రివ్యూస్
How was the movie?
తారాగణం
నాగ చైతన్యవిక్రమ్ వాత్సల్య, సింధు భర్త
శృతి హాసన్సితార వెంకటేశన్, విక్రమ్ మాజీ ప్రేమికుడు, సంజయ్ భార్య
అనుపమ పరమేశ్వరన్సుమ, విక్రమ్ ల 1వ క్రష్
మడోన్నా సెబాస్టియన్సింధు విక్రమ్ వాత్సల్య, విక్రమ్ ప్రేమ ప్రేమ భార్యగా మారింది
అరవింద్ కృష్ణసంజయ్, సితార భర్త
చైతన్య కృష్ణశివ
ప్రవీణ్వాసు
శ్రీనివాస రెడ్డిE. కనక రావు / EK
నోయెల్ సీన్అర్జున్
బ్రహ్మాజీకోచ్
నర్రా శ్రీనుకాంత రావు
జీవాకళాశాల ప్రిన్సిపాల్
జోష్ రవివిక్రమ్ స్నేహితుడు
తాగుబోతు రమేష్రియో శాంసన్
ఎల్దోస్ సన్నీరవి
వినయ్ విజయన్
సత్య అక్కలడాన్స్ కొరియోగ్రాఫర్
అవంతిక వందనపుయువ సింధు
బన్నీ అబిరాన్
సిబ్బంది
చందూ మొండేటి
దర్శకుడుసూర్యదేవర నాగ వంశీనిర్మాత
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Rajesh_Murugesan_250_250.jpeg)
రాజేష్ మురుగేశన్
సంగీతకారుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Gopi_Sundar_250_250.jpeg)
గోపీ సుందర్
సంగీతకారుడుఅల్ఫోన్స్ పుతారెన్కథ
కోటగిరి వెంకటేశ్వరరావు
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
![అనుపమ పరమేశ్వరన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/03112106/123.-14.jpg)
అనుపమ పరమేశ్వరన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
తక్కువ టైంలో స్టార్ హీరోయిన్గు గుర్తింపు పొందిన కథానాయికల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తొలి సినిమా ప్రేమమ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టాలీవుడ్లో 'అ ఆ' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఉన్నది ఒక్కటే జీందగి, హలో గురు ప్రేమకోసమే, కార్తికేయ2 వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కొద్దికాలం పాటు పద్దతిగా నటించిన ఈ కేరళ అందం.. ప్రస్తుతం బోల్డ్ క్యారెక్టర్లలో నటిస్తోంది. మరి అనుపమ పరమేశ్వరన్ గురించి అభిమానులకు తెలియని కొన్ని (Some Lesser Known Facts about Anupama Parameswaran) ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
అనుపమ పరమేశ్వరన్ ముద్దు పేరు?
అను
అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడు పుట్టింది?
1996, ఫిబ్రవరి 18న జన్మించింది
అనుపమ పరమేశ్వరన్ తొలి సినిమా?
ప్రేమమ్(2015)
అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటించిన తొలి సినిమా?
అఆ(2016)
అనుపమ పరమేశ్వరన్ ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
అనుపమ పరమేశ్వరన్ ఎక్కడ పుట్టింది?
ఇరింజలకుడ, కేరళ
అనుపమ పరమేశ్వరన్ ఏం చదివింది?
ఇంగ్లీష్లో పీజీ చదివింది
అనుపమ పరమేశ్వరన్ అభిరుచులు?
షాపింగ్, ట్రావెలింగ్
అనుపమ పరమేశ్వరన్కి ఇష్టమైన ఆహారం?
తాయ్, ఇండియన్ వంటకాలు
అనుపమ పరమేశ్వరన్కు అఫైర్స్ ఉన్నాయా?
క్రికెటర్ జాస్ప్రిత్ బుమ్రా, ఫిల్మ్ మేకర్ చిరంజీవ్ మక్వానాతో అఫైర్స్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి.
అనుపమ పరమేశ్వరన్కు ఇష్టమైన కలర్ ?
వైట్
అనుపమ పరమేశ్వరన్కు ఇష్టమైన హీరో?
అల్లు అర్జున్
అనుపమ పరమేశ్వరన్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
అనుపమ పరమేశ్వరన్ తల్లిదండ్రుల పేరు?
సునిత, పరమేశ్వరన్ ఎరక్నాథ్
అనుపమ పరమేశ్వరన్ ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/anupamaparameswaran96/?hl=en&img_index=3
అనుపమ పరమేశ్వరన్ గురించి మరికొన్ని విషయాలు
అనుపమ పెట్ లవర్, ఆమె పెంపుడు కుక్క పేరు విస్కీ
అనుపమ ఖాళీ సమయంలో పేయింటింగ్ వేస్తుంది
https://www.instagram.com/p/CH9oMWjJeJJ/?utm_source=ig_web_copy_link
దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ వెంచర్లో ‘మనియారయెల్లి’(2019) అశోకన్ చిత్రానికి అనుపమ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది.
https://www.youtube.com/watch?v=Zl0QJwSnKtA
ఏప్రిల్ 05 , 2024
![Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/05/09122316/9th-May-Sai-Pallavi-birthday-vertica-e1683615214893.jpg)
Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పాత్రలో గ్లామర్ డోస్ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. భోళా శంకర్ (Bhola Shankar)
చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్ చేస్తోంది. అయితే కీర్తి సురేష్ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్ను రిజెక్ట్ చేశానని స్పష్టం చేసింది. రీమేక్ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్గా ‘భోళా శంకర్’ వస్తోంది.
2. లియో (Leo)
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడు అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్ లేటెస్ట్ మూవీ ‘లియో’లో హీరోయిన్గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
3. ఛత్రపతి (Chatrapathi)
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్ వినిపించింది. గ్లామర్ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్ కానుంది.
4. వారసుడు (Varasudu)
విజయ్ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు.
5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)
మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
6. డియర్ కామ్రేడ్ (Dear Comrade)
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్ ఆఫర్ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్ ఉండటంతో నో చెప్పింది.
7. చెలియా (Cheliya)
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్నే తిరస్కరించింది. కార్తిక్ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు.
మే 09 , 2023
![సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/08122519/123.-77.jpg)
సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
సాయి పల్లవి తెలుగులో ఫిదా చిత్రంతో పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతకు ముందు ఆమె మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాలో మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. మరి సాయి పల్లవి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about Sai Pallavi) విషయాలు ఇప్పుడు చూద్దాం.
సాయి పల్లవి ముద్దు పేరు?
మలార్
సాయి పల్లవి పేరు ఎవరు పెట్టారు?
సాయి పల్లవి పేరును పుట్టపర్తి సాయిబాబా పెట్టారు
సాయి పల్లవి వయస్సు ఎంత?
1992, మే 9న జన్మించింది
సాయి పల్లవి తెలుగులో నటించిన తొలి సినిమా?
ఫిదా
సాయి పల్లవి ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
సాయి పల్లవి ఎక్కడ పుట్టింది?
కోటగిరి, తమిళనాడు
సాయి పల్లవి ఏం చదివింది?
MBBS
సాయి పల్లవి అభిరుచులు?
డ్యాన్సింగ్, సింగింగ్
సాయి పల్లవికి ఇష్టమైన ఆహారం?
చాకోలెట్స్, స్వీట్స్
పూజా హెగ్డేకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
సాయి పల్లవికి ఇష్టమైన హీరో?
కమల్ హాసన్, మమ్మాటి
సాయి పల్లవికి ఇష్టమైన హీరోయిన్?
జ్యోతిక, సిమ్రాన్
సాయి పల్లవి పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
సాయి పల్లవి తల్లిదండ్రుల పేరు?
