• TFIDB EN
  • రెడ్
    UATelugu2h 26m
    సిద్ధార్థ్ (రామ్), ఆదిత్య (రామ్) ఐడెంటికల్ ట్విన్స్. ఇద్దరి డీఎన్‌ఏ కూడా ఒకేలా ఉంటుంది. ఈ క్రమంలో ఆకాశ్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురవుతాడు. ఈ కేసులో సిద్దార్థ, ఆదిత్య ఇద్దరిని పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆకాశ్‌ను హత్య చేసింది ఎవరు? అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రామ్ పోతినేని
    సిద్ధార్థ్ మరియు ఆదిత్య
    నివేదా పేతురాజ్
    SI యామిని
    మాళవిక శర్మ
    సిద్ధార్థ్ ప్రేమికుడు
    అమృత అయ్యర్
    ఆదిత్య ప్రేమికుడు
    సంపత్ రాజ్
    సీఐ నాగేంద్ర
    వెన్నెల కిషోర్
    యామిని ఏకపక్ష ప్రేమికుడు
    నాసర్
    జస్టిస్ కృష్ణమూర్తి
    పోసాని కృష్ణ మురళి
    అడ్వ. పార్థసారథి
    సత్య అక్కల
    ఆదిత్య స్నేహితుడు
    సోనియా అగర్వాల్
    సిద్ధార్థ్ మరియు ఆదిత్య తల్లి
    రవి ప్రకాష్
    సిద్ధార్థ్ ఆదిత్య తండ్రి
    పవిత్ర లోకేష్
    కాన్-ఆర్టిస్ట్ మరియు ఆదిత్య భాగస్వామి
    శివన్నారాయణ నారిపెద్ది
    అడ్వ. అప్పాజీ
    సూర్య శ్రీనివాస్ సిద్ధార్థ్ స్నేహితుడు
    చరణ్దీప్
    హెబ్బా పటేల్
    ఐటెమ్ నంబర్
    సిబ్బంది
    కిషోర్ తిరుమల
    దర్శకుడు
    స్రవంతి రవి కిషోర్నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    సమీర్ రెడ్డి
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Sriya Reddy: సలార్ ముద్దుగుమ్మ శ్రియా రెడ్డి అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
    Sriya Reddy: సలార్ ముద్దుగుమ్మ శ్రియా రెడ్డి అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
    శ్రియా రెడ్డి అందానికి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.  సలార్‌లో ఓ పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ నటనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రియారెడ్డి గతంలో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు... కానీ ఈమె మరెవరో కాదు హీరో విశాల్‌కు స్వయాన వదిన.  హీరో విశాల్ సోదరుడు విక్రమ్‌ను పెళ్లి చేసుకున్న ఈ సుందరాంగి.. సినిమాల్లో నటిస్తూ రాణిస్తోంది. లేటు వయసులోనూ తన ఒద్దికైన ఫిజిక్‌తో పెద్దసంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. సలార్ సినిమాలో శ్రియా రెడ్డి.. పృథ్విరాజ్ సవతి తల్లి కూతురిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆమె అందానికి కుర్రకారు దాసోహమంటున్నారు. 40ఏళ్ల వయసులోనూ ఈ ఘాటు అందాలు ఏంటని నెటిజన్స్ తమ కామెంట్లకు పనిచెబుతున్నారు. 2002 నుంచి ఇండస్ట్రీలో ఉన్న శ్రియా రెడ్డికి అవకాశాలు అంతంత మాత్రమే వచ్చినా... తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ బామ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియా రెడ్డి, హాట్ ఫోటో షూట్‌తో కుర్రకారుకు కనువిందు చేస్తుంటుంది. ముఖ్యంగా చీర కట్టులో ఎద అందాల ఆరబోతతో కవ్విస్తుంటుంది. చీరలోనో కాదు మోడ్రన్ డ్రెస్‌లోనూ కావాల్సినంత అందాన్ని అప్పనంగా అభిమానులకు అందిస్తుంటుంది. పదునైన చూపులతో గాలం వేస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది.  ప్రస్తుతం శ్రియారెడ్డి ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్య 1.6మిలియన్ దాటింది. సలార్ మూవీ హిట్‌తో ఈ కుందనపు బొమ్మకు అవకాశాలు దక్షిణాదిలో వెల్లువెత్తుతున్నాయి.  మరి భవిష్యత్‌లో ఈ ఘాటు అందం ఎన్ని సంచలనాలకు వేదిక కానుందో చూడాలి.
    డిసెంబర్ 26 , 2023
    <strong>Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్‌? సందీప్‌ రెడ్డి వంగా మాస్టర్‌ ప్లాన్‌!</strong>
    Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్‌? సందీప్‌ రెడ్డి వంగా మాస్టర్‌ ప్లాన్‌!
