రివ్యూస్
How was the movie?
తారాగణం
అడివి శేష్
రిషిఅదా శర్మ
శ్వేతఅనసూయ భరద్వాజ్
ACP జయ భరద్వాజ్సత్యదేవ్ కంచరణా
కార్తీక్అమిత్ సచ్దేవ్ కమీషనర్ లక్నో
వెన్నెల కిషోర్
బాబు ఖాన్సత్యం రాజేష్
రవి చౌదరిరవి వర్మ
బాబీబేబీ డాలీరియా
అబుజీనైజీరియన్
మార్సెల్లీన్ కోఫీ హౌసౌ నైజీరియన్
కున్లే అవోసన్యానైజీరియన్
సీధా అహ్మద్ నైజీరియన్
రవి రాజా మగులూరిహంతకుడు
శశాంక్ కలవలఅనిల్
వైష్ణవి శ్రీధర్రిషి తల్లి
నికోలా వాన్ స్టేసీ
అనూష గవరపతిపూజ
రచన కోడూరిశ్వేత స్నేహితురాలు
స్వరాజ్ రెబ్బాప్రగడశ్వేత తండ్రి
రాజు బి. చోటు
షణ్ముఖ జి.SI గణేష్
లలిత పమిడిపాటిస్కూల్ ప్రిన్సిపాల్
రవికాంత్ పేరు
మార్వారీ సేథ్రామకృష్ణ రేపల్లెరిషి బావ
గ్యారీ BH
శ్రీనివాస్ రెడ్డి గారిలక్ష్మీకాంత్ దేవ్సాయి ప్రకాష్
అమిత్ సచ్దేవ్జై సింగ్ మెహ్రా
ఉమా అక్కినేనిహేమ
అభిజిత్ దేశ్పాండేజీత్
సిబ్బంది
రవికాంత్ పేరు
దర్శకుడుపరమ్ వి. పొట్లూరినిర్మాత
కవిన్ అన్నే.Ravikanth Perepu_telugu:రవికాంత్ పేరునిర్మాత
శ్రీచరణ్ పాకాల
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Anasuya Bharadwaj: కైపెక్కించే ఫోజుల్లో రచ్చ రచ్చ చేస్తున్న రంగమ్మత్త!
బుల్లితెర యాంకర్ & నటి అనసూయ భరద్వాజ్ మరోమారు గ్లామర్ ఫొటోలతో తళుక్కుమంది. హాఫ్ జాకెట్లో సింధూర పువ్వులా మెరిసిపోయింది.
ట్రెండీ లెహంగా, మ్యాచింగ్ టాప్ ధరించిన అనసూయ.. మతులు పోగెట్టో ఫోజులతో అలరించింది.
సోఫాలో పడుకొని అందాల విందు చేసింది. హాట్ హాట్ స్టిల్స్తో ఆకట్టుకుంది.
జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.
2012 - 2022 మధ్య బుల్లితెర యాంకర్గా కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం యాంకర్గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.
యాంకర్ కాకముందు ప్రముఖ వార్త ఛానల్లో అనసూయ న్యూస్ రీడర్గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్, గాయత్రి సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.
రంగస్థలం సినిమా అనసూయ కెరీర్ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.
రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.
సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. ప్రస్తుతం పుష్ప2 చిత్రంలోనూ ఈ భామ నటిస్తోంది.
తాజాగా విమానం సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్లో అనసూయ బిజీబిజీగా గడుపుతోంది.
జూన్ 01 , 2023
Klin Kaara Birthday Special: చిరంజీవి, పవన్, రామ్చరణ్ తలరాతను మార్చిన క్లీంకారా.. ఎలాగంటే!
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల గారాలపట్టి క్లింకార (Klin Kaara) నేడు (జూన్ 20) తన తొలిపుట్టిన రోజు జరుపుకుంటోంది. క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది గడిచిపోవడంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. దశాబ్దకాలం నిరీక్షణ తర్వాత రామ్చరణ్ తండ్రి కావడంతో పాటు.. మెగా ఫ్యామిలీకి ఎన్నో ఆనందాలు తీసుకొచ్చిన క్లింకారా గురించి తల్లి ఉపాసన ఎమోషనల్ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీలో చోటుచేసుకున్న అద్భుతాలు ఏంటి? తండ్రి రామ్చరణ్తో పాటు తాతలు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లు సాధించిన ఘనతలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
క్లింకారా.. స్పెషల్ వీడియో!
నేడు (జూన్ 20 ) క్లింకారా మొదటి పుట్టినరోజు సందర్భంగా తల్లి ఉపాసన స్పెషల్ వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఉపాసన ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి క్లింకారా పుట్టెంత వరకు మెగా కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అయ్యారో వీడియోలో కనిపించింది. పెళ్లి అయిన చాలా కాలానికి రాంచరణ్, ఉపాసన దంపతులకు క్లింకారా జన్మించడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషించింది. తన ముద్దుల కూతురుని తనివితీరా ఎత్తుకొని రాంచరణ్ ఎంతో ఎమోషనల్ అవ్వడం వీడియోలో చూడవచ్చు. ఉపాసన షేర్ చేసిన వీడియోలో క్లింకారా బారసాల విజువల్స్ కూడా ఉన్నాయి. అలాగే తన మనవరాలి గురించి చిరు మాట్లాడిన అమూల్యమైన మాటలు కూడా ఉపాసన ఈ వీడియోలో యాడ్ చేసింది. క్లింకారా స్పెషల్ వీడియోను చూసిన మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు. క్లింకారా మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన క్షణం తమకు ఎంతో అపురూపమైనదని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)
క్లీంకారా రాకతో గ్లోబల్ స్థాయి క్రేజ్
క్లింకారా పుట్టకముందు వరకూ రామ్చరణ్ క్రేజ్ టాలీవుడ్కు మాత్రమే పరిమితమైంది. క్లింకార ఉపాసన కడుపులో పడినప్పటి నుంచి చరణ్ దశ తిరగడం మెుదలైంది. అతడు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్గా ఆదరణ పొంది.. చరణ్ను గ్లోబల్ స్టార్ను చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కడం విశేషం. రామ్చరణ్ లాంటి నటుడు కావాలంటూ ఓ హాలీవుడ్ క్యాస్టింగ్ సంస్థ తమ కరపత్రంలో చరణ్ ఫొటోలు వేసే స్థాయికి అతడు ఎదిగాడు. అయితే ఇదంతా క్లింకారా అడుగుపెట్టిన వేళా విశేషమేనని మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
చిరంజీవికి పద్మవిభూషణ్
క్లీంకారా రాక తాత చిరంజీవి (Chiranjeevi)కి కూడా బాగా కలిసొచ్చిందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’.. క్లింకారా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన తర్వాతనే చిరుకు వచ్చింది. వాస్తవానికి ‘పద్మ విభూషణ్’ను చిరుకు ఇవ్వాలని ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. సినిమాకు, సమాజానికి ఆయన చేస్తున్న సేవ అమోఘమని.. వాటిని భారత ప్రభుత్వం గుర్తించి మెగాస్టార్ను గౌరవించాలని సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో క్లింకారా జననం తర్వాతే.. చిరును పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పవన్ పొలిటికల్ సక్సెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. సుమారు దశాబ్దకాలంగా ప్రజల పక్షాన పోరాటం చేశారు. 2019 ఏపీ ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసిన పవన్.. పోటీ చేసిన రెండు చోట్లా ఘోర ఓటమిని చవిచూశారు. పార్టీ తరపున గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా అప్పటి అధికార వైకాపాలోకిన జంప్ అయ్యారు. కట్ చేస్తే.. 2024లో పవన్ కల్యాణ్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఏపీ ఎన్నికల్లో నిలిచారు. టీడీపీ, భాజాపాతో కూటమి కట్టి.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో (21/21 ఎమ్మెల్యేలు, 2/2 ఎంపీలు) 100 స్ట్రైక్రేట్తో ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పవన్.. ఈ స్థాయిలో పొలిటికల్గా సక్సెస్ కావడం క్లింకారా పుట్టిన తర్వాతనే జరగడం గమనార్హం. క్లింకారా పుట్టిన తర్వాతే మెగా ఫ్యామిలీలో ఈ అద్భుతాలు జరిగాయని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)
జూన్ 20 , 2024
Anasuya Bharadwaj Hot: భర్త, పిల్లల ముందే బికినీలో అనసూయ!
