల్ల తన హీరోయిన్ కెరీర్ ముగిసిపోయిందని మనీషా కొయిరాలా ఇటీవల బాధను వ్యక్తం చేశారు. కానీ రీ రిలీజ్లో మాత్రం ‘బాబా’ ఘన విజయం సాధించింది. పవన్ కల్యాణ్ ‘జల్సా’ కూడా రీ రిలీజ్తో రూ.3.25 కోట్లు వసూలు చేసింది. మహేశ్ బాబు ఒక్కడు రూ.2.25 కోట్లు రాబట్టింది. పోకిరి కూడా బాగానే వసూలు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని రీ రిలీజ్లు చూసే అవకాశముంది. కొన్ని సినిమాలు అప్పట్లో థియేటర్లో ఫ్లాప్ అయినా టీవీలో సూపర్ హిట్గా నిలిచాయి. అలాంటి సినిమాలు థియేటర్లో రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అలాగే కొన్ని హిట్ సినిమాలు కూడా రీ రిలీజ్ అయితే బాగుంటుందని నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.
మీరు ఏ సినిమా మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
ఏప్రిల్ 01 , 2023
Tollywood Directors: హీరోయిన్ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?
సినిమాకు హీరో, హీరోయిన్ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో చుట్టూనే సాగేలా కొందరు దర్శకులు సినిమాలు తీస్తున్నారు. పాటల కోసం, అందచందాలను ఆరబోయటం కోసం మాత్రమే హీరోయిన్లు అన్నట్లు చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘లైగర్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలను గమనిస్తే హీరోయిన్ నటన కంటే వారి ఎక్స్పోజింగ్పైనే దర్శకులు ఎక్కువగా దృష్టిపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్లోని కొందరు యువ డైరెక్టర్లు మాత్రం హీరోయిన్లను ఒకప్పటిలా డిగ్నిటీగా చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో శేఖర్ కమ్ములాను ఫాలో అవుతూ సినీ లవర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేసిన చిత్రాలేంటి? అందులో హీరోయిన్స్ను ఎలా చూపించారు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శేఖర్ కమ్ముల (Sekhar Kammula)
టాలీవుడ్లో సెన్సిబుల్ దర్శకుడు అనగానే ముందుగా శేఖర్ కమ్ముల గుర్తుకు వస్తారు. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆయా సినిమాల కోసం ఎంచుకునే హీరోయిన్స్, వారిని ఆయన చూపించే విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆనంద్, గోదావరి చిత్రాల్లో నటి కమలిని ముఖర్జీని ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. పక్కింటి అమ్మాయి అనిపించేతలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. అలాగే ‘లీడర్’లో రీచా గంగోపాధ్యాయ, ‘లైఫ్ ఈజ్బ్యూటీఫుల్’లో షగున్ కౌర్ పాత్రలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇక ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రను మనసుకు హత్తుకునేలా ఎలా తీర్చిదిద్దారో అందరికీ తెలిసిందే. పెద్దగా ఎక్స్పోజింగ్ చేయనప్పటికీ ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్గా రాణిస్తుందంటే అందులో శేఖర్ కమ్ములకు ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. హీరోయిన్లను డిగ్నిటీగా ఎలా చూపించాలో, వారి నుంచి నటన ఏవిధంగా రాబట్టాలో తెలిసిన దర్శకుడు కావడంతో శేఖర్ కమ్ములతో కనీసం ఒక సినిమా అయిన చేయాలని కథానాయికలు ఆశ పడుతుంటారు.
హను రాఘవపూడి (Hanu Raghavapudi)
శేఖర్ కమ్ముల తరహాలోనే దర్శకుడు హను రాఘవపూడి కథానాయికల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఆయన దర్శత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’, ‘క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడి పడి లేచె మనసు’, ‘సీతారామం చిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దర్శకత్వంలో పని చేసిన లావణ్య త్రిపాఠి, మెహరిన్, సాయిపల్లవి, మృణాల్ ఠాకూర్ ఎంత మంచి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి అద్భుతమైన ప్రేమ కావ్యంలో మృణాల్ను చాలా బాగా చూపించారు. ఆ సినిమాతో ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ సినిమాలోని సీత పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని మృణాల్ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. హను రాఘవపడి ప్రభాస్తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె లుక్స్ విపరీతంగా ఆకర్షించగా డైరెక్టర్ హను ఇంకెంత బాగా చూపిస్తారోనని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
వివేక్ ఆత్రేయ (Vivek Athreya)
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం హీరోయిన్ల విషయంలో శేఖర్ కమ్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్గా నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంలో తమిళ నటి ప్రియాంక అరుళ్ మోహన్ను ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. ఎక్కడా గ్లామర్షోకు చోటు ఇవ్వకుండా ఆమె ద్వారా అద్భుత నటనను రాబట్టి ప్రశంసలు అందుకున్నారు. అందుకు ముందు డైరెక్ట్ చేసిన ‘మెంటల్ మదిలో’ (Mental Madhilo), ‘బ్రోచెవారెవరురా’ (Brochevarevarura), ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రాల్లోనూ హీరోయిన్ల స్కిన్ షో కంటే డిగ్నిటీ లుక్కే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్, నివేదా థామస్, నజ్రియా నజిమ్కు మంచి గుర్తింపు వచ్చింది.