    ‘యానిమల్‌’ చిత్రంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్‌ స్కిల్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేశాయి. అర్జున్‌ రెడ్డితో సందీప్‌ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ యానిమల్‌ మూవీతో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో తారక్‌ను సందీప్‌ కలవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘స్పిరిట్‌’ సినిమాకు సంబంధించే తారక్‌ను కలిసినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వచ్చిన ఓ క్రేజీ బజ్‌ టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది.&nbsp; ‘స్పిరిట్‌’లో విలన్‌గా తారక్‌? ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్‌’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ మూవీలో తారక్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా తారక్‌ను సందీప్‌ రెడ్డి వంగా కలిసిన నేపథ్యంలో ఈ రూమర్‌ బయటకొచ్చింది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్‌ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రంలో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్‌ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్‌ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ మూవీలో తారక్‌ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్‌ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్‌’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.&nbsp; ఎక్కడ కలిశారంటే? సందీప్‌ రెడ్డి వంగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలవడంపై రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పిరిట్‌లో తారక్‌ నటిస్తాడా? లేదా? అన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం వీరిద్దరు కలవడానికి ఓ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 9) వీరు కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం తారక్‌ ‘దేవర’ ప్రమోషన్స్‌లో కోసం ముంబయికి వెళ్లారు. రేపు (సెప్టెంబర్ 10) అక్కడే దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజ్ ఉన్న సందీప్‌ రెడ్డి వంగాను తారక్‌ కలిసినట్లు తెలుస్తోంది. వీరు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటో ఆ విధంగా బయటకు వచ్చిందేనని సమాచారం.&nbsp; తారక్‌తో స్పెషల్‌ ఇంటర్యూ! దేవర ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్‌ రెడ్డి వంగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ల మధ్య క్రేజీ ఇంటర్యూ కూడా జరిగినట్లు బాలీవుడ్‌లో మీడియా కోడై కూస్తోంది. ‘దేవర’ సినిమాకు సంబంధించి తారక్‌ను సందీప్‌ రెడ్డి వంగా పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై తారక్‌ అదిరిపోయే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మాస్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ఇద్దరి మధ్య ఇంటర్యూ ఎలా ఉంటుందోనని తారక్‌, సందీప్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ఇంటర్యూ టెలికాస్ట్ అవుతుందని సమాచారం.&nbsp; ట్రైలర్‌ రన్‌టైమ్‌ ఫిక్స్‌! రేపు విడుదల కాబోయే దేవర ట్రైలర్ రన్‌టైమ్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌&nbsp; 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్‌ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్‌ కూడా యాక్షన్‌ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్‌ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    <strong>Ashu Reddy Bold Pics: బ్రా లెస్‌ బ్లేజర్‌లో అషు రెడ్డి ఘాటు అందాలు.. చూస్తే పిచ్చెక్కిపోతారు!</strong>
    Ashu Reddy Bold Pics: బ్రా లెస్‌ బ్లేజర్‌లో అషు రెడ్డి ఘాటు అందాలు.. చూస్తే పిచ్చెక్కిపోతారు!
    జూ.సమంతగా పాపులర్ అయిన అషు రెడ్డి అందాల జాతర చేయడంలో స్టార్‌ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఎప్పటికప్పుడు గ్లామర్‌ డోస్‌ పెంచుతూ సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది. తన అందాలతో నెటిజన్లను కవ్విస్తోంది.&nbsp; తాజాగా రెడ్‌ కలర్‌ బ్లేజర్‌లో అషు అందాల జాతర చేసింది. బ్రా లెస్‌ కోట్‌లో ఉప్పొంగుతున్న ఎద అందాలతో రచ్చ రచ్చ చేసింది.&nbsp; ఘాటైన రెడ్‌ మిర్చిని తలపిస్తూ నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ అమ్మడి మత్తెక్కించే అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.&nbsp; ఇక అషు రెడ్డి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించింది.&nbsp; సోషల్‌ మీడియా రీల్స్‌ ద్వారా అషు తొలుత ఫేమస్‌ అయ్యింది. ఈ క్రమంలోనే జూ.సమంతగా గుర్తింపు పొందింది. 2018లో వచ్చిన 'ఛల్‌ మోహన్‌ రంగ' (Chal Mohana Ranga) చిత్రం ద్వారా అషు తొలిసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాతి ఏడాదే ‘బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3’ (Bigg Boss Telugu)లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది.&nbsp; బిగ్‌బాస్‌తో వచ్చిన ఫేమ్‌తో ‘#పీకే’ (#PK), ‘ఏ మాస్టర్‌ పీస్‌’ (A Masterpiece) వంటి చిత్రాల్లో అషుకి అవకాశం దక్కింది. అదే సమయంలో బుల్లితెర వ్యాఖ్యాతగానూ మారి పలు షోలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసింది. తన అందచందాలతో అలరించింది.&nbsp; ఈ క్రమంలో రామ్‌గోపాల్‌ వర్మతో అషు చేసిన బోల్డ్ ఇంటర్యూ&nbsp; అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.&nbsp; ఆర్జీవీ ఇంటర్యూతో ఈ అమ్మడి పేరు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా మారుమోగిపోయింది.&nbsp; ఇక అషు రెడ్డికి బాగా ఇష్టమైన హీరో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan). అతడి పేరున ఒంటిపై టాటూ కూడా వేసుకుంది. నెట్టింట నిత్యం ట్రెండింగ్‌లో నిలిచే ఈ అమ్మడికి వెండితెర (Tollywood)పై పెద్దగా అవకాశాలు రావడం లేదు.&nbsp; దీంతో తెలుగు పరిశ్రమలోనూ సత్తా చాటేందుకు అషు ప్రయత్నిస్తోంది. అందాల ప్రదర్శనలో రోజు రోజుకు డోస్ పెంచుతోంది. తద్వారా తన గ్లామర్‌తో సిల్వర్‌ స్క్రీన్‌ను ఓ ఊపు ఊపేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు పంపుతోంది.&nbsp; ప్రస్తుతం అషు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    సెప్టెంబర్ 04 , 2024
    Chitrangada Singh: రెడ్‌ కలర్‌ ఔట్‌ ఫిట్‌లో సెగలు పుట్టిస్తోన్న చిత్రాంగద సింగ్‌!
    Chitrangada Singh: రెడ్‌ కలర్‌ ఔట్‌ ఫిట్‌లో సెగలు పుట్టిస్తోన్న చిత్రాంగద సింగ్‌!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మే 17 , 2024
    Cannes Film Festival: రెడ్‌ కార్పెట్‌పై సన్నీ లియోన్ అందాల రచ్చ!