సెంతమార కన్నన్, రాధ కన్నన్
సాయి పల్లవి రాకముందు ఏం చేసేది?
సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు పలు డ్యాన్స్ షోల్లో పాల్గొంది. ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షోలో కూడా సాయి పల్లవి పార్టిసిపేట్ చేసింది.
సాయి పల్లవి ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/saipallavi.senthamarai/
సాయి పల్లవి నికర ఆస్తుల విలువ?
రూ.30కోట్లు
https://www.youtube.com/watch?v=1OtXtXJWTVg
ఏప్రిల్ 16 , 2024
![Vijay Deverakonda - Sai Pallavi: విజయ్ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/06155129/123.-2024-06-06T154804.523.jpg)
Vijay Deverakonda - Sai Pallavi: విజయ్ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి.. తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవి.. రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
క్రేజీ లవ్స్టోరీ..
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్గా సాయిపల్లవిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
లవ్ స్టోరీలకు కేరాఫ్
తమిళంలో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సాయిపల్లవి (Sai Pallavi).. ఆ తర్వాత నుంచి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకమైన ఈ భామ.. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.
ఫుల్ స్వింగ్లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మెుదలైంది.
పోలీసు ఆఫీసర్గా విజయ్
'ఫ్యామిలీ స్టార్' చిత్రం తర్వాత ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సీరియస్ పోలీసు ఆఫీసర్గా విజయ్ కనిపించనున్నాడు. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
జూన్ 06 , 2024
![Ranbir Kapoor - Sai Pallavi: ‘రామాాయణం’ నుంచి బిగ్ అప్డేట్.. ఏంటంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/02164046/123.-31.jpg)
Ranbir Kapoor - Sai Pallavi: ‘రామాాయణం’ నుంచి బిగ్ అప్డేట్.. ఏంటంటే?
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) సీతగా బాలీవుడ్లో ‘రామాయణం’ (Ramayanam) అనే చిత్రం తెరకెక్కబోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కేజీఎఫ్ (KGF) ఫేమ్ యష్ (Yash) రావణసురుడిగా కనిపిస్తారని సమాచారం. బాలీవుడ్కు ‘దంగల్’ (Dangal) లాంటి బ్లాక్ బాస్టర్ను అందించిన స్టార్ డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ కోసం ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం మూవీ గురించి అంతా మర్చిపోయారు. అయితే తాజాగా సాలిడ్ అప్డేట్ బయటకు రావడంతో అందరిదృష్టి ఈ సినిమాపై పడింది.
షూటింగ్ ప్రారంభం ఆ రోజే!
లేటెస్ట్ బజ్ ప్రకారం.. 'రామాయణం' చిత్రానికి సంబంధించి ఏప్రిల్ 17న అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు శ్రీరామ నవమి (Sri Rama Navami) కావడంతో సినిమా అనౌన్స్కు అదే సరైన సమయంగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజున ఎలాంటి ప్రకటను రానుందోనని.. నటీనటుల ఎంపిక గురించి కూడా అనౌన్స్మెంట్ చేస్తారేమోనని అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు ‘రామాయణం’కు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ కూడా ముంబయిలో ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతుందని టాక్.
ఆ స్టార్లను సాయిపల్లవికి అవకాశం!
‘రాయాయణం’ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు తొలుత అలియా భట్ (Alia Bhatt), దీపికా పదుకొణె (Deepika Padukone), కరీనా కపూర్ (Kareena Kapoor)ల పేర్లను మూవీ టీమ్ పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. చివరికీ సాయిపల్లవి (Sai Pallavi)ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. సీతాదేవి పాత్రకు సాయిపల్లవి అయితేనే సరిగ్గా సరిపోతుందని యూనిట్ భావించిందట. ఆమె సహజసిద్ధమైన నటన ఆ పాత్రకు చాలా ప్లస్ అవుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆస్కార్ విన్నింగ్ కంపెనీతో గ్రాఫిక్స్!
రామాయణం చిత్రాన్ని విజువల్ వండర్గా తీర్చిదిద్దాలని డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) భావిస్తున్నారట. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా గ్రాఫిక్స్పై విపరీతంగా ట్రోల్స్ రావడంతో ఆయన జాగ్రత్తపడుతున్నారట. గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ కంపెనీ ‘DNEG’తో చిత్ర యూనిట్ చర్చలు జరిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ కంపెనీనే.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
అమీర్ఖాన్ కొడుకుతో సినిమా
ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan)తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతేడాది డిసెంబర్లో ప్రారంభమైంది. లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటూ సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది.
సాయిపల్లవి ఫూచర్ ప్రాజెక్ట్స్
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తోంది. లేటెస్ట్గా నాగచైతన్య (Naga Chaitanya)తో ‘తండేల్’ (Thandel)లో చేయగా ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో శివకార్తికేయన్ (Siva Karthikeyan)తో ‘అమరన్’ (Amaran) చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
మార్చి 02 , 2024
![Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/02/21202646/Anupama-Feature.jpg)
Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) పేరు చెప్పగానే క్లాస్ లుక్స్, పద్దతిగా ఉండే పాత్రలే గుర్తుకు వస్తాయి. అయితే 'డీజే టిల్లు 2' సినిమాలో ఈ భామను చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.
ఎందుకంటే రీసెంట్గా రిలీజైన 'డీజే టిల్లు 2' ట్రైలర్ ఈ భామను చూసిన వారంతా నోరేళ్లబెడుతున్నారు. ఈ సినిమాలో అనుపమా గట్టిగానే అందాలు ఆరబోసినట్లు ట్రైలర్ను బట్టి తెలుస్తోంది.
తాజా ట్రైలర్లో ఈ భామ హీరో సిద్ధుతో ఓ సీన్లో ఘాటైన ముద్దు సీన్లో కనిపించింది. ఇది చూసిన అనుపమా ఫ్యాన్స్ నివ్వెరపోతున్నారు. ఒకప్పుడు చూసిన అనుపమానేనా తాము చూస్తోందని ప్రశ్నించుకుంటున్నారు.
కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్తో ముద్దు సన్నివేశాలు చేసి అందరికి షాకిచ్చింది.
ఆ సినిమాలో ఒక్క లిప్లాక్కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది.
రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్గా మారాయి.
దీని తర్వాత మళ్లీ ‘కార్తికేయ 2’, ‘18 పేజీస్’ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్గా కనిపించి ఒకప్పటి అనుపమాను గుర్తు చేసింది. ఈ చిత్రాల్లో తన అందం, అభినయంతో అనుపమా ఆకట్టుకుంది.
ఇప్పుడు 'డీజే టిల్లు 2' ఈ భామ పూర్తిగా రెచ్చిపోయింది. హాట్గా కనిపించడంతో పాటు ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమ గతంలో చేయలేదు. ఇదే ఆమెకు తొలిసారి.
అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం అనుపమా గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసున్న అనుపమ.. 'టిల్లు స్వ్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.
గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. .
కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' (Premam) మూవీతో హీరోయిన్ అయిపోయింది. నితీన్ హీరోగా చేసిన 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. ఎక్కడా గీత దాటలేదు.
మాస్ మహారాాజా రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్ (Eagle)లోనూ అనుపమా మెరిసింది. ఇందులో జర్నలిస్టు పాత్ర పోషించి మంచి నటనను కనబరిచింది.
అలాగే తమిళంలో 'సైరెన్' అనే సినిమాలో ఈ కేరళ కుట్టి నటించింది. ఈ చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది.
ప్రస్తుతం మలయాళంలో 'JSK Truth Shall Always Prevail' అనే సినిమాలో నటిస్తున్న వికిపీడియాను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 21 , 2024
![Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్.!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/19143518/Untitled-design-2024-01-19T143501.233.jpg)
Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్.!