శౌర్యువ్ (Shouryuv)
దర్శకుడు శౌర్యువ్ ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని మలిచి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో నాని హీరోగా నటించగా మృణాల్ ఠాకూర్ అతడికి జోడీగా చేసింది. బాలీవుడ్లో అప్పటికే హాట్ బాంబ్గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ను ఇందులో మళ్లీ అచ్చ తెలుగు అమ్మాయిగా చూపించారు. సాంగ్స్లో స్కిన్ షోకు అవకాశం ఉన్నప్పటికీ శౌర్యువ్ ఆ పని చేయలేదు. ఆమె పోషిస్తున్న డిగ్నిటీ పాత్రపై ప్రభావం చూపకుండా ఆద్యంతం మృణాల్ను అందంగా చూపించారు. హీరోయిన్ పాత్ర ఎలా ఉండాలి? ఎలా చూపించాలి? అని శౌర్యువ్కు ఉన్న స్పష్టతను చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. తన తర్వాతి సినిమాల్లోనూ ఇదే రీతిన కొనసాగాలని ఆశిస్తున్నారు.
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ యూత్ఫుల్ చిత్రాలకు కేరాఫ్గా మారిపోయారు. యువత మెచ్చే కంటెంట్తో వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే కుర్రకారును ఆకట్టుకువాలన్న తాపత్రయంలో అతడు ఎక్కడా గ్లామర్ షోకు ఆస్కారం ఇవ్వడం లేదు. తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ నుంచి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా రీతు వర్మ నటించింది. అసభ్యతకు, అనవసర స్కిన్షోకు చోటు లేకుండా ఆమెతో మంచి నటన రాబట్టాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో రీతు వర్మ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటుడిగా మారి పలు సినిమాల్లో నటించిన తరుణ్ బాస్కర్ ‘కీడా కోలా’తో మళ్లీ డైరెక్టర్గా మారారు.
సెప్టెంబర్ 14 , 2024
Tollywood New Directors: టాలీవుడ్లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ విజయాలు!
టాలీవుడ్లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, రామ్ గోపాల్ వర్మ, వి.వి. వినాయక్, తేజ, గుణశేఖర్ వంటి స్టార్ డైరెక్టర్లు హిట్స్ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్ కథలు, వైవిధ్యమైన మేకింగ్తో తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అంజి కె. మణికుమార్
ఎన్టీఆర్ బామ మరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ఆయ్' (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్ స్టైల్తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.
యదువంశీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ముఖేశ్ ప్రజాపతి
అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ఈ సిరీస్ ద్వారా దర్శకుడిగా ముఖేశ్ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి వ్యూస్ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.
శౌర్యువ్
నాని రీసెంట్ చిత్రం 'హాయ్ నాన్న'తో శౌర్యువ్ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్ చూపించాడు. 'హాయ్ నాన్న' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.
కల్యాణ్ శంకర్
ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఎంటర్టైనర్ చిత్రాల్లో 'మ్యాడ్' ఒకటి. దర్శకుడు కల్యాణ్ శంకర్ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని కల్యాణ్ శంకర్ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్, డైలాగ్స్ యూత్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కార్తిక్ దండు
‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్లో ఉందని నాని కితాబిచ్చాడు.
వేణు యెల్దండి
కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.
ప్రశాంత్ వర్మ
అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్ ఇండియా డైరెక్టర్గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది.
గౌతమ్ తిన్ననూరి
నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా చేస్తోంది.
బుచ్చిబాబు సానా
తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్ లవ్స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్ చరణ్తో అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా చేయనుంది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్గానే కాకుండా డైలాగ్ రైటర్గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.
ఆగస్టు 27 , 2024
Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్హుడ్ సినిమాలు ఇవే!
అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి. ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి.
[toc]
Jersey
అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ.
Ee Nagaraniki Emaindi
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
Chi La Sow
అర్జున్ (సుశాంత్) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies)
C/o Kancharapalem
కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ.
Brochevarevarura
పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies)
Ninnila Ninnila
పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
Raja Raja Chora
భాస్కర్ (శ్రీ విష్ణు) సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సంజన (మేఘా ఆకాష్)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ.
Nootokka Jillala Andagadu
హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
Balagam
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు.
Pareshan
ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ.
Nuvvu Naaku Nachchaav
వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.
Vedam
రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
Bommarillu
సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
Keedaa Cola
ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Seethamma Vakitlo Sirimalle Chettu
ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది.
Miss Shetty Mr Polishetty
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
Pilla Zamindar
అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ.
Josh
దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు.
Rowdy Boys
అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
Middle Class Melodies
రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
ఆగస్టు 24 , 2024
69th Filmfare Awards South 2024: ఫిల్మ్ఫేర్ అవార్డ్ నామినేషన్స్లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!
ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం.
నాని.. డబుల్ ధమాకా!
69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 నామినేషన్స్లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్ నాన్న) నాని నామినేట్ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్ కేసరి), ధనుష్ (సర్), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ), ఆనంద్ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్ (దసరా) ఫిల్మ్ఫేర్ అవార్డు రేసులో నిలిచింది.
బేబీ చిత్రం హవా!
