![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Sarileru_Neekevvaru.jpeg)
UATelugu2h 49m
అజయ్( మహేష్ బాబు) పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్.. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఓ పని నిమిత్తం కర్నూలుకు బయల్దేరుతాడు. మరోవైపు భారతి( విజయశాంతి) కర్నూలులో ప్రొఫెసర్గా పనిచేస్తుంటుంది. ఈ క్రమంలో భారతికి స్థానిక మంత్రి ప్రకాశ్ రాజ్ వల్ల సమస్య ఎదురవుతుంది. ఇదే సమయంలో కర్నూలుకు వచ్చిన అజయ్ భారతికి ఎలాంటి సాయం చేస్తాడు. అసలు భారతికి అజయ్కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగతా కథ
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Aha
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Mahesh_Babu_250_250.jpeg)
మహేష్ బాబు
మేజర్ అజయ్ కృష్ణ (పారా SF)![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Rashmika_Mandanna_250_250.jpeg)
రష్మిక మందన్న
అజయ్ ప్రేమికుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Vijayashanti_250_250.jpeg)
విజయశాంతి
వైద్య కళాశాల ప్రొఫెసర్![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sangeetha_Krish_250_250.jpeg)
సంగీత క్రిష్
సంస్కృతీ తల్లి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Prakash_Raj.jpeg)
ప్రకాష్ రాజ్
ఒక అవినీతి మంత్రి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Rajendra_Prasad_(actor).jpeg)
రాజేంద్ర ప్రసాద్
అజయ్ సహోద్యోగి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Rao_Ramesh.jpeg)
రావు రమేష్
సంస్కృతి తండ్రి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Murali_Sharma.jpeg)
మురళీ శర్మ
అజయ్ బ్రిగేడియర్![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Posani_Krishna_Murali.jpeg)
పోసాని కృష్ణ మురళి
సీఐ నారాయణ![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Satyadev_Kancharana_250_250.jpeg)
సత్యదేవ్ కంచరణా
భారతి కొడుకు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Brahmaji_250_250.jpeg)
బ్రహ్మాజీ
న్యాయవాది మృదంగరావు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Tanikella_Bharani_250_250.jpeg)
తనికెళ్ల భరణి
మంత్రి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Jaya_Prakash_Reddy_250_250.jpeg)
జయ ప్రకాష్ రెడ్డి
నాగేంద్ర తండ్రి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Ajay_(actor).jpeg)
అజయ్
నాగేంద్ర అనుచరుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Raghu_Babu.jpeg)
రఘు బాబు
నాగేంద్ర పక్కవాడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Subbaraju_250_250.jpeg)
సుబ్బరాజు
క్రైమ్ బ్రాంచ్ కోటి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Vennela_Kishore_250_250.jpeg)
వెన్నెల కిషోర్
కోటి సహాయకుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Rajeev_Kanakala_250_250.jpeg)
రాజీవ్ కనకాల
ఒక ప్రభుత్వ అధికారిబండ్ల గణేష్
బ్లేడ్ గణేష్సూర్య
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Satya_Akkala_250_250.jpeg)
సత్య అక్కల
సంస్కృతీ భావి వరుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/f694b37c-aba3-423f-b88c-aa00c2082ec7.jpeg)
హరి తేజ
సంస్కృత సోదరిరజిత
సంస్కృతి కాబోయే వరుడు తల్లి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Tamannaah_Bhatia_250_250.jpeg)
తమన్నా భాటియా
అనిల్ రావిపూడి
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Devi_Sri_Prasad.jpeg)
దేవి శ్రీ ప్రసాద్
శేఖర్
సిబ్బంది
అనిల్ రావిపూడి
దర్శకుడురామబ్రహ్మం సుంకరనిర్మాత
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Devi_Sri_Prasad.jpeg)
దేవి శ్రీ ప్రసాద్
సంగీతకారుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/R._Rathnavelu.jpeg)
ఆర్. రత్నవేలు
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
![రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/04132327/123.-69.jpg)
రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
నేషనల్ క్రష్గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతా రామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.
రష్మిక మందన్న ఎవరు?
రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
రష్మిక మందన్న దేనికి ఫేమస్?
రష్మిక మందన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
రష్మిక మందన్న వయస్సు ఎంత?
రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు
రష్మిక మందన్న ముద్దు పేరు?