బ్రహ్మోత్సవం చిత్రంలో బాలనటిగా అరంగేట్రం చేసిన 'అవంతిక వందనపు'.. ఇప్పుడు హాలీవుడ్లో సెన్సేషన్గా మారింది.
https://twitter.com/i/status/1747997141644251346
టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు వరుస హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.
https://twitter.com/i/status/1746394374546559063
తాజాగా అవంతిక నటించిన హాలీవుడ్ చిత్రం ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) విడుదలై మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగుతుంది.
ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మడు చాలా బోల్డ్గా కనిపించడంతో పాటు ఓ పాటలో శృతిమించి అందాల ప్రదర్శన చేసింది. బాలనటిగా చేసిన అవంతని ఇలా బోల్డ్గా చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
https://twitter.com/i/status/1746552711666094366
మనం చూస్తున్నది అప్పుడు తెలుగు సినిమాలలో చూసిన అవంతికనేనా.. ఇంతలో అంత మార్పా అంటూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
అవంతిక వందనపు.. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ చెల్లెలిగా నటించింది. తన డ్యాన్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది.
బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో మహేష్ను ఇంటర్యూ చేసి మంచి మార్కులు కొట్టేసింది.
https://twitter.com/i/status/1746391190511952308
అవంతిక.. ఇండో-అమెరికన్ యువతి. కాలిఫోర్నియాలో తెలుగు మూలలున్న కుటుంబంలో 2005లో పుట్టింది. అక్కడే చదవుకుంటూ డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకుంది.
2014లో ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ (నార్త్ అమెరికన్ ఎడిషన్)లో రన్నరప్గా నిలిచి అవంతిక అందరిచేత ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత 2016లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా ద్వారా నటిగా మెప్పించి బాలనటిగా తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంది.
మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి చిత్రాల్లోనూ అవంతిక బాల నటిగా మెరిసింది.
ఇటీవల తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలు కూడా అవంతికకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె వాటిని తిరస్కరించినట్లు సమాచారం.
ప్రస్తుతం అవంతిక తన ఫోకస్ మెుత్తం హాలీవుడ్ పైనే పెట్టింది. హాలీవుడ్ యానిమేషన్ సిరీస్లైన మీరా: రాయల్ డిటెక్టివ్, డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్లోని పాత్రలకు ఆమె గాత్రదానం చేసింది.
హాలీవుడ్లో నటించాలన్న అవంతిక ఆశకు డిస్నీ సంస్థ ఊపిరి పోసింది. స్పిన్ చిత్రం ద్వారా ఆమె కలను నెరవేర్చింది. ఆ తర్వాత ‘సీనియర్ ఇయర్’ అనే హాలీవుడ్ చిత్రంలోనూ అవంతిక కీలక పాత్ర పోషించింది.
ప్రస్తుతం ఈ భామా హోరోస్కోప్, క్రౌన్ విషెష్ అనే రెండు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో ఓ రెస్టారెంట్లో వర్క్ చేస్తూ అవంతిక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
అమెరికా సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఎంత రిచ్ అయినా 18 ఏళ్లు నిండితే వారు స్వయం కృషితో స్వంతంగా బతకాలి. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమకాళ్లపై తాము నిలబడాలి.
ఈ క్రమంలోనే అవంతిక (Avantika Vandanapu) తల్లిదండ్రులు ఉన్నవాళ్లైనప్పటికీ తను ఓ రెస్టారెంట్లో పని చేస్తూ మరో వైపు సినిమాలలో నటిస్తూ చాలామంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
జనవరి 19 , 2024
![Sai Pallavi: సీతారాములుగా సాయిపల్లవి, రణ్బీర్.. రావణుడిగా యష్.. బాలీవుడ్లో మరో ‘రామాయణం’!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/04150228/Untitled-design-2023-10-04T150201.369.jpg)
Sai Pallavi: సీతారాములుగా సాయిపల్లవి, రణ్బీర్.. రావణుడిగా యష్.. బాలీవుడ్లో మరో ‘రామాయణం’!
అందాల తార సాయి పల్లవి బాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రణ్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న ‘రామాయణం’ చిత్రంలో ఆమె సీతా దేవి పాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2024లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు అలియా భట్, దీపికా పదుకొణె, కరీనా కపూర్ల పేర్లు పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం సాగింది. చివరికీ సాయిపల్లవిని ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది.
రామయాణం చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ కుమార్ తెరకెక్కించనున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక ఈ చిత్రం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యష్ రావణుడి పాత్రను పోషించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆస్కార్ విన్నింగ్ కంపెనీ ‘DNEG’.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
సహజంగా నటించి ఏ పాత్రకైనా ఒక మంచి విలువను తీసుకొచ్చే సాయి పల్లవి.. ఇక సీతగా ఆ క్యారెక్టర్కు ఎంతటి నిండుతనాన్ని తీసుకొస్తుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి మేకర్స్ సాయిపల్లవిని సంప్రదించగా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సాయిపల్లవికి పెళ్లి అయ్యిందంటూ ఇటీవల తెగ రూమర్స్ వచ్చాయి. తమిళ దర్శకుడు వేణు ఊడుగులను ఆమె వివాహం చేసుకున్నట్లు నెట్టింట విస్తృతంగా ప్రచారం జరిగింది. వారు దండలతో ఉన్న ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
పెళ్లిపై జరుగుతున్న రూమర్స్పై సాయిపల్లవి స్పందించింది. ఓ సినిమా పూజా కార్యక్రమంలో దిగిన ఫొటోలను క్రాప్ చేసి డబ్బుకోసం నీచంగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది. పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధగా ఉందని పేర్కొంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యేనని మండిపడింది.
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది ఈ భామ. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తోందని తెలుస్తోంది. నాగ చైతన్యతో సాయి పల్లవికి ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లవ్ స్టోరీ తెలుగులో సూపర్ హిట్ అయింది.
అక్టోబర్ 04 , 2023
![Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/05134540/Untitled-design-2023-08-26T180200.286.jpg)
Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
భారతీయ సంస్కృతిలో ఉపధ్యాయ వృత్తికి అత్యున్నత గౌరవం ఉంది. పురాణాలు, చరిత్రలో గురువులకు సముచిత స్థానం కల్పించారు మన పూర్వికులు. "గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః" అంటూ గురువును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పొల్చారు. విద్యార్థుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులకు అప్పటికీ, ఇప్పటికీ ఉన్నారు. వారందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలుగు తెరపై టీచర్లుగా నటించి మంచి గుర్తింపు పొందిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఆ పంతులమ్మలు ఎవరో ఓసారి చూద్దాం...
విజయశాంతి:
తెలుగు తెరపై ఎన్ని సినిమాలు వచ్చినా అందులో విజయశాంతి నటించిన ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ప్రతిఘటనలో లెక్చరర్గా ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆ సినిమాలో గతి తప్పిన విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయశాంతి పాడిన పాట సినిమాకే హైలెట్.
"ఈ దుర్యోధన దుశ్శాసన
దుర్వినీతలోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ
రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం ఆరవవేదం
మానభంగపర్వంలో
మాతృహృదయ నిర్వేదం నిర్వేదం...
ఆసిన్
విజయశాంతి తర్వాత టీచర్ పాత్ర చేసి అంత గుర్తింపు పొందిన హీరోయిన్ ఆసిన్. విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రంలో మ్యాథ్య్ టీచర్గా సీరియస్ రోల్ నటించి మెప్పించింది.