69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్స్లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ (సాయి రాజేష్), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ (విజయ్ బుల్గానిన్), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (శ్రీరామ చంద్ర, పీవీఎన్ఎస్ రోహిత్) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్ఫేర్లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
https://twitter.com/MassMovieMakers/status/1813445764934431164
ఫిల్మ్ అవార్డ్స్ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే...
ఉత్తమ చిత్రం
బేబీబలగందసరాహాయ్ నాన్నమిస్శెట్టి.. మిస్టర్ పొలిశెట్టిసామజవరగమనసలార్: పార్ట్-1 సీజ్ ఫైర్
ఉత్తమ నటుడు
ఆనంద్ దేవరకొండ (బేబీ)బాలకృష్ణ (భగవంత్ కేసరి)చిరంజీవి (వాల్తేర్ వీరయ్య)ధనుష్ (సర్)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)నవీన్ పొలిశెట్టి (మిస్శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి)ప్రకాశ్రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ నటి:
అనుష్క (మిస్శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి)కీర్తిసురేశ్ (దసరా)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న)సమంత (శాకుంతలం)వైష్ణవీ చైతన్య (బేబీ)
ఉత్తమ దర్శకుడు:
అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)కార్తిక్ దండు (విరూపాక్ష)ప్రశాంత్నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)సాయి రాజేశ్ (బేబీ)శౌర్యువ్ (హాయ్ నాన్న)శ్రీకాంత్ ఓదెల (దసరా)వేణు యెల్దండ (బలగం)
ఉత్తమ సహాయ నటుడు:
బ్రహ్మానందం (రంగ మార్తండ)దీక్షిత్శెట్టి (దసరా)కోట జయరాం (బలగం)నరేశ్ (సామజవరగమన)రవితేజ (వాల్తేర్ వీరయ్య)విష్ణు ఓఐ (కీడా కోలా)
ఉత్తమ సహాయ నటి:
రమ్యకృష్ణ (రంగమార్తండ)రోహిణి మోల్లెటి (రైటర్ పద్మభూషణ్)రుపా లక్ష్మీ (బలగం)శ్యామల (విరూపాక్ష)శ్రీలీల (భగవంత్ కేసరి)శ్రియారెడ్డి (సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్)శ్వేతరెడ్డి (మంత్ ఆఫ్ మధు)
ఉత్తమ గాయని:
చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్ పాప)దీ (చమ్కీల అంగీలేసి -దసరా)మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)శక్తిశ్రీ గోపాలన్ (అమ్మాడి -హాయ్ నాన్న)శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు -సర్)
ఉత్తమ గాయకుడు:
అనురాగ్ కుల్కర్ణి (సమయ-హాయ్ నాన్న)హేషమ్ అబ్దుల్ వాహబ్ (ఖుషి -టైటిల్ సాంగ్)పీవీఎన్ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా -బేబీ)రామ్ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)సిధ్ శ్రీరామ్ (ఆరాధ్య – ఖుషి)శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్:
బేబీ (విజయ్ బుల్గానిన్)బలగం (భీమ్స్ సిసిరిలియో)దసరా (సంతోష్ నారాయణ్)హాయ్ నాన్న (హేషమ్ అబ్దుల్ వాహబ్)ఖుషి (హేషమ్ అబ్దుల్ వాహబ్)వాల్తేర్ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)
ఉత్తమ సాహిత్యం:
అనంత శ్రీరామ్ (గాజు బొమ్మ -హాయ్ నాన్న)అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)కాసర్ల శ్యామ్ (చమ్కీల అంగీలేసి -దసరా)కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు -బలగం)పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్)
జూలై 17 , 2024
Vijay Deverakonda - Sai Pallavi: విజయ్ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి.. తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవి.. రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
క్రేజీ లవ్స్టోరీ..
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్గా సాయిపల్లవిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
లవ్ స్టోరీలకు కేరాఫ్
తమిళంలో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సాయిపల్లవి (Sai Pallavi).. ఆ తర్వాత నుంచి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకమైన ఈ భామ.. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.
ఫుల్ స్వింగ్లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మెుదలైంది.
పోలీసు ఆఫీసర్గా విజయ్
'ఫ్యామిలీ స్టార్' చిత్రం తర్వాత ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సీరియస్ పోలీసు ఆఫీసర్గా విజయ్ కనిపించనున్నాడు. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
జూన్ 06 , 2024
Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్కి పండగే..!
రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.
భారీ తారాగణంతో..
జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది.
మ్యూజిక్ అతడేనా
నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్లో 4 సినిమాలు చేశాడు. జైలర్కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్లోనూ అనిరుధ్నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.
వీటికి కూడా సీక్వెల్స్?
జైలర్తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.
