రివ్యూస్
How was the movie?
తారాగణం
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sivakarthikeyan_250_250.jpeg)
శివకార్తికేయన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Keerthy_Suresh.jpeg)
కీర్తి సురేష్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Anson_Paul_250_250.jpeg)
అన్సన్ పాల్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sathish.jpeg)
సతీష్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/K_S_Ravikumar_OOoksuwbaSBne6KU_250_250.jpeg)
కెఎస్ రవికుమార్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Saranya_Ponvannan.jpeg)
శరణ్య పొన్వన్నన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Motta_Rajendran_250_250.jpeg)
రాజేంద్రన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Yogi_Babu_250_250.jpeg)
యోగి బాబు
అరుణ్రాజా కామరాజ్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Aadukalam_Naren_250_250.jpeg)
ఆడుకలం నరేన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Mayilsamy_250_250.jpeg)
మయిల్సామి
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Swaminathan_250_250.jpeg)
స్వామినాథన్
బేబీ రక్షా చౌహాన్
కల్యాణి నటరాజన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Pratap_Pothen_250_250.jpeg)
ప్రతాప్ పోతేన్
ప్రియదర్శిని రాజ్కుమార్
సరోజ
టి.ఎస్.ఆర్
మిప్పు
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sri_Divya.jpeg)
శ్రీ దివ్య
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Raju_Sundaram_NRGu7R5Xy64f9vZ0_250_250.jpeg)
రాజు సుందరం
బక్కియరాజ్ కన్నన్ సిరికాద్ధే &తమిళ్ సెల్వి పాటలో ప్రత్యేక పాత్రలో కనిపించారు
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/S._J._Suryah.jpeg)
S. J. సూర్య
సిబ్బంది
బక్కియరాజ్ కన్నన్
దర్శకుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/R._D._Raja.jpeg)
ఆర్డి రాజా
నిర్మాత![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Anirudh_Ravichander_250_250.jpeg)
అనిరుధ్ రవిచందర్
సంగీతకారుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/P._C._Sreeram.jpeg)
P. C. శ్రీరామ్
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
![కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/08115514/123.-76.jpg)
కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే కీర్తి సురేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Keerthy Suresh) విషయాలు ఇప్పుడు చూద్దాం.
కీర్తి సురేష్ దేనికి ఫేమస్?
కీర్తి సురేష్.. మహానటి, సర్కారువారి పాట వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
కీర్తి సురేష్ వయస్సు ఎంత?
1992, అక్టోబర్ 17న జన్మించింది. ఆమె వయస్సు 31 సంవత్సరాలు
కీర్తి సురేష్ ముద్దు పేరు?
కీర్తమ్మ
కీర్తి సురేష్ ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
కీర్తి సురేష్ ఎక్కడ పుట్టింది?
చెన్నై
Screengrab Instagram: keerthysureshofficial
కీర్తి సురేష్కు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
కీర్తి సురేష్ అభిరుచులు?
యోగ, ట్రావెలింగ్, స్మిమ్మింగ్
కీర్తి సురేష్కు ఇష్టమైన ఆహారం?
దోశ
కీర్తి సురేష్ అభిమాన నటుడు?
సూర్య, విజయ్
తెలుగులో కీర్తి సురేష్ తొలి సినిమా?
నేను శైలజ(2016)
కీర్తి సురేష్ నటించిన తొలి తెలుగు సినిమా?
శ్రీ
కీర్తి సురేష్ ఏం చదివింది?
ఫ్యాషన్ డిజైన్లో BA హానర్స్
Courtesy Instagram: Keerthy suresh
కీర్తి సురేష్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.3 కోట్లు వరకు ఛార్జ్ చేస్తోంది.
కీర్తి సురేష్ తల్లిదండ్రుల పేర్లు?
సురేష్ కుమార్, మేనక
కీర్తి సురేష్కు అఫైర్స్ ఉన్నాయా?
తమిళంలో కమెడియన్ సతీష్తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.
కీర్తి సురేష్ ఎన్ని అవార్డులు గెలిచింది?
మహానటి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ అందుకుంది.
తమన్నా భాటియా ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/keerthysureshofficial/?hl=en
కీర్తి సురేష్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది?
ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు
కీర్తి సురేష్ ఫెవరెట్ హీరోయిన్
సిమ్రాన్
కీర్తి సురేష్ గురించి మరికొన్ని విషయాలు
కీర్తి సురేష్ తండ్రి సురేష్, మలయాళం మెగాస్టార్ మమ్మూటి ఇద్దరు కాలేజీ రోజుల్లో క్లాస్మెట్స్ తన స్కూల్ డేస్లో కీర్తి సురేష్ అనేక స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని చాలా అవార్డులు గెలుచుకుంది.కీర్తి సురేష్ సోదరి రేవతి మంచి VFX స్పెషలిస్ట్, షారుక్ ఖాన్కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థలో పనిచేస్తోంది.కీర్తి సురేష్ తండ్రి ఫిల్మ్ మేకర్ కాగా ఆమె తల్లి మేనక 100కు పైగా చిత్రాల్లో నటించింది.
https://www.youtube.com/watch?v=dCuIkapXKDY
ఏప్రిల్ 16 , 2024
![<strong>Laila Movie : అమ్మాయి గెటప్లో విశ్వక్ సేన్.. హీరోయిన్స్ను తలదన్నేలా మేకోవర్! </strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/03141909/123.-2024-07-03T141845.399.jpg)
Laila Movie : అమ్మాయి గెటప్లో విశ్వక్ సేన్.. హీరోయిన్స్ను తలదన్నేలా మేకోవర్!
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).. విభిన్న తరహా చిత్రాలకు కేరాఫ్గా మారిపోయాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విశ్వక్.. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్తో రాబోతున్నాడో అని ఆడియన్స్లో ఆసక్తి ఏర్పడింది. అయితే తాజాగా ఈ యంగ్ హీరో.. తన కొత్త సినిమాను మెుదలు పెట్టారు. ఈ మూవీలో విశ్వక్ పాత్రకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కాగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటివరకూ చేయని గెటప్లో విశ్వక్ ఈ పోస్టర్లో కనిపించాడు.
‘లైలా’గా విశ్వక్ సేన్..
ప్రస్తుతం విష్వక్ సేన్.. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. షైన్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ మూవీకి 'లైలా' (Laila Movie) అనే టైటిల్ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం జరగ్గా.. ఫస్ట్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో విశ్వక్ లేడీ గెటప్లో కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే క్లోజ్గా ఫేస్లో కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ను రిలీజ్ చేసారు. కెరీర్లో తొలిసారి ఓ లేడీ గెటప్లో విశ్వక్ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. అమ్మాయిగా విశ్వక్ సేన్ భలే క్యూట్గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్లను తలదన్నే అందంతో కనిపించి సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాడని పోస్టులు పెడుతున్నారు. తమ హీరో డేరింగ్ డెసిషన్కు సెల్యూట్ అంటూ పోస్టర్ను వైరల్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా తప్పక విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
https://twitter.com/pudiharicharan/status/1808373415163973920
రిలీజ్ ఎప్పుడంటే..!
తాజాగా పూజా కార్యక్రమం జరుపుకున్న 'లైలా' చిత్రం.. త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విశ్వక్కు జోడీగా ఆకాంక్ష శర్మ (Akanksha Sharma)నటించనుంది. ఈ మూవీని వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న (Laila Movie Release Date Announced) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన ప్రధాన తారాగణాన్ని కూడా ఫైనల్ చేసి.. షూటింగ్ మెుదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు మెుదలు పెట్టింది. ఈ మూవీ విశ్వక్ కెరీర్లోనే మరుపురాని చిత్రంగా మిగిలిపోతుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
https://twitter.com/AndhraBoxOffice/status/1808389179472060518
‘రెమో’ తరహాలో మేకోవర్!
విశ్వక్ సేన్ లేటెస్ట్ ‘లైలా’ పోస్టర్.. తమిళ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన 'రెమో' (Remo) చిత్రాన్ని గుర్తు చేస్తోంది. బక్కియారాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా చేసింది. ఇందులో కూడా హీరో శివకార్తికేయన్.. అందమైన అమ్మాయి గెటప్లో కనిపిస్తాడు. హీరోయిన్ను ఇంప్రెస్ చేసే క్రమంలో సినిమా మెుత్తం ఆ పాత్రలోనే అలరిస్తాడు. అయితే విశ్వక్ సేన్ కూడా లైలాలో ఎక్కువ నిడివి లేడీ గెటప్లోనే కనిపించే అవకాశముందని అంటున్నారు. లైలా పోస్టర్లోని అతడి మేకోవర్ చూస్తే.. ఏదో ఒక సీన్ కోసం చేసినట్లు కనిపించడం లేదు. అచ్చమైన అమ్మాయిలాగా కనిపించేలా అతడి మేకోవర్ను డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
‘మెకానిక్ రాకీ’గా విశ్వక్..