కమలినీ ముఖర్జీ
హ్యాపీ డేస్ చిత్రంలో తన గ్లామర్తో మాయ చేసింది కమలినీ ముఖర్జీ. ఇంగ్లిష్ లెక్చరర్గా కనువిందు చేసింది.
ఇలియానా
రవితేజ నటించిన ‘ఖతర్నాక్’ మూవీలో చేసిన టీచర్ పాత్రకు కాస్త గ్లామర్ అద్దింది ఇలియానా. ఈ రోల్పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీచర్ పాత్రను ఇలా చూపించడం ఏమిటంటూ పలువురు పెదవి విరిచారు.
నయనతార
లేడీ బాస్ నయనతార సైతం పలు చిత్రాల్లో పంతులమ్మ క్యారెక్టర్లో నటించి మెప్పించింది. ‘నేనే అంబానీ మూవీలో టీచర్ క్యారెక్టర్లో నటించి మెప్పించింది.
అనుపమ పరమేశ్వరన్
క్యూట్ డాల్ అనుపమ పరమేశ్వరన్ కూడా టీచర్ రోల్ మెప్పించి ఔరా అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో టీచర్ పాత్రలో కనిపించింది.
సాయి పల్లవి
ఈ తరం కుర్రకారును లెక్చరర్ పాత్రలో బాగా మెప్పించిన రోల్ ఏదైన ఉందంటే 'ప్రేమమ్'(మలయాళం) సినిమాలో సాయిపల్లవి చేసిన అధ్యాపకురాలి పాత్ర. ఈ పాత్రలో సాయిపల్లవి పరకాయ ప్రవేశం చేసి అలరించింది.
శృతిహాసన్
తెలుగులో వచ్చిన 'ప్రేమమ్' సినిమాలోనూ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయింది శృతిహాసన్. ఆ సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే.
సన్నిలియోన్
మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ సినిమాలో కాసేపు టీచర్ పాత్రలో నటించి కాసేపు కనువిందు చేసింది సన్ని లియోన్.
షకిలా
నితిన్-సదా జంటగా నటించిన జయం సినిమాలో షకిలా లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించింది. అప్పట్లో ఈ క్యారెక్టర్ వివాదాస్పదమైంది.
కలర్స్ స్వాతి
సుమంత్ హీరోగా నటించిన గోల్కొండ హై స్కూల్ చిత్రంలో టీచర్ పాత్రలో మెరిసింది కలర్స్ స్వాతి
సంయుక్త మీనన్
ధనుష్ హీరోగా నటించిన 'సార్' మూవీలో లెక్చరర్ పాత్రలో నటించి కనువిందు చేసింది సంయుక్త మీనన్. బయాలజీ టీచర్ రోల్లో నటించి అలరించింది. ఈ సినిమా సూపర్ హిట్
సుహాసిని
ఇక పాత తరంలో 'ఆరాధన' సినిమాలో సుహాసిని చేసిన టీచర్ పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 05 , 2023
![Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్ ఉగ్రరూపం.. ‘యానిమల్’ ఎలా ఉందంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/12/01135834/Untitled-design-2023-12-01T135824.041.jpg)
Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్ ఉగ్రరూపం.. ‘యానిమల్’ ఎలా ఉందంటే?
నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023
రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ (Animal). రష్మిక హీరోయిన్గా చేసింది. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటించారు. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) తీసిన సందీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్ ఉండటంతో ‘యానిమల్’పై అటు బాలీవుడ్తో పాటు, తెలుగులోనూ భారీగా హైప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని అయిన ఆయనకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కుమారుడు. విజయ్ దూకుడు మనస్తత్వం కలవాడు. అయితే తండ్రి అంటే ప్రాణం. కుమారుడి ప్రవర్తన నచ్చక బల్బీర్ అతడ్ని బోర్డింగ్ స్కూల్కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ గొడవ వల్ల తండ్రి కొడుకుల మధ్య మరింత దూరం పెరుగుంది. ఈ క్రమంలోనే విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత భారత్కు వస్తాడు. తండ్రిపై అటాక్ చేసిన వాళ్ళ అంతు చూస్తానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది కథ.
ఎవరెలా చేశారంటే
తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా నటించే అతి కొద్ది మంది హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా వివిధ దశల్లో జీవించారు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా అందులో ఒదిగిపోయాడు. అటు గీతాంజలి పాత్రకు రష్మికా మందన్నా న్యాయం చేసింది. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ బాండింగ్, పెళ్లి గురించి చెప్పే కొన్ని డైలాగులు అదరహో అనిపిస్తాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి గ్లామర్తో ఆకట్టుకుంది. అటు రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ అదరగొట్టాడు. ఇక రణ్బీర్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు బాబీ డియోల్. ఆయన విలన్గా కళ్లతోనే భయపెట్టేశారు. రణబీర్ - బాబీ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో మరోమారు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. సోదరిని ర్యాగింగ్ చేశారన్న కోపంతో హీరో గన్ పట్టుకొని ఆమె కాలేజీకి వెళ్లే సీన్ ఆయన మార్క్ యాక్షన్కు ఉదాహరణ. ఇలాంటి కొత్త తరహా వైలెన్స్ యాక్షన్ సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. కథలో కొత్త దనం లేకపోయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో డైరెక్టర్ ఎటువంటి మెుహమాటాలకు పోలేదు. ముఖ్యంగా రణబీర్ - బాబీ డియోల్ మధ్య ఫైట్ సీన్స్ సందీప్ వంగా దర్శకత్వం ప్రతిభకు అద్దం పడతాయి. అయితే నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని సీన్లు మరి సాగదీసినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ప్రేక్షకులు అక్కడక్కడ బోర్ ఫీలవుతారు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. హర్షవర్ధన్ రామేశ్వర్ తన BGMతో సినిమాకు ప్రాణం పోశారు. హీరోయిజాన్ని తన BGMతో చాలా బాగా ఎలివేట్ చేశారు. కెమెరా వర్క్ టాప్ క్లాస్గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. డైలాగ్స్లో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది.
ప్లస్ పాయింట్
రణ్బీర్ నటనయాక్షన్ సీన్లునేపథ్య సంగీతం
మైనస్ పాయింట్
నిడివిసాగదీత సీన్లు
రేటింగ్ : 4/5
డిసెంబర్ 01 , 2023
![Filmfare Awards 2024: ఫిల్మ్ఫేర్ నామినేషన్స్లో ప్రభాస్, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/17163348/Untitled-design-2024-01-17T163334.931.jpg)
Filmfare Awards 2024: ఫిల్మ్ఫేర్ నామినేషన్స్లో ప్రభాస్, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్ఫేర్' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్, డంకీ, జవాన్, శ్యామ్ బహదూర్ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్', 'సలార్' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.
ప్రభాస్కు అన్యాయం!
బాహుబలి తర్వాత ప్రభాస్ (Prabhas) క్రేజ్ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్ చేసిన ఆదిపురుష్ (Aadipurush), సలార్ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్ మూవీ ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్వైడ్గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్ తన యాక్షన్తో గూస్బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్లో అసంతృప్తికి కారణమవుతోంది.
సలార్ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki)
షారుక్ ఖాన్ రీసెంట్ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్ ‘సలార్’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది. అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్నే సాధించింది. కావాలనే ప్రభాస్ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.
సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్ను, ఆయన సినిమాలను బాలీవుడ్లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.
పాపం రష్మిక..!
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన చిత్రం ‘యానిమల్’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ నామినేషన్స్లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.
అప్పట్లోనే అవమానం
అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది.
https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20
‘యానిమల్’ సత్తా చాటేనా!
తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్బీర్ కపూర్, ఉత్తమ సహాయ నటులుగా అనిల్ కపూర్, బాబీ దేబోల్, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా
ఉత్తమ చిత్రం (పాపులర్)
12th ఫెయిల్జవాన్ఓఎంజీ2పఠాన్రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)
12th ఫెయిల్బీడ్ఫరాజ్జొరామ్శ్యామ్ బహదూర్త్రీ ఆఫ్ అజ్జ్విగాటో
ఉత్తమ దర్శకుడు
అమిత్ రాయ్ (ఓఎంజీ2)అట్లీ (జవాన్)కరణ్ జోహార్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)సందీప్ వంగా (యానిమల్)సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్)విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ నటుడు
రణ్బీర్ కపూర్ (యానిమల్)రణ్వీర్ సింగ్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)షారుక్ఖాన్ (డంకీ)షారుక్ ఖాన్(జవాన్)సన్నీ దేఓల్ (గదర్2)విక్కీ కౌశల్ (శ్యామ్ బహదూర్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)
అభిషేక్ బచ్చన్ (ఘూమర్)జయ్దీప్ అహల్వత్ (త్రీ ఆఫ్ అజ్)మనోజ్ బాజ్పాయ్ (జొరామ్)పంకజ్ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్కుమార్ రావ్ (బీడ్)విక్కీ కౌశల్ (శ్యామ్ బహదూర్)విక్రాంత్ మెస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి
అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)భూమి పెడ్నేకర్ (థ్యాంక్యూ ఫర్ కమింగ్)దీపిక పదుకొణె (పఠాన్)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్)
దీప్తి నవల్ (గోల్డ్ ఫిష్)ఫాతిమా సనా షేక్ (ధక్ ధక్)రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్ (ఘూమర్)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్ షా (త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ సహాయ నటుడు
ఆదిత్య రావల్ (ఫరాజ్)అనిల్ కపూర్ (యానిమల్)బాబీ దేఓల్ (యానిమల్)ఇమ్రాన్ హష్మి (టైగర్3)టోటా రాయ్ చౌదరి (రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి
జయా బచ్చన్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)రత్న పాఠక్ షా (ధక్ ధక్)షబానా అజ్మీ (ఘూమర్)షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్)యామి గౌతమ్ (ఓఎంజీ2)
జనవరి 17 , 2024
![Janhvi Kapoor: జాన్వీ కపూర్ నడుము మడతలు.. చూపు తిప్పుకొకుండా ఉండగలరా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/30182017/Untitled-design-2024-01-30T182004.679.jpg)
Janhvi Kapoor: జాన్వీ కపూర్ నడుము మడతలు.. చూపు తిప్పుకొకుండా ఉండగలరా?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Jhanvi Kapoor) ‘69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2024’ (69th Filmfare Awards 2024) ఈవెంట్లో సందడి చేసింది.
స్టన్నింగ్ అవుట్ ఫిట్లతో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. ఈ బ్యూటీ అందాలను చూసి వేడుకకు వచ్చిన వారంతా ఫిదా అయ్యారు.
వేదికపై అద్భుతమైన డాన్స్ పెర్ఫామెన్స్తో అదరగొట్టిన జాన్వీ... మాస్ స్టెప్పులతో అక్కడి వారిని ఉర్రూతలూగించింది.
స్టేజీపై జాన్వీ ప్రదర్శనను చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలు తమ చప్పట్లతో ఆమెను అభినందించారు. అటు జాన్వీ పర్ఫార్మెన్స్కు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్గా మారాయి.
ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకల్లోనే జాన్వీ టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్లోనూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్ చేసింది.
నల్లటి దుస్తుల్లో జాన్వీ అందాలను చూసిన నెటిజన్లు ఉర్రూతలూగుతున్నారు. తల్లి శ్రీదేవికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
బాలీవుడ్లో వరుస చిత్రాలతో అలరిస్తున్న జాన్వీ కపూర్.. త్వరలో టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకోబోతోంది.
కోలివుడ్ హీరో సూర్య నటిస్తున్న 'కర్ణ' (Karna) చిత్రంలోనూ ఈ భామకు ఛాన్స్ చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
జాన్వీ కపూర్.. ‘ధడ్’ చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో జాన్వీకి పెద్దగా పేరు రాలేదు.
నటనపరంగా జాన్వీకి గుర్తింపు తెచ్చిన సినిమా ‘గుంజన్ సక్సేనా’. నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రంలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత ‘గుడ్లక్ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు.
ఇటీవల 'రాఖీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’ చిత్రంలో నటిస్తూ బిజీగా బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని శరణ్శర్మ తెరకెక్కిస్తున్నారు.
జనవరి 30 , 2024
![69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/29134812/Untitled-design-2024-01-29T134801.247.jpg)
69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!
బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్ఫేర్’ (69th FilmFare Awards) అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్లోని గాంధీనగర్ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్ (Animal) చిత్రానికి అవార్డుల పంట పడింది. అందరూ ఊహించినట్లుగానే సందీప్.. ఫిల్మ్ఫేర్ వేడుకల్లో తన సత్తా ఏంటో చూపించాడు. మెుత్తం ఐదు అవార్డులను కొల్లగొట్టి టాలీవుడ్ జెండా బాలీవుడ్లో ఎగిరేలా చేశాడు.
బాలీవుడ్లో ‘యానిమల్’ తుఫాన్!
డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.910 కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది. తాజాగా ప్రకటించిన ఫిల్మ్ఫేర్ అవార్డుల్లోనూ సందీప్ మూవీ ‘యానిమల్’ దుమ్మురేపింది. నటుడు, గాయకుడు, సంగీతం (పాటలు), నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్ ఇలా మెుత్తం ఐదు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ వేడుకల్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది.
అదరగొట్టిన ‘12th ఫెయిల్’
ఇటీవల విడుదలైన ‘12th ఫెయిల్’ (12th Fail) చిత్రం కూడా యానిమల్ తరహాలోనే 69వ ‘ఫిల్మ్ఫేర్’ అవార్డు వేడుకల్లో అదరగొట్టింది. యానిమల్తో సమానంగా ఐదు అవార్డులను గెలుచుకొని అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఉత్తమ క్రిటిక్స్ నటుడు అవార్డుతో పాటు సినిమా, స్క్రీన్ప్లే, ఎడిటింగ్, దర్శకుడు విభాకాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో 12th ఫెయిల్ అవార్డుల సంఖ్య ఐదుకు చేరాయి. మరోవైపు 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' నాలుగు అవార్డులు గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది.
బెస్ట్ యాక్టర్స్గా భార్య భర్తలు
ఫిల్మ్ ఫేర్ - 2024 పురస్కారాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు భార్యాభర్తలకు వచ్చాయి. 'యానిమల్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) అవార్డు అందుకోగా 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ (Alia Bhatt) అవార్డు గెలుచుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి జంటకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం ఇది తొలిసారి. ఇక ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్), ఉత్తమ నటి (క్రిటిక్స్) రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ), ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ) అవార్డులు సొంతం చేసుకున్నారు.
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో విజేతలు వీరే:
ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జొరామ్
ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ నటుడు: రణ్బీర్ కపూర్ (యానిమల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్)
ఉత్తమ నటి: అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)
ఉత్తమ గీత రచయిత: అమితాబ్ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బం: యానిమల్
ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్ బాబల్ ( అర్జన్ వెయిలీ- యానిమల్)
ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్)
ఉత్తమ కథ: అమిత్ రాయ్ (OMG 2)
ఉత్తమ స్క్రీన్ప్లే: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ డైలాగ్: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)
జనవరి 29 , 2024
![69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్.. అవార్డ్స్ విజేతలు వీరే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/18143600/Untitled-design-2023-10-18T143547.220.jpg)
69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్.. అవార్డ్స్ విజేతలు వీరే!