నేషనల్ క్రష్ రష్మిక
రష్మిక మందన్న ఎత్తు ఎంత?
5 అడుగుల 3 అంగుళాలు
రష్మిక మందన్న ఎక్కడ పుట్టింది?
విరాజ్ పేట, కర్ణాటక
రష్మిక మందన్నకు వివాహం అయిందా?
లేదు ఇంకా జరగలేదు
రష్మిక మందన్న ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు?
రష్మిక మందన్న తొలుత కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఇష్టపడింది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేశారు.
రష్మిక మందన్నకు ఇష్టమైన రంగు?
బ్లాక్
రష్మిక మందన్న అభిరుచులు?
ట్రావెలింగ్
రష్మిక మందన్నకి ఇష్టమైన ఆహారం?
చికెన్, చాక్లెట్
రష్మిక మందన్న అభిమాన నటుడు?
అక్షయ్ కుమార్
రష్మిక మందన్న ఫెవరెట్ హీరోయిన్?
శ్రీదేవి
రష్మిక మందన్న తొలి సినిమా?
కిరాక్ పార్టీ(కన్నడ), ఛలో(తెలుగు)
రష్మిక మందన్నకు గుర్తింపు తెచ్చిన సినిమాలు?
గీతాగోవిందం, పుష్ప
రష్మిక మందన్న ఏం చదివింది?
సైకాలజీలో డిగ్రీ చేసింది
రష్మిక మందన్న చౌదరి పారితోషికం ఎంత?
రష్మిక ఒక్కొ సినిమాకు రూ.4కోట్లు- రూ.4.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
రష్మిక మందన్న తల్లిదండ్రుల పేర్లు?
సుమన్, మదన్ మందన్న
రష్మిక మందన్న ఎన్ని అవార్డులు గెలుచుకుంది?
రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది.
రష్మిక మందన్న మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా?
రష్మిక మందన్న అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది.
రష్మిక మందన్న సిస్టర్ పేరు?
సిమ్రాన్ మందన్న
రష్మిక మందన్న ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా?
లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన చిన్నతనంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇంటి అద్దే కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు ఉండేవి కాదని పేర్కొంది.
రష్మిక మందన్న ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/rashmika_mandanna/?hl=en
రష్మిక మందన్న ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
రష్మిక తొలుత డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆ తర్వాత యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్తో లిప్ లాక్ సీన్లలో నటించింది.
https://www.youtube.com/watch?v=-I7Z5-LKCdc
ఏప్రిల్ 16 , 2024
![Guntur Kaaram Record: భారత సినీ చరిత్రలో ఆల్టైమ్ రికార్డు.. ట్రోలర్లకు మహేష్ దెబ్బ అదుర్స్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/19165155/Untitled-design-2024-01-19T165140.241.jpg)
Guntur Kaaram Record: భారత సినీ చరిత్రలో ఆల్టైమ్ రికార్డు.. ట్రోలర్లకు మహేష్ దెబ్బ అదుర్స్!
సూపర్స్టార్ మహేష్బాబు (Mahesh Babu) 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమాతో ఆల్టైమ్ రికార్డు కొల్లగొట్టాడు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (Guntur Kaaram Collections) జోరు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ.94 కోట్లు, సెకండ్ డే రూ.33 కోట్లు, మూడో రోజు రూ.37 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం తొలి వారంలోనే ఏకంగా రూ.212 మొత్తం కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
భారత సినీ చరిత్రలో ప్రాంతీయ భాషలో రిలీజైన ఓ చిత్రం తొలి వారంలోనే ఇలా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను సాధించి ‘గుంటూరు కారం’(Guntur Kaaram) ఆల్టైమ్ రికార్డు సృష్టించిందని మేకర్స్ తాజా పోస్టర్ ద్వారా తెలియజేశారు. కాగా, మహేష్ కెరీర్లో రూ.200+ గ్రాస్ అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా టాలీవుడ్లో రూ.100 కోట్ల క్లబ్లో మహేష్ సినిమాలు ఐదు ఉన్నాయి.
