UATelugu
తెప్ప సముద్రం అనే గ్రామంలో స్కూల్ పిల్లలు మాయమవుతుంటారు. దీనిని కనిపెట్టేందుకు ఎస్సై గణేష్ (చైతన్య రావు) రంగంలోకి దిగుతాడు. మరోవైపు రిపోర్టర్ ఇందు (కిశోరి ధాత్రిక్) కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో వారికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి? ఆ వాస్తవాలు ఏంటి? గణేష్ ఈ కేసును ఎలా ఛేదించాడు? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
చైతన్య రావు మాదాడి
అంబటి అర్జున్
కిషోరి దాత్రక్
పి. రవిశంకర్
నీరుకంటి మణి చరణ్
సిబ్బంది
సతీష్ రాపోలుదర్శకుడు
నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్నిర్మాత
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం..
[toc]
బేబీ
“ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని”
“మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు”
“అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు”
వాన
“ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు”
మన్మథుడు
“నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!”
కంచె
“గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం”
నిన్నుకోరి
“నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది”
ఆర్య
“నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “
ఆరెంజ్
“ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి”
ప్రేయసిరావే
“ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.”
ఏమాయ చేశావె
“ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.”
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
“కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”
మజిలి
“పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది”
ఊపిరి
“ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే”
జాను
“పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే”
అందాల రాక్షసి
“నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను”
"రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు."
ఓయ్
“నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే”
కలర్ ఫొటో
“ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.”
“ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే
సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం.
కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది.
మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.”
“ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో
రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.”
“నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి.
అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి.
ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.”
మనం
“మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు”
పడిపడిలేచె మనసు
మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది.
హలో గురు ప్రేమకోసమే
“గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.”
తీన్మార్
“మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది”
అల వైకుంఠపురములో..
“ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.”
“బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.”
“ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు”
“ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.!
“ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్,
ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
ఆగస్టు 23 , 2024
Aadikeshava Review: యాక్షన్ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు
రచన - దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి
సినిమాటోగ్రఫీ: డడ్లీ
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ: నవంబర్ 24, 2023
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppen Movie)తో బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆ స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తాజాగా నటించిన 'ఆదికేశవ' మూవీపై వైష్ణవ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో మాస్ లుక్లో వైష్ణవ్ కనిపించాడు. మరి, 'ఆదికేశవ'తో ఆయన విజయం అందుకున్నారా? లేదా?. వైష్ణవ్-శ్రీలీల జోడీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
బాలు (వైష్ణవ్ తేజ్) తల్లిచాటు బిడ్డగా గారాబంగా పెరుగుతాడు. కానీ, కళ్లముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. ఎంతటివాళ్లనైనా ఎదిరించే మనస్తత్వం అతడిది. తల్లిదండ్రుల బలవంతంతో కాస్మోటిక్ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. కంపెనీ సీఈవో చిత్రావతి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రాయలసీమలోని బ్రహ్మసముద్రం ప్రాంతం నుంచి వచ్చిన ఓ పెద్దాయన బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని చెబుతాడు. అతడి అసలు పేరు రుద్ర కాళేశ్వర్రెడ్డి అని తెలియజేస్తాడు. ఇంతకీ బాలు ఎవరు? బ్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్)ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే
ప్రథమార్థం మెుత్తం సరదా సరదాగా కాలక్షేపంగా సాగిపోతుంది. హైదరాబాద్లో స్నేహం, ప్రేమ, కుటుంబ సన్నివేశాలు కనిపిస్తాయి. విరామం సమయానికి కథ మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థం కథంతా సీమలో చెంగారెడ్డితో ఢీ కొట్టడంతో సాగిపోతుంది. హీరో హీరోయిన్ కలవగానే ఓ పాట, విలన్ హీరో ఎదురుపడగానే ఓ ఫైట్ అన్నట్లు సినిమా సాగిపోతుంది.
ఎవరెలా చేశారంటే
వైష్ణవ్తేజ్ మరోమారు మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రథమార్థంలో లవర్ బాయ్గా సరదాగా ఉండే పాత్రలో ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో రుద్రకాళేశ్వర్రెడ్డిగా వీరోచితాన్ని ప్రదర్శించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక శ్రీలీలకు నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు. కానీ డ్యాన్సుల్లో మాత్రం ఎప్పటిలాగే ఇరగదీసింది. హీరో తల్లి పాత్రలో రాధిక మెప్పించారు. విలన్గా జోజు జార్జ్ క్రూరంగా కనిపించినా ఆ పాత్ర ప్రభావం తక్కువే. ఇక అపర్ణాదాస్, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్ అక్కడక్కడా నవ్వించాడు
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, డ్రామా, రాజకీయం తదితర అంశాలు పుష్కలంగా ఉన్నా వాటిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి తడబడ్డాడు. ఒకట్రెండు మలుపులు తప్ప కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనమేమీ కనిపించదు. పాత రోజుల్లో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల్లాగే డైరెక్టర్ కథను చెప్పినట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలతో కట్టిపడేసే సీన్లు, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ఎక్కడా కనిపించదు. రచనలో బలం లేకపోయిన దర్శకుడి మేకింగ్ మాత్రం బాగుంది.