69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను విజేతలకు అందజేశారు. టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరోగా బన్నీ నిలిచాడు.
https://twitter.com/i/status/1714234869629558869
జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రంగా ‘RRR’ నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు రాజమౌళి రాష్ట్రపతి చేతుల మీదగా అందుకున్నారు.
https://twitter.com/i/status/1714263091029107087
పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నిలిచారు. ఈ అవార్డును రాష్ట్రపతి ముర్ము ఆయనకు అందజేశారు.
https://twitter.com/bharatidubey/status/1714279017837474231
'ఆర్ఆర్ఆర్' మూవీకి గాను ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును ఎం. ఎం. కీరవాణి దక్కించుకున్నారు. జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.
https://twitter.com/i/status/1714256005079704005
'ఆర్ఆర్ఆర్'లోని ‘కొమరంభీముడో..’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్ కాల భైరవ.. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
https://twitter.com/i/status/1714253448215228480
ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్గా కింగ్ సోలోమన్ జాతీయ అవార్డు అందుకున్నారు. RRR చిత్రానికి గాను ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కైవసం చేసుకున్నారు.
https://twitter.com/i/status/1714255504153993419
టాలీవుడ్కు చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ జాతీయ స్థాయిలో ఉత్తమ నృత్య దర్శకుడిగా నిలిచారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి గాను రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్నారు.
https://twitter.com/i/status/1714253832241422699
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాలీవుడ్కు చెందిన వి. శ్రీనివాస్మోహన్ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇతను కూడా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సంబంధించే తీసుకోవడం విశేషం.
https://twitter.com/i/status/1714266870713647487
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్.. కొండపొలం చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సాహిత్యం అవార్డు అందుకున్నారు.
https://twitter.com/i/status/1714230631885062219
జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డును చిత్ర దర్శకుడు బుచ్చిబాబు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
https://twitter.com/i/status/1714224832316080266
ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ విమర్శకుడిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషోత్తమాచార్యులు అవార్డు అందుకున్నారు.
https://twitter.com/i/status/1714218637362659515
జాతీయ అవార్డు వేడుకల సందర్భంగా టాలీవుడ్కు చెందిన విజేతలు అందరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అల్లుఅర్జున్, రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు విజేతలు ఉన్నారు. ఈ ఫొటోను బన్నీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడం విశేషం.
https://twitter.com/alluarjun/status/1714300482934751553
అక్టోబర్ 18 , 2023
![Jawan Movie Review in Telugu : మ్యాజిక్లు.. లాజిక్లు పక్కన పెట్టి చూడండి… జవాన్ బొమ్మ అదిపొయింది!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/07142856/F5XkO3caUAAhefC.jpeg)
Jawan Movie Review in Telugu : మ్యాజిక్లు.. లాజిక్లు పక్కన పెట్టి చూడండి… జవాన్ బొమ్మ అదిపొయింది!
తమిళ్ డైరెక్టర్ అట్లీ మాస్ యాక్షన్ సినిమాలను తీయడంలో ధిట్ట. ఆయన మాస్ ప్రేక్షకుల పల్స్ ఇట్టే పట్టేస్తాడు. దళపతి విజయ్తో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తీశాడు. సోషల్ మెసెజ్తో కూడిన కంటెంట్కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తమిళ్లో బిగిల్, తేరి, మెర్సల్ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్తో తీసిన జవాన్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అంతటా పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఇంతకు ఎలా ఉంది. అట్లీ- షారుక్ మ్యాజిక్ ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.
కథేంటంటే..
భారత్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని (షారుఖ్ ఖాన్) తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు షారుఖ్ ఖాన్ నేను ఎవరు అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని షారుఖ్ ఖాన్ కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు.
సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత విక్రమ్ రాథోడ్( షారుఖ్ ఖాన్) అనే పోలీస్ ఆఫీసర్.. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పొరాటం చేస్తుంటాడు. కాళి (విజయ్ సేతుపతి) అక్రమంగా సంపాదించిన డబ్బును పేదలకు పంచి పెడుతుంటాడు రాబిన్ హుడ్ తరహాలో. అయితే 30 ఏళ్ల క్రితం దొరికిన వ్యక్తి... విక్రమ్ రాథోడ్ ఒక్కరేనా? లేక ఇద్దరా..? ప్రామిస్ చేసిన పిల్లవాడు మాట నిలబెట్టుకున్నాడా? అసలు ఆ బుడ్డోడికి షారుఖ్ ఖాన్కు ఉన్న సంబంధం ఏంటి? కాళితో విక్రమ్ రాథోడ్కు ఉన్న గొడవ ఏంటి అనే అంశాలను తెరపై చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే?
ఈ ఏడాది ప్రథమార్థంలో పఠాన్ సినిమాతో హిట్ కొట్టిన షారుఖ్ మరో బ్లాక్ బాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ నటన ఆయన ఫ్యాన్స్కు మంచి విందు భోజనం పంచుతుంది. షారుఖ్ ఇంట్రడక్షన్ సీన్ మునుపెన్నడూ లేని విధంగా హైఓల్టేజీలో డైరెక్టర్ అట్లీ డిజైన్ చేశాడు. ప్రతి ఫ్రేమ్లో షారుఖ్ లుక్స్ సూపర్బ్గా అనిపిస్తాయి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇండింగ్ వరకు షారుఖ్ పర్ఫామెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంది.
విలన్గా కాళి పాత్రలో విజయ్ సేతుపతి ఒదిగిపోయాడు. తనదైన నేచురల్ యాక్టింగ్తో అదరగొట్టాడు. కాళి పాత్రకు సూపర్బ్ మ్యెనరిజాన్ని విజయ్ జోడించాడు.
నయనతార షారుఖ్తో సమానంగా నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అయితే ఆమె పరిధి ఇంకొంచెం ఉంటే బాగుంటుందనిపించింది. ఆమె ప్రతి ప్రేమ్లో తన యాక్టింగ్ స్కిల్స్తో ఆకట్టుకుంది. దీపికా పదుకునే పాత్ర ఈ సినిమాకు ఎమోషనల్ కనెక్ట్. ప్రియమణి, సాన్య మల్హోత్ర, సంజీత భట్టాచార్య అందరూ తమ పరిధి మేరకు బాగా నటించారు.
ఎలా ఉందంటే?
డైరెక్టర్ అట్లీ మరోసారి తన స్క్రీన్ ప్లే మ్యాజిక్తో కట్టిపడేశాడు. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్కు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తగా రాసుకున్నట్లు తెలిసింది. ఫస్టాఫ్ను చాలా ఎంగేజింగ్ నడిపించి ఇంటర్వల్లో ట్విస్ట్ రివీల్ చేశాడు. యాక్షన్ సీన్స్, షారుఖ్ కామెడీ టైమింగ్ ఎక్కడా ప్రేక్షకునికి బోర్ కొట్టించదు. ఈ సినిమా ద్వారా సమాజంలోని అన్ని సమస్యలు స్పృశిస్తూ.. ఆర్మీలోని కొన్ని సమస్యలను బయటకు తెచ్చాడు అట్లీ.
సెకండాఫ్లో షారుఖ్ ఖాన్ జాతినుద్దేశించే ఇచ్చే స్పీట్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయాయి. బోర్డర్ సన్నివేశాలు, యుద్ధసన్నివేశాలను కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చూపించారు.