రజనీ, విజయ్లతో మూవీ
కోలీవుడ్లో రజనీ, విజయ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
4 రోజుల్లో 300 కోట్లు
జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఆగస్టు 14 , 2023
PAN INDIA MOVIE TITLES: టైటిల్తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ పదం కామన్గా వినిపిస్తోంది. అదే పాన్ ఇండియా. మొన్నటివరకు ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా పరిధి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎంగేజింగ్ కంటెంట్తో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆలోచన సినిమా టైటిల్ ఖరారు చేయడం దగ్గర నుంచే మొదలవుతోంది. అలా పాన్ ఇండియాగా వచ్చిన, రాబోతున్న సినిమాల టైటిల్స్ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఏ ఒక్క భాష, ప్రాంతానికే పరిమితం కాకుండా ఉంటోంది. అందరికీ తెలిసిన, బహు ప్రాచుర్యంలో ఉన్న పదాలను టైటిల్స్గా ఎంచుకుంటుండటం విశేషం.
సినిమాలో దమ్ముంటే కచ్చితంగా పరభాషా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. ఈ భరోసాతోనే భారీ బడ్జెట్ చిత్రాలను తీసుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా మూవీ టైటిల్ని ఫిక్స్ చేస్తున్నారు. పైగా, ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను సినిమాలో చేర్చుకోవడం కూడా కలిసొస్తోంది. ఇలా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైటిల్స్ ఏంటో చూద్దాం.
RRR
ఆస్కార్ అవార్డు పొందిన సినిమా ‘RRR’. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం. అయితే, వాస్తవానికి ఈ సినిమా టైటిల్ని ముందుగా ‘RRR’గా నిర్ణయించలేదు. రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్చరణ్ల కాంబోలో వస్తున్న సినిమా గనుక వాడుకలో ఉండేందుకు ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుచుకున్నారు. క్రమంగా ఇది అందరినీ చేరుకుంది. జనాల నోళ్లలో బాగా నానింది. దీంతో ఇతర భాషల్లో కూడా సులువుగా అర్థమవుతుందని భావించి ఇదే టైటిల్ను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మీకు తెలియంది కాదు.
KGF
రెండు పార్ట్లుగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం వచ్చేలా KGF అని కుదించి పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా మూడో పార్ట్ కూడా భవిష్యత్తులో తెరకెక్కనుంది.
పఠాన్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ‘పఠాన్’ అనే పేరు అంతటా సుపరిచతమే. ఏ ప్రాంతంలోనైనా ఈ పేరు కలిగిన వారుంటారు. అందుకే సినిమాకు ఈ టైటిల్ని కంటిన్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.
పుష్ప
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్గా ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ కోసం చాలా టైటిళ్లు అనుకున్నప్పటికీ.. క్యాచీగా, సులువుగా ఉంటుందని ఈ టైటిల్ని ఖరారు చేసింది. ఊహించినట్టుగానే ఈ మూవీ అన్ని భాషల్లో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది.
బ్రహ్మాస్త్ర
అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కంటెంట్కు అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. పురాణాలకు భారత్ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే తన అస్త్ర లోకాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి సినిమా ‘బ్రహ్మాస్త్ర’గా టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదటి పార్ట్ని గతేడాది రిలీజ్ చేశారు. రెండు, మూడు పార్ట్లు రావాల్సి ఉంది.
బీస్ట్
దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా సైతం ఇతర భాషల్లో డబ్ అయింది. ఈ టైటిల్ అందరినీ ఆకర్షించింది. కానీ, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కోలీవుడ్లో కాస్త మెరుగ్గా ఆడింది.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సలార్ టైటిల్తో పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతోంది.
OG
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ, చిత్రబృందం మొదటి నుంచి OG అనే పేరుతోనే ప్రచారం నిర్వహిస్తోంది. ఈ టైటిల్ ఇప్పటికే మార్మోగిపోయింది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్ను ఫిక్స్ చేసే సూచనలు ఉన్నాయి.
LEO
లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఇది. ‘లియో’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నారు.
మే 02 , 2023
This Week Movies: ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు
పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్ పోతినేని, విక్రమ్ వంటి స్టార్ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్, భాగ్యశ్రీ అందాలు, హరీశ్ శంకర్ టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.
డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
తంగలాన్ (Thangalaan)
తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటించిన లేటెస్ట్ చిత్రం ‘తంగలాన్’ కూడా ఈ వారమే గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఆయ్ (Aay)
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ నటించిన రెండో చిత్రం ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ యంగ్ హీరో తన సెకండ్ హిట్ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్’ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. గోదావరి విలేజ్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్కు జోడీగా నయన్ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.
వేదా (Vedaa)
జాన్ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వేదా’ (Vedaa). నిఖిల్ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది.
ఖేల్ ఖేల్ మే (Khel Khel Mein)
ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించుకున్న పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్ ఖేల్ మే’ (khel khel mein)గా రాబోతోంది. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్, తాప్సి, అమ్మీ వ్రిక్, వాణీకపూర్, ఫర్దీన్ఖాన్, ఆదిత్య సీల్, ప్రజ్ఞా జైశ్వాల్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
డార్లింగ్
ప్రియదర్శి, నభా నటేష్ నటించిన 'డార్లింగ్' (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే సమస్యకు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు.
వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra)
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతోంది. 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. సీనియర్ నటుడు నరేశ్, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ఈ సిరీస్లో కీలక పాత్ర పోషించారు. టైటిల్ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.