    Cannes Film Festival: రెడ్‌ కార్పెట్‌పై సన్నీ లియోన్ అందాల రచ్చ!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మే 25 , 2023
    సోషల్ మీడియా  స్టార్ అశు రెడ్డి
    సోషల్ మీడియా స్టార్ అశు రెడ్డి
    ]ఇక తెల్లటి బ్రాలో పింక్ పైజామాతో ఫోటోకు పోజు ఇస్తూ వేడి పుట్టిస్తోందీ భామ.Download Our App
    ఫిబ్రవరి 11 , 2023
    అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న అషూ రెడ్డి...
    అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న అషూ రెడ్డి...
    ]బిగ్ బాస్ సీజన్‌తో ఈ బ్యూటీ జాతకమే మారిపోయిందిబిగ్ బాస్ సీజన్‌తో ఈ బ్యూటీ జాతకమే మారిపోయిందిట్రెడీష‌నల్‌తో పాటు ట్రెండీ లుక్‌లోనూ అద‌ర‌గొడుతుంది&nbsp;ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోందిప్రస్తుతం బిగ్‌బాస్ ఓటీటీలో మ‌రోసారి సంద‌డి చేస్తుంది
    అక్టోబర్ 21 , 2022
    <strong>Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా మరో రాజమౌళి కానున్నారా? ఇది చూస్తే నిజమే అంటారు!</strong>
    Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా మరో రాజమౌళి కానున్నారా? ఇది చూస్తే నిజమే అంటారు!
    దేశం గర్వించతగ్గ దర్శకుడిగా దర్శకధీరుడు రాజమౌళి గుర్తింపు సంపాదించారు. పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సినిమా అంటే ఇలా ఉండాలి అనే స్థాయిలో ఇతర దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా ఆస్కార్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డును దేశానికి అందించి సత్తా చాటారు. అయితే రాజమౌళి తర్వాత ప్రస్తుతం ఆ స్థాయిలో వినిపిస్తున్న పేరు సందీప్‌ రెడ్డి వంగాదే. తీసింది మూడే సినిమాలు అయినప్పటికీ ఏ డైరెక్టర్‌కు రానీ అటెన్షన్‌ సందీప్‌కు వస్తోంది. రాజమౌళి తరహాలోనే సందీప్‌ సినిమాలో నటించేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. సందీప్‌ స్టోరీ చెబితే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; యునిక్‌ డైరెక్షన్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను చూపించిన విధానం యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో తీసి మరోమారు హిట్‌ కొట్టాడు. రీసెంట్‌గా రణ్‌బీర్‌ సింగ్‌తో 'యానిమల్‌' (Animal) చిత్రాన్ని తెరకెక్కించి బాక్సాఫీస్‌ వద్ద ప్రకంపనలు సృష్టించాడు. అయితే సందీప్‌ కథ చెప్పే విధానం ఇతర డైరెక్టర్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. హీరో క్యారెక్టర్‌ను చాలా బాగా ఎస్టాబ్లిష్‌ చేస్తాడని చెబుతుంటారు. అతడు డిజైన్‌ చేసే హీరో రోల్స్‌ అభిమానులకు మంచి కిక్‌ ఇస్తాయి. హీరో క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా యునిక్‌ డైరెక్షన్‌లో చూపిస్తుండటంతో సందీప్‌తో వర్క్‌ చేసేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; క్యూ కడుతున్న స్టార్స్‌! ‘యానిమల్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత సందీప్ - ప్రభాస్ కాంబోలో ‘స్పిరిట్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా మరో ప్రాజెక్ట్‌ కన్ఫార్మ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ కూడా రాజమౌళితో సినిమా కంప్లీట్ అయ్యాక సందీప్‌తో మూవీకి ఓకే చెప్పనున్నట్లు సమాచారం. ఇప్పటికే కథను మహేష్‌కు వివరించినట్లు పలు ఇంటర్యూలలో సందీప్‌ తెలిపాడు. అలానే రీసెంట్‌గా తారక్ కూడా సందీప్ రెడ్డితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ కూడా త్వరలోనే సందీప్‌తో మాట్లాడనున్నట్లు మెగా కాంపౌండ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ స్టార్స్ కాకుండా అటు బాలీవుడ్‌లో ‘యానిమల్-2’ ఎలానూ ఉంది. దీనిని బట్టి సందీప్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సందీప్‌తో సినిమా అంటే ఎంత బిజీ షెడ్యూల్‌లో అయినా డేట్స్‌ ఇచ్చేందుకు స్టార్ హీరోలు సిద్ధంగా ఉంటున్నారు. రాజమౌళి తరహాలోనే సందీప్‌ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్ సినీ లవర్స్ కోరుకుంటున్నారు.&nbsp; స్పిరిట్‌ హీరోయిన్‌ ఫిక్స్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ (Kareena Kapoor) ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అయినా కరీనా కపూర్‌ ప్రస్తుతం అడపా దడపా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఓ స్టార్‌ హీరో పక్కన హీరోయిన్‌గా చేయనున్నట్లు వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది. ప్రభాస్‌, కరీనా జోడీ ఎలా ఉంటుందోనని ఇప్పటినుంచే ఫ్యాన్స్‌ ఊహించుకుంటున్నారు. దీనిపై స్పిరిట్‌ యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; ప్రభాస్‌ విలన్‌ మళ్లీ రిపీట్‌! బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్‌ కేరాఫ్‌గా మారుతున్నారు. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్‌ అలీఖాన్‌ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించారు. ఇటీవల రిలీజైన ‘దేవర’ ట్రైలర్‌లో క్రూరంగా కనిపించి ఆకట్టుకున్నారు. స్పిరిట్‌పై వచ్చిన మరో బజ్‌ ప్రకారం సైఫ్‌ అలీఖాన్‌ ఇందులోనూ నెగిటివ్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్‌ పాత్రలో సైఫ్‌ కనిపించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే స్పిరిట్‌లో హీరోయిన్‌ అంటూ రూమర్లు ఎదుర్కొంటున్న కరీనా కపూర్‌.. సైఫ్‌ అలీఖాన్‌కు భార్య. దీంతో భార్య హీరోయిన్‌గా, భర్త విలన్‌గా కనిపిస్తారన్న టాక్‌ ఆసక్తి రేపుతోంది. ఇదే నిజమైతే స్పిరిట్‌పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 24 , 2024
    Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?
    Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?
    యూట్యూబ్‌ స్టార్, బిగ్‌ బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి (Ashu Reddy) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌గా, యాంకర్‌గా ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ అమ్మడు&nbsp; ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలోనూ తరచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. బుల్లితెర నుంచి వెండి తెరకు గుర్తింపు సంపాదించిన అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది? ఆమె ఇష్టాఇష్టాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది? అమెరికాలోని టెక్సాస్‌లో ఆమ జన్మించింది. అషూ రెడ్డి పుట్టిన తేదీ? 15 సెప్టెంబర్‌, 1995 అషూ రెడ్డి స్కూలింగ్ ఎక్కడ జరిగింది? అషూ స్కూలింగ్ అంతా టెక్సాస్‌లో జరిగింది. అక్కడ ఉన్న గిల్మర్‌ హై స్కూల్‌లో ఆమె చదువుకుంది.&nbsp; అషూ రెడ్డి విద్యార్హత ఏంటి? డెల్లాస్‌ బాప్టిస్ట్‌ యూనివర్సిటీలో అషూ.. ఎంబీఏ చేసింది.&nbsp; అషూ రెడ్డి ఎత్తు ఎంత? 5 అడుగుల 4 అంగుళాలు (166 సెం.మీ) అషూ రెడ్డి బరువు ఎంత? 60 కిలోలు అషూ రెడ్డికి సోదరుడు / సోదరి ఉందా? అషూకి ఓ సోదరి ఉంది. ఆమె పేరు దివ్యా రెడ్డి అషూ రెడ్డి వయసు ఎంత? 29 సంవత్సరాలు (2024) అషూ రెడ్డి పూర్తి పేరు ఏంటి? అశ్విని రెడ్డి ప్రస్తుతం అషూ రెడ్డి ఎక్కడ ఉంటోంది? హైదరాబాద్‌ అషూ రెడ్డి ఎలా ఫేమస్ అయ్యింది? సోషల్‌ మీడియాలో రీల్స్‌ ద్వారా అషూ ఫేమస్‌ అయ్యింది. అమెను అంతా జూ.సమంత అని పిలిచేవారు.&nbsp; అషూ రెడ్డి తొలి చిత్రం? ‘ఛల్‌ మోహన్‌ రంగా’ (2018) అషూ రెడ్డి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ ఏది? ఈ భామ 2019లో వచ్చిన తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో పాల్గొంది. ఐదు వారాల పాటు బిగ్‌బాస్‌లో సర్వైవ్‌ అయ్యింది. ఈ బ్యూటీ.. అందం, అభినయం చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అషూకి టెలివిజన్‌ షోలలో వరుసగా అవకాశాలు దక్కాయి.&nbsp; అషూ రెడ్డి ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి? ‘ఛల్‌ మోహన్‌ రంగా’, ‘#పీకే’, ‘ఏ మాస్టర్‌ పీస్‌ (రైజ్‌ ఆఫ్‌ సూపర్‌ హీరో)’ అషూ రెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్యూ ఏది? రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma)ను అషూ రెడ్డి చేసిన ఇంటర్యూ అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది. ఇందులో చాలా అడల్ట్ ప్రశ్నలు ఉన్నాయి. అషూ రెడ్డి హాబీలు ఏంటి? ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడం ఈ భామకు చాలా ఇష్టమట. అషూ రెడ్డి ఫేవరేట్‌ హీరో? ఈ భామ ఫేవరేట్‌ హీరో పవన్‌ కల్యాణ్‌. తన శరీరంపై పవన్‌ పేరును టాటూ సైతం వేయించుకుంది.&nbsp; అషూ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఏది? https://www.instagram.com/ashu_uuu/ https://www.youtube.com/watch?v=cmlVZwZOdeg
    ఏప్రిల్ 23 , 2024
    Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌తో వివాహ బంధంలోకి స్నేహరెడ్డి అడుపెట్టి నేటికి 13 వసంతాలు పూర్తయ్యాయి. టాలీవుడ్‌లో ఎంతో మంది సెలబ్రెటీల చేత ఐకానిక్ జంటగా స్నేహ రెడ్డి- బన్నీ జంట గుర్తింపు పొందింది. కేవలం ఓ స్టార్ హీరో భార్యగా మాత్రమే  కాకుండా స్నేహా రెడ్డి తనకంటూ  ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్‌పై తనకున్న అభిరుచి ఇతర దృక్కొణాలు ఆమెను లేడీ ఐకానిక్ స్టార్‌గా నిలిపాయి. ఈక్రమంలో స్నేహా రెడ్డి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫాలోయింగ్‌లో తగ్గేదేలే  స్నేహరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్‌స్టాగ్రాంలో స్నేహాకు ఏకంగా  9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.  అందంలోనూ టాప్ ప్రస్తుతం స్నేహారెడ్డి వయసు 38. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం తనది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా ఇప్పటికీ స్నేహా రెడ్డి ఫిట్‌గా ఉంటారు.&nbsp; రోజూ సాయంత్రం కేబీఆర్ పార్కులో రన్నింగ్ ఆమె డైలీ హ్యాబిట్ ఫ్యాషన్ ఐకాన్ ఏ సెలబ్రెటీతో పోల్చినా ఫ్యాషన్‌లో ఓ మెట్టు పైనే ఉంటుంది. ఇటీవలే సిల్వర్ ఆకులతో ఎంబ్రాయిడరీ చేయించిన చీరను స్నేహా రెడ్డి ధరించింది. దీని ధర సుమారు రూ.1.45కోట్లు ఉంటుందని అంచనా  ప్రతిరోజు యోగా చేయడం స్నేహ దినచర్య. యోగా మెళకువలు, ఫ్యాషన్ టిప్స్ అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది. యాక్టివ్ రెస్పాన్స్ ఫుడ్, ట్రావెల్ అంటే స్నేహా రెడ్డికి మక్కువ. ఎప్పుడూ వీటికి సంబంధించిన అంశాలను తను షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉంటుంది. సినిమాల్లోకి స్నేహరెడ్డి? ఇంత అందం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్నేహా రెడ్డి త్వరలో మేకప్ వేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి బన్నీ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. మలయాల సినిమాతో స్నేహా రెడ్డి ఎంట్రీ ఉంటుందట. ఓ స్టార్ హీరో సరసన నటించనున్నట్లు సమాచారం. మలయాళంలో అల్లు అర్జున్‌కి క్రేజ్ ఎక్కువ. అందుకే తన డెబ్యూ సినిమాకు అక్కడ ప్లాన్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్నేహా రెడ్డి తెరంగేట్రం చేస్తే మరింత అభిమానాన్ని సొంతం చేసుకోగలదు.
    మార్చి 06 , 2024
    Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా!
    Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా!