గుంటూరు కారం చిత్రం ద్వారా మహేష్బాబు కెరీర్లో వరుసగా ఐదోసారి రూ.100+ కోట్ల షేర్ సాధించాడు. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' సినిమాల ద్వారా ఆయన ఈ ఫీట్ అందుకున్నారు. దీంతో వరుసగా ఐదుసార్లు ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా మహేష్ నిలిచాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా ముడోసారి మహేష్తో ‘గుంటూరు కారం’ తెరకెక్కించారు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి సక్సెస్ సాధించాయి. తొలుత ‘గుంటూరు కారం’ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్లలో ఆ ప్రభావం కనిపంచలేదు. మహేష్బాబు యాక్టింగ్, మేనరిజం, ఫైట్స్కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.
ఈ సినిమాలో మహేష్కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) నటించగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కీ రోల్ ప్లే చేసింది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. కాగా హారికా అండ్ హసిన్ ప్రొడక్షన్ బ్యానర్పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందని టాక్. మార్చి ఆఖరి వారంలో గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
మహేష్ టాప్-5 కలెక్షన్లు ఇవే!
‘గుంటూరు కారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తూ మరిన్ని రికార్డులను కొల్లగొట్టేందుకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
సర్కారు వారి పాట
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్ల వసూళ్లు సాధించి మహేష్ సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమాలో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటించింది.
సరిలేరు నీకెవ్వరు
మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' (Sarileru Neekevvaru). రూ.85 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజే రూ. 64.7 కోట్లను వసూలు చేసింది. ఓవరాల్గా రూ.214 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
మహర్షి
రూ.90 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘మహర్షి’(Maharshi) చిత్రం.. వరల్డ్వైడ్గా రూ.170.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజునే రూ.48.2 కోట్లు రాబట్టి నిర్మాతలపై కనక వర్షం కురిపించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, పూజా హెగ్డే, జగపతిబాబు ముఖ్యపాత్రలు పోషించారు.
భరత్ అనే నేను
కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా సైతం మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్ రూ.95 కోట్లు కాగా.. వరల్డ్వైడ్గా రూ. 164.9 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది.
శ్రీమంతుడు
మహేష్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'శ్రీమంతుడు'(Srimanthudu) ఒకటి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.145.2 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్ సరసన శ్రుతి హాసన్ చేసింది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.
జనవరి 19 , 2024
![Rashmika: హాట్ ఫోజుల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నేషనల్ క్రష్.. వైరల్గా ఫొటోస్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/09102911/Untitled-design-2024-01-09T102901.621.jpg)
Rashmika: హాట్ ఫోజుల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నేషనల్ క్రష్.. వైరల్గా ఫొటోస్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. మరోమారు తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్లో ఎద అందాలను ఆరబోసింది.
కొంటె చూపులతో మత్తెక్కించే ఫోజుల్లో ఫ్యాన్స్ను ఉర్రూతలూగించింది. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జంట ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తాజాగా పుకార్లు రేకెత్తాయి.
విజయ్, రష్మిక వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని టాక్ వినిపించింది. మంచి రోజు చూసుకొని ఎంగేజ్మెంట్, కొద్ది రోజుల వ్యవధిలోనే వివాహాం కూడా చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.
నెట్టింట వైరల్గా మారిన ఈ కథనాలపై విజయ్ టీమ్ తాజాగా స్పందించింది. అందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది.
ఇదిలా ఉంటే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ కోసం విజయ్, రష్మిక కలిసి వర్క్ చేశారు. వరుసగా రెండు చిత్రాల్లో నటించడం, టూర్స్, డిన్నర్ పార్టీలకు కలిసి వెళ్తుండటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్ వినిపించాయి.
రణ్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇటీవల రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. రష్మిక డీప్నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్లో ఉన్నట్లు వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వీడియోపై రష్మిక అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ వీడియో ఘటనపై బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇదిలా ఉంటే.. 2016లో కన్నడలో వచ్చిన కిర్రాక్ పార్టీ సినిమాతో రష్మిత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమక్' వంటి కన్నడ చిత్రాల్లో ఈ భామ మెరిసింది.
2018లో వచ్చిన 'ఛలో' సినిమాతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది.
అదే ఏడాదిలో వచ్చిన విజయ్ దేవరకొండతో చేసిన 'గీతా గోవిందం' సినిమా బ్లాక్బాస్టర్గా నిలవగా, దేవదాస్ మూవీ పర్వాలేదనిపించింది.
ఆ తర్వాత వరుసగా మహేష్తో ‘సరిలేరు నీకెవ్వరు, నితీన్తో ‘బీష్మా’, కార్తీతో ‘సుల్తాన్’, బన్నీతో ‘పుష్ప’, శర్వానంద్తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, సీతారామం, విజయ్తో ‘వారసుడు’ వంటి చిత్రాల్లో రష్మిక తళుక్కుమంది.