ప్రస్తుతం విశ్వక్ సేన్.. 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky) అనే ప్రాజెక్ట్లో నటిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్ పాత్ర.. చాలా పవర్ఫుల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్లో రానున్న చిత్రంలో.. విశ్వక్కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) కనిపించనుంది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా విశ్వక్ సేన్ కేరీర్లో 10వ మూవీగా రానుంది. ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
జూలై 03 , 2024
![CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/17114719/kk-main_5d3180c8c6e00.jpg)
CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!
విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు జాన్ కెన్నడీ విక్టర్. ఆయన ఎవరో కాదు చియాన్ విక్రమ్. ఎలాంటి గెటప్నైనా వేసి నటనతో మెప్పించగలిగిన సామర్థ్యం ఈ హీరోది. ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. చియాన్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో మర్చిపోలేని క్యారెక్టర్లతో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు విక్రమ్. అతడికి పేరు సంపాదించి పెట్టిన కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలుసుకోండి.
శివ పుత్రుడు
పితమగాన్ సినిమాను తెలుగులో శివ పుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమాయకుడి పాత్రలో చియాన్ విక్రమ్ అదరగొట్టాడు. క్రూరంగా కనిపిస్తూ జాలి, దయ కలిగున్న మనిషిగా నటించాడు. రస్టీ లుక్లో విక్రమ్ నటనకు జాతీయ అవార్డు లభించింది. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య కూడా మరో క్యారెక్టర్లో నటించాడు.
అపరిచితుడు
శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్లో చేశాడు. తప్పులను ప్రశ్నించే అమాయకమైన రామానుజం, తప్పు చేసిన వారిని శిక్షించే అపరిచితుడు, ప్రియురాలి ప్రేమ కోసం తపించే రెమో క్యారెక్టర్లో నటనతో ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
మల్లన్న
విక్రమ్ సినిమా తీస్తున్నాడంటే ఏదో ప్రత్యేకత ఉందని అభిమానులు భావించేలా చిత్రాల్ని ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మల్లన్న చిత్రంలోనూ వివిధ గెటప్లతో అలరించాడు చియాన్. కోడి మాస్క్ ధరించి నటించడంతో పాటు లేడీ గెటప్లోనూ నటించాడు. కానీ, సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఐ
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్ చేసిన రోల్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇందులో విచిత్రమైన వ్యాధి సోకి వృద్ధాప్యం వచ్చిన పాత్రలో మెప్పించాడు విక్రమ్. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. ఓ పాటలో బీస్ట్ గెటప్లోనూ మెరిశాడు. బాడీ బిల్డర్గానూ నటించిన ఈ టాప్ హీరో… చాలా రోజుల పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకున్నట్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
నాన్న
విక్రమ్ కెరీర్లో నాన్న సినిమా ప్రత్యేకం. సరైన మతిస్థిమితం లేని వ్యక్తి కుమార్తెతో కలిసి ఉండే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో విక్రమ్ చేసిన క్యారెక్టర్కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తండ్రి, కూతురు మధ్య కేవలం సైగలతో వచ్చే సీన్ ఇప్పటికే చాలామందిని మెప్పించింది.
ఇంకొక్కడు
ఇరుముగన్గా వచ్చిన తమిళ్ సినిమా తెలుగులో ఇంకొక్కడు పేరుతో అనువాదం అయ్యింది. ఇందులో రెండు క్యారెక్టర్స్లో విక్రమ్ కనిపించాడు. లేడీ విలన్ రోల్లో అదరగొట్టాడు. ఆ గెటప్ చూస్తే నిజంగా విక్రమ్ ఇలాంటి రోల్ చేశాడా అనిపిస్తుంది. అంతలా మెప్పించాడు విక్రమ్. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది.
తంగలాన్
విక్రమ్ తదుపరి చిత్రం తంగలాన్. ఇందులో మాస్ లుక్లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
https://telugu.yousay.tv/thangalan-the-chian-mark-terror.html
ఏప్రిల్ 18 , 2023
![రెమ్యూనరేషన్ను భారీగా పెంచేసిన సీతారామం భామ మృణాల్ ఠాకూర్](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/02/13155022/cropped-ws_image-69.png)
రెమ్యూనరేషన్ను భారీగా పెంచేసిన సీతారామం భామ మృణాల్ ఠాకూర్
]మృణాల్ తన భవిష్యత్ నట ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని YouSay ఆకాంక్షిస్తోంది.
ఫిబ్రవరి 13 , 2023
![Ramoji Rao: రామోజీ పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన రాజమౌళి.. వారి బంధం ఎంత బలమైందంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/08172230/Untitled-design-2024-06-08T172226.360.jpg)
Ramoji Rao: రామోజీ పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన రాజమౌళి.. వారి బంధం ఎంత బలమైందంటే?
ఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు (Ramoji Rao) మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ఆయన లేని లోటును తలుచుకుంటూ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీని కడసారి చూసేందుకు ఆయన పార్థివ దేహమున్న ఫిలిం సిటీకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం కుటుంబ సమేతంగా ఫిలిం సిటీకి వెళ్లారు. అక్కడ అశ్రు నయనాలతో రామోజీకి అంజలి ఘటించారు.
వెక్కి వెక్కి ఏడ్చిన రాజమౌళి!
రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించడానికి దర్శకధీరుడు రాజమౌళితో పాటు ఆయన భార్య రమా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) కూడా వెళ్లారు. ఈ సందర్భంలో రామోజీని చూస్తూ రాజమౌళి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. రాజమౌళిని ఇంత బాధలో ఎప్పుడు చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. రామోజీతో రాజమౌళికి ఉన్న బంధం ఎంత విలువైనదో ఈ దృశ్యాలే కళ్లకు కడుతున్నాయని చెబుతున్నారు.
https://twitter.com/i/status/1799327168675360807
ఆ కన్నీటికి కారణం ఇదే!
రాజమౌళి సినిమా దర్శకుడు అయ్యే కంటే ముందే శాంతి నివాసం అనే సీరియల్తో దర్శకుడిగా మారారు. ఈ శాంతి నివాసం సీరియల్ ఈటీవీలోనే ప్రసారమయ్యేది. అలా అప్పుడు రామోజీరావుతో రాజమౌళికి ఏర్పడిన పరిచయం తర్వాత సాన్నిహిత్యంగా మారింది. తనకు ఆత్మీయుడైన రామోజీ మరణించడంతో రాజమౌళి తట్టుకోలేకపోయారు. అటు సోషల్ మీడియా వేదికగాను నివాళులు అర్పించారు. 'ఒక వ్యక్తి తన 50 సంవత్సరాల స్థితిస్థాపకత, కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి ఉపాధి, జీవనోపాధి మరియు ఆశలను అందించారు. రామోజీ రావు గారికి మనం నివాళులు అర్పించే ఏకైక మార్గం 'భారతరత్న' ప్రదానం చేయడం' అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు.
స్టార్ హీరోల నివాళులు
పత్రికా రంగం, సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన రామోజీ రావుకి టాలీవుడ్ స్టార్ హీరోలు.. సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. రామోజీ రావు గారి మరణం అత్యంత బాధాకరమని రామ్ చరణ్ అన్నారు. ఈ మేరకు 'గేమ్ ఛేంజర్' చిత్ర యూనిట్తో కలిసి నివాళులు అర్పించారు. అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు పవన్ కల్యాణ్ అన్నారు. రామోజీ రావు పేరు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని కళ్యాణ్ రామ్ పోస్టు చేశారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. తాను గౌరవించే స్ఫూర్తిదాయ వ్యక్తుల్లో రామోజీ ఒకరని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు. రామోజీ మరణం తీరని లోటని సినీ నటుడు రవితేజ కామెంట్ చేశారు.
ఆదివారం అంత్యక్రియలు
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
జూన్ 08 , 2024
![Heroines Remuneration: రెమ్యూనరేషన్లో హీరోలతో పోటీ పడుతున్న కథానాయికలు.. టాప్ ఎవరంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/05/15132403/Untitled-design-7.png)
Heroines Remuneration: రెమ్యూనరేషన్లో హీరోలతో పోటీ పడుతున్న కథానాయికలు.. టాప్ ఎవరంటే?
