ATelugu2h 40m
నాజియా (భాంధవి శ్రీధర్) ఆమె తల్లి నీలం (సంగీత) ఇద్దరు కలిసి జీవిస్తుంటారు. వీరు గోపీ కృష్ణ (తిరువీర్) సాఫ్ట్వేర్ ఉద్యోగితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. అయితే నాజియా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఆమె ప్రవర్తన నీలం, గోపిలను షాక్కు గురిచేస్తుంది. ఆమెను భూతవైద్యుల దగ్గరికి తీసుకెళ్తారు. మరి నాజియా కోలుకుందా? ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? అనేది మిగతా కథ.
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
సంగీత క్రిష్
నీలంతిరువీర్
గోపీ కృష్ణకావ్య కళ్యాణ్ రామ్
మినీశుభలేఖ సుధాకర్
రిజ్వాన్ (బాబా)అఖిలా రామ్మసూద
బాంధవి శ్రీధర్నాజియా
సత్యం రాజేష్
అల్లావుద్దీన్సత్య ప్రకాష్
అబ్దుల్సూర్యారావు
సురభి ప్రభావతినర్గీస్
కృష్ణ తేజ
సిబ్బంది
సాయి కిరణ్దర్శకుడు
రాహుల్ యాదవ్ నక్కానిర్మాత
ప్రశాంత్ ఆర్ విహారి
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Pareshan Review: కామెడీ ఓకే.. ‘పరేషాన్’తో మసూద హీరో హిట్ కొట్టినట్లేనా!
నటీనటులు : తిరువీర్, పావని, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్, శ్రుతి రయాన్
దర్శకత్వం: రోనాల్డ్ రూపక్ సన్
సంగీతం: యశ్వంత్ నాగ్
సినిమాటోగ్రఫీ: వాసు
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి
సమర్పణ: రానా దగ్గుబాటి
టాలీవుడ్లో తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. తెలంగాణ యాస, భాషతో పాటు సంస్కృతి సంప్రదాయల మేళవింపుతో వచ్చి ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఫిదా, బలగం, జాతి రత్నాలు, దసరా వంటి చిత్రాలు అలా వచ్చి భారీ హిట్ అందుకున్నవే. తాజాగా రూపొందిన ‘పరేషాన్’ మూవీ సైతం తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కింది. రోనాల్డ్ రూపక్ సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించాడు. ఈ సినిమాని సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించగా, హీరో దగ్గుబాటి రానా సమర్పిస్తుండటంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (జూన్ 2) పరేషాన్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అందరినీ ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ:
ఐజాక్(తిరువీర్) ITI చదివి పనిపాట లేకుండా స్నేహితులతో ఖాళీగా తిరుగుతుంటాడు. ఫ్రెండ్స్తో కలిసి విపరీతంగా తాగుతూ గొడవలు పడుతుంటాడు. ఐజాక్ను చూసి విసిగిపోయిన తండ్రి సమర్పణం (మురళీధర్ గౌడ్) తన సింగరేణి ఉద్యోగం కుమారుడికి ఇప్పించాలని భావిస్తాడు. అందుకోసం భార్య నగలు అమ్మి లంచం డబ్బు సిద్ధం చేస్తాడు. అయితే ఆ డబ్బును ఆపదలో ఉన్న ఫ్రెండ్స్కు ఐజాక్ ఇస్తాడు. డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి శిరీష (పావని కరణం) గర్భవతి కావడం ఐజాక్ చిక్కులు తెచ్చిపెడుతుంది. అబార్షన్ కోసం సిద్దం చేసిన డబ్బును ఎవరో కాజేయడంతో ఐజాక్ కొత్త సమస్యల్లో చిక్కుకుంటాడు. దీంతో డబ్బు కోసం ఐజాక్ తెగ పరేషాన్ అవుతుంటాడు. డబ్బు కోసం ఐజాక్ ఏం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
ఐజాక్ పాత్రలో తిరువీర్ అద్భుత నటన కనబరిచాడు. సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలో జీవించేశాడు. మసూద తర్వాత నటనలో మరింత మెరుగైనట్లు కనిపించాడు. అటు ఫ్రెండ్స్ పాత్రలైన ఆర్జీవీ, మైదాక్, సత్తి(అర్జున్ కృష్ణ) ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్ అవుతాయి. డబ్బు కోసం వారు పడే బాధలు థియేటర్లో నవ్వులు పూయించాయి. ముఖ్యంగా సత్తి పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక తండ్రి పాాత్రలో మురళీధర్ గౌడ్ ఎప్పటిలాగే తన మార్క్ చూపించాడు. కొడుకు ఫ్యూచర్ కోసం తాపత్రయపడే తండ్రిగా అలరించాడు. హీరోయిన్ శిరీష పాత్రలో పావని తన పరిధిమేరకు నటించిం మెప్పించింది. సినిమాలో చాలావరకు కొత్తవారే ఉన్నప్పటికీ ఆ నటనలో మాత్రం చాలా అనుభవం ఉన్నట్లు చేశారు. అయితే కొన్ని సీన్లలో మాత్రం అనుభవలేమి కనిపిస్తుంది.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ రోనాల్డ్ రూపక్ సన్ మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని తెరకెక్కించడంలో తడబడ్డాడు. స్క్రీన్ప్లే చాలా పేలవంగా ఉంది. నవ్వుల కోసమే సీన్లు చేసుకుంటూ పోయినట్లు అనిపిస్తుంది. ఒకదానికొకటి కనెక్షన్ ఉండదు. సినిమాలో ఎక్కువ భాగం తాగుడే ఉండటం వల్ల ప్రేక్షకుడికి కాస్త విసుగ్గా అనిపిస్తుంది. అయితే ప్రధాన పాత్రల మధ్య వచ్చే కామెడీ సీన్స్ను మాత్రం డైరెక్టర్ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఆ కామెడీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ను తీసుకొస్తుంది. అయితే సీన్లను మరింత క్వాలిటీగా రాసుకుని మేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సినిమాకు తిరుగుండేది కాదు.
టెక్నికల్గా
సినిమాటోగ్రఫీ పరేషాన్ చిత్రానికి ప్లస్ అని చెప్పొచ్చు. వాసు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని ఆయన చక్కగా తన కెమెరాతో చూపించారు. ఎడిటింగ్ పరంగా ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేది. యశ్వంత్ నాగ్ సంగీతం పర్వాలేదు. అయితే BGM సో సోగా అనిపిస్తుంది. కొన్ని సీన్లకు నేపథ్య సంగీతం మరీ ఓవర్గా అనిపిస్తుంది. అసలు సింక్ అయినట్లు అనిపించదు. నిర్మాణ పరంగా మేకర్స్ రాజీ పడినట్లు కనిపిస్తుంది. ఆచి తూచి ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్క్రీన్ప్లేఎడిటింగ్నేపథ్య సంగీతం
రేటింగ్ : 2.5/5
జూన్ 02 , 2023
2022లో తెలుగు బాక్సాఫీస్ హిట్లు
]మయోసైటిస్తో బాధపడుతూ డబ్బింగ్ చెప్పిన సమంత ‘యశోద’ హిట్ సాధించింది. బుల్లితెర సూపర్ స్టార్ సుధీర్ నటించిన గాలోడు బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేసింది. మసూద, లవ్ టుడే వంటి చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి.చివర్లో చిన్నసినిమాలు
ఫిబ్రవరి 13 , 2023
Unique Promotions: ప్రమోషన్స్తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్ ఫేమస్’ రచ్చ రచ్చ..!
సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చేస్తున్న ప్రమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి. రొటిన్ ప్రమోషన్స్లా కాకుండా చిత్ర యూనిట్ వినూత్నంగా తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. డీజే బ్యాండ్తో స్వయంగా సెలబ్రిటీల దగ్గరకు వెళ్లి తమ ప్రమోషన్స్లో వారిని భాగస్వామ్యం చేస్తోంది. ‘మేమ్ ఫేమస్’ను ప్రమోట్ చేస్తూ సెలబ్రిటీలు చెబుతున్న డైలాగ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
విశ్వక్సేన్
‘దాస్ కా ధమ్కీ’ మూవీ హిట్తో విశ్వక్ సేన్ ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ క్రమంలో విశ్వక్ను కలిసిన ‘మేమ్ ఫేమస్’ చిత్ర యూనిట్ ఆయన చేత వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేయించింది.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
తిరువీర్
హారర్ చిత్రం ‘మసూద’లో లీడ్ రోల్ చేసిన నటుడు తీరువీర్ కూడా ‘మేమ్ ఫేమస్’ ప్రమోషన్స్లో భాగమయ్యాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
రాహుల్ సిప్లిగంజ్
ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ను కూడా చిత్ర యూనిట్ కలిసింది. ఊరమాస్ స్టెప్పులతో తమ మూవీని ప్రమోట్ చేయించుకుంది.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
సింగర్ మంగ్లీ
ప్రముఖ సింగర్ మంగ్లీ కూడా ధూమ్ ధామ్ డ్యాన్స్తో ‘మేమ్ ఫేమస్’ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
అడివి శేష్
యంగ్ హీరో అడివి శేష్ను కూడా చిత్ర యూనిట్ వదల్లేదు. తమ డప్పులకు చిందేయించి మరి హీరోతో ప్రమోషన్ చేయించుకుంది.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
విజయ్ ఆంటోనీ
బిచ్చగాడు-2 సినిమా హీరో ‘విజయ్ ఆంటోనీ’ సైతం ఎంతో ఉత్సాహాంగా ప్రమోషన్స్లో పాల్గొన్నాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
రానా దగ్గుబాటి
‘మేమ్ ఫేమస్’ యూనిట్తో కలిసి హీరో రానా కూడా రచ్చ రచ్చ చేశాడు. కిర్రాక్ స్టెప్పులతో అలరించాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
తరుణ్ భాస్కర్
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఎంతో హుషారుగా సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
సుహాస్
‘కలర్ ఫొటో’ సినిమా హీరో సుహాస్ చేసిన ప్రమోషన్స్ అన్నింటి కంటే హైలెట్ అని చెప్పొచ్చు. సినిమా ఫంక్షన్స్లో ఎంతో బిడియంగా కనిపించే సుహాస్ తన డ్యాన్స్తో ఇరగదీశాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
అనిల్ రావిపూడి
ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా మూవీ ప్రమోషన్స్లో తళుక్కుమన్నాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
నవదీప్
హీరో నవదీప్ ఇటీవల ‘న్యూసెన్స్’ అనే వెబ్సిరీస్లో నటించాడు. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో పాటు తెలివిగా తన వెబ్సిరీస్ను కూడా నవదీప్ ప్రమోట్ చేసుకున్నాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
హరీశ్ శంకర్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా మేమ్ ఫేమస్ చిత్ర ప్రమోషన్స్లో చురుగ్గా పాల్గొన్నాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
నాగచైతన్య
ఎప్పుడూ సాఫ్ట్గా, కూల్గా ఉండే హీరో నాగచైతన్య కూడా దుమ్ములేపాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తనదైన శైలిలో కొత్త మూవీని ప్రమోట్ చేశాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట కూడా ‘మేమ్ ఫేమస్’ టీమ్ హల్చల్ చేసింది. ఈ క్రమంలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన అల్లుఅరవింద్.. మే 26న థియేటర్స్లో కలుద్దాం అంటూ మూవీ బృందంతో అన్నారు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
మే 23 , 2023
KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఓ హీరోయిన్ గురించే చర్చ. ఆమె ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు కావ్య కల్యాణ్ రామ్. బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య…మసూద, బలగం సినిమాలతో హీరోయిన్గా మారి గుర్తింపు తెచ్చుకుంది.
అచ్చమైన తెలుగమ్మాయి
హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి నాగార్జున హీరోగా వచ్చిన స్నేహమంటే ఇదేరా చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి ఎన్నో చిత్రాల్లో చిన్నప్పట్నుంచే క్యారెక్టర్లు చేసింది కావ్య.
హీరోయిన్ ఛాన్స్
గతేడాది చివర్లో వచ్చిన హార్రర్ చిత్రం మసూదలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది కావ్య కళ్యాణ్ రామ్. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కమేడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగంలోనూ కావ్యకు కథానాయికగా మెరిసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవటంతో కావ్య గురించి అందరూ వెతుకుతున్నారు.
ఫాలోయింగ్ ఎక్కువే
సినిమాల్లో చేస్తూనే చదువుపై కూడా శ్రద్ధ పెట్టింది కావ్య. B.A, L.L.B పూర్తి చేసింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాలో 95.5k ఫాలోవర్స్ ఉన్నారు. అటు ఫిట్నెస్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అందాల భామ. ఉదయాన్నే కసరత్తులు చేస్తూ గ్లామర్ మెయింటెన్ చేస్తోంది.
దశ మారుతుందా?
వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టడంతో ఆమెకు అవకాశాలు చాలా పెరగొచ్చు. అందులోనూ దిల్ రాజు వంటి బడా నిర్మాతతో పనిచేయడం కలిసి వస్తుందని ఆశిస్తోంది. ఇప్పటికే మరో సినిమా షూటింగ్లోనూ బిజీగా గడుపుతోంది కావ్య. మత్తు వదలరా చిత్రంతో హీరోగా మారిన శ్రీ సింహా సరసన నటిస్తోంది. బడ్జెట్ కాస్త తక్కువ ఉండే సినిమాల్లో హీరోయిన్గా కావ్యను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మార్చి 17 , 2023
Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్ భాస్కర్ హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్
నిర్మాతలు: కె.వివేక్, సాయికృష్ణ, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్, ఉపేంద్ర వర్మ
సమర్పణ: రానా దగ్గుబాటి
విడుదల: 03-11-2023
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ కథలను అందించడంలో తనకు సాటి లేరని చాటి చెప్పారు. సున్నితమైన కథలతో వల్గారిటీ లేని కామెడీని పుట్టించి తరుణ్ తెలుగు ఆడియన్స్కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా యూత్లో మంచి క్రేజ్ సంపాదించాడు. అటువంటి తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన మరో చిత్రం 'కీడా కీలా' (Keeda Cola). ఈ చిత్రం ఇవాళ (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందా? తరుణ్ భాస్కర్ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? వంటి ప్రశ్నలకు ఈ రివ్యూలో సమాధానాలు తెలుసుకుందాం.
కథ
వాస్తు (చైతన్యరావు), వరదరాజు (బ్రహ్మానందం) తాత మనవళ్లు. లాయర్ అయిన కౌశిక్ (రాగ్ మయూర్)తో కలిసి డబ్బు కోసం ఓ ప్లాన్ వేస్తారు. తాత కోసం కొన్న శీతల పానీయం కీడా కోలా బాటిల్లో బొద్దింకని చూపించి యజమానిని బ్లాక్మెయిల్ చేయాలని పన్నాగం పన్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేరసారాలు మొదలవుతాయి. మరోవైపు జీవన్ కార్పొరేటర్ కావాలని ఆశపడుతుంటాడు. 20 ఏళ్లు జైల్లో ఉండి బయటికి వచ్చిన తన అన్న నాయుడు (Tharun bhascker) అండతో ఆ ప్రయత్నాల్లోకి దిగుతాడు. వీరికి కూడా డబ్బు అవసరం పడటంతో నాయుడు, జీవన్ కూడా ఓ వ్యూహం పన్నుతారు. మరి వీళ్లందరి ప్రయత్నాలు ఫలించాయా? డబ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్, జీవన్ గ్యాంగ్ ఎలా కలిశారు? తదితర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎలా సాగిందంటే
సరదా సరదా సన్నివేశాలతో ప్రథమార్ధం వేగంగా పూర్తవుతుంది. నాయుడుగా తరుణ్ భాస్కర్ ఎంట్రీతో కథలో మరింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయన చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. ఇక ద్వితీయార్ధం మరింత సందడిగా అనిపిస్తుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటనల్లో నటిస్తూ హీరోగా గెటప్ శీను చేసే సందడి, వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని సరెండర్ అంటూ చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. నాయుడుని అంతం చేయడానికి వచ్చిన షార్ప్ షూటర్స్ చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్గా నిలుస్తాయి. బ్రహ్మానందం పాత్ర వీల్ ఛెయిర్కే పరిమితమైనా సందర్భానుసారంగా నవ్విస్తుంది.
ఎవరెలా చేశారంటే?
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో నటుడిగానూ అద్భుత నటన కనబరిచాడు. నాయుడుగా ఆయన కనిపించిన విధానం, నటన, కామెడీ టైమింగ్ సినిమాకి ప్రధానబలం. బ్రహ్మానందం పాత్ర పరిధి తక్కువే అయినా చివరి వరకూ సినిమాపై ఆయన పాత్ర ప్రభావం కనిపిస్తుంటుంది. హీరో చైతన్యరావు వైకల్యం ఉన్న యువకుడిగా కనిపించాడు. మాటల్ని సరిగ్గా పలకలేని పాత్రలో మంచి నటనని ప్రదర్శించాడు. రాగ్మయూర్, జీవన్, విష్ణు, రఘు, రవీంద్ర విజయ్, గెటప్ శీను కీలక పాత్రల్లో కనిపిస్తారు. చిన్న చిన్న పాత్రలు కూడా సినిమాలో నవ్విస్తాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
తరుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ చిత్రమిది. ఈ కథని నడిపించిన విధానం, రచనలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్, సంగీతం, మాటలు, పాత్రల హావభావాలతో ఆయన నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే తరుణ్ భాస్కర్ గత చిత్రాలకీ ఈ సినిమాకీ పోలిక ఉండదు. తొలి రెండు సినిమాల్ని వాస్తవికతకి పెద్ద పీట వేస్తూ ఆయన సన్నివేశాల్ని నడిపించారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా, నవ్వించడమే టార్గెట్ అన్నట్టుగా స్వేచ్ఛగా ఇందులో సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. చెప్పుకోదగ్గ కథ లేకపోయినా, కొన్ని సన్నివేశాలు ఊహకు తగ్గట్టుగా సాగుతున్నా ప్రేక్షకుల్ని మాత్రం కడుపుబ్బా నవ్వించడంలో తరుణ్ భాస్కర్ మరోమారు విజయం సాధించాడు.