హిందీలో అమితాబ్తో కలిసి ‘గుడ్ బై’, సిద్దార్థ్ మల్హోత్రాతో జంటగా ‘మిషన్ మజ్ను’ మూవీలో రష్మిక నటించింది.
ప్రస్తుతం తెలుగులో పుష్ప2లో ఈ భామ నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రష్మిక కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
పుష్ప-2తో పాటు రష్మిక తెలుగులో ‘రెయిన్ బో’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా షూటింగ్ను జరుపుకుంటోంది.
జనవరి 09 , 2024
![Rashmika Mandanna: రష్మిక మరో ఫేక్ వీడియో ప్రత్యక్షం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10165426/Untitled-design-70.jpg)
Rashmika Mandanna: రష్మిక మరో ఫేక్ వీడియో ప్రత్యక్షం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!
స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna)ను సోషల్మీడియాలోని ఆకతాయిలు మరోసారి టార్గెట్ చేశారు. ఇప్పటికే ఆమెపై ఓ మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసి ఇబ్బందిపెట్టగా తాజాగా మరో డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు.
https://twitter.com/MrReactionWala/status/1722643605729550835
ఇందులో ఆమె జిమ్ సూట్ ధరించి డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ వీడియోపై రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. దీనిని ఎవరూ నమ్మొద్దని పోస్టులు పెడుతున్నారు.
ఇటీవల సోషల్మీడియా ఇన్ఫ్లుయేన్సర్ జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్, కీర్తిసురేశ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే.. 2016లో కన్నడలో వచ్చిన కిర్రాక్ పార్టీ సినిమాతో రష్మిత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమక్' వంటి కన్నడ చిత్రాల్లో ఈ భామ మెరిసింది.
2018లో వచ్చిన 'ఛలో' సినిమాతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది.
అదే ఏడాదిలో వచ్చిన విజయ్ దేవరకొండతో చేసిన 'గీతా గోవిందం' సినిమా బ్లాక్బాస్టర్గా నిలవగా, దేవదాస్ మూవీ పర్వాలేదనిపించింది.
ఆ తర్వాత వరుసగా మహేష్తో ‘సరిలేరు నీకెవ్వరు, నితీన్తో ‘బీష్మా’, కార్తీతో ‘సుల్తాన్’, బన్నీతో ‘పుష్ప’, శర్వానంద్తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, సీతారామం, విజయ్తో ‘వారసుడు’ వంటి చిత్రాల్లో రష్మిక తళుక్కుమంది.
హిందీలో అమితాబ్తో కలిసి ‘గుడ్ బై’, సిద్దార్థ్ మల్హోత్రాతో జంటగా ‘మిషన్ మజ్ను’ మూవీలో రష్మిక నటించింది.
ప్రస్తుతం రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప 2తో పాటు, బాలీవుడ్ మూవీ యానిమల్ (Animal)లోనూ రష్మిక హీరోయిన్గా చేస్తోంది. స్టార్ హీరో రణ్బీర్కపూర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.
వీటితో పాటు రష్మిక ఫీ మేల్ సెంట్రిక్ కథాంశంతో సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమాకు ‘రెయిన్ బో’ (Rainbow) టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ బైలింగ్యువల్ ప్రాజెక్ట్కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నవంబర్ 10 , 2023
![Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/05/09122316/9th-May-Sai-Pallavi-birthday-vertica-e1683615214893.jpg)
Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పాత్రలో గ్లామర్ డోస్ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. భోళా శంకర్ (Bhola Shankar)
చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్ చేస్తోంది. అయితే కీర్తి సురేష్ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్ను రిజెక్ట్ చేశానని స్పష్టం చేసింది. రీమేక్ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్గా ‘భోళా శంకర్’ వస్తోంది.
2. లియో (Leo)
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడు అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్ లేటెస్ట్ మూవీ ‘లియో’లో హీరోయిన్గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
3. ఛత్రపతి (Chatrapathi)
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్ వినిపించింది. గ్లామర్ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్ కానుంది.
4. వారసుడు (Varasudu)
విజయ్ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు.
5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)
మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
6. డియర్ కామ్రేడ్ (Dear Comrade)
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్ ఆఫర్ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్ ఉండటంతో నో చెప్పింది.