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఫొటోలు.. సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.
ప్రస్తుతం ఫ్యామిలీ విహార యాత్రలు చేస్తున్న అనసూయ.. వాటర్ ఫాల్స్ దగ్గర బికినీతో దిగిన ఫొటోలను షేర్ చేసింది.
బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లోని ఈ వాటర్ సూట్లో తన తడి అందాలను ప్రదర్శించి ఫ్యాన్స్ను ఉక్కిరి బిక్కిరి చేసింది.
ఎద, థైస్ అందాలను చూపిస్తూ.. చల్లటి నీటిలో జలకాలు ఆడింది. అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోల్లో ఆమె భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అనసూయ లేటెస్ట్ గ్లామర్ షోను చూసిన నెటిజన్లు.. ఆమె ఒంపుసొంపులకు ఫిదా అవుతున్నారు. అందంలో రంగమ్మత్తకు పోటీ ఎవరూ రాలేరని కామెంట్స్ చేస్తున్నారు.
జబర్దస్త్ షో (Jabardasth Show) ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.
2012 - 2022 మధ్య బుల్లితెర యాంకర్గా కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం యాంకర్గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.
యాంకర్ కాకముందు ప్రముఖ వార్త ఛానల్లో అనసూయ (Anasuya Bharadwaj) న్యూస్ రీడర్గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.
Anchor Anasuya Hot 🔥 pic.twitter.com/N7ByHQl57v— Viji Tamil Channel ❤️ (@vijiandco6) June 30, 2023
రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.
రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meeku Maathrame Cheptha), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.
సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది.
గతేడాది సెప్టెంబర్లో పెదకాపు1 (Peddha Kapu-1) అనే సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత విమానం (Vimanam) అనే మరో మూవీలోనూ అనసూయ నటించింది. ఇందులో తెలంగాణ మాండలికం ఓన్ చేసుకొని మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రీసెంట్గా ‘రజాకార్’ (Razakar) అనే తెలంగాణ నేపథ్యమున్న చిత్రంలోనూ అనసూయ మెరిసింది.
ఇందులో పోచమ్మ పాత్రలో ఎంతో అగ్రెసివ్గా కనిపించి ఆకట్టుకుంది.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ నటిస్తోంది. గతంలో పుష్పలో ఈ పాత్రనే ఆమె పోషించగా మంచి పేరు వచ్చింది. దీంతో పుష్ప 2లో తన రోల్పై అనసూయ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
పుష్ప 2తో పాటు ' ఫ్లాష్బాక్' (Flashback) అనే తమిళ చిత్రంలోనూ అనసూయ నటిస్తోంది. ఈ మూవీ కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
మే 24 , 2024
Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్ తీసుకొచ్చిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే?
టాలీవుడ్ ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు హీరోల్లో ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. ‘బాహుబలి’ (Bahubali), ‘బాహుబలి 2’ (Bahubali 2) చిత్రాలతో ప్రభాస్ గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. ఇటీవల ‘సలార్’ (Salaar)తో సాలిడ్ హిట్ అందుకున్న డార్లింగ్.. బాక్సాఫీస్ వద్ద మరోమారు తన సత్తా ఎంటో చూపించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా ప్రభాస్ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పెళ్లికి సంబంధించి గతంలో పలుమార్లు రూమర్లు సైతం వచ్చాయి. అయితే తాజాగా ప్రభాస్ పెట్టిన ఓ పోస్టు.. అతడి పెళ్లిపై మళ్లీ చర్చను లేవనెత్తాయి.
‘ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. అయితే లేటెస్ట్గా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వ్యక్తి గురించి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ‘డార్లింగ్స్.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ను ఫ్యాన్స్ ఎక్స్లో షేర్ చేస్తున్నారు. ఆ ప్రత్యేక వ్యక్తి ప్రభాస్ మనసుకు నచ్చిన యువతి అయ్యి ఉంటుందని చాలా మంది ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
అసలు నిజం ఇదే!
ప్రస్తుతం ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin).. ఈ సినిమాలోని పాత్రలను ఒక్కొక్కటిగా ప్రేక్షకులకు టీజర్ రూపంలో పరిచయం చేస్తున్నారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వద్థామ పాత్రను రివీల్ చేశారు. అలాగే కమల్ హాసన్ రోల్ను కూడా గ్లింప్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీనిని ఉద్దేశించే ప్రభాస్ లేటెస్ట్ పోస్టు పెట్టినట్లు సమాచారం. కల్కి సినిమా ప్రమోషన్స్లో భాగంగానే డార్లింగ్ లేటెస్ట్ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.
కమల్ అంటే చాలా ఇష్టం
ప్రభాస్ ఫేవరేట్ హీరోల్లో దిగ్గజ నటుడు కమల్ హాసన్ ముందు వరుసలో ఉంటారు. కమల్పై తనకున్న అభిమానం గురించి డార్లింగ్ ఇప్పటికే చాలా సార్లు తెలియజేశారు. కమల్.. కల్కి సినిమాలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్ పెట్టారు. ‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్ ఈ పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
నెలాఖరులో ఫస్ట్ సింగిల్!
కల్కి 2898 ఏడీ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. సినిమా మ్యూజికల్ రైట్స్ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరిగమ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అంతేకాదు త్వరలో ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేయనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ నెలాఖరులో దానిని రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
మే 17 , 2024
Kalki 2898 AD: ప్రభాస్ కోసం రంగంలోకి మహేష్.. ఎందుకంటే?
సలార్ (Salaar) తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. గ్లోబల్ రేంజ్లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్లో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్ న్యూస్ బయటకొచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు డబ్బింగ్? (Mahesh Babu Dubbing)
కల్కి చిత్రం (Prabhas New Movie)లో హీరో ప్రభాస్ విష్ణు మూర్తి అవతారంలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడి పాత్ర పేరు 'భైరవ' అని చిత్ర యూనిట్ ఇప్పటికే రివీల్ చేసింది. అయితే ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్ను ఉపయోగించుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్స్కు మహేష్ వాయిస్ ఇస్తే సినిమాపై హైప్ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయమై మహేష్ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో ఇలాగే..
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇలా డబ్బింగ్ చెప్పడం కొత్తేమి కాదు. గతంలో ఆయనకు డబ్బింగ్ చెప్పిన అనుభవం ఉంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) - త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ (Jalsa Movie) సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సంజయ్ సాహు పాత్రను పరిచయం చేస్తూ తన వాయిస్తో చక్కటి ఎలివేషన్స్ ఇచ్చాడు. అప్పట్లో ఇది ‘జల్సా’ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మహేష్ చేత ఎలాగైన డబ్బింగ్ చెప్పించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ పట్టుదలతో ఉన్నట్లు ఫిల్స్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్ ‘SSMB29’ సినిమా షూట్ కోసం సిద్దమవుతున్నాడు. మరి ఈ ఆఫర్కు మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి.
కల్కి వెనక లెజెండరీ డైరెక్టర్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Prabhas New Movie Director).. కల్కి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. మహాభారతం నాటి పాత్రలతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ఇతిహాసాల ప్రభావం కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక చిత్రాలపై పట్టున్న లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమా విషయంలో తన వంతు సాయం అందిస్తున్నట్లు సమాచారం. ‘మాయాబజార్’కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం కల్కికి ఉపయోగపడుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.
‘ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు’
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ (Prabhas New Movie) సినిమాపై రానా (Rana Daggubati) ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో వ్యాఖ్యానించాడు. ‘భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. ఈ ఇండియన్ ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్గా చేస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు.
మే 08 , 2024
Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్ లవ్స్టోరీ గురించి తెలుసా?
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే ఆర్జీవీ అక్కడ ఉంటారు. ఆయన నోటి నుంచి వచ్చే మాట.. వెలువడే ట్వీట్ ప్రతీది హాట్ టాపిక్గా మారిపోతుంటాయి. ఇక వ్యక్తులను టార్గెట్ చేసి ఆయన చేసే సెటైరికల్ కామెంట్స్ కూడా ఓ రేంజ్లో చర్చకు దారితీస్తుంటాయి. అయితే తాజాగా ఆర్జీవీ పెట్టిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను ఎంతో అభిమానించే దివంగత నటి శ్రీదేవికి సంబంధించి ఈ పోస్టు పెట్టడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.