మనోరథంగల్ (Manorathangal)
కమల్హాసన్, మోహన్లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ వంటి ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్స్ నటించిన లేటెస్ట్ సిరీస్ ‘మనోరథంగల్’. తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్.టి వాసుదేవన్ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్ను రూపొందించారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateDaughtersMovieEnglishNetflixAugust 14Worst Ex EverSeriesEnglishNetflixAugust 14Emily In ParisSeriesEnglishNetflixAugust 14The UnionMovieEnglishNetflixAugust 16Love Nexts DoorMovieKorean/EnglishNetflixAugust 17DarlingMovieTeluguHotstarAugust 13The TyrantMovieKorean/EnglishHotstarAugust 14Nam Namak NishanMovieHindiAmazon August 14JackpotMovieEnglishAmazon August 15ChanakSeriesHindiSonyLIVAugust 16ManorathangalSeriesTelugu DubZee 5August 15Sekhar HomeMovieHindiJio CinemaAugust 14
ఆగస్టు 12 , 2024
VD12 Leaked Pic: ‘VD12’ సెట్ నుంచి విజయ్ దేవరకొండ ఫొటో లీక్.. నెట్టింట రచ్చ రచ్చ!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు యూత్లో ఏ స్థాయి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్తో స్టార్ హీరోల స్థాయికి ఎదిగాడు. అయితే గత కాలంగా ఇండస్ట్రీలో విజయ్కు కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్దగా దారుణంగా విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెట్ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
విజయ్ పిక్ వైరల్!
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' చిత్రం రూపొందుతోంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో షూటింగ్ సెట్ నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో బైక్పై వెనక కూర్చుని మాస్ లుక్లో కనిపించాడు. తలపై లైట్ హెయిర్, ముఖాన గడ్డంతో మెస్మరైజ్ చేసేలా అతడి లుక్ ఉంది. ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్తో సంతోషంతో ఊగిపోతున్నారు. మరో బ్లాక్బాస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.
https://twitter.com/king_ntr9999/status/1815611065381896259
థియేటర్లు బద్దలే!
‘VD 12’ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ మాస్లుక్కు అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు తోడైతే ధియేటర్లు బద్దలు కావాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘VD 12’లో విజయ్ లుక్ చూస్తుంటే ‘యువ’ సినిమాలో మాధవన్ గుర్తుకు వస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో ఆమె ప్లేస్లో భాగ్యశ్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్లోనూ పాల్గొంటున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/Rebelstarpr/status/1815667163178656207
డ్యుయల్ రోల్లో రౌడీ బాయ్!
‘VD 12’ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్ పోస్టర్ను సైతం అధికారికంగా రిలీజ్ చేసింది. అయితే తాజాగా లీకైన ఫొటోను చూస్తే విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్లో కనిపించాడు. ఒక లోకల్ గ్యాంగ్స్టర్ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా లీకైనా విజయ్ లుక్ చూస్తే థియేటర్లో మాస్ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.
క్యూట్ లవ్స్టోరీ!
విజయ్ దేవరకొండ ‘VD 12’తో పాటు మరో ప్రాజెక్ట్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీకి దిల్రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్గా సాయిపల్లవి (Sai Pallavi) తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇటీవల టాలీవుడ్లో ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
జూలై 23 , 2024
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని..!
టాలీవుడ్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు 'విజయ్ దేవరకొండ' (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎమోషనల్ పోస్టు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్ షెడ్యూల్స్తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్ను.. విజయ్ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్రావును విజయ్ గట్టిగా హగ్ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అసిస్టెంట్ డైరెక్టర్గా త్రివిక్రమ్ కుమారుడు!
విజయ్ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్) బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచాయి. దీంతో విజయ్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పడంతో విజయ్ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్ను మెుదలుపెట్టినట్లు సమాచారం.
పోలీసు ఆఫీసర్గా విజయ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్ పోలీసు ఆఫీసర్గా విజయ్ కనిపించనున్నాడట. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
సాయిపల్లవితో రొమాన్స్
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
జూన్ 19 , 2024
Konidela Pawan Kalyan Ane Nenu: బాహుబలిని తలపించిన పవన్ ప్రమాణ స్వీకారం.. ఆనందంతో ఉప్పొంగిన చిరంజీవి!
అంధ్రప్రదేశ్లో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ - జనసేన - భాజపా ముఖ్యనేతలు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'పవన్ అనే నేను'.. అంటూ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అపూర్వమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
బాహుబలి రేంజ్లో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన నూతన మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పవన్ ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. జయజయ ధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయేలా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘పవన్ అనే నేను’ అని జనసేనాని అనగానే సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ సర్వ సైన్యాధ్యాక్షుడిగా ప్రమాణం చేసే సన్నివేశాన్ని ఈ ఘటన గుర్తు చేసింది.
https://twitter.com/i/status/1800799485137944671
చిరు.. ఆనంద బాష్పాలు
పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తన తమ్ముడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని భావిస్తూ ఆనందంతో ఉప్పొంగారు. కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ వేదికపై ఉన్న అతిథులందరికీ అభివాదం చేశారు. ఆపై సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించారు. తాను ఎంత ఎదిగిన అన్న ముందు చిన్నవాడినేనన్న విధంగా చిరు పట్ల తనకున్న కృతజ్ఞతను తెలియజేశారు. అనంతరం చిరు.. పవన్ను ప్రేమగా దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం సభా ప్రాంగణంలోని వారందరినీ ఉద్వేగానికి గురి చేసింది.