    సంచలనాలకు మారుపేరుగా మారిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) జాతీయ స్థాయిలో మరోమారు సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIFF) - 2024 అవార్డు కైవసం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచాడు. మంగళవారం రాత్రి ముంబయిలో జరిగిన ఈ అవార్డు వేడుకల్లో ఉత్తమ దర్శకుడు విభాగంలో సందీప్‌ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నాడు. ‘యానిమల్‌’ (Animal) చిత్రానికి గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. అటు ‘జవాన్’ మూవీలో డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టిన షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందాడు. ఇక అదే సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్‌ నయనతార (Nayanthara) ఉత్తమ నటి అవార్డు అందుకుంది. నెట్టింట సందీప్‌ మేనియా ప్రతిష్టాత్మక DPIFF అవార్డు అందుకోవడంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా పేరు నెట్టింట మారుమోగుతోంది. #SandeepReddyVanga హ్యాష్‌ట్యాగ్‌తో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ప్రధానంగా దాదా సాహేబ్‌ అవార్డు అందుకుంటున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను పలువురు ప్రముఖులు, సందీప్‌ రెడ్డి ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1760151102740464016 https://twitter.com/i/status/1760137348128358646 ‘నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా’ సందీప్‌ రెడ్డి వంగాకు తనపైన తనకు నమ్మకం ఎక్కువ. ఆ విశ్వాసం వల్లే యూనిక్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయగల్గుతున్నారు. మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వచ్చినప్పటికీ తన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే సందీప్‌లోని ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టే ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాపై అప్పట్లో మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఓ న్యూస్ ఛానెల్‌ ప్రతినిధి సందీప్‌ వద్ద లేవనెత్తగా.. అందుకు సందీప్‌ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు ఏంటో కింద వీడియోలో చూడండి. https://twitter.com/i/status/1758682406754861236 సందీప్‌ ఫేవరేట్‌ స్టార్లు వారే! సందీప్‌ రెడ్డి వంగా.. ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కావడంపై మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. గతంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను ఉద్దేశించి సందీప్‌ మాట్లాడిన వీడియోను ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో తాను చిరు, పవన్‌లకు పెద్ద ఫ్యాన్ అని సందీప్‌ చెబుతాడు. తన గురించి కొంత సమాచారం తెలిసిన వారికైనా ఈ విషయం తెలుస్తుందని పేర్కొంటాడు. చిరంజీవి ఫ్యాన్స్‌ అందరికీ కాంపీటిషన్‌ పెడితే తాను ఫస్ట్‌ వస్తానని ఓ అవార్డు వేడుకలో సైతం సందీప్‌ స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1757377128511778830 ఓ వైపు విమర్శలు.. మరోవైపు అవార్డులు గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షించింది. రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ ఈ సినిమా దుమ్ము రేపింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. థియేటర్లలోనే కాదు తర్వాత ఓటీటీలోనూ యానిమల్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమాగా యానిమల్‌ నిలవడం విశేషం. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చినా అదే స్థాయిలో అవార్డులు, రివార్డులు కూడా అందుకోవడం విశేషం.&nbsp; సందీప్‌పై హీరోయిన్‌ సెటైర్! డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు దాదా సాహేబ్ అవార్డు రావడంతో హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. 'మిసోజినీ (మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేసే వ్యక్తి)కి అవార్డుకు వచ్చిందని విన్నా. దీనిపై కేవలం 'యానిమల్స్' మాత్రమే నిర్ణయం తీసుకోగలవు. ఇది ప్రమాదానికి సంకేతం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం పూనం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సందీప్‌ రెడ్డి ఫ్యాన్స్‌ పూనం పోస్టును తప్పుబడుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన సందీప్ రెడ్డి వంగా ఎదుగుదలను ఆపలేరని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; మిగతా అవార్డులు.. ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే.. ఉత్తమ విలన్ అవార్డు కూడా యానిమల్ చిత్రానికే వరించడం విశేషం. విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా బాబీ డియోల్ (ANIMAL) అవార్డు అందుకున్నారు. అటు క్రిటిక్స్‌ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌), ఉత్తమ గీత రచయితగా జావేద్‌ అక్తర్‌ (నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (మేల్)గా వరుణ్‌ జైన్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (ఫీమేల్)గా శిల్పా రావు ఎంపికయ్యారు. ఇక ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ అవార్డు ఏసుదాసుకి, ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్ మౌషుమీ ఛటర్జీలకు దక్కాయి. టీవీ విభాగంలో.. అటు టెలివిజన్‌ విభాగంలో దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డుల విషయానిసి వస్తే.. టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌‌గా ‘ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌’ నిలిచింది. ఉత్తమ నటుడిగా ‘నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌), ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ (అనుపమ) అవార్డులు అందుకున్నారు. ఇక వెబ్‌సిరీస్‌ విభాగంలో క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్‌) నిలిచారు.