‘స్వర్గంలో శ్రీదేవిని కలిశా..’
ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి (Sridevi)ని.. రామ్ గోపాల్ వర్మ ఎంతగానో ఆరాధించేవాడు. ఆమెను ఆర్జీవీ మనస్పూర్తిగా ప్రేమించాడని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్లు అప్పట్లో టాక్ ఉండేది. ఇందుకు అనుగుణంగానే చాలా ఇంటర్యూల్లో శ్రీదేవిపై తనకున్న ఇష్టాన్ని ఆర్జీవీ బహిరంగంగానే తెలియజేశాడు. అయితే చనిపోయిన శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఆర్జీవీ పెట్టిన AI ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. 'ఇప్పుడే స్వర్గంలో శ్రీదేవిని కలిశాను' అంటూ ఆర్జీవీ ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. పైగా ఈ ఫొటోలో ఆర్జీవీ సిగరేట్ తాగుతూ కెమెరాకు ఫోజు ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘చనిపోయినా వదలవా’
ఆర్జీవీ తాజా పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ పోస్టును సమర్థిస్తుంటే ఎక్కువ మంది విమర్శలు చేస్తున్నారు. చనిపోయిన వారి గురించి ఇలా ఎడిటింగ్ చేసి పెట్టడం సరికాదని సూచిస్తున్నారు. శ్రీదేవిపై ఇష్టం ఉంటే ఉండొచ్చు గానీ, ఇలా మార్ఫింగ్ ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చనిపోయినా కూడా శ్రీదేవిని వదలవా అంటూ నిలదిస్తున్నారు. ఇంకొందరు మాత్రం శ్రీదేవిని ఆర్జీవి మర్చిపోలేకపోతున్నాడని అంటున్నారు. ఇలా ఆమెకు సంబంధించిన పోస్టులు పెట్టి శ్రీదేవి జ్ఞాపకాలను ఆర్జీవీ గుర్తు చేసుకుంటున్నాడని పేర్కొంటున్నారు.
ఆర్జీవీ ఫస్ట్ లవ్ ఈమే!
ఆర్జీవీ మనసుకు నచ్చిన మహిళ శ్రీదేవి కంటే ముందు ఒకరున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆర్జీవీనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతేకాదు ఆమె బికినీలో ఉన్న ఫొటోలను సైతం షేర్ చేసి తన ఫ్యాన్స్కు పరిచయం చేశాడు. ‘బ్లూకలర్ స్విమ్ సూట్లో ఉన్న సత్య అనే మహిళ.. విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు తన ఫస్ట్ లవ్ అని ఆర్జీవీ చెప్పాడు. ప్రస్తుతం ఆమె అమెరికాలో వైద్యురాలిగా స్థిర పడినట్లు తెలిపాడు. తాను తీసిన ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి పేరు కూడా సత్య అని ఆర్జీవీ గుర్తుచేశాడు. అలాగే తనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో 'సత్య' మూవీ కూడా ఉందని అన్నాడు.
https://twitter.com/RGVzoomin/status/1430379804382023680
రంగీలా స్టోరీ అలా వచ్చిందే!
డా. సత్యతో తనకున్న ఓ క్యూట్ మూమెంట్ను కూడా అప్పట్లో ఆర్జీవీ తన ఫ్యాన్స్తో పంచుకున్నాడు. తాను చదివే రోజుల్లో సిద్ధార్థ కాలేజీలో మెడికల్ & ఇంజనీరింగ్ విభాగాలు ఒకే కాంపౌండ్లో ఉండేవని ఆర్జీవీ తెలిపాడు. కొన్ని సంఘటనల తర్వాత సత్యను వన్సైడెడ్గా లవ్ చేయడం మెుదలు పెట్టానని పేర్కొన్నాడు. కానీ ఆమె తనను పట్టించుకోలేదని చెప్పాడు. ఎందుకంటే అప్పటికే ఆమె డబ్బున్న యువకుడితో సన్నిహితంగా ఉండేదని ఆర్జీవీ తెలిపాడు. ఈ అనుభవం నుంచే రంగీలా స్టోరీ పుట్టిందని గతంలో స్పష్టత ఇచ్చాడు.
మే 02 , 2024
Seerat Kapoor: ‘భామకలాపం-2’తో గట్టి కమ్బ్యాక్ ఇచ్చిన సీరత్.. ఆమె గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
యంగ్ బ్యూటీ సీరత్ కపూర్ (Seerat Kapoor).. ఇటీవల వచ్చిన ‘భామకలాపం 2’ (Bhamakalapam 2) వెబ్సిరీస్తో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన అందం, నటనతో ఓటీటీ ఆడియన్స్ను అలరించింది. టాలీవుడ్లో తన అరంగేట్ర చిత్రంతోనే బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్న సీరత్ కపూర్.. రాత్రికి రాత్రే స్టార్గా మారిపోయింది. ఆ తర్వాత చిత్రాలు చెప్పుకోతగ్గ విజయాలు సాధించకపోవడంతో ఈ భామకు అవకశాలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ‘భామకలాపం 2’ మళ్లీ మెరవడంతో అందరి దృష్టి ఈ బ్యూటీపై పడింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.
సీరత్ కపూర్ ఎవరు?
సీరత్ కపూర్.. ప్రముఖ హీరోయిన్. తెలుగు, హిందీ చిత్రాల్లో నటించింది.
సీరత్ కపూర్ ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్ర ముంబైలో ఈ భామ జన్మించింది.
సీరత్ కపూర్ ఎప్పుడు జన్మించింది?
ఏప్రిల్ 3, 1993
సీరత్ కపూర్ వయసు ఎంత?
31 సంవత్సరాలు (2024)
సీరత్ కపూర్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు (165 సెం.మీ)
సీరత్ కపూర్ తల్లిదండ్రులు ఎవరు?
వినీత్ కపూర్, నీనా సిహోత కపూర్ దంపతులకు సీరత్ జన్మించింది. ఆమె తండ్రి ముంబయిలోని ప్రముఖ హోటల్కు యజమాని. తల్లి ఎయిర్ హోస్టేస్గా పనిచేసింది.
సీరత్ కపూర్కు తోబుట్టువులు ఉన్నారా?
ఈ భామకు ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు వరుణ్ కపూర్ (గ్రాఫిక్ డిజైనర్)
సీరత్ కపూర్ ఎక్కడ చదువుకుంది?
ముంబయిలోని పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీరత్ ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఆర్.డి నేషనల్ కాలేజీలో బిఏ మాస్ కమ్యూనికేషన్లో చేరిన సీరత్..చదువు మధ్యలోనే ఆపేసింది.
సీరత్ కపూర్కు పెళ్లి అయ్యిందా?
ఆమెకు ఇంకా మ్యారేజ్ కాలేదు
సీరత్ కపూర్ తన కెరీర్ను ఎలా మెుదలుపెట్టింది?
సీరత్కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. 16 ఏళ్లకే బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ యాష్లే లోబో వద్ద అసిస్టెంట్గా తన కెరీర్ ప్రారంభించింది.
సీరత్ కపూర్ కొరియోగ్రాఫ్ చేసిన చిత్రం?
బాలీవుడ్ చిత్రం రాక్స్టార్కు సీరత్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసింది.
సీరత్ కపూర్ మోడల్గా చేసిందా?
సినిమాల్లోకి రాకముందు మోడల్గానూ ఈ బ్యూటీ పనిచేసింది. రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్లో నటనకు శిక్షణ కూడా తీసుకుంది.
సీరత్ కపూర్ తెరంగేట్ర చిత్రం?
2014లో బాలీవుడ్లో వచ్చిన 'జిద్' ఆమెకు మెుట్ట మెుదటి సినిమా. నాన్సీ పాత్రతో ఆమె హిందీ ఆడియన్స్ను పలకరించింది.
సీరత్ కపూర్ చేసిన తొలి తెలుగు చిత్రం?