టెక్నికల్ పరంగా
జవాన్ సినిమా నిర్మాణ విలువల పరంగా సూపర్బ్గా ఉంది. క్వాలిటీ విషయంలో రెడ్ చిల్లీస్ ఎక్కడా రాజీ పడలేదు. యాక్షన్ సీన్స్ కోసం అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ స్పిరో రజటోస్, యన్నిక్ బెన్, సనీల్ రోడ్రిగూస్ వంటి వారు పనిచేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హైప్ తెచ్చాయి. ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్లలో వచ్చే సౌండ్ థియేటర్లలో స్పీకర్లు బద్దలయ్యేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పడి కష్టం సౌండ్స్లో రీసౌండ్ అయిందని చెప్పవచ్చు.
బలాలు:
షారుఖ్ నటన
ఇంటర్వల్ ట్విస్ట్
క్లైమాక్స్ సీన్స్
BGM
బలహీనతలు
సెకాండాఫ్లో ముందే ఊహించదగిన సీన్లు
చివరగా:
జవాన్ సినిమా గురించి విమర్శకుల మ్యాజిక్లు లాజిక్లు పక్కన పెడితే... ఈ చిత్రం అభిమానులకు రియల్ షారుఖ్ను పరిచయం చేస్తుంది.
రేటింగ్
4/5
సెప్టెంబర్ 07 , 2023
![This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/08/28105310/Untitled-design-2023-08-28T105026.449.jpg)
This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్సిరీస్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3 మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
ఖుషి
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 1న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.
నా... నీ ప్రేమకథ
ఆముద శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నా... నీ ప్రేమకథ’. కారుణ్య చౌదరి కథానాయిక. శ్రవణ్కుమార్ నిర్మాత. ఈ సినిమా సెప్టెంబరు 2న (శనివారం) థియేటర్లో విడుదల కానుంది. ‘ఒక ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’ అని చిత్ర బృందం చెబుతోంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, ప్రచార చిత్రాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్సిరీస్లు
డీడీ రిటర్న్స్
తమిళ కమెడియన్ సంతానం హీరోగా నటించిన డీడీ రిటర్న్స్ (DD Returns) మూవీ ఈ వారం ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్ 1న (శుక్రవారం) జీ5 (Zee 5) వేదికగా ఈ హారర్ కామెడీ మూవీ రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 2016లొ వచ్చిన ‘దిల్లుకు దుడ్డు’ సినిమాకు సీక్వెల్గా ‘డీడీ రిటర్న్స్’ రూపొందింది. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న థియేటర్లలో రిలీజైంది. రూ.5 కోట్ల బడ్జెట్తో రూపొందిన మూవీ రూ.40 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి పెద్ద హిట్గా నిలిచింది. సినిమాలో సురభి హీరోయిన్గా చేసింది.
TitleCategoryLanguagePlatformRelease DateThe Wheel of Time; season 2SeriesEnglishAmazon PrimeSep 01Scam 2023SeriesHindi/TeluguSonyLIVSep 01DD ReturnsMovieTelugu/TamilZee 5Sep 01AloneReality ShowEnglishNetflixAug 30Choose LoveMovieHindiNetflixAug 31One PieceSeriesEnglishNetflixAug 31Friday Night PlanMovieHindiNetflixSep 01Happy EndingMovieEnglishNetflixSep 01
ఆగస్టు 28 , 2023
![VARUNLAV: ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/06/09140613/Untitled-design-4.png)
VARUNLAV: ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్షిప్పై సైలెంట్గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.
https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20
https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20
కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా
బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
నయనతార- విఘ్నేష్ శివన్
లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.
Screengrab Instagram:nayanatara
నమ్రత- మహేశ్ బాబు
నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.
అలియా భట్- రణ్బీర్ కపూర్
బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.
విజయనిర్మల- కృష్ణ
సెలబ్రిటీ కపుల్స్లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.
జ్యోతిక- సూర్య
సౌత్లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).
అమల- నాగార్జున
తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.
నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి
గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు.
జీవిత- రాజశేఖర్
జీవిత, రాజశేఖర్లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.
షాలిని- అజిత్
బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
దీపిక పదుకొణె- రణ్వీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు.
ఈ జంటలు కూడా..
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
జూన్ 09 , 2023
![Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఎగిరి గంతేసిన రాజమౌళి](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/13093533/rrr-scaled.jpg)
Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఎగిరి గంతేసిన రాజమౌళి
అనుకున్నదే అయింది. ఊహించినదే నిజమైంది. కల సాకారమైంది. ఇద్దరు తెలుగు వీరులు చేసిన డ్యాన్స్కి ఆస్కార్ ఫిదా అయింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును ‘నాటు నాటు’ గెలుచుకుంది. తెలుగు కీర్తి పతాకం విశ్వవ్యాప్తంగా రెపరెపలాడింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పాశ్చాత్య పాటలను తలదన్ని అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినిమా సత్తా ఏంటో విశ్వ వేడుకపై నిరూపించింది.
అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్..
ఆస్కార్ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం ‘ఇప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు’ అని కీరవాణి పాటపాడుతూ చెప్పడం గూస్బంప్స్ తెప్పించింది. ‘నాటు నాటు’ సాంగ్ని ప్రపంచంలోనే అత్యుత్తమమైన పాటగా తీర్చిదిద్దాలని భావించాం. ప్రతి భారతీయుడూ గర్వపడాలని ఆశించాం. అది జరిగింది. నాకు, రాజమౌళికి, మా ఫ్యామిలీకి ఉన్న చిరకాల కోరిక నేడు నెరవేరింది. అకాడమీకి ధన్యవాదాలు’ అంటూ కీరవాణి చెప్పారు. అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ ‘నమస్తే’ అని చెప్పారు.
https://twitter.com/fizzie_girl/status/1635114184982814721?s=20
https://twitter.com/HoneyRoseOffl_/status/1635120372013203456?s=20
ఎగిరి గంతేశారు..
‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డును ప్రకటించగానే బాల్కనీలో కూర్చొన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఎగిరి గంతేసింది. డైరెక్టర్ రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ చిన్నపిళ్లల్లా కేరింతలు కొట్టారు. రామ్చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ విజయ నినాదాలు చేశారు.
https://twitter.com/AndhraBoxOffice/status/1635114810651328513?s=20
‘నాటు నాటు’తోనే మొదలు..
ఆస్కార్ వేడుక ప్రారంభమైంది ‘నాటు నాటు’ సాంగ్తోనే. అవార్డుల ప్రదానోత్సవానికి ప్రజెంటర్గా ఎంపికైన ‘దీపిక పదుకొణె’ ‘నాటు నాటు’ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం సింగర్స్ని ఆహ్వానించింది. ‘మీరెప్పుడైనా నాటు నాటు పాటను చెవులారా విన్నారా? కళ్లారా చూశారా? లేకపోతే ఇదే అసలైన సమయం. నాటు నాటు పాటను తిలకిస్తూ ఎంజాయ్ చేయండి’ అంటూ దీపిక పదుకొణె ప్రకటించడం భారతీయ సినిమాకే గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతేగాకుండా ‘నాటు నాటు’ సాంగ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆస్కార్ వేడుకలో చప్పట్లు, ఈలలు వినిపించాయి. సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్లను ఆహ్వానించిన సమయంలో హాలీవుడ్ ప్రముఖులు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ మర్చిపోలేనిది.
https://twitter.com/THR/status/1635094319139893248?s=20
గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో..
‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అప్పుడు మొదలైన ‘నాటు నాటు’ మేనియా అవార్డు అందుకునే వరకూ జోరుగా కొనసాగింది. ఆస్కార్ వేడుకలో ‘నాటు నాటు’ ప్రభావం క్లియర్గా కనిపించింది.
‘నాటు నాటు’కు ప్రాణం..