టెక్నికల్గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. తరుణ్ భాస్కర్ తెలివైన రచన ఇందులో చాలా చోట్ల కనిపిస్తుంది. కొన్ని మాటల్ని హెడ్ఫోన్లో వినిపించే పాటలతో తనే సెన్సార్ చేస్తూ నవ్వించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటులు హాస్య సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
ఊహకందే కథనంరొటిన్ స్టోరీ
రేటింగ్ : 3.5/5
నవంబర్ 03 , 2023
Gangs Of Godavari Review: విష్వక్ సేన్- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు
దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీతం: యువన్ శంకర్
సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ : 31-05-2024
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో విష్వక్ సేన్.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్ క్యారెక్టర్లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో మాస్ జాతరే అన్నట్లు విష్వక్ నటన ఉంటుంది. ఇక హీరోయిన్ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచ్లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్గా తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ స్లోగా నడవడం, రొటీన్ సన్నివేశాలు, రెగ్యులర్ స్టోరీ మూవీకి కాస్త మైనస్గా చెప్పవచ్చు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్ను ఎలివేట్ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
విష్వక్ సేన్ నటన
డైలాగ్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
రెగ్యులర్ స్టోరీ
స్లో నారేషన్
Telugu.yousay.tv Rating : 3/5
Public Talk On Gangs of Godavari
సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయని, స్క్రీన్ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/raghav917252/status/1796382241532334575
చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్స్ చూస్తున్నట్లు మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్ అంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/PulakithSai/status/1796399917969412273
ఫస్టాఫ్ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్ కొట్టదని స్పష్టం చేశాడు.
https://twitter.com/PinkCancerian/status/1796336006402355622
పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్ వెర్షన్లా గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఉందని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు బాలేదని పేర్కొన్నాడు. రన్టైమ్ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు.
https://twitter.com/Kamal_Tweetz/status/1796330322730373525
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-neha-shetty.html
మే 31 , 2024
Varun Tej Reception: వైభవంగా వరుణ్-లావణ్య రిసెప్షన్.. సందడి చేసిన సినీ ప్రముఖులు..!
టాలీవుడ్ స్టార్స్ వరుణ్తేజ్ (Varun Tej Konidela), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మ్యారెజ్ రిసెప్షన్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. #VarunTejReception హ్యాష్ట్యాగ్తో రిసెప్షన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుకేద్దాం.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ రిసెప్షన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ కలర్ కోటులో మనవరాలితో కలిసి వేడుకకు హాజరయ్యారు. నవ దంపుతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ కూడా రిసెప్షన్లో సందడి చేశారు. వరణ్-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపి వారితో ఫొటోలు దిగారు.
యంగ్ హీరో నాగ చైతన్య కూడా రిసెప్షన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బియర్డ్ లుక్లో పెళ్లి కొడుకు, కూతురితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు
యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్లతో పాటు నాగబాబు దంపతులు, నిహారిక ఈవెంట్లో హల్చల్ చేశారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దంపతులు సైతం రిసెప్షన్కు హజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దంపతులు కూడా రిసెప్షన్ ఈవెంట్లో సందడి చేశారు.
యువ హీరో అల్లు శిరీష్ ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైట్ అండ్ బ్లాక్ కోటులో వరుణ్, లావణ్య జంటతో ఫొటో దిగారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దంపతులు, మరో డైరెక్టర్ సంపత్ నంది కూడా రిసెప్షన్కు హాజరయ్యారు.
బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో తళుక్కుమంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ దంపతులు వారి పెద్ద కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్, చిన్న కుమారుడు రిసెషన్షన్కు వెళ్లారు.
యంగ్ హీరో కార్తికేయ, నటుడు నవదీప్ కూడా యువ జంటతో కలిసి ఫొటోలు దిగారు.
టాలీవుడ్ యువ హీరోలు సాయి సజ్జ, అడవి శేషు, సందీప్ కిషన్ నవ దంపతులతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
సీనియర్ నటుడు జగపతి బాబు సైతం వేడుకకు హాజరై కొత్త జంటకు ఆశీర్వచనాలు అందజేశారు.
నవంబర్ 06 , 2023
Akkineni Nagarjuna: హీరో నాగార్జునపై క్రిమినల్ కేసు.. ప్రతికారం తీర్చుకుంటున్నారా?
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. టాలీవుడ్ మన్మథుడిగా కూడా ఆయన్ను పిలుస్తుంటారు. అటువంటి కింగ్ నాగార్జునకు గత కొన్ని రోజులుగా అసలు కలిసి రావడం లేదు. ఏదోక రూపంలో అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థంపై విమర్శలు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు నాగార్జునను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాగార్జునపై కేసు నమోదు
సినీ హీరో నాగార్జునపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పోలీసులకు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్కు పంపారు. అనంతరం తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే.
రూ.100 కోట్ల స్థలం కబ్జా!
నాగార్జునపై చేసిన ఫిర్యాదులో మరిన్ని అంశాలను కసిరెడ్డి భాస్కర్రెడ్డి లేవనెత్తారు. శిల్పారామం ఎదురుగా గల అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని ఫిర్యాదు పేర్కొన్నారు. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేసి రూ.కోట్లు గడించిన అక్కినేని నాగార్జునపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.
https://twitter.com/jsuryareddy/status/1842478697938403807
కక్ష్య సాధింపు చర్యలేనా!
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అటు నాగార్జున ఓ అడుగు ముందుకువేసి రూ.100 కోట్ల మేర పరువునష్టం దావా మంత్రిపై వేశారు. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జునపై క్రిమినల్ కేసు పెట్టడం ద్వారా అతడ్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కేసులో నాగార్జున ఎలా వ్యూహాత్మంగా ముందుకు వెళ్తారో చూడాలి.
తీవ్రంగా ఖండించిన టాలీవుడ్
అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఖండించింది. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్ బాబు ఎక్స్లో పోస్టు పెట్టాడు. అటు తారక్ సైతం వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోందంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ స్పందిస్తూ మంత్రి ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సీనియర్ నటుడు వెంకటేష్ ఎక్స్లో రాసుకొచ్చారు.
అక్టోబర్ 05 , 2024
Avneet Kaur: కసి అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్న అవ్నీత్ కౌర్
బాలీవుడ్ హాట్ బాంబ్ అవనీత్ కౌర్ తన లేలేత పరువాలతో సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్తెక్కించే అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది.
ప్రస్తుతం జర్మనీలో పర్యటనలో ఉన్న ఈ అమ్మడు అక్కడి సముద్రపు పడవలో అందాల ప్రదర్శన చేసింది.
ఎద పొంగులు, నడుము అందాలను చూపిస్తూ నెటిజన్లకు అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అవనీత్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పంబాబ్లోని జలంధర్లో జన్మించింది. 8 ఏళ్లకే 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.
ఓ వైపు డ్యాన్స్ షోలలో పాల్గొంటూనే పంజాబీ, హిందీ టీవీ సీరియల్స్లో అవనీత్ నటించింది. 'మేరీ మా' 'సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ', 'హమారీ సిస్టర్ దీదీ' వంటి సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ముఖ్యంగా 'అల్లాఉద్దీన్' సీరియల్లో హీరోయిన్ యాస్మిన్ పాత్రతో అవనీత్ పాపులర్ అయ్యింది. దీంతో బాలీవుడ్ అవకాశాలు ఆమెను వరించాయి.
2014లో వచ్చిన 'మర్దానీ' (Mardaani) చిత్రంతో తొలిసారి అవనీత్ బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఇందులో మంచి నటన కనబరిచి అందర్నీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత వరుసగా దోస్త్, బ్రూనీ, ఏక్తా, మర్దానీ 2 చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. అయితే అవేమి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
దీంతో ఓటీటీలోనూ అవనీత్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 'బాబర్ కా తాబర్', 'బందిశ్ బండిట్స్' వంటి వెబ్సిరీస్లలోనూ కనిపించింది.
గతేడాది టీకూ వేడ్స్ శేరూ, ఈ ఏడాది 'లవ్ కి అరేంజ్ మ్యారేజ్' చిత్రాల్లో అవనీత్ నటించింది. ఈ రెండు కూడా అవనీత్కు కోరుకున్న పాపులారిటీని అందించలేకపోయాయి.
ప్రస్తుతం 'లవ్ ఇన్ వియాత్నం' అనే ఫిల్మ్లో అవనీత్ నటిస్తోంది. ఈ సినిమా ద్వారానైనా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఈ భామ ఆశిస్తోంది.
సినిమాల్లో జయపజయాలు ఎలా ఉన్న అవనీత్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్ను అలరిస్తుండటమే ఇందుకు కారణం.
అవనీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్టు వచ్చిందంటే అది నెట్టింట ట్రెండింగ్ కావాల్సిందే. తన జిగేలు మనే అందాలతో ఈ అమ్మడు కవ్విస్తుంటుంది.