శర్వానంద్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన 'రన్ రాజా రన్'.. సీరత్కు తొలి తెలుగు చిత్రం. ప్రియా పాత్రలో గ్లామర్గా కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సీరత్ కపూర్ నటించిన తెలుగు చిత్రాలు?
‘రన్ రాజా రన్’తో పాటు ‘టైగర్’, ‘కొలంబస్’, ‘రాజు గారి గది - 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్ చేసి చూడు’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’, ‘మా వింత గాధ వినుమా’ చిత్రాల్లో సీరత్ నటించింది.
సీరత్ కపూర్ చేసిన బాలీవుడ్ చిత్రాలు?
తొలి చిత్రం జిద్తో పాటు మార్రిచ్ (Maarrich) సినిమాలో ఆమె నటించింది.
సీరత్ కపూర్ హాబీస్?
ట్రావెలింగ్ & డ్రాయింగ్
సీరత్ కపూర్కు ఇష్టమైన హీరో?
హిందీలో రణ్బీర్ కపూర్.. తెలుగులో మహేష్ బాబు అంటే తనకూ ఎంతో ఇష్టమని సీరత్ ఓ ఇంటర్యూలో తెలిపింది.
సీరత్ కపూర్ ఇన్స్టాగ్రామ్ ఖాతా?
https://www.instagram.com/iamseeratkapoor/?hl=en
https://www.youtube.com/watch?v=Hv1HLoWBEMU
ఏప్రిల్ 05 , 2024
Anasuya Bharadwaj: ‘సెక్సీగా ఉంటాను.. ఏమైనా నేర్పిస్తాను’.. ఫీజులు ఎగిరే క్యాప్షన్!
గ్లామరస్ నటి అనసూయ భరద్వాజ్.. మరోమారు తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. మత్తెక్కించే అందాలను నెటిజన్లను కవ్విచించింది.
ఎప్పుడు గ్లామర్ ఫొటోలు పెట్టేసి ఊరుకునే అను.. ఈసారి అదిరిపోయే క్యాప్షన్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్యాప్షన్ను తన హేటర్స్ కోసమే అనసూయ పెట్టినట్లు తెలుస్తోంది.
ఆ క్యాప్షన్ ఏంటంటే.. నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను అంటూ పెట్టింది.
ప్రస్తుతం అనసూయ గ్రామరస్ ఫొటోలతో పాటు.. ఈ క్యాప్షన్ గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అను వ్యాఖ్యలను ఫ్యాన్స్ సమర్థిస్తుంటే.. హేటర్స్ మాత్రం నిట్టూరుస్తున్నారు.
ఇక తాజా ఫొటోల విషయానికి వస్తే.. ఇందులో అనసూయ చాలా హాట్గా కనిపించింది. చిట్టి పొట్టి డ్రెస్లో ఎద, థైస్ అందాలు చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది.
లూజ్ హెయిర్తో మ్యాజింగ్ చమ్కీలు ధరించి అదరహో అనిపించింది. అంతేకాదు కురసైన డ్రెస్లో వివిధ రకాలుగా ఫొటోలకు ఫోజులిచ్చింది.
జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.
2012 - 2022 మధ్య బుల్లితెర యాంకర్గా కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం యాంకర్గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.
యాంకర్ కాకముందు ప్రముఖ వార్త ఛానల్లో అనసూయ న్యూస్ రీడర్గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.
రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.
రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.
సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది.
రీసెంట్గా ‘రజాకార్’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. తన అత్యుత్తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు తమిళంలో ఫ్లాష్ బ్యాక్ మూవీలో అనసూయ నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే తమిళంలోనూ ఈ బ్యూటీ బిజీగా మరిపోనుంది.
ఏప్రిల్ 03 , 2024
Hanuman Movie OTT: హనుమాన్ ఓటీటీ ఆలస్యంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!
యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja), అమృత అయ్యర్ (Amritha Aiyer) జంటగా నటించిన తొలి తెలుగు సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’ (Hanu Man). ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్షన్లో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం.. బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఆశ్చర్యపరుస్తోంది. అయితే సంక్రాంతికి రిలీజైన చిత్రాలన్నీ ఇప్పటికే ఓటీటీలో విడుదలై సందడి చేస్తున్నాయి. దీంతో హనుమాన్ రాక ఎప్పుడంటూ ఓటీటీ ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. మార్చి 16న హనుమాన్ హిందీ వెర్షన్ విడుదలవుతున్నప్పటికీ తెలుగులో ఎప్పుడు వస్తుందో తెలియక ఆడియన్స్ తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాపై ఓ అపడేట్ ఇచ్చాడు.
డైరెక్టర్ ఏమన్నారంటే!
హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యంపై సినిమా లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించాడు. ‘హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా చేయలేదు. సినిమాను వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకువచ్చేందుకు మేము అహర్నిశలు కొన్ని విషయాల పట్ల దృష్టి సారించాం. ఎప్పుడూ మీకు మంచి బెస్ట్ కంటెంట్ ఇవ్వడమే మా ఉద్దేశం తప్పా ఇంకేం లేదు. దయచేసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించి మాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. ధన్యవాదాలు’ అని ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/PrasanthVarma/status/1768483659928265154
తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!
హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ 5' (Zee 5) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క హిందీలో స్ట్రీమింగ్ డేట్ కన్ఫార్మ్ కాగా తెలుగు ఆడియన్స్కు మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో 'జీ 5' కూడా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్పై ఆసక్తికర ట్వీట్ పెట్టింది. ‘ఎంతోకాలం ఎదురుచూసిన క్షణం ఆసన్నమైంది. జీ5లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో హనుమాన్ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి’ అంటూ రాసుకొచ్చింది. డైరెక్టర్తో పాటు ఓటీటీ సంస్థ కూడా స్ట్రీమింగ్ డేట్ను ప్రకటించకపోవడంతో ఆడియన్స్ మరింత నిరాశ చెందుతున్నారు. ఇంకెన్ని రోజులు ఈ ఎదురు చూపులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే హనుమాన్ రేపే హిందీతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/ZEE5Telugu/status/1768250898784854434
హిందీలో డబుల్ ధమాకా
ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’ (Jio Cinema)లో మార్చి 16 నుంచి ఈ సినిమా హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇటీవల ట్వీట్ రూపంలో ప్రకటించాడు. ఇక అదే రోజూ టెలివిజన్ ప్రీమియర్గానూ హనుమాన్ రానుంది. మార్చి 16 రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ (Colors Cineplex) ఛానల్లో హనుమాన్ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు ‘కలర్స్ సినీప్లెక్స్’ సంస్థ తమ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో ధ్రువీకరించింది. దీంతో హిందీ ప్రేక్షకులు.. హనుమాన్ను ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.
మార్చి 15 , 2024
Nani HBD: నాని గురించి స్టార్ హీరోలు ఏమన్నారో తెలుసా? చూస్తే.. గూస్బంప్సే!
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని.. తన కృషి, పట్టుదలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. ఇవాళ నాని పుట్టిన రోజు (#HappyBirthdayNani) కావండంతో ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు నాని అప్కమింగ్ మూవీ ‘సరిపోదా శనివారం’ (#SaripodhaaSanivaaram) విడుదలకు సిద్ధమవుతుండటంతో ఆ సినిమా హ్యాష్ట్యాగ్తోనూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియోను షేక్ చేస్తున్న నాని వీడియోలపై ఓ లుక్కేద్దాం.
ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ నచ్చిన హీరో నాని. పలు వేదికలపై మహేష్, రాజమౌళి, అల్లు అర్జున్, రవితేజ, డైరెక్టర్ సుకుమార్ వంటి ప్రముఖులు నానిపై చేసిన ప్రశంసల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.
https://twitter.com/i/status/1761065464669864301
నాని సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్లో ముఖ్య అతిథి పాల్గొన్న పవన్ కల్యాణ్.. నేచురల్ స్టార్ వ్యక్తిత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. నానికి భగవంతుడు గొప్ప విజయాలను ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఈ వీడియోను నాని బర్త్డే సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1761097491502772606
టాలీవుడ్ సంచలనాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సైతం ఓ ఇంటర్యూలో హీరో నానిని కొనియాడాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అందరితో కలిసి స్టీల్ ప్లేట్ను తుడుచుకొని తిన్న నాని.. ఈ రోజు ఏ స్థాయికి ఎదిగాడో అంటూ సందీప్ ప్రశంచించాడు. .
https://twitter.com/i/status/1761098448496115970
‘సీతారామం’ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి.. నానితో ‘కృష్ణగాడి ప్రేమకథ’ చిత్రం తీశారు. ఆ సినిమా అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆయన నానిపై ప్రశంసలు కురిపించారు. నాని ఒక్క క్షణం కూడా పాత్ర నుంచి బయటకు రాడని.. ఆ క్యారెక్టర్లోనే కూర్చుండిపోతాడని పేర్కొంటాడు.
https://twitter.com/i/status/1761214343755256110
నాని హీరోగా చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని ఓ ఆడియో ఫంక్షన్లో అల్లుఅర్జున్ పేర్కొంటాడు. నాని నటన చాలా బాగుందంటూ ప్రశంసిస్తాడు. ప్రస్తుతం ఆ వీడియోను సైతం నాని పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1480588099688153089
నాని బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో మరో ఆసక్తిర వీడియో వైరల్ అవుతోంది. తోటి స్టార్స్ అయిన ప్రభాస్, తారక్ ఇతర హీరోల గురించి నాని చేసిన హెల్తీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాని ఏమన్నాడో కింద వీడియోలో మీరే చూడండి.
https://twitter.com/i/status/1761060076645711983
ఈ జనరేషన్ యువతలో ప్రేరణ కలిగిస్తూ నాని చేసిన ఓ వీడియో సైతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమ కలలను నేరవేర్చుకునే క్రమంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా బలంగా నిలబడాలని నాని ఈ వీడియో సూచించాడు.
https://twitter.com/i/status/1761106534715797807
మరోవైపు నాని స్ఫూర్తిదాయక వీడియోలు సైతం #HappyBirthdayNani హ్యాష్ట్యాగ్తో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో తాను పడ్డ ఇబ్బందులను నాని స్వయంగా పలు వేదికలపై చెప్పుకొస్తాడు. వాటన్నింటిని జోడిస్తూ ఫ్యాన్స్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1761124945327747406
ఒక అమీతాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి ఆ తర్వాత నాని.. అంటూ సాగే వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సౌత్ ఇండియాలో నాని ఓ అద్భుతమైన నటుడు అంటూ రవితేజ ఈ వీడియో ప్రశంసిస్తాడు.
https://twitter.com/i/status/1761229505295745273
నాని కెరీర్లో ఇప్పటివరకూ జరిగిన మెమోరబుల్ మూమెంట్స్, హైలెట్ మూవీ సీన్లను ఒక చోట చేర్చి చేసిన మరో వీడియో కూడా ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1761018169005584453
ఇక నాని బర్త్డే సందర్భంగా.. తన అప్కమింగ్ మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి ఆసక్తికర పోస్టు విడుదలైంది. చుట్టూ మంటలు.. ముఖాన ముసుగుతో నాని చాలా అగ్రెసివ్గా పోస్టర్లో కనిపించాడు. అయితే ఈ చిత్రం ఆగస్టు 14 లేదా ఆగస్టు 28 తేదీల్లో రిలీజయ్యే అవకాశముందని సినీ వర్గాల టాక్.
https://twitter.com/TheAakashavaani/status/1761255871374614584?s=20
ఫిబ్రవరి 24 , 2024
Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!
మాతృదినోత్సవాన్ని సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడూ షూటింగ్లో బిజీగా ఉండే వారంతా మదర్స్డే రోజున పూర్తిగా తమ తల్లులతో టైమ్ స్పెండ్ చేశారు. వారితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను సినీ తారలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని ఫొటోల రూపంలో పంచుకున్నారు. మరోవైపు అమ్మ దూరమైన జాన్వికపూర్, విష్ణుప్రియ తదితరులు తల్లితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా తారలు పోస్టు చేసిన ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.
పంజా వైష్ణవ్ తేజ్
చిరంజీవి మేనల్లుడు, ఉప్పెన సినిమా హీరో పంజా వైష్ణవ్ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పాడు. అన్న సాయిధరమ్ తేజ్తో కలిసి తల్లితో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.
View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja)
శ్రీజ కొణిదెల
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూమార్తె శ్రీజ.. మాతృదినోత్సవం రోజున తన తల్లితో సరదాగా గడిపింది. తన అక్క సుశ్మితతో కలిసి తల్లితో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. తనకు లభించిన అత్యుత్తమైన బహుమతి తన తల్లి అని శ్రీజ క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela)
కాజల్ అగర్వాల్
ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా తన తల్లికి మదర్స్డే శుభాకాంక్షలు చెప్పింది. తన తల్లితో దిగిన ఫోటోనూ షేర్ చేసిన కాజల్.. ఆమె లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చే దానిని కాదని పేర్కొంది.
View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
జాన్వీ కపూర్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. ఆమెతో దిగిన చిన్నప్పటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ మధర్ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)
విష్ణు ప్రియ
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ మాతృదినోత్సవం రోజున తన తల్లిని గుర్తు చేసుకుంది. ప్రతీ క్షణం నిన్ను మిస్ అవుతూనే ఉంటానని చనిపోయిన తల్లీని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టింది.
View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni)
రాశి ఖన్నా
నటి రాశి ఖన్నా తన తల్లితో ఎంతో సంతోషంగా ఉయ్యాల ఊగుతున్న ఫొటోను షేర్ చేసింది. ‘ఐ లవ్ యూ’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna)
మమతా మోహన్ దాస్
నటి మమతా మోహన్ దాస్ కూడా తన తల్లి గొప్పతాన్ని నెటిజన్లకు తెలియజేసింది. నా జీవితంలో గడిపిన ప్రతీ రోజూ నువ్వు ఇచ్చిందేనని తన తల్లి గురించి చెప్పుకొచ్చింది. ఆమెతో దిగిన ఫొటోను కూడా నెటిజన్లతో మమతా పంచుకుంది.
View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan)
హనీరోజ్
గ్లామర్ బ్యూటీ హనీరోజ్ కూడా మాతృదినోత్సవం రోజున తన తల్లి ప్రేమను గుర్తుచేసుకుంది. తన అమ్మతో పాటు ప్రపంచంలోని ప్రతీ అమ్మకు శుభాకాంక్షలు తెలియజేసింది.
View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta)
పద్మావతి
మహేష్బాబు సోదరి గల్లా పద్మావతి కూడా మాతృదినోత్సవ రోజున తన తల్లి చూపించిన ఆప్యాయతను గుర్తుచేసుకుంది. పద్మావతి కుమారుడు, నటుడు అశోక్ గల్లా ఈ ఫొటోను షేర్ చేశాడు. తన తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేనంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
View this post on Instagram A post shared by Galla Ashok (@ashokgalla_)
నైనికా విద్యాసాగర్
మీనా కుమార్తె నైనికా విద్యాసాగర్ తన తల్లితో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.
View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16)
మే 15 , 2023
HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్-10 రేర్ పిక్స్ వైరల్
ఇప్పుడు హీరోయిన్ ఆదాశర్మ పేరు దేశమంతా మార్మోగుతోంది. ది కేరళ స్టోరీలో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక సినీ కెరీర్ ముగుస్తుందనుకున్న తరుణంలో ది కేరళ స్టోరీ హిట్తో మంచి కమ్బ్యాక్ ఇచ్చింది. నేడు హీరోయిన్ ఆదాశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదాశర్మ రేర్ పిక్స్తో పాటు ఆమె గురించి ప్రత్యేక విషయాలు మీకోసం..
ప్రముఖ నటి ఆదాశర్మ.. ముంబయిలోని నేవీ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది.
పదో తరగతి పూర్తి చేసిన వెంటనే సినీ రంగ ప్రవేశం కోసం ఆదాశర్మ యత్నించింది. అయితే మరీ యంగ్గా ఉండటంతో పలు ఆడిషన్లలో ఆమెను రిజెక్ట్ చేశారు. 2008లో వచ్చిన ‘1920’ అనే హారర్ చిత్రంతో ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టారు.
‘1920’ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించిన ఆదాశర్మ.. హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. హయాతి పాత్రలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
‘హార్ట్ ఎటాక్’ ఫ్లాప్ అయినా ఆదాశర్మకు మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు.