సినిమా విజయాల్లో హీరోలతో పాటు హీరోయిన్స్ కీలక పాత్ర పోషిస్తారు. చివరి వరకూ ఉంటూ తమ నటనతో ఆకట్టుకుంటారు. అంతేగాక పాటల్లో గ్రామర్ షో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. హీరోయిన్ల కోసమే సినిమా చూసే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారంటే ఎలాంటి అతియోక్తి లేదు. మరి సినిమా కోసం ఎంతగానో కష్టపడే హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది?. సౌత్ ఇండియా కథానాయికల్లో పారితోషికంలో ఎవరు టాప్లో ఉన్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐశ్వర్య రాయ్
ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ ఇండియన్ కథానాయికగా ఐశ్వర్యరాయ్ నిలిచింది. పొన్నియన్ సెల్వన్-2 సినిమా కోసం ఆమె రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలిసింది. దక్షిణాది సినీరంగంలో ఇంత పెద్ద మెుత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక నటి ఐశ్వర్యనే.
నయనతార
ప్రముఖ హీరోయిన్ నయనతార లీడ్ రోల్ ఉన్న సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు రూ. 5 - 10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమాలో తన ప్రాధాన్యత బట్టి గరిష్టంగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.
సమంత
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోందట. ఒక్కో సినిమాకు రూ. 3 - 8 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
శృతి హాసన్
ప్రముఖ నటి శృతి హాసన్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ద్వారా మంచి హిట్ అందుకుంది. శృతి ఒక సినిమాకు రూ. 6-8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
పూజా హెగ్డే
టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తెలుగుతో పాటు, బాలీవుడ్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ భామ ఒక్కో సినిమాకు రూ. 3.5 - 5 కోట్లు తీసుకుంటోంది. పూజా ప్రస్తుతం SSMB 28 సినిమాలో నటిస్తోంది.
అనుష్క శెట్టి
తెలుగులోని టాప్ హీరోయిన్స్ జాబితాలో అనుష్క శెట్టి కచ్చితంగా ఉంటుంది. అరుంధతి, రుద్రమ దేవి, బాహుబలి 1, 2 సినిమాల ద్వారా ఈ భామ క్రేజ్ అమాంతం పెరిగింది. అనుష్క కూడా ఒక్కో సినిమాకు రూ. 6 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట. అనుష్క రీసెంట్ మూవీ ‘Ms.శెట్టి Mr. పొలిశెట్టి’ విడుదలకు సిద్ధంగా ఉంది.
రకూల్ ప్రీత్ సింగ్
రకూల్ ప్రీత్ సింగ్ కూడా ఒక్కో సినిమాకు రూ. 3-5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్పై తన ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. రకూల్ తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది.
తమన్నా భాటియా
మిల్కీ బ్యూటి తమన్న రీసెంట్గా F2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ భామ సైతం సినిమాకు రూ. 4 - 5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు టాక్.
రష్మిక మందన్న
ప్రస్తుతం సినిమాల పరంగా రష్మిక ఎంతో దూకుడుగా ఉంది. చకా చకా సినిమాలు చేసేస్తూ కథానాయికలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ భామ కూడా ఒక్కో సినిమాకు రూ. 4 - 5 కోట్లు డిమాండ్ చేస్తోంది.
కాజల్ అగర్వాల్
పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ కొంత కాలం సినిమాకు గ్యాప్ ఇచ్చింది. ఒక బిడ్డకు జన్మించిన కాజల్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ రూ. 2 - 4 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది.
మే 15 , 2023
![తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూరేషన్ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/29181357/Featured-image-15.jpg)
తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూరేషన్ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే స్థితి నుంచి మన అగ్ర హీరోలు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పైగా తీసుకునే రేంజ్కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏ హీరో రెమ్యూనరేషన్ ఎంత ఉందో చూద్దాం.
ప్రభాస్:
హీరో ప్రభాస్ కెరీర్ బాహుబలి చిత్రం తర్వాత పూర్తిగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు టాలీవుడ్కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ఆ సినిమాతో విశ్వవ్యాప్తమైంది. దీంతో రెండేళ్ల నుంచి ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్... సిద్ధార్థ్ సినిమాతో పాటు భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాల కోసం రెమ్యునరేషన్ను మరింత పెంచాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తన 25వ చిత్రం స్పిరిట్ కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మహేశ్:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘SSMB28’ నటిస్తున్న మహేశ్.. దాని తర్వాత దర్శకధీరుడు S.S. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో చేయనున్నారు. రాజమౌళితో సినిమా అంటే ఓ రేంజ్లో ఉంటాయని ఆయన గత చిత్రాలు ఆర్ఆర్ఆర్, బాహుబలి ఇప్పటికే నిరూపించాయి. పాన్ వరల్డ్గా రూపొందనున్న ఈ మూవీకి మహేశ్ ఏకంగా రూ. 100కోట్లు తీసుకుంటున్నారని టాక్. గత చిత్రం ‘సర్కారు వారి పాట’కు రూ.55 కోట్లు తీసుకున్న మహేశ్ నెక్స్ట్ మూవీకి ఏకంగా వంద కోట్లు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్:
టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతూనే సినిమాలను సైతం అంతే స్పీడుగా పట్టాలెక్కిస్తున్నారు.
పవన్ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే హరిహర వీరమల్లు కోసం పవన్ రూ. 60 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఒక్కో రోజు షూటింగ్ కోసం రూ. 2 కోట్లు తీసుకున్నట్టు పవన్ స్వయంగా వెల్లడించారు.
రామ్ చరణ్:
ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్చరణ్ బ్రాండ్ పూర్తిగా మారిపోయింది. మగధీర, రంగస్థలంతో చరణ్కు వచ్చిన క్రేజ్ను RRR రెండింతలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా స్టార్గా మారిన చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చెర్రీ దాదాపు రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సినిమాకు రూ. 45 కోట్లు తీసుకున్న చెర్రీ శంకర్ మూవీ కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెంచడం గమనార్హం. చెర్రీ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో నటించనున్నారు.
జూ. ఎన్టీఆర్:
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రామ్చరణ్తో పాటు జూ.ఎన్టీఆర్కు వరల్డ్వైడ్గా ఫాలోయింగ్ను తెచ్చిపెట్టింది. RRR కు ఎన్టీఆర్ రూ. 45 కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో NTR30 మూవీలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ రూ.60 కోట్లు తీసుకుంటున్నారని టాక్.
https://telugu.yousay.tv/these-are-the-top-10-telugu-heroes-with-the-most-followers-on-instagram.html
అల్లు అర్జున్:
పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ మేనియా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో బన్నీ క్రేజ్ బాలీవుడ్కు విస్తరించింది. దీంతో అల్లుఅర్జున్ మార్కెట్ విలువ భారీగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ కోసం బన్నీ కూడా రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చిరంజీవి
అగ్రకథానాయకుడిగా టాలీవుడ్ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్ చిరు.. సినిమాల్లో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరు మార్కెట్ వాల్యూ యంగ్ హీరోలకూ ఏ మాత్రం తక్కువగా లేదనే చెప్పాలి. దీంతో చిరు కూడా తన ప్రతీ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య కోసం చిరు రూ.40 కోట్లు తీసుకున్నారని టాక్.
బాలకృష్ణ:
నట సింహం బాలకృష్ణ సైతం వరుస హిట్లతో తన మార్కెట్ను పెంచుకున్నారు. ‘అఖండ’కు రూ.11 కోట్లు తీసున్న బాలయ్య.. ఆ సినిమా రూ. 90 కోట్ల షేర్ వసూలు చేయడంతో రెమ్యూనరేషన్ను పెంచారు. ‘వీర సింహారెడ్డి’ కోసం బాలయ్య రూ.15 కోట్లు తీసుకున్నారని తెలిసింది.
విజయ్ దేవరకొండ:
అర్జున్రెడ్డి సినిమాతో యంగ్ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ సంచలనంగా మారారు. అయితే ఇటీవల రిలీజైన వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అయితే వరుస ఫ్లాపులు వస్తున్నప్పటికీ విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ‘లైగర్’కు కూడా విజయ్ రూ. 15 కోట్లు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఏప్రిల్ 01 , 2023
![War 2: బాలీవుడ్ స్టార్లకు నిద్ర లేకుండా చేస్తున్న తారక్ రెమ్యూనరేషన్.. ‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్ సోలో చిత్రం!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/13155433/Untitled-design-2024-03-13T155358.652.jpg)
War 2: బాలీవుడ్ స్టార్లకు నిద్ర లేకుండా చేస్తున్న తారక్ రెమ్యూనరేషన్.. ‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్ సోలో చిత్రం!