    ఫిబ్రవరి 21 , 2024
    5 Reasons to watch “వీరసింహా రెడ్డి”
    5 Reasons to watch “వీరసింహా రెడ్డి”
    ]సంక్రాంతికి బాలయ్య 11 హిట్లు కొట్టాడు. మరోసారి అదే రేసులో నిలబడ్డాడు. చిరంజీవీతోనూ దాదాపు 10వ సారి &nbsp;సై అంటున్నాడు. ఈసారి ఆధిపత్యం ఎవరిదో చూడాలి మరి.కలిసొచ్చే కాలం
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Spirit Movie: ‘స్పిరిట్‌’ కోసం గట్టిగానే ప్లాన్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌!&nbsp;</strong>
    Spirit Movie: ‘స్పిరిట్‌’ కోసం గట్టిగానే ప్లాన్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌!&nbsp;
    ‘యానిమల్‌’ (Animal) చిత్రంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్‌ స్కిల్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేశాయి. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy)తో సందీప్‌ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ ‘యానిమల్‌’తో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా స్పిరిట్‌ నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; భారీ బడ్జెట్‌తో.. ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.&nbsp; ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్‌ పరంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా 'స్పిరిట్‌' నిలవనుంది.&nbsp; రెమ్యూనరేషన్లకే రూ.600 కోట్లు! ‘స్పిరిట్‌’కు కేటాయించనున్న బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల టాక్‌. ఎందుకంటే ప్రభాస్‌ ఇందులో డ్యూయల్‌ రోల్‌ పోషించనున్నాడు. కాబట్టి ఆ మాత్రం రెమ్యూనరేషన్‌ తీసుకోవడం సమంజసమే అంటున్నారు. అదే విధంగా బాలీవుడ్‌ స్టార్స్‌ అనిల్‌ కపూర్‌ (Anil Kapoor), సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan), కరీనా కపుర్‌ (Kareena Kapoor) ఇందులో స్పెషల్‌ రోల్స్ చేస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పారితోషికానికి ఆ మాత్రం బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక మూవీ మేకింగ్‌ కోసం రూ.300 కోట్లు, గ్రాఫిక్స్‌ కోసం రూ.120-150 కోట్లు, ప్రమోషన్స్‌కు మరో రూ.50-80 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. మమ్ముట్టీ స్పెషల్‌ రోల్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ఓ స్టార్‌ హీరో నటించబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథకు ఆ పాత్ర ఎంతో కీలకం కానుందని అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్‌ కపుల్‌ సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే కొరియన్‌, చైనీస్‌ స్టార్స్‌ కూడా ఇందులో నటిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి.&nbsp;&nbsp; పోలీసు vs మాఫియా డాన్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్‌ కనిపిస్తారని సమాచారం. డాన్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్‌. మరోవైపు ప్రభాస్‌ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’ సిరీస్‌లోనూ డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్‌’లోనూ ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
    అక్టోబర్ 08 , 2024
    <strong>Tollywood Top 10: ‘సైరా నరసింహ రెడ్డి’ని బీట్‌ చేయలేకపోయిన ‘దేవర’.. తెలుగులో టాప్‌-10 ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చిత్రాలు ఇవే!</strong>
    Tollywood Top 10: ‘సైరా నరసింహ రెడ్డి’ని బీట్‌ చేయలేకపోయిన ‘దేవర’.. తెలుగులో టాప్‌-10 ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చిత్రాలు ఇవే!