తెలుగులో ఆదాశర్మ చేసిన చివరి సినిమా ‘కల్కి’. ఇందులో డాక్టర్ పద్మ అనే పాత్రలో ఈ భామ కనిపించింది. ఈ సినిమా కూడా కలిసిరాకపోవడంతో తెలుగులో అవకాశాలు మరింత సన్నగిల్లాయి.
అటు బాలీవుడ్లోనూ ఛాన్సెస్ రాకపోవడంతో ఆమె వెబ్సిరీస్లపై ఫోకస్ పెట్టింది. ‘పతి పత్ని ఔర్ పంగా’ అనే వెబ్ సిరీస్లో నటించింది. శివాని భట్నాగర్ అనే పాత్రలో మెప్పించింది.
హిందీలో ‘చుహాబిల్లి’ అనే థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్లో కూడా ఆదాశర్మ నటించింది. అలాగే ‘పియా రే పియా’ అనే ఒక మ్యూజిక్ వీడియోలోనూ కనిపించి సందడి చేసింది.
ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ అనే సినిమాలోనూ ఆదాశర్మ కీలక పాత్ర పోషించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ది కేరళ స్టోరీ సినిమాకు భాజపా పాలిత రాష్ట్రాలు రాయితీలు ప్రకటిస్తుంటే.. మరికొన్ని స్టేట్స్ మాత్రం షరతులు విధిస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలోనూ ఆదాశర్మ ఎంతో చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ఆదాశర్మ ఇన్స్టా ఖాతాను 7.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
https://telugu.yousay.tv/the-kerala-story-review-in-telugu-adah-sharmas-performance-brought-tears-reminds-me-of-another-kashmir-files.html
మే 11 , 2023
Failure Hero’s: స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్ హీరోలు తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్లో వారసుల హవా నడుస్తోంది. దిగ్గజ నటుల కుటుంబం నుంచి వచ్చిన వారు ఇప్పుడు స్టార్ హీరోలుగా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బాలకృష్ణ, పవన్కళ్యాణ్, మహేశ్ బాబు, రామ్చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్లు టాలీవుడ్లో దిగ్గజ హీరోలుగా స్థిరపడ్డారు. అయితే స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కాలక్రమంలో కొందరు అవకాశాలు లేక సినిమాలకు దూరం కాగా, మరికొందరు ఉపయోగించుకొని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చుద్దాం.
అక్కినేని అఖిల్:
అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్(Akhil) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అతడు చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్నూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలం అయ్యాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ హిట్ కొట్టిన అఖిల్.. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఏజెంట్ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఫలితంగా అఖిల్ కెరీర్ ఆధారపడి ఉంది.
అల్లు శిరీష్:
చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ కుమారుడు శిరీష్ (Allu Sirish) మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు శిరీష్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘కొత్త జంట’, ‘ఒక్క క్షణం’, ‘ఊర్వశివో.. రాక్షసివో’ ఫెయిల్యూర్స్తో శిరీష్ సినీ కెరీర్ మరింత డల్ అయ్యింది.
అల్లరి నరేష్:
దిగ్గజ హాస్య దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్ (Allari Naresh) తన తొలి చిత్రం ‘అల్లరి’ తోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ‘తొట్టి గ్యాంగ్’, ‘సీమశాస్త్రి’, ‘బెండు అప్పారావు’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ దశలో కామెడీ స్టార్గా ఎదుగుతున్నట్లే కనిపించిన నరేష్.. వరుస ఫ్లాప్లతో ఆ ట్యాగ్కు దూరమయ్యాడు. వరుసగా సినిమాలు చేసినా అవేమి చెప్పుకోదగ్గ హిట్స్ ఇవ్వకపోవడంతో నరేష్కు హీరో అవకాశాలు తగ్గాయి. దీంతో కారెక్టర్ ఆర్టిస్టుగా మారిన నరేష్.. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలతో అలరించాడు. ఇటీవల ‘నాంది’, ‘మారేడుమిల్లి ప్రజానికం’ సినిమాలతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు నరేష్.
సుశాంత్:
అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ (Sushanth) 2008లో కాళిదాసు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్గా నిలవగా తర్వాతి ఏడాది వచ్చిన కరెంటు మూవీతో సుశాంత్ పర్వాలేదనిపించాడు. కానీ అడ్డా, దొంగాట, ఆటాడుకుందా రా, చిలాసౌ వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో సుశాంత్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సుశాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అలా వైకుంఠపురం చిత్రంలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సుశాంత్ రావణాసుర, భోళాశంకర్ చిత్రాల్లో నటించారు.
ఆది పినిశెట్టి:
దిగ్గజ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి (Aadi pinisetty) టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2006లో ఒక V చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద హీరో రెంజ్ సంపాదించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేస్తున్నాడు.
ఆది:
నటుడు సాయికుమార్ వారసుడిగా ఆది సినిమాల్లోకి వచ్చాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’ తో మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన లవ్లీ, సుకుమారుడు, గాలిపటం, గరం వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆది కెరీర్ ఒడిదొడుకులకు లోనైంది. దీంతో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇటీవలే ‘మేక పులి’ సిరీస్ ద్వారా ఆకట్టుకున్నాడు.
రాజా గౌతం:
హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతం 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గౌతం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చాడు. మళ్లీ 2014లో ‘బాసంతి’ సినిమాతో గౌతమ్ ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఫెయిలవ్వగా ఆ తర్వాత మను, బ్రేక్ ఔట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.
అరుణ్ దాసరి:
టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ దాసరి నారాయణరావు తన సినిమాలతో ఎంతో మంది నటులను స్టార్ హీరోలుగా తీర్చిదిద్దారు. అలాంటి దర్శకుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అరుణ్ దాసరి తెలుగు ప్రేక్షకులను మెప్పిండంలో విఫలమయ్యారు. 2001లో చిన్నా సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన అరుణ్ ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ‘ఆది విష్ణు’ చిత్రం సైతం ఫ్లాప్గా నిలవడంతో అరుణ్ హీరో కెరీర్ మసకబారిపోయింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన అరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
ఏప్రిల్ 03 , 2023
Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి.
[toc]
Samantha Ruth Prabhu
సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత ఫ్యాన్స్ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్పై మీరు ఓ లుక్కేయండి.
Samantha bikini images
Kajal Aggarwal
కాజల్ అగర్వాల్ తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.
Kajal Agarwal bikini video
https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250
Tamannaah Bhatia
తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్సిరీస్ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్ స్టోరీస్లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.
Tamannaah Bhatia Bikini images
View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial)
View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)
Anushka Shetty
అనుష్క శెట్టి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు.
Anushka shetty Bikini Images
Disha Patani
దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది.
Disha Patani Bikini images
Pragya Jaiswal
ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్గా ఫిల్మ్ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి.
Pragya Jaiswal bikini Images
ShwetaTiwari
శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి.
ShwetaTiwari Bikini Images
Deepika Padukone
దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది.
deepika padukone bikini Images
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి.
Pooja Hegde Bikini Images
Pooja Hegde Hot Videos
https://twitter.com/RakeshR86995549/status/978983052364808194
View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
Raashii Khanna
రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్. ఐఏఎస్ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్లు వస్తుంటాయి.
Raashii Khanna Bikini images
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్గా నటించింది. గోపిచంద్తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్ బీట్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్ వేయండి
https://twitter.com/PicShareLive/status/1525365506471231488
Ketika Sharma Bikini Images
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ గ్లామరస్ డాల్గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి
Ketika Sharma Bikini Images
Catherine Tresa
కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి.
Catherine Tresa Bikini images
Mrunal Thakur
మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి.
Mrunal Thakur Bikini images
Mrunal Thakur hot video
https://twitter.com/MassssVishnu/status/1786566946600988750
https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193
https://twitter.com/SastaJasoos/status/1788498532162236427
Anasuya Bharadwaj
బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి.
Anasuya Bharadwaj Bikini images
View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
Nidhhi Agerwal
నిధి అగర్వాల్ ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి.
Nidhhi Agerwal Bikini Images
Mehreen Kaur Pirzada
మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది.