టెక్నికల్గా
సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. డడ్లీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్ పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కానీ, నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాకు సంబంధించిన మిగతా విభాగాలు అన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వైష్ణవ్తేజ్ నటనమలుపులునేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ, కథనంపండని భావోద్వేగాలు
రేటింగ్: 2.5/5
నవంబర్ 24 , 2023
Devara Dialogues : గూస్బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే
జూ.ఎన్టీఆర్ (Jr.NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. జూ.ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషించాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.
సినిమా కథను కొరటాల చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఆచార్య అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా డైలాగ్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సినిమా పూర్తైన తర్వాత కూడా ఆ డైలాగ్స్ వెంటాడుతాయి.
ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ ఆయ పాత్రలకు అనుగుణంగా చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి.
[toc]
బైరా(సైఫ్ అలీ ఖాన్) డైలాగ్:
“ఎర్ర సముద్రం కాడికి వచ్చి రక్తం గురించి మాట్లాడుతుండావా.. నాకు చావు గురించి చెబుతుండావా”
అక్కడి నుంచి తప్పించుకున్న అజయ్, ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లినప్పుడూ…
ప్రకాశ్ రాజ్ డైలాగ్: కొండ మీదకొచ్చి భయపెడుదామనుకున్నావా
అజయ్ : ఎవడ్రా నువ్వు
ప్రకాశ్ రాజ్: సింగప్పా.. నువు దిగివచ్చిన కొండ మీద తూర్పు దిక్కున ఉంటాను
అజయ్: నేను ఇక్కడికో పనిమీద వచ్చాను. పెద్దాయనవి, మీ వాళ్లకు ఓ మాట చెప్పి ఒప్పించగలవా..!
సముద్రంపై పడవలో వెళ్తున్న సమయంలో వచ్చే డైలాగ్స్…
అజయ్ తన డైమండ్ ఉంగరం కోసం సముద్రంలో దూకి.. లోపల ఆస్తి పంజరాలు చూసి భయపడినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుటుంది.
ప్రకాశ్ రాజ్: “వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీకు కానొచ్చిన దాని భయంతో వజ్రం గుర్తుకు రాలే.! ఈ భయమే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంత ఆశ చూపినా, ఇక్కడ ఉన్నవాళ్లు ఈ సముద్రం జోలికి మాత్రం రారు.”
ప్రకాశ్ రాజ్ దేవరను పరిచయం చేస్తూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్తో విజిల్స్ వేయిస్తుంది.
అజయ్: కళ్లు మూసినా, తెరిసినా సముద్రంలో చూసిందే కనిపిస్తోంది. అసలు ఎవరు వాళ్లంతా.. ఎవరు చేశారు ఇదంతా?
ప్రకాశ్ రాజ్: “చాలా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ“
అజయ్: ఎవరి కథ
ప్రకాశ్ రాజ్: పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ.. మా దేవర కథ.
“భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా”
”కులం లేదు, మతం లేదు, భయం లేదు వారికి తెలిసింది ధైర్యమే”
దేవర… తన కొడుకు వరంకు తన తండ్రి గురించే చెప్పే సందర్భంలోని డైలాగ్స్ కూడా బాగుంటాయి.
(Devara Movie Dialogues)
వరం(జూ.ఎన్టీఆర్): అబ్బా ఎప్పుడూ మీ నాన్న కథలు, వాళ్ల నాన్న కథలు చెబుతుంటావ్..! మా నాన్న కథ చెప్పు దేవర కథ చెప్పు నాకు!
దేవర: తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి. మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు. మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు, బతికున్నామే గాని, భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు.
దేవర తొలిసారి ఆయుధ వ్యాపారులకు ఎదురు తిరిగిన సందర్భంలో వచ్చే సీన్లో డైలాగ్స్ పవర్ఫుల్గా ఉంటాయి.
దేవర: మా ఆయుధాల లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావ్
“మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్.. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్..”
విలన్: మాటలు ఎక్కువ అవుతున్నాయ్, సముద్రం ఎక్కాలా, సముద్రం ఎలాలా?
దేవర గ్యాంగ్లోని కొండ ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సూపర్బ్గా ఉంటుంది.