    తారక్‌ లేటెస్ట్ చిత్రం 'దేవర' రిలీజ్‌కు ఇంకో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే మూవీ టీమ్‌ కూడా వరుసగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై భారీగానే హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే దేవరకు సంబంధించిన రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఎన్నడూ లేనివిధంగా థియేట్రికల్‌ బిజినెస్‌ నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ దేవర ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఎంత? బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎన్ని కోట్లు? తెలుగులో ఇప్పటివరకూ అత్యధిక ప్రిరీలిజ్‌ బిజినెస్‌ చేసిన టాప్‌-10 చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; దేవర ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్​లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్​లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్‌ వసూలు చేస్తే బ్రేక్‌ ఈవెన్ అవుతుంది.&nbsp; ముఖ్య అతిథులుగా స్టార్‌ డైరెక్టర్స్‌! దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ వేదికగా ఈ నెల 22న ఈవెంట్ జరగనుంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ వేడుకకు ముగ్గురు స్టార్‌ డైరెక్టర్లు హాజరుకానున్నట్లు సమాచారం. దర్శకధీరుడు రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌, త్రివిక్రమ్‌ ఈవెంట్‌లో పాల్గొంటారని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అదే విధంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా ఈవెంట్‌కు హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే దేవర టీమ్‌ ప్రమోషన్స్‌ పరంగా నార్త్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్స్‌తోపాటు మహేష్‌ను గెస్ట్‌గా పిలవడం ద్వారా ఆ విమర్శల నుంచి బయటపడాలని దేవర టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం.&nbsp; ప్రీరిలీజ్ బిజినెస్‌లో టాప్ మూవీస్ ఇవే ఒకప్పుడు ప్రీరిలీజ్‌ బిజినెస్ అంటే బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే సాధ్యమన్న ఆలోచనలో తెలుగు ఆడియన్స్‌ ఉండేవారు. దర్శకధీరుడు రాజమౌళి దీనిని పూర్తిగా మార్చివేశారు. ప్రీరిలీజ్‌ బిజినెస్‌ రికార్డులకు కేరాఫ్‌గా టాలీవుడ్‌ను మార్చారు. అలవోకగా 350 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్‌ చేస్తూ తెలుగు చిత్రాలు సత్తా చాటాడు. తెలుగులో అత్యధిక ప్రిరీలిజ్‌ బిజినెస్‌ చేసిన టాప్‌ -10 చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ అత్యధిక ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసిన తెలుగు చిత్రంగా టాప్‌లో నిలిచింది. డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కలిపి ఆర్‌ఆర్‌ఆర్‌కు దాదాపు రూ.480 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.191 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. ఇప్పటి&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ. 385 కోట్ల వ్యాపారం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.180 కోట్లు, ఓవర్సీస్‌లో 70 కోట్లు, హిందీలో రూ.85 కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.&nbsp; బాహుబలి 2 (Bahubali 2) దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా కీలకపాత్రలు పోషించిన చిత్రం బాహుబలి 2. బాహుబలికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.350 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను రూ.190 కోట్లకు పైగా విక్రయించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. సలార్‌ (Salaar) కేజీఎఫ్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ అనే చిత్రాన్ని తీశాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.120 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా. సాహో (Sahoo) బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్మరేపింది. సాహోకు ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.280 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ ఇండియాలో ఏకంగా రూ.120 కోట్ల వ్యాపారం చేసి అప్పట్లో సాహో రికార్డ్ క్రియేట్ చేసింది&nbsp; ఆదిపురుష్‌ (Adipurush) ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మూవీ ‘ఆదిపురుష్’. రామాయణాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్మ తల్లిగా నటించారు. మైథలాజికల్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా అందుకు తగినట్లుగానే బిజినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద ఈ సినిమా రూ.240 కోట్లకు పైగా వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి రాధేశ్యామ్ (RadheShyam) ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ హీరో ప్రభాస్‌ను కంప్లీట్ డిఫరెంట్‌ లుక్‌లో చూపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.107 కోట్ల వ్యాపారం చేసి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది. సైరా నర్సింహారెడ్డి (Saira Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఏకంగా 187.25 కోట్లకు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. మెగాస్టార్‌ కెరీర్‌ అత్యధిక ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చిత్రంగా అవతరించింది. ఇక ఈ సినిమా తెలుగులో మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటడం గమనార్హం. దేవర (Devara) కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 రిలీజ్‌కు ముందు రూ.185 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసి ఈ జాబితాలో టాప్‌-9లో చోటు సంపాదించింది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే (సోలో హీరోగా) హయ్యెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; పుష్ప (Pushpa) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించిన ‘పుష్ప: ది రైజ్‌’ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐదు భాషల్లోని థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ఇలా అన్ని కలిపి దాదాపు రూ.160 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా.
    సెప్టెంబర్ 21 , 2024
    Ashu Reddy Hot: ఎద పొంగులతో రెచ్చిపోయిన హాట్‌ యాంకర్‌ అషు రెడ్డి..!
    Ashu Reddy Hot: ఎద పొంగులతో రెచ్చిపోయిన హాట్‌ యాంకర్‌ అషు రెడ్డి..!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మే 21 , 2024
    AA23: అల్లు అర్జున్‌, సందీప్‌ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్‌ లైనప్స్‌
    AA23: అల్లు అర్జున్‌, సందీప్‌ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్‌ లైనప్స్‌
    ]మరిన్ని ఇంట్రెస్టింగ్ &nbsp;వెబ్‌స్టోరీల&nbsp; కోసం లింక్‌ని క్లిక్ చేయండి.Watch Now
    మార్చి 03 , 2023
    శర్వానంద్- రక్షితారెడ్డి నిశ్చితార్థం... రక్షితా రెడ్డికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?
    శర్వానంద్- రక్షితారెడ్డి నిశ్చితార్థం... రక్షితా రెడ్డికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?
    ]ఎంగియం ఏ పొద్దుం అనే తమిళ సినిమాలో నటించి బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరీలో SIIMA అవార్డు సాధించాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది.అవార్డులు ?