Mehreen Kaur Pirzada Bikini Videos
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
Manushi Chillar
మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్. మిస్ వరల్డ్ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రంతో ఈ భామ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి.
Manushi Chillar Bikini Images
Manushi Chillar Bikini videos
View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar)
https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి.
Sobhita Dhulipala bikini images
Hot videos
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
Tripti Dimri
తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్పోజింగ్లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి.
Tripti Dimri Bikini images
View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri)
Shirley Setia
షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్డౌన్(2018) వెబ్సిరీస్ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Shirley Setia Bikini Images
మే 11 , 2024
Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్ తెలుసా?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్ సైడ్ లవ్ అనే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా థియేటర్లలో 125 రోజులకు పైగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 2004 మే7న ఈ సినిమా రిలీజ్ కాగా, నేటితో సరిగ్గా 20 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన తెర వెనక రహాస్యాలపై ఓ లుక్కేద్దాం.
దిల్ సక్సెస్తో సుకుమార్కు ఛాన్స్
నితీన్ హీరోగా చేసిన ‘దిల్’ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజుకు సుకుమార్ ‘ఆర్య’ స్టోరీ వినిపించారు. ఇంప్రెస్ అయిన అతడు.. ‘దిల్’ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అని సుకుమార్కు మాటిచ్చారు. ఈ లోపు పూర్తి కథ సిద్ధం చేసుకో అని సూచించారు. ఆ తర్వాత రిలీజైన ‘దిల్’.. బ్లాక్ బాస్టర్ కావడంతో సుకుమార్కు డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత ఆర్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడింది.
మిస్ చేసుకున్న అల్లరి నరేష్
ఆర్య చిత్రానికి తొలుత హీరోగా అల్లరి నరేష్ను సుకుమార్ అనుకున్నారట. అతడ్ని దృష్టిలో పెట్టుకొనే కథను కూడా రాశారట. అయితే కొన్ని కారణాల వల్ల కథ ఆయన వరకూ వెళ్లలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో నరేష్ స్వయంగా పంచుకున్నారు. ‘సుకుమార్ ‘100%లవ్’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్ కంటే బాగా ఎవరూ చేయలేరు’ అని నరేశ్ అన్నారు.
https://twitter.com/i/status/1787548147520061468
బన్నీని అలా ఫైనల్ చేశారు!
ఆర్య కథ సిద్ధమైన తర్వాత హీరోను ఎవరు పెట్టాలన్న సందేహం కొన్ని రోజుల పాటు దర్శక నిర్మాతలను వెంటాడిందట. హీరో కోసం వెతుకున్న క్రమంలోనే దిల్ మూవీ స్పెషల్ షో నిర్వహించారు. ఆ సమయంలో బన్నీ కూడా వెళ్లాడు. అల్లుఅర్జున్ చలాకీ తనం, కామెడీ టైమింగ్ చూసి తన కథకు బన్నీ అయితేనే సరిగ్గా సరిపోతాడని దిల్ రాజుతో సుకుమార్ అన్నాడట. వెళ్లి అల్లు అర్జున్తో మాట్లాడరట. గంగోత్రి తర్వాత చాలా కథలు విని విసిగిపోయిన బన్నీ రొటీన్ స్టోరీ అనుకొని నో చెప్పారట. ఎట్టకేలకు విన్నాక కథ బన్నీకి బాగా నచ్చిందట. అటు చిరంజీవి, అల్లు అరవింద్కు కూడా ఇంప్రెస్ కావడంతో సినిమా పట్టాలెక్కింది.
అసిస్టెంట్గా చేసిన స్టార్ డైరెక్టర్
కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల.. ఆర్య మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాదు ఓ సీన్లోనూ ఆయన కనిపించాడు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలోనూ తొలుత కాస్త గందరగోళం నెలకొందట. ఈ వన్సైడ్ లవ్ స్టోరీకి ఏ పేరు పెడితే బాగుంటుందా? అని దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు తెగ ఆలోచించారట. ఈ క్రమంలో ‘నచికేత’ టైటిల్ పెడితే ఎలా ఉంటుదని చిత్ర యూనిట్ యోచించిందట. చివరకు బన్నీ పాత్ర పేరునే టైటిల్గా ఫిక్స్ చేశారట.
https://twitter.com/i/status/1787674074585714980
120 రోజుల్లో షూటింగ్ పూర్తి
ఆర్య చిత్ర షూటింగ్ను దర్శకుడు శరవేగంగా పూర్తి చేశాడు. 2003 నవంబరు 19న ఈ సినిమా లాంఛనంగా మెుదలవ్వగా.. 120 రోజుల్లోనే పూర్తి చేశారు. అటు సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ మూవీ ఆల్బమ్.. మ్యూజిక్ లవర్స్ను ఫిదా చేసింది. ముఖ్యంగా తెలుగు అక్షరాలమాలకు కొత్త అద్దం చెప్పే ‘అ అంటే అమలాపురం..’ పాట అప్పట్లో మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆటోలు, ట్రాక్టర్లు, ఫంక్షన్లు, ఈవెంట్స్ ఇలా ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించేది.
ఆర్యతో వారికి స్టార్డమ్
ఆర్య సినిమా సక్సెస్.. డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, డీవోపీ రత్నవేలు జీవితాలను మార్చివేసింది. వారి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. గంగోత్రి తర్వాత బన్నీ చేసిన రెండో చిత్రం ఆర్య. ఈ సినిమాలో బన్నీ స్టైల్, డ్యాన్స్, గ్రేస్, యాక్షన్ చూసి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆర్య వచ్చి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరో బన్నీ ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టును సైతం పెట్టాడు. 'నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అని బన్నీ పోస్టు పెట్టాడు.
మే 07 , 2024
Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!
ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతుండటంతో కొన్ని మూవీస్ ఆటోమేటిక్గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్తో వచ్చినా కూడా అవి అండర్ రేటెట్ ఫిల్మ్స్గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్లో వీక్షించవచ్చు.
కంచె (Kanche)
వరణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ కంచె. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్స్టార్లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్ తేజ్).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya)
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ.
పలాస 1978 (Palasa 1978)
రక్షిత్ అట్లూరి హీరోగా కరుణ కుమార్ డైరెక్షన్ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
మను (Manu)
బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్గా చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్ ఫండింగ్ రూపంలో నిర్మించారు. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీని చూడవచ్చు. కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
చక్రవ్యూహం: ది ట్రాప్ (Chakravyuham: The Trap)
అజయ్ లీడ్ రోల్లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్ (సుదీష్)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్, అమృత శ్రీనివాసన్ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్తో ఉండే హీరో లైఫ్లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
క్షణం (Kshanam)
అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
మే 04 , 2024
RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్ అనగానే ముందుగా అందరికీ ‘రామ్ గోపాల్ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఆరాధ్య దేవి (Aaradhya Devi)
ఆర్జీవీ అప్కమింగ్ చిత్రం 'చీర'లో శ్రీలక్ష్మీ సతీష్ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
Aaradhya Devi Hot images gallery
ఇర్రా మోర్ (Irra Mor)
ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు 'భైరవ గీత', ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava)
హాట్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన 'రౌడీ' సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది.
Shanvi Srivastava Hot images gallery
పూజా భలేకర్ (Pooja Bhalekar)
హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్లో కెమెరాను పెట్టి హీరోయిన్ అందాలను ఆర్జీవీ క్యాప్చర్ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్ హాట్ బాంబ్లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.
Pooja Bhalekar Bikini images gallery
నైనా గంగూలి (Naina Ganguly)
ఆర్జీవీ టాలెంటెడ్ హీరోయిన్లతో పాటు బోల్డ్ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్ షో చేసింది.
అప్సర రాణి (Apsara Rani)
ఆర్జీవీ చేతిలో పడి స్టార్గా మారిన మరో హాట్ బాంబ్ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్ పోస్టులతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Apsara Rani Hot images gallery
ఊర్మిళ (Urmila Matondkar)
ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్’, ‘జంగిల్’, ‘దావుద్’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్, అందమైన హీరోయిన్ ఉంటే సినిమాను సక్సెస్ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.
అక్కినేని అమల (Akkineni Amala)
స్టార్ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్లో సినిమా చేయలేదు.