'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. దీంతో ఆయన చేస్తున్న చిత్రాలపై దేశవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. ప్రస్తుతం తారక్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్లు ఉన్నాయి. అందులో ఒకటి కొరటాల శివ (Koratala Siva)తో చేస్తున్న 'దేవర' (Devara) కాగా.. మరోకటి బాలీవుడ్లో చేయబోతున్న 'వార్ 2' (War 2) చిత్రం. ముఖ్యంగా 'వార్ 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తుండటంతో పాటు హిందీలో తారక్కు ఇదే తొలి చిత్రం. దీంతో ఈ సినిమా నేషనల్ వైడ్గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
60 రోజుల్లో షూటింగ్ పూర్తి!
'వార్ 2' చిత్రంలో తారక్, హృతిక్ రోషన్ పాత్రల షూటింగ్కు సంబంధించి కొన్ని వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కూడా కేవలం 60 రోజుల్లో తమ పాత్రలకు సంబంధించిన షూట్ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చే సీన్స్ 30 రోజులు చిత్రీకరించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఎంతో క్రేజీగా ఉంటాయని అంటున్నారు. అటు హై టెక్నాలజీతో రూపొందుతున్న 'వార్ 2' చిత్ర షూటింగ్ను ఎక్కువ భాగం స్టూడియోస్లోనే తీయనున్నారట. హృతిక్ పార్ట్ను జూన్ కల్లా, తారక్ పార్ట్ను జులై కల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం.
‘రా ఏజెంట్’గా ఎన్టీఆర్!
యశ్రాజ్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న 'వార్ 2' చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పోషించనున్న పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఇందులో తారక్ ఇండియన్ రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ పాత్ర భవిష్యత్తులో తరచూ తెరపై కనిపిస్తూనే ఉంటుందని అంటున్నారు. అలాగే యశ్రాజ్ స్పై యూనివర్స్లో భాగంగా తారక్ సోలో హీరోగా ఓ సినిమా కూడా రూపొందనుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ‘వార్ 2’ టీమ్, నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తారక్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
'వార్ 2' సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్గా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యేక పాత్ర కోసం ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్.. తారక్ రెమ్యూనరేషన్ చూసి అవాక్కవుతున్నారట. ఓ స్పెషల్ రోల్ కోసం తారక్ ఈ రేంజ్లో ఛార్జ్ చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతున్నారట. ఈ విషయంపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. స్పెషల్ రోల్ కోసం వంద కోట్లా.. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
'వార్ 2' కోసం సరికొత్త టెక్నాలజీ!
'వార్ 2' సినిమా కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సమాచారం. అవుట్ డోర్లో వచ్చే ఎన్టీఆర్, తారక్ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ను పూర్తిగా బాడీ డబుల్స్తో తీస్తున్నారట. ఆ తర్వాత VFX వాడి తారక్, హృతిక్ ముఖాలను స్వాప్ చేస్తారట. గ్రాఫిక్స్ వాడినట్లు అనుమానం రాకుండా అధునిక టెక్నాలజీని ఇందుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ పద్దతిలో అయితే డూప్లతో పాటు హీరోలు కూడా లొకేషన్స్లో ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ ఆధునిక బాడీ డబుల్స్ విధానంలో హీరోలతో పని లేకుండా సీన్లను చిత్రీకరించవచ్చని మూవీ యూనిట్ చెబుతోంది.
మార్చి 13 , 2024
![Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/15180559/123.-2024-05-15T180521.202.jpg)
Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మాక పాన్ ఇండియన్ చిత్రం కన్పప్ప. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఎంతో హైప్ను క్రియేట్ చేస్తోంది. గతవారం ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ కన్ఫామ్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటించనున్నాడన్నది సస్పెన్స్గా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ప్రతీ ఫ్రేమ్ రిచ్గా ఉండేందుకు డబ్బు ఎంతైన ఖర్చు పెట్టేందుకు మేకర్స్ వెనకాడటం లేదు. ఈ సినిమాకు అంతర్జాతీయ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరామెన్గా ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. మెస్మరైజింగ్ విజువల్స్, దానికి తగిన కథ, స్క్రీన్ప్లేతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మోహన్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్పను మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?
పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భాగమైనప్పటి నుంచి ఓ క్రేజీ బజ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అని. అయితే దీనిపై తాజాగా ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలిసింది. చాలా తక్కువ రోజులు ఈ చిత్రం కోసం ప్రభాస్ పనిచేస్తుండటంతో ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. మంచు విష్ణుతో ప్రభాస్కు చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమైంది. అయితే మంచు విష్ణు ప్రభాస్కు బిగ్ ఎమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ... ప్రభాస్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.
శరవేగంగా షూటింగ్
ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పను మంచు విష్ణు అన్ని తానై షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు. ప్రతీ విషయంలోనూ ప్లాన్గా మందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75శాతం వరకు పూర్తైనట్లు తెలిసింది. ప్రభాస్ రోల్ మీద ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని సమాచారం.గతేడాది నవంబర్లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. శివలింగం వైపు కన్నప్ప గెటప్లో విల్లు ఎక్కుపెట్టినట్లు మంచు విష్ణును ఈ పోస్టర్లో చూపించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో ప్రధాన కథగా చూపించనున్నారు.
టీజర్ డేట్ ఫిక్స్
కన్నప్ప నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం టీజర్ను మే 20న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. అయితే టీజర్ విడుదల చేసే వేదికను ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు మార్చారు. ఈ చిత్రం టీజర్ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. దీంతో టీజర్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మే 15 , 2024
![టాలీవుడ్ బిగ్ మూవీస్లో బాలీవుడ్ భామలు..కళ్లుచెదిరే రెమ్యూనరేషన్లు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/07172904/cropped-ws_Snapinsta.app_1080_330301008_923894728611023_2713209541408555744_n.jpg)
టాలీవుడ్ బిగ్ మూవీస్లో బాలీవుడ్ భామలు..కళ్లుచెదిరే రెమ్యూనరేషన్లు!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Download Our App
మార్చి 10 , 2023
![Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్బ్యాక్ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/08/22131748/Untitled-design-95.jpg)
Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్బ్యాక్ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!
టాలీవుడ్ ప్రముఖ కథానాయికల్లో అనుష్క శెట్టి ఒకరు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఆపై అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. అయితే బాహుబలి తర్వాత అనుష్క కెరీర్ పూర్తిగా చతికిలపడింది. దీనికి కారణం ఆమె తీసిన ‘సైజ్ జీరో’ చిత్రం. 2015లో వచ్చిన ఈ మూవీ కోసం అనుష్క బరువు పెరిగింది. మూవీ అనంతరం తగ్గేందుకు యత్నించినా అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈ భామకు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అయితే తాజాాగా యంగ్ హీరో నవీన్కు జతగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంలో అనుష్క నటించింది. సోమవారం (ఆగస్టు 21) విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
వైవిధ్యమైన ప్రేమ కథ
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబర్ 7న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ను బట్టి చూస్తే మరో వైవిధ్యమైన ప్రేమకథతో అనుష్క తన అభిమానులను మెస్మరైజ్ చేయబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాలో అనుష్క షెఫ్గా, నవీన్ స్టాండప్ కమెడియన్గా నటించారు. ప్రేమ, రిలేషన్షిప్స్, పెళ్లి మీద అస్సలు ఆసక్తి, నమ్మకం లేని అమ్మాయిగా అనుష్క కనిపించింది. అలాంటి అమ్మాయి హీరోని ఇష్టపడుతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు. గర్భం దాల్చడానికి అతడిని హెల్ప్ అడుగుతుంది. ఇదేంటో అర్థంకాక గందరగోళ పరిస్థితిలో హీరో పడతాడు. ఇదే విషయాన్ని ట్రైలర్లో ఆసక్తికరంగా చెప్పారు. సరికొత్త ప్రేమకథను ఎంటర్టైనింగ్, ఎమోషనల్గా చెప్పడానికి దర్శకుడు మహేష్ సిద్ధమయ్యారు.
అనుష్క.. గ్రేట్ కమ్బ్యాక్!