దీంతో నెట్టింట అవనీత్ కౌర్ ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 32.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
జూలై 27 , 2024
Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సైతం తెరకెక్కింది. రామాయణం గొప్పతనాన్ని ఈ తరం వారికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. అయితే రామాయణంలోని పాత్రలు లేకుండా కథను మాత్రమే ప్రతిబింబిస్తూ కమర్షియల్ హంగులతో రూపొందిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిని పరిశీలనగా చూస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. అటువంటి చిత్రాలను YouSay మీ ముందుకు తెచ్చింది. ఆయా చిత్రాల్లోని రామాయణం తాలుకూ మూలాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
దసరా (Dasara)
హీరో నాని రీసెంట్ చిత్రం ‘దసరా’లోనూ రామాయణం కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ పాత్రలు రావణుడి ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్పై కన్నేసిన విలన్.. ఆమెను సొంతం చేసుకోవడానికి కుట్రలు చేస్తుంటాడు. చివరికి హీరో అతడ్ని చంపి తన భార్యకు, ఊరికి ప్రశాంతత కల్పిస్తాడు.
ఆర్ఆర్ఆర్ (RRR)
ఆర్ఆర్ఆర్లోనూ తారక్ (Jr NTR) పాత్రను గమనిస్తే ఆంజనేయుడు గుర్తుకు రాక మానడు. తన గూడెం నుంచి బ్రిటిష్ వారు ఎత్తుకెళ్లిన పాప ఆచూకి కోసం తారక్ హస్తినకు వెళ్తాడు. రావణకోట లాంటి బ్రిటిష్ బంగ్లాలోకి వెళ్లి బందింపబడిన బాలికలో ధైర్యం నింపుతాడు. చివరికి పాపను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. రాముడి వద్దకు సీతను ఆంజనేయుడు ఎలా చేర్చాడో అచ్చం అలాగే.
వర్షం (Varsham)
ప్రభాస్ - త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గాఢంగా ప్రేమించుకోగా వీరి మధ్యలోకి విలన్ (గోపీచంద్) ఎంట్రీ ఇస్తాడు. త్రిషను ఇష్టపడి ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అతడ్ని అంతం చేసి చివరికి ప్రభాస్ (Prabhas) తన ప్రేమను గెలిపించుకుంటాడు. ఈ కథను పరిశీలిస్తే రామాయణంలో సీతపై మనసు పడ్డ రావణుడు.. అతడ్ని సంహరించిన రాముడు గుర్తుకు వస్తారు.
వరుడు (Varudu)
2010లో వచ్చిన ఈ చిత్రానికి గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ (Allu Arjun), భానుశ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆర్య (Actor Arya) చేశాడు. కథలోకి వెళ్తే హీరో హీరోయిన్లకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి పీటలపై నుంచి కథానాయకిని విలన్ ఎత్తుకెళ్తాడు. విలన్ను కనిపెట్టి అంతం చేయడం ద్వారా హీరో తన భార్యను పొందుతాడు. ఈ మూవీ స్టోరీ కూడా రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒక్కడు (Okkadu)
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu), భూమిక (Bhumika) జంటగా నటించిన బ్లాక్బాస్టర్ చిత్రం ‘ఒక్కడు’. ఇందులో హీరోయిన్పై మనసు పడ్డ విలన్ (ప్రకాష్రాజ్) ఆమె కుటుంబాన్ని చంపి మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. భూమిక అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హీరో కంట పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. విలన్ను అంతం చేసి హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
రావణన్ (Raavanan)
విక్రమ్, ఐశ్వర్యరాయ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'రావణన్' చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. ఇందులో రాముడు లాంటి ఎస్పీ దేవ్ (పృథ్వీ) భార్య ఐశ్వర్యరాయ్ను నల్లమల్ల అడవులకు విక్రమ్ తీసుకొస్తాడు. సీతలాంటి ఆమెను వెత్తుక్కుంటూ పోలీసు ఆఫీసర్ పృథ్వీ, ఆంజనేయుడి పాత్ర లాంటి అడవులు తెలిసిన కానిస్టేబుల్ కార్తిక్ వెళ్తారు. రామాయణాన్ని ఆధునీకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ ఈ చిత్రం వచ్చింది.
సైనికుడు (Sainikudu)
మహేష్ - త్రిష జంటగా చేసిన ‘సైనికుడు’ సినిమా కథ రామాయణానికి కాస్త ఆపోజిట్గా ఉంటుంది. విలన్ మంచోడని భావించిన హీరోయిన్ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఓ కారణం చేత హీరోయిన్ను హీరో ఎత్తుకెళ్తాడు. విలన్ నిజస్వరూపం తెలుసుకున్నాక త్రిష.. మహేష్బాబుని ప్రేమిస్తుంది. త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విలన్ ప్రయత్నించడంతో హీరో అతడ్ని చంపి ఆమెను సొంతం చేసుకుంటాడు.
రోబో (Robo)
రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన చిత్రం ‘రోబో’. కథలోకి వెళితే సైంటిస్ట్ వశీకర్ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. దానిలో మనుషులకు లాగే ఫీలింగ్స్ ఉండేలా చేస్తాడు. దీంతో ఆ రోబో హీరోయిన్పై మనసు పడుతుంది. ఆమెను ఎత్తుకెళ్లి పోతుంది. రక్షణగా తనలాగా ఉండే వందలాది రోబోలను సైన్యంగా చేసుకుంటుంది. చివరికీ హీరో ఆ రోబోను నిర్విర్యం చేసి ప్రేయసిని దక్కించుకుంటాడు.
ఆదిపురుష్ (Adipurush)
గతేడాది ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు.
సీతారాముల కల్యాణం లంకలో
నితిన్ - హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం (Seeta Ramula Kalyanam Lankalo) టైటిల్కు తగ్గట్లే రామయాణ కథను గుర్తు చేస్తుంది. కాలేజీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ కుటుంబానికి విలన్కు మధ్య కుటుంబ కక్ష్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విలన్ కథానాయికను రావణాసురుడిలా మాయ చేసి ఎత్తుకెళ్తాడు. అది గ్రహించిన హీరో లంక లాంటి అతడి ఇంటికి మారు వేషంలో వెళ్లి వారితో కలిసిపోతాడు. విలన్లను మాయ చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.
ఫిబ్రవరి 19 , 2024
Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావలింగ్ చిత్రాల హవా సాగుతోంది. ఈ జోనర్లో తెరకెక్కించిన సినిమాలో మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో దర్శకులు ఈ కెటగిరీపై సినిమాలు తీస్తున్నారు. ఆదిత్య 369 నుంచి రాబోయే కల్కీ 2898 AD వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
7:11PM
టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో ఈ సినిమా వచ్చింది. అనుకోకుండా ఓ ఊరిలోకి వచ్చిన గ్రహాంతర వాసుల బస్సును హీరో సాహస్ పగడాల ఎక్కడంతో అతను 1999 నుంచి 2024కు ట్రావెల్ చేస్తాడు. ఈ చిత్రాన్ని చైతు మదాల తెరకెక్కించాడు. తెలుగులో మంచి విజయం సాధించింది.
ఒకే ఒక జీవితం
తెలుగులో టైం ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. చనిపోయిన తన తల్లిని బతికించుకునేందుకు టైం ట్రావెలింగ్కు వెళ్లిన శర్వానంద్ ఏం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమాలో(Science fiction movies in telugu) గుడ్ స్క్రీన్ ప్లే, మంచి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
Disco Raja
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించి మెప్పించాడు. విలన్ల చేతిలో దెబ్బలు తిన్న రవితేజ మంచులో కూరుకుపోయి... చాలా ఏళ్లు గడిచిన వయసు పెరగకుండా యవ్వనంగా ఉంటాడు. ఈ సినిమా స్టోరీలో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది.
Mark Antony
టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. (Science fiction movies in telugu) గతంలోని వ్యక్తులతో మాట్లాడే ఓ టెలీఫోన్ను కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే స్టోరీతో ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మార్క్- ఆంటోనిగా విశాల్ డ్యూయల్ రోల్లో కనిపించి అదరగొట్టాడు.
Krrish 3
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భయంకరమైన వైరస్ను భారత్ మీద ప్రయోగించినప్పుడు క్రిష్ దానిని ఎలా అంతమొందించాడు అనే స్టోరీతో అద్భుతంగా సినిమాను రాకేష్ రోషన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించింది.
Robo 2.o
సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్తో ఈ సినిమా వచ్చింది. సెల్ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతుంటాయి. దీనిపై కోపంతో పక్షిరాజు అక్షయ్ కుమార్.. ఈ లోకంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఎలక్ట్రానిక్ డివైస్లు పనిచేయకుండా చేస్తాడు. దీంతో పక్షిరాజు నుంచి వచ్చిన విపత్తును కాపాడేందుకు రజనీకాంత్ Robo 2.O లెటెస్ట్ వెర్షన్గా వచ్చి కాపాడుతాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. కాకపోతే ఈ సినిమా రోబో సినిమా అంత విజయం సాధించలేదు.
Robo
రజనీకాంత్ అందాల తార ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒక రోబోకు ఫీలింగ్స్ అందిస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్గాను నిలిచింది.
24
టైం ట్రావెల్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో సూర్య నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 24 అనే వాచ్లో టైమ్ను మారిస్తే గతంలోకి- భవిష్యత్లోకి ప్రయాణం చేయవచ్చు.