7. చెలియా (Cheliya)
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్నే తిరస్కరించింది. కార్తిక్ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు.
మే 09 , 2023
![Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా...స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/12124757/Featured-image-61.jpg)
Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా...స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?
తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా స్థిరపడటమంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నో సంవత్సరాల కృషి అవసరం. కొందరికి నాలుగైదు సినిమాలకు డైరెక్టర్గా గుర్తింపు వస్తే ఇంకొందరికి 10 సినిమాల వరకు పట్టొచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా అరంగేట్ర సినిమాతోనే కొందరు డైరెక్టర్లు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. దశాబ్ద కాలానికి వచ్చే పేరును మెుదటి సినిమాతోనే సొంతం చేసుకున్నారు. తద్వారా టాలీవుడ్లో అగ్రడైరెక్టర్ల సరసన చేరిపోయారు. టాలీవుడ్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. శ్రీకాంత్ ఓదెల (srikanth odela)
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పేరు టాలీవుడ్లో మార్మోగుతోంది. తొలి సినిమా ‘దసరా’ తోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయిన శ్రీకాంత్.. డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దసరా సినిమా చూసిన వారంతా శ్రీకాంత్ డైరెక్షన్ను తెగ మెచ్చుకుంటున్నారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ను తెరపై చాలా బాగా చూపించాడని ప్రశంసిస్తున్నారు. కాగా, సుకుమార్ దగ్గర శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2. వేణు ఎల్దండి(Venu Yeldandi)
బలగం సినిమాతో వేణు ఎల్దండి గొప్ప డైరెక్టర్గా గుర్తింపు పొందాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. వేణు డైరెక్షన్ స్కిల్స్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి కట్టుబాట్లు, ప్రేమానురాగాలను వేణు చాలా చక్కగా చూపించాడు. తెలంగాణలోని ప్రతీ పల్లెలోను తెరలు కట్టుకొని మరీ సినిమాను చూస్తున్నారంటే బలగం ఏ రేంజ్లో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.
3. బుచ్చిబాబు సాన(buchi babu sana)
డైరెక్టర్ బుచ్చిబాబు కూడా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరు కొత్త వారే అయినప్పటికీ బుచ్చిబాబు తన డైరక్షన్ స్కిల్స్తో సినిమాను నిలబెట్టాడు. స్వచ్చమైన ప్రేమ కావ్యాన్ని తెలుగు ఆడియన్స్కు అందించాడు. ఈ సూపర్ హిట్ సాధించడంతో బుచ్చిబాబు టాలెంట్ ఇండస్ట్రీ అంతా తెలిసింది. దీంతో తన రెండో సినిమానే రామ్చరణ్తో చేసే అవకాశం లభించింది. బుచ్చిబాబు కూడా సుకుమార్ దగ్గరే దర్శకత్వ పాఠాలు నేర్చుకోవడం విశేషం.
4. సందీప్ వంగా(sandeep reddy vanga)
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా డైరెక్ట్ చేసిన సందీప్ వంగా కూడా అంతే స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. మెుదట అర్జున్ రెడ్డి ప్రచార చిత్రాలు, ట్రైలర్ చూసి పెద్ద దుమారమే రేగింది. కానీ, సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. పెద్ద ఎత్తున యువత సినిమాకు కనెక్ట్ అయ్యారు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్తో కలిసి సందీప్ ఓ సినిమా చేయబోతున్నాడు. పుష్ప2 షూటింగ్ పూర్తైన వెంటనే బన్నీ ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు.
5. అనిల్ రావిపూడి(anil ravipudi)
డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన తొలి చిత్రం ‘పటాస్’ ఘన విజయం సాధించింది. హీరో కళ్యాణ్రామ్ కెరీర్లో గొప్ప హిట్గా నిలిచింది. ఈ సినిమాతో హాస్య దర్శకుడిగా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3 చిత్రాలు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన అనిల్ను నిలబెట్టాయి. ప్రస్తుతం అనిల్ బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు.
6. సుజీత్ (sujeeth)
డైరెక్టర్ సుజీత్ కూడా రన్ రాజా రన్ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాకు గాను సుజీత్ ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్గా అవార్డు అందుకున్నాడు. అయితే ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్లో వచ్చిన రీసెంట్ మూవీ సాహో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో సుజీత్ ఓ సినిమా చేస్తున్నాడు.