ఈ సినిమాకు ముందు వరకు పెద్దగా అవకాశాలు లేక అనుష్క ఎంతగానో ఇబ్బంది పడింది. సుదీర్ఘకాలం పాటు మూవీస్కు దూరమైంది. దీంతో ఇక అనుష్క కెరీర్ అయిపోయినట్లేనని అంతా భావించారు. ఫ్యాన్స్ కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. అనుష్కను ఇక వెండితెరపై చూడలేమా అని అనుకుంటున్న సమయంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం ద్వారా ఈ భామ గ్రేట్ కమ్ బ్యాక్కు సిద్దమైంది. ఈ సినిమా ట్రైలర్లో మునుపటి అనుష్కను స్వీటీ గుర్తు చేసింది. తన గ్లామర్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. హీరో ప్రభాస్ సైతం ట్రైలర్ చూసి అద్భుతంగా ఉందంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ట్రైలర్ ఆధ్యాంతం కడుపుబ్బా నవ్వించిందని పేర్కొన్నాడు. పలువురు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్ను మెచ్చుకుంటున్నారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
రెమ్యూనరేషన్ ఎంతంటే?
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా కోసం అనుష్క భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అనుష్క నటించినందుకు మేకర్స్ ఆమెకు రూ.6 కోట్లు చెల్లించారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమాలకు దూరమైనప్పటికీ అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తే తిరిగి అనుష్క టాలీవుడ్లో బిజీ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అటు స్వీటి అభిమానులు సైతం ఇదే జరగాలని కోరుకుంటున్నారు.
ఆగస్టు 22 , 2023
![Telugu Heroes Cars Collections: టాలీవుడ్లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/09105411/Untitled-design-2024-05-09T105404.358.jpg)
Telugu Heroes Cars Collections: టాలీవుడ్లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్గా ఆయన గోల్డ్ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి.
వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు.
జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్ వేరియంట్లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5 (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.
https://twitter.com/sarathtarak9/status/1775161795440971956
వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ను ఆయన రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు.
జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్ను అందుకుంటుంది.
విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం.
ప్రభాస్ కార్ కలెక్షన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ గ్యారేజ్లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్స్టర్ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే?
ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.
Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.
Rolls Royce Ghost
ప్రభాస్ గ్యారేజ్లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు
Jaguar XJL
ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్గా ఎదిగిన తర్వాత కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.
Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు
BMW X5
ప్రభాస్ గ్యారేజ్లో బ్లాక్ బీఎమ్డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్ను జనరేట్ చేస్తుంది.
Lamborghini Aventador Roadster
లంబోర్గినీ వెంచర్లో ఇది ప్రత్యేకమైనది. ఇది లీటర్కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది.
Range Rover SV Autobiography
ప్రభాస్ లగ్జరీ లైనప్లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది.
అల్లు అర్జున్ లగ్జరీ కార్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం.
జాగ్వార్ XJL
దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్ కలర్లో ఉంటుంది.
హమ్మర్ H2
అల్లు అర్జున్ లగ్జరీ లైనప్లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్'గా పిలుచుకుంటారు.
వోల్వో XC90 T8
ఇది వోల్వో ఫ్లాగ్షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు
ఇటీవల ఆయన గ్యారేజ్లోకి రేంజ్ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.
ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే.
రామ్చరణ్ లగ్జరీ కార్ కలెక్షన్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే. విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం.
Ferrari Portofino
రామ్చరణ్ కలెక్షన్స్లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు.
View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy)
ఈ కార్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు
మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు
https://twitter.com/ManobalaV/status/1437059410321309702
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు
ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు
BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు
Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి
ఈ లగ్జరీ కార్ల లైనప్తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా ఆ జెట్లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు.
https://twitter.com/HelloMawa123/status/1502241248836349956
విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది. అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు. Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు.
https://www.youtube.com/watch?v=vkS_uio8ix8
నాగచైతన్య లగ్జరీ కార్ కలెక్షన్లు
అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది.
ఫెరారీ 488GTB — (రూ. 3.88cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr)
BMW 740 Li — (రూ. 1.30cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr)
MV అగస్టా F4 — (రూ. 35L)
BMW 9RT — (రూ. 18.50L)
View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni)
https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280
View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth)
నాని లగ్జరీ కారు కలెక్షన్
నాని దగ్గర లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు, టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు.
https://www.youtube.com/watch?v=KuOxAHUisOg
రామ్పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్
రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్ అదే స్థాయిలో ఉన్నాడు.
అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా
రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,
రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR,
రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ .
రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-
రూ. కోటి విలువైన BMW X3.
https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE
విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్
విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
విశ్వక్కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు
శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్
శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్ప్రెస్ రాజా, క్లాస్మేట్స్, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం.
రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు
ఆడి Q7- రూ. 90 లక్షలు
BMW 530D- రూ. 75 లక్షలు
ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు
నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్
హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు
Fiery Red Mercedes Sports Coupe- దీని ధర రూ.3.33కోట్లు
https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128
https://twitter.com/actor_Nikhil/status/612984749645148160
రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు
https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI
సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్
సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్ తర్వాత కొనుగోలు చేశాడు.
https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
మే 09 , 2024
![20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్ స్టార్ అయ్యాడు!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/28141107/Featured-image-11.jpg)
20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్ స్టార్ అయ్యాడు!
‘అల్లు అర్జున్’... ! పుష్ప సినిమాతో ఇండియాను షేక్ చేసి పాన్ ఇండియన్ స్టార్. ఐకాన్ స్టార్. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకరు. బ్రాండ్ వాల్యూలో ఇండియాలో టాప్-25లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరో. హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఒకడు. కానీ ఇదంతా ఒక్క రోజులో రాలేదు. 20 ఏళ్ల కఠోర శ్రమ, నిబద్ధత పట్టుదల, కథల ఎంపికలో వైవిధ్యత సినిమా కోసం కష్టపడే తత్వం ఇవన్నీకలిపితేనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
https://telugu.yousay.tv/allu-arjun-pushpa-will-decrease-in-brand-value-allu-arjun-rashmika-and-pv-sindhu-in-top-25.html
తొలి అడుగు
28 మార్చి 2003లో గంగోత్రి సినిమా వచ్చినపుడు చాలా మంది విమర్శించారు. ఇతను హీరోనా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులతో తనలోని నటుడిని ప్రపంచానికి చాటాడు. మరి అల్లు అర్జున్ను స్టార్ చేసిన అంశాలేంటో చూద్దాం.
కథల ఎంపిక
గంగోత్రి విడుదలైన నాటి నుంచి ఇప్పటిదాకా అల్లు అర్జున్ను స్టార్గా నిలిచేలా చేసింది మాత్రం అతడి స్టోరీ సెలెక్షన్. అల్లు అర్జున్ ఏ రెండు వరుస సినిమాలు కూడా ఒకే పంథాలో సాగవు. లుక్, మేనరిజం ఇలా ప్రతీది మారిపోతుంది. గంగోత్రితో విమర్శలు ఎదుర్కొన్నా… ఆ తర్వాత 2004లో వచ్చిన సుకుమార్ ‘ఆర్య’ సినిమా అల్లు అర్జున్ పేరు మార్మోగేలా చేసింది. అప్పటిదాకా తెలుగు సినిమా చూడని వెరైటీ లవ్స్టోరీని అల్లు అర్జున్ ఎంపిక చేసుకోవడం సాహసమనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలోనూ అల్లు అర్జున్ డిఫరెంట్గానే కనిపిస్తాడు. బన్నీ, పరుగు, దేశముదురు, ఆర్య-2, వేదం, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో ఇలా తనలోని నటుడిని సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూనే వచ్చాడు. పుష్పలో అయితే ఊర మాస్ లుక్లో బాక్సాఫీస్ను షేక్ చేశాడు.
డ్యాన్స్
మరో మాట లేకుండా ఇండియాలోని హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్స్లో అల్లు అర్జున్ ఒకడు. అతడి డ్యాన్స్కు టాలివుడ్లోనే కాదు బాలివుడ్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్య-2, అల వైకుంఠపురములో, రేసు గుర్రం ఇలా ఏ సినిమా తీసుకున్నా అల్లు అర్జున్ డ్యాన్స్కు ఫిదా కావాల్సిందే.