Skylab
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం విఫలమై దాని శిథిలాలు తెలంగాణలోని ఈ చిన్న గ్రామంపై పడేందుకు సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి నటించారు.
Srivalli
బ్రేయిన్ మ్యాపింగ్ అనే సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా 'శ్రీవల్లి' సినిమా రూపొందింది.
Taxiwaala
ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీతో ఈ సినిమా రూపొందింది. మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది. అయితే మనం బతికి ఉండగానే శరీరం నుంచి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్'. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జువాల్కర్ నటించింది.
Tik Tik Tik
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అంతరిక్షంలో తిరిగే ఓ భారీ ఉల్క వల్ల భారత్కు ప్రమాదం ఉందని తెలిసి దానిని దారి మళ్లించడానికి కొందరు వ్యోమగాములను పంపిస్తారు. ఈ టీమ్ను జయం రవి లీడ్ చేస్తాడు. ఆ ఉల్కను ఎలా దారి మళ్లించేందుకు వ్యోమగాములు ఏం చేశారన్నది కథాంశం. ఈ చిత్రంలో జయం రవితో పాటు, నివేత పేతురాజ్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్ తదితరులు నటించారు.
Chandamama Lo Amrutham
చందమామపై హోటల్ నెలకొల్పాలన్న వెరైటీ కథాంశంతో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శివన్నారాయణ, ఇంటూరి వాసు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు.
Yuganiki Okkadu
తమిళనాడును పాలించిన ప్రాచీన చోళులు- పాండ్యులతో వైరం వల్ల రాజ్యాన్ని వదిలి ఎవరు గుర్తించని ప్రాంతానికి వెళ్తారు. వారు వెళ్లే మార్గం ఎవరికీ తెలియకుండా అనేక అవాంతరాలు పెడుతారు. చివరకు వారిని ఎలా కనిపెట్టారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కార్తి అద్భుతంగా నటించాడు. అతని సరసన రీమా సేన్, ఆండ్రియా జెర్మియా నటించారు. ఈ సినిమాను సెల్వా రాఘవన్ తెరకెక్కించాడు.
ఆదిత్య 369
తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన బాలకృష్ణ... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి ప్రయాణిస్తాడు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆల్టైమ్ క్లాసిక్గా నిలిచింది.
Kalki 2898 AD
సైన్స్ ఫిక్షన్ ఆధారంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. కలియుగాంతంలో జరిగే విపత్తుల నుంచి ప్రజలను రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషిన్ ద్వారా 2898 జన్మించబోయే కల్కిని 2024లోకి తీసుకుని రానున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
నవంబర్ 07 , 2023
Tollywood: రాకేష్ మాస్టర్పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
టాలీవుడ్లో ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ఆదివారం తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం హన్-మ్యాన్ అనే సినిమా షూటింగ్లో ఆయనకు రక్త విరేచనాలు అయ్యాయి. అక్కడే రాకేష్ మాస్టర్ను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు.
అయితే ఆయన మృతిపై ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు సంతాప సందేశం విడుదల చేయలేదు. రామ్గోపాల్ వర్మ నుంచి చిరంజీవి వరకు ఏ ఒక్కరు స్పందించలేదు. రాకేష్ మాస్టర్ చిన్న వ్యక్తి ఏమి కాదు.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫి చేశారు. ప్రభాస్, రామ్పొత్తినేని, రవితేజ, వేణు వంటి హీరోలు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు కేరీర్ ఆరంభంలో ఆయన నుంచి డ్యాన్స్ మెళకువలు నేర్చుకున్నవారే. రామ్పొత్తినేని నటించిన దేవదాసు మూవీకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కనీసం ఆయన పనిచేసిన సినిమాలకు చెందిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ స్పందిస్తే బాగుండేది.
వివాదాలే ఒంటరిని చేశాయి..
యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్, శ్రీరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మిలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలాగే తన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లపై పలు ఇంటర్వ్యూల్లో అసభ్య పదజాలంతో దూషించారు. వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే.. చివరికి తనను పట్టించుకోలేదని చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు. ముక్కుసూటి తనం, నిజాలను నిర్భయంగా చెప్పడం వంటి లక్షణాలు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి. దీంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
పొట్ట కూటి కోసం..
అవకాశాలు తగ్గడంతో పొట్ట కూటి కోసం రాకేష్ మాస్టర్ డ్యాన్స్ స్కూల్ రన్ చేశారు. దీంతో పాటు SRK ENTERTAINMENT అనే యూట్యూబ్ ఛానెల్ను ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. డ్యాన్స్ ఈవెంట్లతో పాటు జబర్దస్త్ లాంటి కామెడీ షోల్లో నటించారు. ఒకనొకప్పుడు ఖరీదైన కార్లలో కనిపించిన రాకేష్ మాస్టర్.. చనిపోయే నాటికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి పడిపోయారు.
వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం సేవా దృక్పథం కలవారు. కోవిడ్ సమయంలో తన దగ్గర ఉన్న డబ్బునంత ఖర్చు చేశారు. రోజుకు 200 మందికి అన్నదానం చేశారు. వారికి కావాల్సిన సామాగ్రిని కొనిచ్చారు. ఇంత చేసినా ఏరోజు ఆయన బయటకు చెప్పుకోలేదు.
వీళ్లే నయం..!
తాను చనిపోతానని ముందే తెలిసిన రాకేష్ మాస్టర్... చివరి రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా స్టార్లతో ఓ పొగ్రాంను ఏర్పాటు చేశారు. ఆవేశం స్టార్, స్వాతినాయుడు, అగ్గిపెట్ట మచ్చతో కలిసి 'మ్యాన్షన్ హౌత్ విత్ మై హౌస్' అనే షోలో చాలా సంతోషంగా గడిపారు. తమను చేరదీసి ఆశ్రయం కల్పించిన రాకేష్ మాస్టర్ మృతి చెందటంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మాత్రం రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు నోచుకున్నారు. రాకేష్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరున విలపించారు.
ఏ సంబంధం లేనివారే ఇంత బాధపడితే... ఆయన నుంచి సినిమాలు చేయించుకున్న ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కనీసం ఒక్క సంతాప సందేశం కూడ విడుదల చేయకపోవడం నిజంగా విచారకరం. చనిపోయిన వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా... ఆ వ్యక్తి చనిపోయాడు కదా..! మీ మీ బిజీ షెడ్యూల్స్ వల్ల రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు వెళ్లకపోయినా కనీసం మానవత్వం చాటుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలకు లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
జూన్ 20 , 2023
Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
తమిళ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్లో అదరగొట్టింది.
సొగసైన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది
వరుస ఆఫర్స్తో ఫుల్ జోష్లో ఉన్న ఈ భామ వలపుల వయ్యారాలతో కుర్రకారును చిత్తుచేస్తుంది.
తమిళ చిత్రాల్లోనే నటిస్తున్న ఈ నెరజాన… తెలుగులోనూ ఓ చిత్రంలోనూ నటించింది
యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం మూవీలో హీరోయిన్గా మెప్పించింది
1989 డిసెంబర్ 31న జన్మించిన ఈ సొగసుల లేడీ.. తొలుత టీవీల్లో యాంకర్గా ప్రస్థానం ప్రారంభించింది.
తమిళ్లో మేయదాన్ మాన్ ( మేయని జింక) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది
తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది ప్రియా భవాని శంకర్
జయంరవికి జంటగా నటించిన అఖిలన్, శింబుతో జతకట్టిన పత్తుతల, తాజాగా రాఘవలారెన్స్ సరసన నటించిన రుద్రన్ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి.
తాజాగా ఎస్ జే సూర్య సరసన బొమ్మయ్ సినిమాలో హీరోయిన్గా నటించింది
ప్రస్తుతం తమిళ్లో వరుసగా ఐదు చిత్రాల్లో నటిస్తోంది
హరి డైరెక్షన్లో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
జూన్ 19 , 2023
AI Gender Swapped: జంబలకిడి పంబ అంటే ఇదే.. మన సెలబ్రిటీలను ఇలా చూసి ఉండరు..!
జంబలకిడి పంబ సినిమా గుర్తుందా. ఇందులోని మగవారు, ఆడవారిగాను, ఆడవారు మగవారిగానూ మారుతుంటారు. కట్టుబొట్టుతో అచ్చం తమ అపొజిట్ జెండర్గా కనిపిస్తారు. అయితే కృత్రిమ మేధ(AI) కూడా సరిగ్గా ఇదే చేసింది. టాప్ సెలబ్రిటీల చిత్రాలను తీసుకొని వారి జెండర్ను మార్చేసింది. మరి మన సెలబ్రిటీలు తమ ఆపోజిట్ జెండర్లో ఎలా ఉంటారు?. మగవారు ఆడవారిలాగా, ఆడవారు మగవారిగా మారితే వారి లుక్ ఎలా ఉంటుంది?. తెలియాలంటే ఈ కథనం చూసేయండి.
1. నరేంద్ర మోదీ
ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరు. ప్రధాని మోదీ తనదైన వేషధారణతో ఎంతో హుందాగా కనిపిస్తారు. అటువంటి మోదీ ఒక మహిళ అయితే ఎలా ఉంటాడో AI చూపించింది.