    ఫిబ్రవరి 11 , 2023
    <strong>Spirit Movie: ఒక్క కామెంట్‌తో ‘స్పిరిట్‌’పై అంచనాలు పెంచేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే!</strong>
    Spirit Movie: ఒక్క కామెంట్‌తో ‘స్పిరిట్‌’పై అంచనాలు పెంచేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. అటు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్‌' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సందీప్‌ రెడ్డి వంగా చేసిన తాజా కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘నా బెస్ట్ ఏంటో చూపిస్తా’ డేరింగ్ డాషింగ్‌ డైరెక్టర్‌ పేరు తెచ్చుకున్న సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ప్రభాస్‌ ఒక్కరే ఫిక్స్‌ కాగా ఇతర నటీనటులను ఫైనల్‌ చేసే పనిలో సందీప్‌ ఉన్నారు. అయితే స్పిరిట్‌ ఎలా ఉండబోతుందోనన్న దానికి సందీప్‌ తాజాగా ఒక హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నారు. ‘కొందరు యానిమల్‌ నా బెస్ట్ వర్క్‌ అంటున్నారు. నా బెస్ట్ వర్క్‌ ఏంటో స్పిరిట్‌లో చూస్తారు’ అని సందీప్‌ రెడ్డి వంగా అన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. సందీప్‌ తీసిన ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’ చిత్రాలకంటే 'స్పిరిట్‌' అత్యుత్తమంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు ఇంకో రూ.1000 కోట్లు లోడింగ్‌ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by FilmyScoops | తెలుగు (@filmyscoops) విలన్‌గా కొరియన్‌ సూపర్‌ స్టార్? ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్‌ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు డాంగ్ సూక్ (డాన్ లీ) కనిపించబోతున్నారని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘ద ఔట్ లాస్’, ‘ద రౌండప్’ వంటి సూపర్ హిట్స్​తో డాంగ్ సూ (Ma Dong-seok) వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. కొరియాలో అతడు చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం ఓటీటీ వేదికగా భారతీయ భాషల్లో డబ్‌ కూడా అవుతున్నాయి. దీంతో భారత్‌లోనూ అతడికి మంచి క్రేజ్ ఏర్పడింది. కాబట్టి ప్రభాస్‌ విలన్‌గా డాంగ్ సూ గనుక నటిస్తే స్పిరిట్‌ ప్రాజెక్ట్ గ్లోబల్‌ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పారు. అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్‌, లుక్‌తో పాటు మేన‌రిజ‌మ్స్ కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు సందీప్ వంగా తెలిపాడు. ఇక ‘స్పిరిట్‌’ స్క్రిప్ట్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
    జూలై 17 , 2024
    Allu Sneha Reddy: క్యూట్ కపుల్‌ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ పెళ్లికి 12 ఏళ్లు
    Allu Sneha Reddy: క్యూట్ కపుల్‌ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ పెళ్లికి 12 ఏళ్లు
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 06 , 2023
    Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
    Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
    యానిమల్‌’ (Animal) చిత్రంతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. యాక్షన్‌ ప్రియులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ఈ సినిమాకు ‘యానిమల్‌ పార్క్‌’(Animal Park) అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.&nbsp; విలన్‌గా స్టార్‌ హీరో! ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా రణ్‌బీర్‌ను పోలిన వ్యక్తినే ఉంటాడని తొలి పార్ట్‌ క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా చూపించారు. అయితే తాజా బజ్‌ ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో.. అందులో ప్రతినాయకుడిగా కనిపిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. షారుక్‌ ఖాన్‌ 'డంకీ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన 'విక్కీ కౌశల్‌' (Vicky Kaushal).. యానిమల్‌ పార్క్‌లో మెయిన్‌ విలన్‌గా చేయనున్నట్లు రూమర్స్‌ మెుదలయ్యాయి. ఇదే నిజమైతే రణ్‌బీర్‌ వర్సెస్‌ విక్కీ కౌశల్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. వీరిద్దరు ప్రత్యర్థులు అయితే తెరపై విధ్వంసమేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; ‘యానిమల్‌ పార్క్‌’ ఇప్పట్లో లేనట్లే! 'యానిమల్‌' సినిమా దెబ్బకు దేశంలోని టాప్‌ డైరెక్టర్ల జాబితాలోకి సందీప్‌ రెడ్డి వంగా చేరిపోయాడు. ప్రస్తుతం అతడు యానిమల్‌ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే సందీప్‌ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై చాలా రోజుల నుంచి స్పష్టత లేదు. ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని ఇప్పటికే సందీప్ ఇప్పటికే ప్రకటించగా.. మరోవైపు యానిమల్‌ పార్క్‌కు సంబంధించిన కథను కూడా అతడి టీమ్‌ సిద్ధం చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాల్లో తొలుత ఏది పట్టాలెక్కుతుందోనన్న సందేహం సినీ వర్గాల్లో ఏర్పడింది. అయితే దీనిపై తాజాాగా సందీప్‌ క్లారిటీ ఇచ్చాడు. ఓ వేడుకలో పాల్గొన్న సందీప్‌.. యానిమల్‌ పార్క్‌ ఇప్పట్లో రాదని క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్‌ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.&nbsp; యానిమల్‌ సీక్వెల్ లక్ష్యమదే! గతంలో ‘యానిమల్‌’ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. ‘యానిమల్‌ పార్క్‌లో ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది. ‘యానిమల్‌’ చిత్రం ప్రేక్షకుల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన అత్యంత సాహసోపేతమైన.. అసాధారణమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అన్నారు.&nbsp; ‘విక్కీ కౌశల్‌’ ఎవరో తెలుసా? యానిమల్‌ పార్క్‌లో విక్కీ కౌశల్‌ విలన్‌గా చేస్తారన్న వార్తలతో సోషల్‌ మీడియాలో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. విక్కీ గురించి తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, బాలీవుడ్‌లో అతడు స్టార్‌ హీరో. ప్రముఖ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ (Katrina Kaif)కు స్వయాన భర్త. 2019లో వచ్చిన ‘ఉరి’ (Uri: The Surgical Strike) సినిమా ముందు వరకూ చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన విక్కీ ఆ సినిమాతో స్టార్‌ హీరోగా మారిపోయాడు. రీసెంట్‌గా షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ చిత్రంలో సుఖి పాత్రలో అదరగొట్టాడు.
    ఫిబ్రవరి 29 , 2024

    @2021 KTree