https://twitter.com/i/status/1800778127129595985
అపూర్వ కలయిక
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. మరో గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు ప్రధాని మోదీ వద్దకు వెళ్లిన పవన్.. తన అన్న గురించి ప్రస్తావించారు. దీంతో వెంటనే మెగాస్టార్ను గమనించిన మోదీ.. స్వయంగా పవన్తో కలిసి అతడి వద్దకు వెళ్లారు. కొద్దిసేపు చిరంజీవితో ముచ్చటించారు. అనంతరం మెగా బ్రదర్స్ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణమంతా మరోమారు హర్షధ్వానాలతో మారుమోగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1800806930975449376
అతిథుల కోలాహలం
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) ముఖ్య అతిథి హోదాలో చిరు పక్కన స్టేజీపైన కూర్చున్నారు. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ (Ram Charan) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారా లోకేశ్ భార్య, బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో రామ్చరణ్ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలిచి.. కార్యక్రమంలో సందడి చేశారు. యంగ్ హీరోలు నిఖిల్, నారా రోహిత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.
https://twitter.com/i/status/1800778957174051224
23 మందితో నూతన మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. పవన్ కల్యాణ్, లోకేష్ సహా మెుత్తం 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెదేపా నుంచి 19 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రిపదవి కల్పించారు.
జూన్ 12 , 2024
Vijay- Sukumar Movie: డైరెక్టర్ సుకుమార్తో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం?
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు గత కొన్ని ఏళ్లుగా కలిసి రావడం లేదు. ఆయన గత మూడు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు. అయితే ఈ హీరో కొత్తగా ప్రకటిస్తున్న ప్రాజెక్ట్స్ మాత్రం అతడి ఫ్యూచర్ మూవీస్పై ఎంతో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల విజయ్ ఓ పిరియాడికల్ మూవీలో నటిస్తున్న ప్రకటించాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్లో రాబోతున్న చిత్రంలో పోలీసు ఆఫీసర్గా విజయ్ కనిపించనున్నాడు. ఇక లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం స్టార్ డైరెక్టర్ సుకుమార్తో రౌడీ బాయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ను షేక్ చేస్తోంది.
‘విజయ్ - సుకుమార్ మూవీ పక్కా..’
విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నట్లు నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన 'గం గం గణేశా' చిత్రానికి కేదార్ నిర్మాతగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన.. విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని నిర్మాత స్పష్టం చేశారు. ఇది విన్న విజయ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.
Sukumar : Vijay Deverakonda's film will be there. I thought this year RamCharan and Sukumar film might be in progress but didn't happen, Pushpa2 is in progress. Currently, our project [ VD, Sukumar ] will take more time to go on floors, Sukumar Garu after completing his current… pic.twitter.com/2yNpn4tyhG— RatpacCheck (@RatpacCheck) May 20, 2024
గతంలోనే ప్రకటన
విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో కొద్ది సంవత్సరాల క్రితమే ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటన వెలువడింది. నిర్మాత కేదార్ సెలగంశెట్టి నేతృత్వంలోని ఫాల్కన్ నిర్మాణ సంస్థ వీరి కాంబోలో సినిమా తీసేందుకు అప్పట్లో ప్రయత్నించింది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే ‘పుష్ప 2’ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని భావించినా సుకుమార్.. రామ్చరణ్ కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో ఇక విజయ్తో సినిమా లేనట్లేనని సినీ వర్గాలు భావించాయి. అయితే లేటెస్ట్గా విజయ్-సుకుమార్ సినిమా ఉంటుందని నిర్మాత ప్రకటించడం ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది.
2026 తర్వాతే..!
ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్.. 'పుష్ప 2' సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ విడుదల తేదీ (ఆగస్టు 15) దగ్గర పడుతుండటంతో శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే రామ్చరణ్తో సినిమా మెుదలవుతుంది. చరణ్తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత విజయ్తో సుకుమార్ సినిమా చేయనున్నట్లు నిర్మాత కేదార్ సెలగంశెట్టి తెలిపారు. దీని ప్రకారం విజయ్ - సుకుమార్ మూవీ పట్టాలెక్కడానికి ఎట్టలేదన్న 2026 వరకూ ఆగాల్సిందేనని టాక్ వినిపిస్తోంది. పైగా పుష్ప 3 కూడా ఉండొచ్చని గతంలో బన్నీ ప్రకటించిన నేపథ్యంలో విజయ్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
'ఫ్యామిలీ స్టార్' (Family Star) తర్వాత విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ఫిల్మ్ను ‘జెర్సీ’ (Jersey) దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు విజయ్ ఓకే చెప్పాడు. ‘టాక్సీవాలా’ (Taxiwaala) ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్తో కలిసి విజయ్ ఓ పిరియాడికల్ మూవీ చేయబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా పోస్టర్ రిలీజ్ కాగా అది అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే దిల్రాజు నిర్మాతగా రవి కిరణ్ కోలాతో కలిసి ఓ యాక్షన్ డ్రామా సైతం విజయ్ చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత సుకుమార్తో విజయ్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
మే 21 , 2024
Bhola Shankar Review: ‘భోళా శంకర్’లో చిరు యాక్టింగ్ అదుర్స్.. రీమేక్తో మరో హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: చిరంజీవి, సుశాంత్, తమన్నా, కీర్తి సురేశ్, బ్రహ్మానందం, తదితరులు
డైరెక్టర్: మెహెర్ రమేశ్
మ్యూజిక్: మహతి స్వర సాగర్
నిర్మాత: అనిల్ సుంకర
తమిళంలో విజయం సాధించిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్గా వచ్చింది ‘భోళా శంకర్’. తెలుగు నేటివిటీకి తగ్గట్టు అన్ని హంగులతో మూవీని తీర్చిదిద్దినట్లు చిత్రబృందం చెప్పుకొచ్చింది. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి మరింత యంగ్ లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరి, శుక్రవారం(Aug 11) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ఒరిజినల్ మూవీతో పోలిస్తే ఈ సినిమాలో చేసిన మార్పులేంటి? ప్రేక్షకుడు ఎలా ఫీల్ అయ్యాడు? అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథ
చెల్లి మహా(కీర్తి సురేశ్)తో కలిసి శంకర్ దాదా(చిరంజీవి) కోల్కతాలో నివసిస్తుంటాడు. ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసే శంకర్ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో నలుగురు కిడ్నాపర్లను హతమార్చడంలో సహాయపడతాడు. దీంతో విలన్ గ్యాంగ్ శంకర్ని కనిపెట్టే ప్రయత్నంలో పడుతుంది. ఈ క్రమంలో మహా పెళ్లి నిశ్చయమౌతుంది. తన గురించి వెతుకుతున్నారని తెలుసుకుని శంకర్ ప్రధాన విలన్లలో ఒకడిని హతమార్చి తన అసలు రూపాన్ని బయట పెడతాడు. అసలు శంకర్ కోల్కతాకు ఎందుకొచ్చాడు? తన ప్రధాన లక్ష్యం ఏంటి? నిజంగా మహా తన చెల్లెలేనా? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/RC_devotee_5/status/1689864697477255168?s=20
ఎలా ఉంది?
మాతృక కథలో కొన్ని మార్పులు చేసినట్లు చెప్పినా, దాదాపుగా అదే స్టోరీతో సినిమాను దింపేశారు. అయితే చిరంజీవి నటన ప్రేక్షకుడికి నచ్చుతుంది. కామెడీ టైమింగ్తో పాటు పవన్ కళ్యాణ్ మ్యానరిజం సీన్స్ కాస్త ఉత్సాహం నింపుతాయి. అయితే, ఖుషి నడుము సీన్ వంటివి ప్రేక్షకుడికి కాస్త వెగటుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్లో భోళా ఇంట్రడక్షన్ బాగుంది. రెండు పాటలు ఆకట్టుకుంటాయి. చివర్లో క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఎలిమెంట్స్ని మేళవించినా.. అవి పెద్దగా పండలేదు.
ఎవరెలా చేశారు?
ఎప్పటిలాగే చిరంజీవి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్లలో చక్కగా చేశాడు. ఇక, పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్ని అచ్చు గుద్దినట్లు చేసే ప్రయత్నం చేశాడు. తన యాక్టింగ్తో సినిమాను నడిపించాడు. ఇక కీర్తి సురేష్, తమన్నాలు తమ పాత్రకు పరిమితమయ్యారు. సుషాంత్ ఫర్వాలేదనిపించాడు. వెన్నెల కిశోర్ కాస్త నవ్వించాడు. మిగతా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.
https://twitter.com/KickTwood/status/1689845486956453888?s=20
టెక్నికల్గా
చిరంజీవి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎలివేషన్స్ని ఇవ్వడంలో డైరెక్టర్ మెహెర్ రమేశ్ కాస్త సక్సెస్ అయ్యారు. కానీ, ఒరిజినల్ ప్లాట్లో పెద్దగా మార్పులు చేయలేకపోయాడు. కథనాన్ని ఆసక్తికరంగా మలచలేదు. వేదాళం సినిమా చూసిన వారికి ఏ కోశాన కూడా ఈ సినిమాలో కొత్తదనం కనిపించకుండా చేశాడు. ఒకట్రెండు చోట్ల మినహా తన పనితనం కనిపించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ ఇచ్చిన పాటల్లో రెండు ఆకట్టుకుంటాయి. బీజీఎం ఒకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పాజిటివ్ పాయింట్స్
చిరంజీవి నటన
సెకండాఫ్
నెగెటివ్ పాయింట్స్
ఊహించే కథనం
స్టోరీలో మార్పులు లేకపోవడం
ఖుషి నడుము సీన్
రేటింగ్: 2.25/5
ఆగస్టు 16 , 2023
Janhvi Kapoor: జాన్వీ అందాల జాతర.. గ్లామర్ షోలో తగ్గేదేలే..!