7. తరుణ్ భాస్కర్(Tharun Bhascker)
పెళ్లి చూపులు చిత్రం ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్గా తరుణ్ భాస్కర్ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ అండ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమాకు గాను తరణ్ భాస్కర్ సైమా అవార్డ్స్-2016 సైమా అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ అరంగేట్ర డైెరెక్టర్గా పురస్కారాన్ని పొందారు. పెళ్లి చూపులు తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా తరుణ్కు మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారానే విశ్వక్ సేన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
8. స్వరూప్ RSJ
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో డైరెక్టర్గా స్వరూప్ RSJ టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు స్వరూప్ డైరెక్షన్కు మంచి మార్కులే పడ్డాయి. రొటిన్ కామెడీతో వస్తున్న సినిమాలకు ఈ చిత్రం ట్రెండ్ సెటర్గా నిలిచింది. మిషన్ ఇంపాజిబుల్ (2022) చిత్రం ద్వారా మరోమారు స్వరూప్ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.
9. అజయ్ భూపతి(Ajay Bhupathi)
అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన RX100 చిత్రం పెద్ద సంచలనమే అని చెప్పాలి. 'యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ' అనే ట్యాగ్లైన్కి తగ్గట్టే సినిమాను చాలా డిఫరేంట్గా తెరపైకి ఎక్కించాడు. ఈ సినిమా యూత్కు తెగ కనెక్ట్ అయింది. దీంతో అజయ్ భూపతి పేరు అప్పట్లో మార్మోగింది. ఆ తర్వాత అజయ్ తీసిని మహాసముద్రం (2021) బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
10. కరుణ కుమార్(karuna kumar)
డైరెక్టర్ కరుణ కుమార్ కూడా తన తొలి సినిమా పలాసతో మంచి డైరెక్టర్గా గుర్తింపు పొందాడు. తన సొంత ఊరులో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు అప్పట్లో కరుణ కుమార్ తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, దళితుల శ్రమ దోపిడి వంటి అంశాలను పలాసలో చక్కగా చూపించాడు. ఈ సినిమాకు గాను కరుణ కుమార్ను సైమా అవార్డ్ వరించింది. ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్-2020 పురస్కారాన్ని అందించింది. అయితే ఆ తర్వాత కరుణ కుమార్ డైరెక్షన్లో వచ్చిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం చిత్రాలు ఆకట్టుకోలేదు.
ఏప్రిల్ 12 , 2023
![Devi Sri Prasad Hits: DSP టాప్-10 బెస్ట్ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/04/04124020/dsp-1.jpg)
Devi Sri Prasad Hits: DSP టాప్-10 బెస్ట్ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. 1999లో విడుదలైన దేవి చిత్రంతో దేవిశ్రీ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పాటలు సూపర్హిట్ కావడంతో దేవిశ్రీ కెరీర్కు తిరుగులేకుండా పోయింది. దేవి సినిమా నుంచి రీసెంట్ వాల్తేరు వీరయ్య వరకు డీఎస్పీ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. హీరోకు తగ్గట్లు మ్యూజిక్ అందించే దేవి.. మాస్, క్లాస్, మెలోడి, ట్రెడిషనల్ సాంగ్స్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఇచ్చిన టాప్-10 సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం..
1. పూనకాలు లోడింగ్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇందులో అన్ని పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే ‘పూనకాలు లోడింగ్’ పాట మాత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించిందనే చెప్పాలి. దేవిశ్రీ సంగీతానికి తోడు చిరు, రవితేజ డ్యాన్స్ నిజంగానే థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది.
https://www.youtube.com/watch?v=4JMpHGMYm1w
2. శ్రీవల్లి
సుకుమార్ డైరెక్షన్లో అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించింది. సినిమా విజయానికి దేవిశ్రీ ఇచ్చిన పాటలు సైతం ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా ‘శ్రీవల్లి’ పాట అప్పట్లో మార్మోగింది. పందిళ్లు, శుభకార్యాలు, వేడుకలు ఇలా ఏ కార్యక్రమమైన శ్రీవల్లి పాట వినిపించాల్సిందే. ఈ పాట ద్వారా సింగర్ సిద్ శ్రీరామ్కు మంచి పేరు వచ్చింది.