సుకుమార్
అల్లు అర్జున్ కెరీర్లో సుకుమార్ది కీలక పాత్ర అనడం అతిశయోక్తి కాదు. అప్పుడు ఆర్యతో అతడి కెరీర్ను మలుపు తిప్పాడు. అలాగే ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ మార్చాడు. ఇప్పుడు పుష్ప: ది రూల్తో గ్లోబల్ స్టార్గా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
https://telugu.yousay.tv/allu-arjun-passed-prabhas-in-remuneration.html
అల్లు అర్జున్ చేసిన అద్భుతమైన పాత్రలు
అల్లు అర్జున్ సినీ కెరీర్లో కథల ఎంపిక, డ్యాన్స్లతో పాటు కొన్ని పాత్రలు సినీ ప్రియులు మరిచిపోలేరు. అవి
ఆర్య
సుకుమార్ కల్ట్ క్లాసిక్ మూవీ ఆర్యలో ‘ఆర్య’గా అల్లు అర్జున్ను ఎవరూ మర్చిపోలేరు. సినిమా అంతా నవ్వించినా, నవ్వులపాలైనా చివరిలో కన్నీరు పెట్టించినా ‘ఆర్య’ పాత్ర సూపర్ అని చెప్పాలి.
బాల గోవింద్
అల్లు అర్జున్కు మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా దేశముదురు. ఇందులో బాల గోవింద్గా అల్లు అర్జున్ పాత్ర ఊర మాస్ ఉంటుంది. ఇందులో బాలగోవింద్ డైలాగ్స్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్గా ఉంటాయి.
గోన గన్నారెడ్డి
స్టైలిష్ స్టార్గా ఉన్న అల్లు అర్జున్ కంప్లీట్ డీ గ్లామర్ రోల్లో చూపించిన సినిమా రుద్రమదేవి. ఇందులో గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్ చెప్పే డైలాగులు ఎవరూ మర్చిపోలేరు.
కేబుల్ రాజు
క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా. హీరోయిజంకు ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర కేబుల్ రాజు. ఎంతోమంది మిడిల్ క్లాస్ కుర్రాళ్లకు కనెక్ట్ అయిన పాత్ర. ఇది కూడా అల్లు అర్జున్ కెరీర్లో అద్భుతమైన పాత్రల్లో ఒకటి.
పుష్ప
ఫైనల్గా ‘పుష్ప’. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ చేసిన ఈ పాత్ర తన కెరీర్లో మైలురాయి. 20 ఏళ్ల కష్టానికి ఫలితాన్నిచ్చిన పాత్ర.
ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్ కష్టపడుతున్నారు. సుకుమార్ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.
తన 20 ఏళ్ల ప్రయాణంపై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులు, అభిమానులే. సదా మీకు కృతజ్ఞుడను’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.
https://twitter.com/alluarjun/status/1640581255732535296?s=20
మార్చి 28 , 2023
![Top 5 Telugu Serial Actress: సీరియల్స్ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్ అవుతున్నట్లే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/02/20174913/Untitled-design-2024-02-20T174839.931.jpg)
Top 5 Telugu Serial Actress: సీరియల్స్ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్ అవుతున్నట్లే!
ఈ జనరేషన్ యూత్కు సినిమాలు, వెబ్సిరీస్లపై ఉన్న ఆసక్తి.. టెలివిజన్లో వచ్చి సీరియళ్లపై ఉండదు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్ వారికి పెద్దగా రుచించదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్ తీసుకొని ఛానెల్ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్-5 సీరియల్ భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Ayesha Zeenath
స్టార్ మా (Star maa)లో వస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) సీరియల్ ట్రెండింగ్లో ఉంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రగతి నటించగా.. ఆమెను ఢీకొట్టే హీరోయిన్ దుర్గ పాత్రలో అయేషా జీనత్ (Ayesha Zeenath) నటిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తోంది.
కేరళకు చెందిన ఈ బ్యూటీ 'రెడీ స్టడీ పో' అనే రియాలిటీ షోతో బుల్లితెరపై కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత జీ తమిళ్ లో వచ్చిన ‘సత్య’ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాందించింది.
సూపర్ క్వీన్ అనే జీ తమిళం రియాలిటీ షోలోనూ పాల్గొన్న అయేషా.. అందులో రెండో స్థానంలో నిలిచి మరింత పాపులర్ అయ్యింది.
అలాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్గా మంచి పేరు తెచ్చుకుంది. హోస్ట్ కమల్తో గొడవ పెట్టుకుని అప్పట్లో అయేషా బాగా పాపులర్ అయింది.
Raksha Goud
కన్నడ నటి రక్ష గౌడ్ (Raksha Goud).. తెలుగులో వస్తోన్న 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu) సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. ఇందులో వసుధార పాత్రలో అందరి మనసులను దోచుకుంది.
ఈమె లీడ్ రోల్లో చేస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ రీసెంట్గా 1000 ఎపిసోడ్లను పూర్తి చేసింది. ఇందులో ఈమె క్రెడిట్ ఎంతగానో ఉందని చెప్పవచ్చు.
2017లో కన్నడ సీరియల్ 'రాధా రమణ'తో రక్ష తన బుల్లితెర కెరీర్ను ప్రారంభించింది. తెలుగులో కృష్ణవేణి అనే సీరియల్ చేసినప్పటికీ రక్షకు పెద్దగా పేరు రాలేదు.
గుప్పెడంత మనసు సీరియల్తో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా తనను గుర్తుపడుతున్నారని ఆమె ఓ ఇంటర్యూలో చెప్పారు.
Jyothi Rai
‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manasu) సీరియల్ ద్వారా పాపులర్ అయిన మరో కన్నడ నటి జ్యోతి రాయ్ (Jyothi Rai). ఇందులో జగతి పాత్రపై ఆమె చెరగని ముద్ర వేసింది.
కర్ణాటకకు చెందిన జ్యోతి రాయ్.. తెలుగు, కన్నడ సీరియల్స్లలో నటిస్తూ మంచి పేరు సంపాదించింది. ముచ్చటైన చీరకట్టులో తల్లి పాత్రలు పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం జ్యోతి రాయ్ను ఫైర్ బ్రాండ్గా చెప్పవచ్చు. ఆమె ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటుంది.
ప్రస్తుతం ఈ భామ కన్నడ సినిమాలతో పాటు.. ‘ప్రెట్టి గర్ల్’ (Pretty Girl) అనే సిరీస్లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Preethi Sharma
తెలుగులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పాపులర్ నటి ప్రీతి శర్మ (Preethi Sharma). 'పడమటి సంధ్యా రాగం' (Padamati Sandhya Ragam) సీరియల్లో ఆధ్య పాత్ర ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ప్రీతి శర్మ.. కలర్స్ తమిళ్ సీరియల్ 'ఒరు కాదయి పాడతుమా, సార్?' ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.
తెలుగులోకి 'కావ్యాంజలి' అనే సీరియల్ ద్వారా అడుగుపెట్టింది. ఇందులో అంజలి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ క్రమంలోనే ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్లో లీడ్ రోల్ సంపాదించి గృహిణుల ఫేవరేట్ నటిగా మారిపోయింది.
Soundarya Reddy
‘పడమటి సంధ్యా రాగం’ (Padamati Sandhya Ragam) అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి ‘సౌందర్య రెడ్డి’ (Soundarya Reddy). ఈ భామ తన అందం, అభినయం, నటనతో బుల్లితెరపై హల్చల్ చేస్తోంది.
కర్ణాటకలోని బెంగళూరు నగరానికి చెందిన ఈ భామ.. 'రాజీ' అనే కన్నడ సీరియల్ ద్వారా టెలివిజన్లోకి అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్లో అవకాశం దక్కించుకొని.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
బుల్లితెర కెరీర్లో ఆమెకు ఇది రెండో సీరియల్ అయినప్పటికీ.. 10 సీరియళ్లకు సరిపడ క్రేజ్ను ఈ సుందరి దక్కించుకుంది. తన అందంతో చిన్న స్క్రీన్పై మాయ చేస్తోంది.
ఫిబ్రవరి 20 , 2024
![War 2: బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్.. దీనికి అసలు కారణం ఇదేనా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/05/10162548/FtFzhbUWwAI75Ax.jpg)
War 2: బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్.. దీనికి అసలు కారణం ఇదేనా?
టాలీవుడ్ అగ్ర హీరోల్లో జూ.ఎన్టీఆర్ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. కొమరం భీమ్గా ఎన్టీఆర్ నటనకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్ తారలు సైతం ఎన్టీఆర్ నటనను మెచ్చుకున్నారు. గ్లోబర్ స్టార్గా ఎదిగిన తారక్తో సినిమాలు చేసేందుకు హాలీవుడ్ దర్శకులు సైతం ఆసక్తి బహిరంగంగానే తమ ఆసక్తిని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ వార్-2 చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్తో పాటు తారక్ స్క్రీన్ చేసుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి జాతీయ మీడియా పలు కథనాలు రాసింది. అది చూసిన తారక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ వార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తారక్.. తనని తాను తగ్గించుకుంటున్నాడా?
ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి చేయనున్న వార్ - 2 చిత్రాన్ని బాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్’లో భాగంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్ నెగిటివ్ రోల్లో కనిపిస్తాడని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అంతేగాక ఈ పాత్ర కోసం రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. RRRలో తమ హీరో కంటే రామ్చరణ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పట్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మళ్లీ వార్ 2 సినిమాలోనూ అదే పరిస్థితి రిపీట్ అవుతుందని కలవరపడుతున్నారు. ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ చేయడం వల్ల సినిమాలో హృతిక్ పాత్రే హైలైట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లోనూ హీరోదే పైచేయి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
రెమ్యూనరేషన్ తక్కువే!
ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే RRR చిత్రానికే ఎన్టీఆర్ 45 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. RRR తర్వాత చేయబోయే చిత్రాలకు ఎన్టీఆర్ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం పొందే టాప్ 5 స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్ చేరిపోయాడని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.30 కోట్లకే వార్-2 చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్నట్లు కథనాలు రావడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా తారక్ను అభిమాన హీరోను నెగిటివ్ రోల్లో చూడటానికి తమ మనసు అంగీకరించడం లేదని మదనపడుతున్నారు. అయితే బాలీవుడ్లోని అగ్ర నటులతో పోలిస్తే తారక్ రెమ్యూనరేషన్ ఎక్కువనే చెప్పాలి.
లాభాల్లో షేర్..
ఎన్టీఆర్ రెమ్యూనరేషన్కు సంబంధించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ నేరుగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా వార్-2 సినిమా లాభాల్లో షేర్ తీసుకునేలా డీల్ కుదిరి ఉండొచ్చని మరికొన్ని మరికొన్ని వార్త కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే వార్ 2 సినిమా కోసం తారక్ కంటే ముందు ప్రభాస్, విజయ్ దేవరకొండను సంప్రదించారని గతంలో ప్రచారం జరిగింది. వారు రిజెక్ట్ చేయడం వల్లే తారక్ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను యాష్ రాజ్ నిర్మాణ సంస్థ ఛైర్మన్ ఆదిత్య చోప్రా ఖండించారు. తాము ఎవరినీ సంప్రదించలేదని, తారక్ను దృష్టిలోపెట్టుకునే ఆ క్యారెక్టర్ను తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. దీంతో ఆ దుష్ప్రచారాలకు చెక్ పెట్టినట్లైంది. ఇకపోతే వార్ 2 సినిమా నవంబర్లో పట్టాలెక్కనున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
శరవేగంగా NTR 30 షూటింగ్
ప్రస్తుతం NTR 30 సినిమా షూటింగ్లో తారక్ బిజీబిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. NTR 30 అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు రత్నవేలు తీసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యవసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మే 10 , 2023
![Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/13112534/Featured-image-64.jpg)
Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!
ఈ తరం యువత సినిమాలు, వెబ్సిరీస్లు, క్రికెట్పై చూపిన శ్రద్ధ సీరియళ్లపై చూపించరు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్ యువతరానికి ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్ తీసుకొని ఛానెల్ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. మరీ ఆ నటీమణులు ఎవరు? వారు చేసిన సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం..
సుహాసిని
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అందమైన నటీమణుల్లో సుహాసినీ ముందు వరుసలో ఉంటుంది. చంటిగాడు సినిమాతో మెుదట టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ భామ వెండితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సీరియళ్లపై తన దృష్టిని కేంద్రీకరించి సూపర్ సక్సెస్ అయింది. శివశంకరి, అపరంజి, అనుబంధాలు, అష్టాచమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కల్యాణం, దేవత, అనుబంధ ఆలయం వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, భోజ్పూరి సినిమాల్లోనూ అడపాదడపా నటిస్తూ సుహాసిని అలరిస్తోంది.
ప్రీతి అస్రాని
బుల్లితెరపై అలరిస్తున్న అందాల భామల్లో ప్రీతి అస్రాని కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో తన కెరీర్ ప్రారంభించిన ఈ భామ టెలివిజన్ రంగంలోనూ నటిస్తూ అలరిస్తోంది. పక్కింటి అమ్మాయి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రీతి.. సోషల్, మిన్నాలే 9 ఆవర్స్ వంటి ప్రముఖ షోలలో కనిపించింది. అంతేగాక మళ్లీరావా, హ్యాపీ వెడ్డింగ్, సీటీమార్, దొంగలున్నారు జాగ్రత్త, యశోధ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నవ్య స్వామి
నటి నవ్య స్వామి కూడా అందమైన బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ భామ ఓ కన్నడ టీవీ షో ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత వాణి-రాణి, నా పేరు మీనాక్షి, ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి తెలుగు సీరియళ్లలో నటించి పాపులర్ అయింది. ప్రస్తుతం పలు టెలివిజన్ షోలలోనూ కనిపిస్తూ నవ్య అలరిస్తోంది.
ఐశ్వర్య పిస్సే
33 ఏళ్ల ఐశ్వర్య పిస్సే బుల్లితెల నటిగా రాణిస్తోంది. తన గ్లామర్తో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ తెలుగు, తమిళం, కన్నడ సీరియళ్లలో నటించి చాలా బాగా పాపులర్ అయింది. సర్వమాంగళ మాంగల్యే, అగ్నిసాక్షి, ముక్కు పుడక వంటి తెలుగు సీరియళ్లలో ఐశ్వర్య నటించింది.
శోభా శెట్టి
కన్నడ నటి శోభా శెట్టి బుల్లితెరపై పాపులర్ యాక్టర్గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్తో ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఆమె చేసిన ప్రతినాయిక పాత్రకు ‘మా పరివార్’ అవార్డు వరించింది. అష్టా-చమ్మా సీరియల్లోనూ చేసిన ఈ భామ తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది.
ప్రియాంక జైన్
నటి ప్రియాంక జైన్ కూడా తన అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షుకలను అలరిస్తోంది. \రంగీ తరంగా అనే తమిళ చిత్రం ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళ సిరీయళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చేసిన మౌన రాగం సీరియల్ ఈ భామను అందరూ గుర్తుపట్టేలా చేసింది. ఇందులో అమ్ములు పాత్రలో ప్రియాంక జైన్ అద్భుతంగా నటించింది.
ఏప్రిల్ 13 , 2023
![<strong>NTR 31: 75 ఏళ్ల వృద్ధుడిలా తారక్.. నీల్ మామ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/26140323/123.-2024-07-26T140053.811.jpg)
NTR 31: 75 ఏళ్ల వృద్ధుడిలా తారక్.. నీల్ మామ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా!
‘ఆర్ఆర్ఆర్’ (RRR) సక్సెస్ తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr NTR) క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. బాలీవుడ్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం తారక్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత ‘NTR 31’ ప్రాజెక్ట్లో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
డ్యూయల్ రోల్లో తారక్?
తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్కు సంబంధించి ఓ వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇందులో ఒకటి కెరీర్లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
నర రూప రాక్షసుడిగా..!
'NTR 31' చిత్రంలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం ఓ పాత్రలో మాఫియా డాన్గా తారక్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో అతడు నరరూప రాక్షసుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. తారక్ పాత్రను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సరికొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే 'సలార్ 2' మెుదలు పెట్టాలని ప్రశాంత్ నీల్ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.
డ్రాగన్ టైటిల్ ఫిక్స్!
NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్ఫుల్ పేరు అయినందువల్లే డ్రాగన్ టైటిల్ను ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్ ఇందులో నెగిటివ్ రోల్లో ఎంతో పవర్ఫుల్గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్ అయితేనే సరిగ్గా మ్యాచ్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
రూ.300 కోట్ల ఖర్చుతో..
తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్గా తారక్కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్ చేస్తారని సమాచారం.
‘దేవర’ రిలీజ్ ఎప్పుడంటే?
క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్గా రిలీజ్ కానుంది. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ - కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇందులో విలన్గా కనిపించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10న దేవర రిలీజ్ కావాల్సి ఉండగా.. పనులు శరవేగంగా సాగుతుండటంతో సెప్టెంబర్ 27కు మార్చినట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
జూలై 26 , 2024
![<strong>NTR 31: ప్రశాంత్ నీల్ మూవీలో </strong><strong>జూ.ఎన్టీఆర్ పాత్ర ఇంత వైలెంట్గా ఉంటుందా? ఇక ఊచకోత తప్పదా!</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/22161739/Untitled-design-2024-06-22T161735.481.jpg)
NTR 31: ప్రశాంత్ నీల్ మూవీలో జూ.ఎన్టీఆర్ పాత్ర ఇంత వైలెంట్గా ఉంటుందా? ఇక ఊచకోత తప్పదా!
‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. త్వరలో జూ.ఎన్టీఆర్ (Jr NTR)తో ఓ సినిమా చేయబోతున్నారు. ‘NTR 31’ ప్రొడక్షన్ టైటిల్తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం తారక్.. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో 'దేవర' (Devara) చిత్రం చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల తర్వాత 'NTR 31' సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
రాక్షసుడిగా తారక్!
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందనున్న 'NTR 31' చిత్రాన్ని ఆగస్టులో సెట్స్పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం తారక్ కెరీర్లో 31వ సినిమాగా తెరకెక్కనుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. తారక్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నరరూప రాక్షసుడిగా కనిపిస్తాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తారక్ పాత్రను సరికొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే 'సలార్ 2' మెుదలు పెట్టాలని ప్రశాంత్ నీల్ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.
పవర్ఫుల్ టైటిల్!
NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్ఫుల్ పేరు అయినందువల్లే డ్రాగన్ టైటిల్ను ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్ ఇందులో నెగిటివ్ రోల్లో ఎంతో పవర్ఫుల్గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్ అయితేనే సరిగ్గా మ్యాచ్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
భారీ బడ్జెట్ చిత్రం
తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్గా తారక్కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్ చేస్తారని సమాచారం.
‘దేవర’ రిలీజ్ ఎప్పుడంటే?
క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్గా రిలీజ్ కానుంది. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ - కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇందులో విలన్గా కనిపించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10న దేవర రిలీజ్ కావాల్సి ఉండగా.. పనులు శరవేగంగా సాగుతుండటంతో సెప్టెంబర్ 27కు మార్చినట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
జూన్ 22 , 2024
![Kalki 2898 AD Sequel: ప్రభాస్ ‘కల్కి’ రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానుందా? నెట్టింట ఆసక్తికర చర్చ!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/22141233/Untitled-design-2024-05-22T141226.779.jpg)
Kalki 2898 AD Sequel: ప్రభాస్ ‘కల్కి’ రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానుందా? నెట్టింట ఆసక్తికర చర్చ!
ప్రస్తుతం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో భారీగా అంచనాలు ఉన్నాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ బజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
రెండు కంటే ఎక్కువ భాగాలుగా!
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. జూన్ 27న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ సైతం మెుదలు పెట్టింది. ఇప్పటికే విడుదలైన భైరవ (ప్రభాస్) బుజ్జి వీడియో అభిమానులకు సర్ప్రైజ్గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన ఓ అప్డేట్ సైతం ఫ్యాన్స్ను మరింత ఖుషి చేస్తోంది. దీని ప్రకారం కల్కి చిత్రం రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
కారణం ఇదేనట!
‘కల్కి 2898 ఏడీ’ కథను ఒక పార్ట్తో చెప్పటం సాధ్యం కాదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాక్. బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు రెండు కంటే ఎక్కువ భాగాలు అవసరం అవుతాయని మేకర్స్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మెుదట కల్కీకి సంబంధించి ఓ సీక్వెల్ ప్లాన్ చేయాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. సీక్వెల్లోనూ కథ చెప్పలేకపోతే మిగతా పార్ట్స్ గురించి ఆలోచించాలని మేకర్స్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్ను మించిన క్రేజ్ టాలీవుడ్కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నేడు బిగ్ ఈవెంట్
‘కల్కి’ సినిమాకు సంబంధించి ఇవాళ (మే 22) రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ను చిత్ర యూనిట్ నిర్వహించనుంది. ఇప్పటికే స్టేజీ సిట్టింగ్ కూడా రెడీ అయ్యింది. సా. 5 గంటలకు ఈ వేడుక మెుదలకానుంది. కల్కి సినిమా మెుదలు పెట్టిన తర్వాత భారత్లో చేస్తున్న తొలి ఈవెంట్ కావడంతో దీనిపై అందరిలోనూ హైప్ ఏర్పడింది. ఈ ఈవెంట్కు ప్రభాస్తో పాటు మూవీ యూనిట్ అంతా వస్తారని సమాచారం. కల్కి సినిమాలో భైరవ (ప్రభాస్), బుజ్జి మధ్య రిలేషన్ ఏంటో ఈ ఈవెంట్లో చెప్పనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
మే 22 , 2024
![Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/14185344/mrunal1-e1715693448852.jpeg)
Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
సీతారామం సినిమా తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జతకట్టిన దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ హిట్ పేయిర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో, మృణాల్ సీత పాత్రలో అలరించారు. స్వచ్ఛమైన ప్రేమకథను తమ కళ్లతోటే పలికించి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారు. మృణాల్ ఠాకూర్ సాంప్రదాయ వస్త్రధారణతో ఆమె చేసిన అభినయం తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ జోడీ మరోసారి జత కట్టనుట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ పరుశురామ్ శిష్యుడు రవి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని మంచి ప్రేమకథా చిత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్లో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హిట్ పేయిర్ రిపీట్
సీతారామం మూవీ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్తో పాటు మృణాల్ ఠాకూర్కు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. దుల్కర్ కింగ్ కొత్త వంటి వెబ్ సిరీస్లో నటించినా అది ఆశించినంత విజయం సాధించలేదనే చెప్పాలి. మరోవైపు సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్నా, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు చేసింది. ఇందులో హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా... ఫ్యామిలీ స్టార్ చిత్రం మాత్రం చతికిలపడిపోయింది. ఫ్యామిలీ స్టార్కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆశించినంతగా వసూళ్లు రాలేదు. ఈ సినిమా కోసం మృణాల్ బాగానే కష్టపడిందని చెప్పాలి. విజయ్ దేవరకొండతో కలిసి మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా పాల్గొంది. స్వయంగా రీల్స్ చేసి వైరల్ చేసినా.. సినిమా ఫలితం మాత్రం వేరేలాగా వచ్చింది. దీంతో ఆమె కెరీర్ తెలుగులో ప్రశ్నార్థకంగా మారింది. కొత్త హీరోయిన్లతో గట్టి పోటీ ఎదుర్కొంటోంది.
మృణాల్ హవా కొనసాగేనా?
దశాబ్దకాలంగా మృణాల్ బాలీవుడ్లో నటిస్తోంది."సూపర్ 30"లో హృతిక్ రోషన్తో జతకట్టింది, కానీ ఇప్పటివరకు ఈ కలువ కనుల సుందరికి బీటౌన్లో సరైన గుర్తింపు దక్కలేదు. అయితే టాలీవుడ్లో మృణాల్ కేవలం ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్ను అందుకుంది. తెలుగు ప్రజల ప్రేమకు మైమరిచిపోయిన ఈ భామ అప్పట్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది.సీతారామం విజయం మృణాల్కు టాలీవుడ్లో రాచబాట పరిచింది. సీతారామం సినిమాకోసం రూ.80 లక్షలు పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత తన రెమ్యూనరేషన్ను రూ.కోటీన్నరకు పెంచింది. ఫ్యామిలీ స్టార్ పరాజయంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు సన్నగిల్లాయి. రవి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్తో జత కట్టే సినిమాపై ఈ ముద్దుగుమ్మ కెరీర్ను నిర్ణయించే అవకాశం ఉంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్లో స్టోరీ
టాలీవుడ్లో దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకుర్ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో.. ఈ జంటలో మరో మారు సినిమా తీయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ పరుశురాం అసిస్టెంట్ డైరెక్టర్ రవి ఈ జంటతో సినిమా తీసేందుకు ముందుకొచ్చాడని సమాచారం. దుల్కర్- సల్మాన్ కోసం ఓ వినూత్నమైన ప్రేమ కథను రాసుకున్నాడంట. ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా రవి పూర్తి చేశాడంట. ఈ సినిమా కోసం దిల్ రాజు దగ్గరికి వెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా జీవీ ప్రకాశ్ను ఎంపిక చేశారంట. ఆయన కూడా ఈ సినిమాకు పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. తెలుగులో సార్, ఆదికేశవ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. సార్ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అదే తరహాలో మ్యూజిక్ అందించేందుకు జీవీ ప్రకాశ్ సిద్ధమయ్యారు.
షూటింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్, విజయ్ దేవరకొండతో మరో సినిమాతో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే దుల్కర్- మృణాల్ ఠాకూర్ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అటు మృణాల్ ఠాకూర్ సైతం పూజా మేరి జాన్ అనే బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. ఇటు దుల్కర్ సైతం మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తికాగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ జంటపై ఊహగానాలు వినిపిస్తున్నాయి.
మే 14 , 2024