2. విరాట్ కోహ్లీ
అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే కోహ్లీ బయట చాలా స్టైలిష్గా కనిపిస్తాడు. అటువంటి విరాట్ కోహ్లీ.. యువతిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్ వేయండి.
https://twitter.com/mvdhav/status/1612298825368240128?s=20
3. ఎలాన్ మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. ట్విటర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మస్క్ అమ్మాయి అయితే ఎలా ఉంటారో AI చేసి చూపించింది.
4. అజయ్ దేవ్గన్
బాలీవుడ్ సినిమాల్లో పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్గా నటుడు అజయ్ దేవ్గన్ అలరించాడు. యాక్షన్, ఫైట్ సీన్లలో తనదైన నటనతో ఆకట్టున్నాడు. అలాంటి దేవ్గన్ మహిళ అయితే ఎలా ఉంటాడో AI మీ ముందు ఉంచింది.
https://twitter.com/mvdhav/status/1612299501737496576?s=20
5. అలియాభట్
బాలీవుడ్ నటి అలియా భట్ పలు సూపర్హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తన అందం, అభినయం, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అటువంటి అలియా మగాడిగా మారితే ఇంకెంత హ్యాండ్సమ్గా ఉంటాడో కదా.
6. మార్క్ జూకర్బర్గ్
ఫేస్బుక్ సృష్టికర్త మార్క్ జూకర్బర్గ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన కూడా తన ఆపోజిట్ జెండర్లో ఎలా ఉంటారో AI చూపించింది.
https://twitter.com/mvdhav/status/1612300171655917568?s=20
7. దీపికా పదుకొనే
బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో దీపికా పదుకొనే ఒకరు. గ్లామర్ క్వీన్గా గుర్తింపు పొందిన ఈ భామ ఒక పురుషుడైతే ఎలా ఉంటాడో మీరే చూడండి.
8. అక్షయ్ కుమార్
బాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరోగా అక్షయ్ కుమార్ గుర్తింపు పొందారు. మహిళల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అటువంటి అక్షయ్ను AI వద్దల్లేదు. ఈ హీరో అమ్మాయిగా పుడితే ఎలా ఉంటాడో కళ్లకు కట్టింది.
https://twitter.com/mvdhav/status/1612300512698986498?s=20
9. ప్రభాస్
బాహుబలి సినిమాతో ప్రభాస్ కెరీర్ మారిపోయింది. ఆ సినిమా ప్రభాస్కు పాన్ ఇండియా క్రేజ్ను తెచ్చిపెట్టింది. మరి ప్రభాస్ అమ్మాయిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్కేయండి.
10. లియోనార్డో డికాప్రియో
టైటానిక్ సినిమా ద్వారా లియోనార్డో డికాప్రియా పేరు మారుమోగింది. ఆ తర్వాత కూడా పలు హిట్ చిత్రాలతో లియోనార్డో మంచి గుర్తింపు సంపాదించాడు. హాలీవుడ్ హీరోయిన్ల అందానికి ఏమాత్రం తీసిపోని విధంగా అమ్మాయి లుక్లో లియోనార్డో ఉన్నాడు.
https://twitter.com/mvdhav/status/1612301198668992513?s=20
11. లియోనెల్ మెస్సీ
అర్జెంటినా ఫుట్బాల్ ప్లేయర్ లియోనాల్ మెస్సీ.. తనదైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. అతడు కూడా అమ్మాయి లుక్లో ఎలా ఉంటాడో AI మార్ఫింగ్ చేసి చూపించింది.
12. క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కూడా తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. మహిళగా రొనాల్డో లుక్ ఎలా ఉందో చూసేయండి.
https://twitter.com/mvdhav/status/1612301499228655616?s=20
13. రాక్
హాలీవుడ్ సినిమాలను విపరీతంగా ఇష్టపడేవాళ్లలో రాక్ తెలియని వారు ఉండరు. కండలు తిరిగిన దేహంతో ఎన్నో సూపర్ హిట్ యాక్షన్ సినిమాల్లో ఆయన నటించాడు. అటువంటి రాక్ మహిళగా మారితే ఎలా ఉంటాడు? ఊహించడానికే కష్టంగా ఉంది కదా.
14. నోరా ఫతేహి
బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్బేస్ను సంపాదించుకుంది. తన గ్లామర్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. మరి నోరా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో చూడండి.
https://twitter.com/mvdhav/status/1612301736508784641?s=20
15. షారుక్ ఖాన్
బాలీవుడ్ బాద్షాగా పేరు సంపాదించిన షారుక్ ఖాన్.. అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి షారుక్ మహిళగా మారితే ఎలా ఉంటాడో చూడాలని ఉందా. అయితే చూసేయండి.
16. బాబా రాందేవ్
యోగా గురు బాబా రాందేవ్ అంటే దేశంలో తెలియని వారు ఉండరు. ఎంతో కఠినమైన ఆసనాలను సైతం చాలా తేలికగా ఆయన వేస్తుంటారు. అయితే బాబా రాందేవ్ ఫొటోను మహిళ చిత్రంగా మార్చడంలో AI విఫలమైంది. కేవలం ఆయన్ను యంగ్గా మాత్రమే మన ముందు ఉంచింది.
https://twitter.com/mvdhav/status/1612302529223880705?s=20
17. ముకేష్ అంబానీ
దేశంలోని అపర కుభేరుల్లో ముకేష్ అంబానీ ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీ కింద అనేక వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. అటువంటి అంబానీ మహిళగా మారితే ఎలా ఉంటారో చూడండి.
18. మోనాలిసా
ప్రపంచంలోని అత్యంత అందమైన చిత్ర పటాల్లో మోనాలిసాది తొలి స్థానంలో ఉంటుంది. అలాంటి మోనాలిసా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో AI చేసి చూపించింది.
https://twitter.com/mvdhav/status/1612302687500120064?s=20
మే 05 , 2023
Guntur Kaaram: ‘గుంటూరు కారం’పై నెట్టింట ఆసక్తికర చర్చ.. కల్ట్ క్లాసిక్ను ఫ్లాప్ చేశారంటూ ఫైర్!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై ఆశించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించినప్పటికీ అప్పట్లో ఈ మూవీపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ‘గుంటూరు కారం’పై తాజాగా మాట్లాడారు. ఈ చిత్రాన్ని మాస్ సినిమాగా ప్రమోట్ చేసి తప్పు చేశామని క్లాస్ మూవీగా ప్రమోట్ చేసి ఉంటే మంచి రిజల్ట్ వచ్చేదని అభిప్రాయ పడ్డారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో ‘గుంటూరు కారం’ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. ‘అతడు’, ‘ఖలేజా’ తరహాలోనే ఈ మూవీకి అన్యాయం జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నాగవంశీ ఏమన్నారంటే?
త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఆయనకు ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ మూవీ కమర్షియల్గా లాభాలు తెచ్చిపెట్టిందా అంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనిపై నాగవంశీ మాట్లాడుతూ 'గుంటూరు కారం కమర్షియల్గా సూపర్ హిట్. ఒక్క నైజాంలో డ్యామేజ్ జరిగింది తప్పితే అందరూ సేఫే కదా. అది సంక్రాంతి మూలానా జనం సొంతూర్లకు వెళ్తారు కాబట్టి ఎక్కువ వసూళ్లు రాలేదు. మేము అనుకున్నట్లు సినిమాను మీరు అనుకోలేదు. అందులో మా తప్పు కూడా ఉండొచ్చు. గుంటూరు కారం టైటిల్ పెట్టడం తప్పు అయ్యుండొచ్చు. ఫ్యామిలీ సినిమాకు మాస్ టైటిల్ పెట్టడం రాంగ్ ఏమో. ఇంకోటి ఫ్యామిలీ సినిమాకు ఒంటి గంట షో వేయడం ఇంకో తప్పేమో' అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
https://twitter.com/MB_Manish_/status/1845636287744626994
కల్ట్ క్లాసిక్ను ఫ్లాప్ చేశారని ఫైర్!
గుంటూరు కారం చిత్రాన్ని రీసెంట్గా ఓటీటీ, టీవీలో చూసినవారంతా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ను థియేటర్లో తప్ప మళ్లీ చూడలేదని, కానీ గుంటూరు కారంను థియేటర్తో పాటు ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్లోనూ రెండుసార్లు చూశానని చెప్పుకొచ్చారు. ఇది తెలుగు ఇండస్ట్రీ ఫెయిల్యూర్ అని పోస్టు పెట్టాడు. మహేష్ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఇలా గుంటూరు కారం మూవీని ఆకాశానికెత్తుతూ #GunturKaaram హ్యాష్ట్యాగ్ను ఒక్కసారిగా ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ మూవీలోని హైలెట్ సీన్స్ను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
https://twitter.com/NikhilKalyan88/status/1845478831462789400
https://twitter.com/dheeraj_0718/status/1845744116237234401
https://twitter.com/RKMSD147/status/1845562518246396065
https://twitter.com/ursrulymahesh02/status/1845547017428447593
https://twitter.com/Areykrishna_/status/1845539794740216028
https://twitter.com/i/status/1845524403872051336
https://twitter.com/i/status/1845515851140825401
‘కుర్చి మడతపెట్టి’ మరో రికార్డు!