https://www.youtube.com/watch?v=txHO7PLGE3o
3. బుల్లెట్ సాంగ్
రామ్ పోతినేని, కృతి శెెట్టి జంటగా నటించిన ‘వారియర్’ సినిమాలో ‘బుల్లెట్ సాంగ్’ బాగా హిట్ అయింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ పాట మాత్రం మ్యూజిక్ లవర్స్కు బాగా దగ్గరైంది. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్కు రామ్, కృతి డ్యాన్స్ తోడవడంతో ఈ సాంగ్ ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది.
https://www.youtube.com/watch?v=WgrLE4Fqxeo
4. జల జల జలపాతం నువ్వు
చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో దేవిశ్రీ ఇచ్చిన పాటలు కూాడా అంతే ఆదరణ పొందాయి. ముఖ్యంగా ‘జల జల జలపాతం’ నువ్వు అనే పాట యూత్కు చాలా బాగా కనెక్ట్ అయింది.
https://www.youtube.com/watch?v=PTpimuHzlvE
5. ఎంత సక్కగున్నావే
రామ్చరణ్లోని గొప్ప నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ‘రంగస్థలం’. ఇందులో చెర్రీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేగాక దేవిశ్రీ ఇచ్చిన పాటల్లో చరణ్ తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. ముఖ్యంగా ‘ఎంత సక్కగున్నావే’ పాట అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఇందులో సమంత హోయలు, రామ్చరణ్ ఎక్స్ప్రెషన్స్ పాటకు మరింత హైప్ తీసుకొచ్చింది.
https://www.youtube.com/watch?v=NuWs_eKu_ic
6. ప్రేమ వెన్నెల
చిరు మేనల్లుడు సాయిధరమ్ కెరీర్లో మంచి వసూళ్లను రాబట్టిన సినిమా చిత్ర లహరి. ఇందులో తేజ్ నటనతో పాటు దేవిశ్రీ సంగీతానికి ప్రేక్షుకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ‘ప్రేమ వెన్నెల’ పాట సినిమాకే హైలెట్ అని చెప్పాలి. లవ్ మెలోడీగా రూపొందిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. తేజ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడి సాంగ్గా నిలించింది.
https://www.youtube.com/watch?v=tpvNtKjlf5E
7. మైండ్ బ్లాక్
మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దేవి శ్రీ అందించిన సంగీతం ఈ సినిమాకా బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా ‘మైండ్ బ్లాక్’ పాటపై చాలా మంచి హైప్ వచ్చింది. దేవి శ్రీ ఇచ్చిన హై ఎనర్జిటిక్ మ్యూజిక్కు మహేశ్, రష్మి హై వోల్టెజ్ పర్ఫార్మెన్స్ తోడవడంతో సాంగ్ సూపర్ హిట్గా నిలిచింది.
https://www.youtube.com/watch?v=ZBDSNy4Yn9Q
8. సీటీ మార్
అల్లుఅర్జున్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి దేవిశ్రీనే సంగీతం ఇచ్చారు. ఇందులోని అన్ని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా ‘సీటీమార్’ పాట అప్పట్లో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. దేవిశ్రీ ఎనర్జీటిక్ మ్యూజిక్కు అల్లు అర్జున్ క్లాస్ స్పెప్పులు జతకావడంతో పాట రేంజ్ పెరిగిపోయింది.
https://www.youtube.com/watch?v=F5X694sak5U
9. నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ప్రభాస్ హీరోగా చేసిన వర్షం సినిమాకు దేవిశ్రీ ఫీల్గుడ్ సాంగ్స్ను అందించారు. ముఖ్యంగా హీరోయిన్ త్రిష వర్షంలో డ్యాన్స్ చేసే పాట ఎప్పటికీ దేవిశ్రీ టాప్ సాంగ్స్లో ఒకటిగా ఉంటుంది.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ సాగే ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.
https://www.youtube.com/watch?v=eUrC0jWdu-M
10. నువ్వుంటే
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని సినిమాాల్లో కెల్లా కెరీర్ స్టార్టింగ్లో చేసిన ఆర్య చిత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ ఇప్పటికీ సూపర్హిట్గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ‘నువ్వుంటే’ పాటను ఇప్పటికీ గుర్తుచేసుకొని వినేవాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రేమ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాటలో అల్లుఅర్జున్ నటన ఆకట్టుకుంటుంది.
https://www.youtube.com/watch?v=Llw7cXHmDDo
ఏప్రిల్ 04 , 2023