Janhvi Kapoor: జాన్వీ అందాల జాతర.. గ్లామర్ షోలో తగ్గేదేలే..!బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ మరోమారు చిట్టి పొట్టి డ్రెస్లో తళుక్కుమంది.గ్లామర్ ఫోజుల్లో కనిపించి అందాల జాతర చేసింది. కొంటెగా చూస్తూ కవ్వించింది.ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు దేవకన్యలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.హిందీలో జాన్వీ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ చెప్పుకోతగ్గ బ్రేక్ రాలేదు.దీంతో దక్షిణాదిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జాన్వీ చూస్తోంది.ప్రస్తుతం జూ.ఎన్టీఆర్తో కలిసి దేవర సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది.మరోవైపు కోలీవుడ్లో కూడా ఈ భామకు అవకాశాలు తలుపు తడుతున్నాయి.శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ.. ‘ధడక్’ మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ సినిమాలో జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అటు అవకాశాలు సైతం క్యూ కట్టాయి.రీసెంట్గా ‘మిలి’ సినిమాతో జాన్వీ ఆడియన్స్ పలకరించింది. అయితే ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది.ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ జాన్వీ యమా యాక్టివ్గా ఉంటోంది.తన ఫొటో షూట్, విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది.ప్రస్తుతం జాన్వీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను 21.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
జూలై 19 , 2023
SSMB29: ఇంకో వారంలో కథ లాక్ అయ్యే ఛాన్స్.. కీరవాణి కీలక వ్యాఖ్యలు!
‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా హిట్తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli).. సూపర్స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ క్రేజీ కాంబో చిత్రం ఎప్పుడు మెుదలవుతుందా? అని యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన అప్డేట్స్ సైతం ఫ్యాన్స్ను తెగ ఖుషి చేశాయి. మహేష్ లుక్ ఇదేనంటూ బయటకొచ్చిన ఫొటోలు సైతం అందర్ని ఆకట్టుకున్నాయి. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని త్వరలోనే సెట్స్పైకి వెళ్తుందని భావిస్తున్న క్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి షాకింగ్ కామెంట్స్ చేశారు.
కథ రెడీ కాలేదా?
రాజమౌళి దర్శకత్వంలో రానున్న 'SSMB29' మూవీ షూట్.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సెట్స్పైకి వెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆగస్టు 9న ఈ మూవీ ఎట్టిపరిస్థితుల్లో మెుదలవుతుందని నమ్ముతున్నారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి వారి ఆశలపై తాజాగా నీళ్లు చల్లారు. తానింకా ఈ ప్రాజెక్ట్పై పని కూడా మెుదలు పెట్టలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కథ కూడా ఇంకా ఫైనల్ కాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొన్ని టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయని.. ఒక వారంలో కథ లాక్ అయ్యే ఛాన్స్ ఉందని కీరవాణి స్పష్టం చేశారు. తన మ్యూజిక్ వర్క్స్ జులై లేదా ఆగస్టులో మెుదలుపెడతానని స్పష్టం చేశారు. టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయంటే ఈ మూవీ షూటింగ్.. ఈ ఏడాది ఆఖరులో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
కథ.. ఆ నవలల ఆధారమేనా?
రాజమౌళి తండ్రి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ‘SSMB29’ సినిమాకు కథను అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాజమౌళి & టీమ్.. రెండు ఆఫ్రికా నవలల హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విల్బర్ స్మిత్ రాసిన రెండు నవలలను వారు కొనుగోలు చేసినట్లు జోరుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో 'SSMB29' ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశానికి సంబంధించిన నవలల హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు రావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. వీటి ఆధారంగానే రాజమౌళి SSMB29 తెరకెక్కించనున్నారా? అన్న సందేహాం అభిమానుల్లో మెుదలైంది. ఇందులో నిజానిజాలు ఎంతో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మహేష్ ద్విపాత్రిభినయం!
రాజమౌళి తెరకెక్కించనున్న 'SSMB29' మూవీలో మహేష్ ద్విపాత్రిభినయం చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. అయితే దీనిపై రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా శుభవార్త కానుంది. ఇక ఈ మూవీలో మహేష్ చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకూ చూడని మహేష్ను ఈ సినిమాలో చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాని స్పెషల్ రోల్..!
'SSMB 29' గురించి మరో రూమర్ గతంలో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ సినిమాలో యంగ్ హీరో నాని (Nani) ఓ స్పెషల్ రోల్లో నటించనున్నట్లు టాక్ వినిపించింది. వరల్డ్ వైడ్గా ఈ సినిమా తెరకెక్కనుండటంతో పలు పాత్రల కోసం రాజమౌళి.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ నటీనటులను రంగంలోకి దించనున్నారట. ఈ క్రమంలోనే ఒక పాత్ర కోసం నాని పేరును ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రాజమౌళి, నాని మధ్య మంచి అనుబంధం ఉండటంతో యంగ్ హీరో నటించడం ఖాయమని అంటున్నారు. దీనిపై రాజమౌళి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, గతంలో రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమాలో నాని నటించాడు. స్క్రీన్పైన కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఆ భామకు ఛాన్స్ దక్కిందా?
'SSMB 29' సినిమాలో హీరోయిన్గా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మహేష్కు జోడీగా అలియా భట్ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్తో పని చేశారు. ఇందులో అలియా భట్ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్ చేసే అవకాశముందని కామెంట్లు వినిపిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా, హాలీవుడ్ నటి చెల్సియా ఇస్లాన్ కూడా 'SSMB 29' చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు.
జూన్ 25 , 2024