గుంటూరు కారం చిత్రంలోని ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్ మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా మహేష్, శ్రీలీల స్టెప్పులు ఫ్యాన్స్ను ఎంతగానో అలరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఈ సాంగ్ మారుమోగేది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్లో మరో రికార్డు సొంతం చేసుకుంది. 450 మిలియన్ల వ్యూస్ మార్క్ను అందుకొని సత్తా చాటింది. దీంతో #KurchiMadathapetti హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ సంబంధించిన వీడియోలను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.
https://twitter.com/AtTheatres/status/1845773602467053815
https://twitter.com/i/status/1845743865938247921
https://twitter.com/i/status/1845712856580333801
మహేష్-త్రివిక్రమ్ మూవీలే ఎందుకు?
మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటివరకూ మూడు చిత్రాలు రూపొందాయి. గతంలో వచ్చిన ‘అతడు’ (Athadu), ‘ఖలేజా’ (Khaleja) చిత్రాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. కమర్షియల్గానూ పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే బుల్లితెర ఆడియన్స్ను మాత్రం ఈ రెండు చిత్రాలు విశేషంగా ఆకర్షించాయి. అత్యధిక టీఆర్పీ సాధించి టెలివిజన్ ప్రీమియర్స్లో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ సినిమాను ఎలా ఫ్లాప్ చేశారన్న ఫీలింగ్ను అందరిలోనూ కలిగించాయి. ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయంలోనూ సరిగ్గా ఇదే జరుగుతోందని నెటిజన్లు అంటున్నారు. థియేటర్లలో పెద్దగా పట్టించుకోని ఆడియన్స్ ఓటీటీ, టెలివిజన్లో చూసి ప్రశంసలు కురిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్-త్రివిక్రమ్ చిత్రాలకే ఇలా ఎందుకు జరుగుతోందంటూ ఫిల్మ్ వర్గాలు సైతం నివ్వేరపోతున్నాయి.
అక్టోబర్ 14 , 2024
David Warner: తెలుగు సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. ఇదెక్కడి మాస్ ఎంట్రీరా సామి!
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు క్రికెట్తో పాటు యాక్టర్గానూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. అతడు తెలుగు సినిమాలకు సంబంధించిన పలు డైలాగ్స్, సాంగ్స్కు రీల్స్ చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu) వంటి హీరోలను అతడు ఇమిటేట్ చేసిన వీడియోలు అప్పట్లో సోషల్మీడియాలో ట్రెండింగ్గా మారాయి. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ సినిమాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తెలుగు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మెుదలుపెడుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
'పుష్ప 2'లో కీ రోల్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2'. అయితే ఇందులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. డేవిడ్ వార్నర్కి సంబంధించిన ఓ స్టిల్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో వార్నర్ చూట్టు ప్రొఫెషనల్ బౌన్సర్లు ఉన్నారు. వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్లో వార్నర్ గన్ పట్టుకొని స్టైలిష్గా కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్ ‘పుష్ప 2’ సినిమాలోనిదే అని నెటిజన్లు అంటున్నారు. కానీ, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ‘పుష్ప 2’ మేకర్స్ నుంచి కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ ప్రచారం నిజం కావాలని వార్నర్ అభిమానులు కోరుకుంటున్నారు.
https://twitter.com/AuTelugu_Films/status/1837406285702074497
సుకుమార్ ప్లాన్ ఇదేనా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' (Pushpa: The Rise)తో డేవిడ్ వార్నర్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట గతంలో ఇండియా మెుత్తం సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకు వార్నర్ రీల్స్ కూడా చేశాడు. అప్పట్లో అవి తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు మైదానంలో పలుమార్లు 'తగ్గేదేలే' అంటూ బన్నీ మేనరిజాన్ని వార్నర్ అనుసరించాడు. తద్వారా తెలుగు ఆడియన్స్కు బాగా దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో వార్నర్ క్రేజ్ను 'పుష్ప 2’లో వినియోగించుకోవాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ‘పుష్ప 2’లో డేవిడ్ మామను తప్పకుండా చూసే ఛాన్స్ ఉంది.
https://twitter.com/i/status/1484806143595532289
https://twitter.com/AAAdmirersKL/status/1516976589069701121
ఐపీఎల్తో చేరువ
టీమిండియా ఆటగాళ్లతో సమానంగా వార్నర్ను తెలుగు క్రికెట్ అభిమానులు గౌరవిస్తుంటారు. వార్నర్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అంతేకాదు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని సైతం అందించాడు. దీంతో వార్నర్కి తెలుగు అభిమానులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. అటు వార్నర్ సైతం ఇందుకు ప్రతిగా తెలుగు సాంగ్స్కు డ్యాన్స్ చేస్తూ, సినిమా డైలాగ్స్ చెబుతూ రీల్స్ చేసేవాడు. ఇలా తెలుగువారికి వార్నర్ దగ్గరయ్యాడు. వార్నర్ పలు సందర్భాల్లో హైదరాబాద్పై, తెలుగు అభిమానులపై ప్రేమ చూపించాడు. హైదరాబాద్ను మిస్ అవుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ వార్నర్ని తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.
రాజమౌళితో యాడ్ షూట్
ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) కోసం రాజమౌళి, డేవిడ్ వార్నర్ ఇద్దరూ కలిసి గతంలో ఓ ఫన్నీ యాడ్లో నటించారు. ఆ యాడ్ ఓపెనింగ్లో ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి` అని వార్నర్ను రాజమౌళి అడుగుతాడు. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్బ్యాక్ వస్తుంది’ అని వార్నర్ బదులిస్తాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ ‘నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?’ అని ప్రశ్నిస్తాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం తనకు ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనతో సినిమా చేయమని అడుగుతాడు. ఒక వేళ తన సినిమాలో డేవిడ్ వార్నర్ నిజంగానే హీరోగా నటిస్తే ఎలా ఉంటుందోనని రాజమౌళి ఊహించుకుంటాడు. బాహుబలి తరహా గెటప్లో వార్నర్ చేసే అల్లరి, డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్స్ ఇవన్నీ ఊహించుకొని ఒక్కసారిగా భయపడతాడు. అప్పట్లో ఈ యాడ్ విపరీతంగా వైరల్ అయ్యింది. మళ్లీ ఓసారి చూసేయండి.
https://twitter.com/i/status/1778705794340720824
సెప్టెంబర్ 21 , 2024
The Goat Director: తెలుగు ఆడియన్స్పై ‘ది గోట్’ డైరెక్టర్ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్). సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం 'ది గోట్'కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
‘అందుకే నచ్చలేదు’
తెలుగు, హిందీ భాషల్లో ‘ది గోట్’ (The Greatest Of All Time) సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రూ.22 కోట్లకు ఈ మూవీని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.10 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బ్రేక్ ఈవెన్ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన సీన్స్ హైలైట్ చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్లో ది గోట్ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. అంతేకాదు ఐపీఎల్లోని ముంబయి, బెంగళూరు జట్టు అభిమానులు తమ చిత్రాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానిని కావడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. వెంకట్ ప్రభు కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
https://twitter.com/TheAakashavaani/status/1833133203697131918
తెలుగు ఆడియన్స్ ఫైర్..!
డైరెక్టర్ వెంకట్ ప్రభు తాజా కామెంట్స్ను తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో 'ది గోట్' డిజాస్టర్ దిశగా వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలను తాము ఆదరిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ఒకసారి గుర్తుచేసుకోవాలని డైరెక్టర్కు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనికి విపరీతంగా అభిమానులు ఉన్నారని, హైదరాబాద్లో సీఎస్కే మ్యాచ్ జరిగితే ఎల్లో జెర్సీలతో స్టేడియం నిండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ‘ది గోట్’ ఫెయిల్యూర్కు గల కారణాలేంటో అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగులో ఫ్లాప్కు కారణాలు ఇవే!
దర్శకుడు వెంకట్ ప్రభు రొటిన్ స్టోరీతో ది గోట్ను తెరకెక్కించారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. అయితే టెర్రరిజం మూలాలతో తెరకెక్కినప్పటికీ ఏజెంట్ సినిమాల్లో కనిపించే ట్విస్టులు ఇందులో ఉండవు. మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపంచలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్లోనూ థ్రిల్ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారమే. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, యోగిబాబు కామెడీ ట్రాక్ తెలుగు ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్లో వచ్చే ఐపీఎల్ ట్రాక్ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి.
నో చెప్పిన ధోని!
‘ది గోట్’లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ (Sivakarthikeyan), హీరోయిన్ త్రిష (Trisha) అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కూడా క్లైమాక్స్లో చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజువల్స్ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్ విజువల్స్ ద్వారా స్క్రీన్పై చూపించారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ క్రికెట్ లవర్స్ను ఎంతగానో ఆకర్షించింది.