‘నాటు నాటు’ సాంగ్ ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర కొరియోగ్రఫీదే. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు ‘నాటు నాటు’ను విశ్వవిజేతగా నిలిపాయి. గేయ రచయిత చంద్రబోస్ తెలుగుదనాన్ని మేళవించి రచించగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బీట్స్ జత చేయగా సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ గొంతెత్తి పాడగా రామ్చరణ్, ఎన్టీఆర్ ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ సాంగ్ని ఉక్రెయిన్లో షూట్ చేశారు.
https://www.youtube.com/watch?v=OsU0CGZoV8E
మార్చి 13 , 2023
![RRR | OSCARS: ‘నాటు నాటు'ను ఏళ్ల తరబడి స్మరించుకుంటాం’.. ప్రధాని మోదీ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/13113537/FrEhAVOXgAAMhyn.jpg)
RRR | OSCARS: ‘నాటు నాటు'ను ఏళ్ల తరబడి స్మరించుకుంటాం’.. ప్రధాని మోదీ
RRR చిత్రంలో నాటునాటు పాటకి ఆస్కార్ రావటం పట్ల చిత్రబృందానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి టీమ్కు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందలు తెలుపుతున్నారు. ప్రపంచస్థాయికి భారతీయ సినిమా వెళ్లిందంటూ ప్రశంసిస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు చరణ్, ఎన్టీఆర్లపై పొగడ్తల వర్షం కురుస్తుంది.
RRR చిత్రబృందం ఆస్కార్ అందుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ నాటునాటు పాటకి ఆస్కార్తో దేశం గర్విస్తోంది. ఈ పాటను కొన్ని ఏళ్లతరబడి స్మరించుకుంటారు. నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది. కీరవాణి, చంద్రబోస్కు అభినందనలు” అంటూ ప్రధాని కొనియాడారు.
https://twitter.com/narendramodi/status/1635132805628956674
బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో RRRలోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవటం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చిత్రబృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు వెంకయ్య.
https://twitter.com/MVenkaiahNaidu/status/1635135662734319616
దేశం మెుత్తం స్టెప్పులు వేసిన పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కీరవాణి, చంద్రబోస్ సహా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/RahulGandhi/status/1635140606862454784
ఆస్కార్ గెలిచి ఆర్ఆర్ఆర్ చిత్రం చరిత్ర సృష్టించిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. భారతదేశ గర్వించ దగ్గ విషయం ఒకటైతే, తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతికి మరింత గర్వకారణంం అన్నారు.
https://twitter.com/ncbn/status/1635117591806234624
దర్శక ధీరుడు రాజమౌళి దార్శనికత, సాహసం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కారం అందుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ఇందులో చరణ్ కూడా భాగస్వామ్యం కావటం గర్వంగా ఉందన్నారు.
https://twitter.com/KChiruTweets/status/1635113504758964227
ఆర్ఆర్ఆర్ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్లకు జనసేనాని పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. “ ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా నిలిచిన RRRలోని ఈ నాటు నాటు… గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా హుషారెత్తించింది. ఈ గీతాన్ని ఆస్కార్ వేదికపై ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందటం ద్వారా భారత సినిమా స్థాయి మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా చేసిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక అభినందనలు” చెప్పారు.
ఆర్ఆర్ఆర్ బృందం భారతీయులను, తెలుగు సినిమాను గర్వించేలా చేసిందని తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రశంసించారు. చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు తమిళిసై.
https://twitter.com/DrTamilisaiGuv/status/1635141311887192064
విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటుతూ.. ఆస్కార్ ను గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు సీఎం కేసీఆర్. ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణమని చెప్పారు సీఎం.
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవటంతో ఆనందంలో మునిగి తేలుతున్న వారిలో తాను కూడా చేరానంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కీరవాణి, చంద్రబోస్తో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.
https://twitter.com/KTRBRS/status/1635138037549248512
RRR హీరోయిన్ అలియా భట్ నాటు నాటుకు ఆస్కార్ రావడం పట్ల తన సంతోషాన్ని ఇన్స్టా స్టోరీలో వ్యక్తపరిచింది. సెలబ్రేషన్ ఎమోజీలతో ఆనందాన్ని పంచుకుంది.
ఆస్కార్ అవార్డు గెలవటంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. “ ఇప్పటికీ నాకు కలగానే ఉంది. మాకు అంతులేని మద్దతు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. రాజమౌళి, కీరవాణి భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప వ్యక్తులు. ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి కృతజ్ఞతలు. నాటు నాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తుంపు పొందటానికి కారణమైన రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ, ప్రేమ్ రక్షిత్కు అభినందనలు. తారక్తో కలిసి మరోసారి డాన్స్ చేసి రికార్డులు బద్ధలుకొట్టాలని ఆశిస్తున్నాను. ఈ అవార్డు భారత చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క నటుడు, టెక్నిషియన్కు అంకితం” అన్నారు.
https://twitter.com/AlwaysRamCharan/status/1635151004298772480?s=20
నాటు నాటు పాట ఆస్కార్ గెలవడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. మేము కూడా ఆస్కార్ సాధించాం అంటూ తన సంతోషాన్ని ట్వీట్ చేశారు. RRR మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి, నాటు నాటు సాంగ్ రాసిన గేయ రచయిత చంద్రబోస్ను తారక్ అభినందించారు. మొత్తం RRR చిత్రబృందానికి ఆయన శుక్షాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/tarak9999/status/1635151033432432641?s=20
మార్చి 13 , 2023
![Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/11195409/GIYqV3-W4AEs8Vd.jpg)
Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ (Rahasya Gorak)ను ఆయన పెళ్లి చేసుకోనున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మార్చి 13న నిశ్చితార్థం జరగనుంది.
హైదరాబాద్లోని ప్రైవేట్ రిసార్ట్స్లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru)తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. ఇందులో రహస్య కథానాయిక పాత్ర పోషించింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.
https://twitter.com/i/status/1332879102211096577
ఆ స్నేహం ఇష్టంగా మారి వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని.. రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్ ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఎవరూ నమ్మలేదు.
ఇందుకు కారణం ఇద్దరూ కలిసి తరచూ వెకేషన్కు వెళ్లడమే. ఇలా ఏళ్లుగా చాటుగా ప్రేమించుకున్న ఈ జంట తమపై వచ్చిన వార్తలకు పెళ్లితో చెక్ చెప్పాలని నిర్ణయించుకుందట.
కిరణ్-రహస్యల ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి బంధంతో నెక్స్ట్ లెవల్కు వెళ్లనుండటంతో అభిమానులు ఈ లవ్ బర్డ్స్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గతేడాది ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha), ‘మీటర్’ (Meter), ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan) చిత్రాలతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులను అలరించాడు.
ప్రస్తుతం ‘దిల్ రుబా’ అనే చిత్రం కిరణ్ నటిస్తున్నాడు. 1970 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీపై ఈ యంగ్ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఇక రహస్య గోరక్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ 2016లో వచ్చిన ‘ఆకాశమంత ప్రేమ’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది.
ఆ తర్వాత మూడేళ్లు సినిమాకు దూరంగా ఉన్న రహస్య.. తిరిగి 2019లో కిరణ్ అబ్బవరం సినిమా (రాజా వారు రాణి గారు)తోనే తెలుగు ఆడియన్స్ను పలకరించింది. ఇందులో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిగా తన నటనతో ఆకట్టుకుంది.
అదే ఏడాది 'బాయ్స్ ఇన్ స్కూల్' సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత 'సర్బత్' అనే తమిళ్ మూవీలోనూ ఈ బ్యూటీ మెరిసింది.
మార్చి 11 , 2024