శ్రీదేవి (Sridevi)
రామ్గోపాల్ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన 'గోవిందా గోవిందా', 'క్షణ క్షణం' చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం.
రేవతి (Revathi)
ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్’, ‘అబ్ తక్ ఛాపన్’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్ (RGV Horror Movies) బ్యాక్డ్రాప్లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్ గోపాల్ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
మహేశ్వరి (Maheswari)
ఒకప్పటి స్టార్ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'దెయ్యం' సినిమాలో మహేశ్వరి లీడ్ రోల్లో నటించింది. హర్రర్ సీన్స్లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ను థ్రిల్ చేశాయి.
మనీషా కోయిరాలా (Manisha Koirala)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్ హిట్ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్లో నటించింది. ఆ తర్వాత ‘భూత్ రిటర్న్స్’, ‘దర్వాజ బంద్’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్ రిటర్న్స్లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.
సుస్మితా సేన్ (Sushmita Sen)
ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'AAG' లోనూ సుస్మితా సేన్ మెరిసింది.
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan)
ఆర్జీవీ డైరెక్షన్లో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన 'సర్కార్ రాజ్' అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్త
https://telugu.yousay.tv/heroines-launched-by-ram-gopal-varma.html
ఏప్రిల్ 24 , 2024
Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
బట్టల సత్తి (Battala Satti)
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన 'లేడీస్ ట్రైలర్' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.
శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar)
విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు.
రామిరెడ్డి (Spot Nana Rami Reddy)
కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్ హీరోగా చేసిన ’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్ పెడతా’ అనే డైలాగ్ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సుత్తి వీరభద్రరావు (Sutti Veerabhadra Rao)
సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్ అయ్యింది.
https://twitter.com/i/status/1674734022793244672
సుత్తివేలు (Suthivelu)
అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.
షావుకారు జానకి (Shavukaru janaki)
షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
సాక్షి రంగారావు (Sakshi Ranga rao)
ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.
అల్లరి నరేష్ (Allari Naresh)
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్తో నరేష్ కాస్త అల్లరి నరేష్గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్’గా నరేష్ గుర్తింపు పొందాడు.
వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas)
టాలీవుడ్కు చెందిన దిగ్గజ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్ హిట్ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri)
టాలీవుడ్ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు.
మహర్షి రాఘవ (Maharshi Raghava)
వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.
దిల్ రాజు (Dil Raju)
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ నిర్మాతగా దిల్రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ మూవీ టైటిల్నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
నటుడు వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కమెడియన్గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన కిషోర్.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్తో మూవీ టైటిల్నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్గా నిలవడం గమనార్హం.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
నటుడు సత్యం రాజేష్ అసలు పేరు.. రాజేష్ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్ పాత్రల్లో కనిపించి సాలిడ్ విజయాలను అందుకున్నాడు.
చిత్రం శ్రీను (Chithram Srinu)
చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu bhaskar)
డైరెక్టర్ భాస్కర్.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్ డూపర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్’తో హ్యాట్రిక్ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్చరణ్ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్’ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.
ఆహుతి ప్రసాద్ (Ahuti Prasad)
నటుడు ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్ బారిన పడి జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.
జేడీ చక్రవర్తి (JD Chakravarthy)
హైదరాబాద్లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.
బొమ్మాళి రవి శంకర్ (Bommali Ravi Shankar)
తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి' చిత్రం రవిశంకర్కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్సూద్కు వాయిస్ ఓవర్ ఇచ్చిన రవిశంకర్.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్ కాస్త.. బొమ్మాళి రవిశంకర్గా మారిపోయారు.
https://twitter.com/ramanuja2797/status/1393914318530351116
దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
టాలీవుడ్ రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. తనదైన మ్యూజిక్తో యావరేజ్ సినిమాలను సైతం సూపర్హిట్స్గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్హిట్గా నిలవడంతో ఈ రాక్స్టార్కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్ను దేవి శ్రీ ప్రసాద్ తన పేరులో కలుపుకున్నాడు.
బాహుబలి ప్రభాకర్ (Bahubali Prabhakar)
‘రైట్ రైట్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్గా అందరి దృష్టిలో పడ్డాడు.
ప్రభాస్ శ్రీను (Prabhas Srinu)
పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి గాను ప్రభాస్ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.
మార్చి 07 , 2024
MEGA HEROS: టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
ఒకప్పుడు టాలీవుడ్ అనగానే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్స్టార్ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్కు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
పవన్ కల్యాణ్
చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్గా పవన్ తీసిన వకీల్ సాబ్ (Vakeel saab), భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్సింగ్, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్లలో పవన్ బిజీగా ఉన్నాడు.
రామ్చరణ్
చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్చరణ్ (Ram Charan).. ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్ఆర్ఆర్ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ సినిమా ఉండనుంది.
అల్లుఅర్జున్
చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.
సాయిధరమ్ తేజ్
చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరణ్ తేజ్
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా వరణ్ తేజ్(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్కు షాక్ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అల్లు శిరీష్
చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా నచ్చింది. అయితే శిరీష్ లేటెస్ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
కళ్యాణ్ దేవ్
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్ దేవ్ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఏప్రిల్ 11 , 2023
Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.
చిరంజీవి ఎమోషనల్..
ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ సంతోష క్షణాలు నిజం కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పొయింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్కి సుస్వాగతం. నీ రాకతో లక్షలాది మంది ఉన్న మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. నీ రాక వల్ల రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులైతే, మేం గ్రాండ్ పేరెంట్స్ అయ్యాం. ఈ ఆనంద క్షణాలు సంతోషంగా గర్వంగా ఉన్నాయి' అంటూ లిటిల్ మెగా ప్సిన్సెస్ రాకపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు.
https://twitter.com/KChiruTweets/status/1671005792965902337?s=20
అలాగే అపోలో ఆస్పత్రి వద్ద వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు ఉద్దేశిస్తూ మెగాస్టార్ మాట్లాడారు. తన మనవరాలి రాకపై ప్రకటన విడుదల చేశారు. ఈరోజు ఉదయం 1.49 నిమిషాలకు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం.. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా వారిద్దరూ తల్లిదండ్రులు కావాలని, మాచేతుల్లో బిడ్డను పెట్టాలని మేము కోరుకున్నాం. అతి ఇన్నేళ్ల తర్వాత ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల నెరవేరింది అని చెప్పుకొచ్చారు.
https://twitter.com/TweetRamCharan/status/1671049788777975808?s=20
11 ఏళ్ల నిరీక్షణ ఫలించింది..
చరణ్- ఉపాసనలకు 2012లో వివాహమైంది. జూన్ 14న 11వ వివాహ వార్షికోత్సవం సైతం జరుపుకున్నారు. వారం రోజులు తిరగక ముందే మెగా ప్రిన్సెస్ రావడంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లివిరిసింది. రామ్చరణ్- ఉపాసనలు తాము పేరెంట్స్ అవుతున్నామనే విషయాన్ని ఎప్పడెప్పుడూ చెబుతారా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఉపాసన బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించింది. ప్రతి అడుగులో జాగ్రత్తలు తీసుకుంది.
డెలివరీ కోసం అంతర్జాతీయ వైద్య బృందం
తన డెలివరీ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులను ఎంచుకుంది. డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హా అపోలో ఆస్పత్రుల్లో OB/GYN బృందంలో కీలకంగా ఉన్నారు. వీరితో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ కూడా ఉపాసన డెలివరి బృందంలో భాగంగా మారారు. వీరి పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది ఉపాసన. డెలివరీ డేట్ దగ్గరపడటంతో ఆపోలో ఆస్పత్రిలో ఈ అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలోఉపాసన ప్రసవించింది.
ఐకాన్ స్టార్ రాక..
రామ్చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో వారిని విష్ చేసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని దీవించారు. రామ్చరణ్- ఉపాసనలకు శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/ANI/status/1671037419255373824?s=20
అటు చరణ్-ఉపాసనలకు శుభాకాంక్షలు చెప్పేందుకు మెగా ఫ్యాన్స్ ఆస్పత్రికి పొటెత్తారు. సోషల్ మీడియాలోనూ #MegaPrincess హ్యాష్ ట్యాగ్తో హోరెత్తిస్తున్నారు.
జూన్ 20 , 2023