నెగిటివ్ రివ్యూలపైనా మండిపాటు
‘ది గోట్’ సినిమాపై వచ్చిన నెగిటివ్ రివ్యూలపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. ‘సినిమాని రూపొందించేందుకు మేం పడిన కష్టం గురించి మాట్లాడరు. కానీ, కొందరు సినిమాపై కావాలనే నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఈ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్లు ఏ చిత్రంలోనూ లేవు. ఏ హీరో అభిమాని అయినా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రిఫరెన్స్లు తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే చిత్రాన్ని రూపొందించలేదు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దా. సినిమా ఆడియన్స్ కోసమేగానీ రివ్యూవర్స్కు కాదు’ అని అన్నారు.
సెప్టెంబర్ 10 , 2024
Sharvari Wagh Hot: ఫిట్నెస్ మాటున శార్వరీ అందాల జాతర.. చూసి తట్టుకోగలరా!
బాలీవుడ్ అందాల తార శార్వరీ వాఘ్ (Sharvari Wagh) తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ వ్యాయామం చేస్తూ కష్టపడుతున్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది.
మెస్మరైజింగ్ ఫిట్నెస్తో పాటు కళ్లు చెదిరే అందాలతో శార్వరీ ఈ ఫొటోల్లో కనిపించింది. ఎద, నడుము, థైస్ అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.
శార్వరీ లేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాలను ఎంత పొగిడినా తక్కువేనని ప్రశంసిస్తున్నారు.
పదహారేళ్ల వయసులోనే మోడల్గా కెరీర్ను ప్రారంభించింది. 2013లో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ కాంటెస్ట్లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది.
ఆ తర్వాత యాక్టింగ్లో శిక్షణ తీసుకుంది. పలు బ్రాండ్లకు మోడల్గా వ్యవహిరించింది. అప్పడే తనకు దర్శకత్వంపై ఆసక్తి కలిగింది.
అలా 2015లో 'ప్యార్ కా పంచ్నామా 2', బాజీరావ్ మస్తానీ, 'సోను కే టిటు కి స్వీటీ' తదితర చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసింది.
'ద ఫర్గాటెన్ అర్మీ - ఆజాదీ కే లియే' వెబ్సిరీస్తో శార్వరీ నటిగా మారింది. ఆ తర్వాతే సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి.
తన తొలి చిత్రం 'బంటీ ఔర్ బబ్లీ 2'తోనే 2022లో ఐఫా, ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకుంది.
ఆ తర్వాత 'ముంజ్యా', మహారాజ్ వంటి చిత్రాల్లో శార్వరీకి ఫీమేల్ లీడ్గా అవకాశాలు దక్కాయి. ‘మహారాజ్’ ఈ ఏడాదే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
రీసెంట్గా జాన్ అబ్రహం చేసిన 'వేదా' చిత్రంలోనూ శార్వరీ నటించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులో శార్వరీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం 'ఆల్ఫా' అనే చిత్రంలో శార్వరీ నటిస్తోంది. అలియా భట్ గుడాఛారిగా కనిపించనున్న ఈ చిత్రంలో శార్వరీ కీలక పాత్రలో కనిపించనుంది.
రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్లకు తాను వీరాభిమానినని శార్వరీ ఓ సందర్భంలో తెలిపింది. ఖాళీ సమయంలో పెంపుడు జంతువులతో ఆడుకుంటానని తెలిపింది.
ఒత్తిడిగా, చికాకుగా ఉన్న సమయాల్లో పుస్తకాలు చదువుతుంటానని శార్వరీ చెప్పింది. అలా చేయడం ద్వారా వెంటనే వాటి నుంచి బయటపడతానిని పేర్కొంది.
ఆగస్టు 26 , 2024
Malavika Mohanan: వైట్ అరేబియన్ గుర్రంలా మాళవిక అందాలు
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్.. తన గ్లామర్ షోతో మరోమారు నెట్టింట వైరల్గా మారింది. చాలీ చాలని గౌనులో ఫొటో షూట్ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఫ్లవర్ డాట్ స్లీవ్లెస్ గౌనులో కనిపించిన ఈ అమ్మడు తన ఎద అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రేపింది.
మతిపోగొట్టే విధంగా థైస్ అందాలను చూపిస్తూ ఫ్యాన్స్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చురకత్తుల్లాంటి చూపులతో మరోమారు వారి మనసు దోచేసింది.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ‘ఏం సొగసురా బాబు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక హాట్ పిక్స్ను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.
ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్కు మాళవిక మోహన్ కుమార్తె. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే.
‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
అనంతరం ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా తరువాత నుంచి మాళవిక వరుస అవకాశాలను అందుకుంటూ వస్తోంది.
ఈ క్రమంలోనే ధనుష్ పక్కన ‘మారన్’ చిత్రంలో నటించి మాళవిక తన క్రేజ్ను మరింత పెంచుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
2020లో 'మసాబా మసాబా' అని టెలివిజన్ సిరీస్లోనూ మాళవిక నటించింది. ఇది నెట్ఫ్లిక్స్ వేదికగా ఇంగ్లీషు భాషలో స్ట్రీమింగ్లో ఉంది.
గతేడాది క్రిస్టీ (Christy) అనే మలయాళ చిత్రంలో నటించిన మాళవిక.. తన నటనతో అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది.
ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తోన్న ‘రాజా సాబ్’ (Raja Saab)లో మాళవిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్తో తెలుగులో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవాలని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది.
‘రాజా సాబ్’ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మాళవికకు పాన్ ఇండియా స్థాయిలో తిరుగుండదని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
తమిళంలో విక్రమ్తో ‘తంగలాన్’ (Thangalaan) అనే సినిమాలో మాళవిక నటిస్తోంది. అలాగే హిందీలో ‘యుద్ర’ (Yudhra) ఫిల్మ్లో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇక మాళవిక అవార్డుల విషయానికి వస్తే.. 2019లో 'బియాండ్ ది క్లౌడ్స్' అనే బాలీవుడ్ చిత్రానికి గాను 'యాక్టింగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఆమె గెలుచుకుంది.
అలాగే 2022లో ‘మాస్టర్’ చిత్రానికి గాను బెస్ట్ అరేంగేట్ర నటిగా మాళవిక మోహనన్ నామినేట్ అయ్యింది. కొద్దిలో సైమా అవార్డును చేజార్చుకుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ మాళవిక చురుగ్గా వ్యవహరిస్తోంది. తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్ను అలరిస్తోంది.
స్టన్నింగ్ ఫిగర్తో హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఆమె నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
మే 27 , 2024
Deepika Padukone: రణ్వీర్ - దీపికా విడాకులు తీసుకోబోతున్నారా?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. నటుడు రణ్వీర్.. ఇన్స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫొటోలను తొలగించడంతో సంచలనంగా మారింది. త్వరలో వీరిద్దరు వీడిపోతున్నారా? అన్న ఊహాగానాలకు ఇది తెరలేపింది.
తాజాగా రణ్వీర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను (Ranveer Singh Removes Wedding Pictures) పరిశీలించిన కొందరు ఫ్యాన్స్.. అందులో పెళ్లి ఫొటోలు లేకపోవడంతో షాక్కు గురయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ మేటర్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
చిత్ర పరిశ్రమలో మరో స్టార్ జంట విడాకులకు సిద్ధమవుతోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అటు బాలీవుడ్ వర్గాలు, జాతీయా మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
కానీ, రణ్వీర్ ఇన్స్టాగ్రామ్లో పెళ్లికి సంబంధించిన ఫొటోలు (Ranveer and Deepika's divorce Rumours) మాత్రమే మిస్ అయ్యాయి. దీపికతో మాములుగా దిగిన ఫొటోలు అంతే ఉన్నాయి. దీంతో రణ్వీర్ కావాలనే ఈ ఫొటోలను డిలీట్ చేసి తమ మధ్య ఉన్న మనస్పర్థలను బహిర్గతం చేశారని రూమర్లు మెుదలయ్యాయి.
అయితే బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సమాచారం. రణ్వీర్ ఈ మధ్యే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఆర్చీవ్ చేశారట. ఆ కారణంగా తన అకౌంట్లో 2023కి ముందు పెట్టిన పోస్టులన్నీ ఆర్చీవ్ అయ్యి కనబడటం లేదట.
ప్రస్తుతం ఈ జంట తమ తమ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇక దీపిక ప్రభాస్తో కల్కి 2898 ఏడీ చిత్రంలో హీరోయిన్గా చేస్తోంది. వీరి జోడీని తెరపై చూసేందుకు ఇరువురు ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.
2013లో రిలీజైన రామ్లీలా సినిమాలో దీపికా - రణ్వీర్ తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాల్లో కలిసి నటించారు.
దాదాపు ఆరేండ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2018లో దీపికా - రణ్వీర్ సింగ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చాలా మంది హాజరయ్యారు.
అయితే రణ్వీర్ - దీపికా (Deepika & Ranveer's Relationship) విడాకులపై రూమర్లు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు వీరు విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో కరణ్ జోహార్ షోలో పాల్గొన్నప్పుడు దీపికా చేసిన వ్యాఖ్యలు రణ్వీర్కు కోపం తెప్పించాయి. ఇక వారు విడిపోవడం ఖాయమని నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తించారు. కానీ, అది తప్పను ఈ జంట నిరూపించింది.
మే 08 , 2024