Jr Ntr Dialogues- Devara
దేవర:
“చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.“
“మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు”. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..!
“దేవర అడిగినాడంటే.. సెప్పినాడనిఅదే సెప్పినాడంటే”…
ఇంటర్వెల్ బ్యాంగ్కు ముందు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద దాడికి వచ్చిన వారందర్ని దేవర చంపేస్తాడు. సముద్రం దేవర చంపిన వ్యక్తుల రక్తంతో ఎర్రగా మారుతుంది.అప్పుడు దేవర ఓ బండపై రాసిన డైలాగ్స్ మంచి కిక్ ఇస్తాయి
ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా, మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా..
కానీ, భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది
మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు
అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా..
భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”.
అలాగే సైఫ్ అలి ఖాన్ డైలాగ్స్ కూడా పవర్పుల్గా ఉంటాయి.
“దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలా..
జాన్వీ కపూర్ డైలాగ్స్
తంగా(జాన్వీకపూర్) వరం(జూ.ఎన్టీఆర్) పిరికితనం గురించి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంటాయి.
“వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే.. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే,
నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా.. లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా!!
సొరచెపను చంపి ‘వర’ తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు.. తంగం చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది.
“ఉందే వాడిలో .. ఉందే ఆడిలో..!నాకు తెలుసూ..ఇంతప్పటి నుంచి చూస్తుండాగాఉందే వాడిలో!!
యంగ్ ఎన్టీఆర్ను చూసి జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్ కూడా హెలేరియస్గా ఉంటుంది.
ఆఆ ఆడా ఆడా.. వీరుడిలెక్క ఆ నడక చూడూ
లోపల పొంగి ఉప్పొంగుతాందే..లోపల
ఎన్టీఆర్, జాన్వీకపూర్ తొలిసారి ఒకరికొకరు ఎదురు పడినప్పుడు వారి మధ్య సాగే సంభాషణ రొమాంటిక్గా ఉంటుంది.
తంగం(జాన్వీకపూర్): ఏంది ఇట్లా వచ్చినవ్
వర(ఎన్టీఆర్): రాయప్ప(శ్రీకాంత్)తో పని ఉండి వచ్చినా
తంగం: అబ్బో అప్పుడే మా అయ్యతో మాట్లాడేదాక పోయినావా
ఈరోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది.నా వీరుడు ఆయుధ పూజకు సిద్ధమవుతున్నాడా
ఆయుధ పూజలో మత్తు మందు ఇచ్చి గెలిచిన యంగ్ ఎన్టీఆర్ను తక్కువ చేసి విలన్(సైఫ్ అలీ ఖాన్) మాట్లాడినప్పుడు రాయప్ప(శ్రీకాంత్) చెప్పే డైలాగ్ పవర్పుల్గా ఉంటుంది.
రాయప్ప
ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!దేవర లెక్క బలాన్ని చూసినావాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనంకానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిదిసముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలుకొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా
తంగం (జాన్వీ కపూర్ డైలాగ్స్)
“నావళ్ల కావట్లా, అందరికీ మత్తు మందు ఇచ్చి గెలవడం ఏంటే.అక్కా, నా మొగుడంటే..సముద్ర అల అంతా ఊహించుకున్నా నేనువాడేమో.. ఒడ్డుకు చేరే పిల్ల అల మాదిరి ఉన్నాడు”
తంగం స్నేహితురాలు ఓదార్చుతూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది
అన్ని తెలిసిన దాన్ని చెబుతానా విను
“ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడువచ్చినోడు ఇంకోడుంటాడువచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకునిదీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటేబతుకు సాఫీగా సాగిపోతది”
Devara Climax Dialogues
క్లైమాక్స్లో దేవర గురించి అతని భార్య జోగుల(శ్రుతి మరాఠే)కు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
“నీ పెనిమిటి అందర్ని వదిలిపెట్టి ఎప్పుడో పొయినాడు తల్లిదేవర మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో చనిపోయాడుఇన్నేళ్లుగా అందర్ని సముద్రంపై తప్పు చేయకుండా భయపెడతా ఉందినీ పెనిమిటి దేవర కాదు..నీ బిడ్డ వరచిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరిగి ఉండాడేమో..ఈ కొండను బతికించడానికి పెద్ద కథను రాసినాడు నీ బిడ్డఆ మృగాల మాయలోపడి గొర్రె పిల్లాల పోయాడు అనుకున్నావాకాదు తల్లి, వాడిని అడ్డుపెట్టుకుని వెళ్లిన వాళ్లు గొర్రెపిల్లలుసముద్రంలో ఈపాటికి మృగాన్ని వెటాడినట్లు వెటాడుతుంటాడు నీ బిడ్డ!
సెప్టెంబర్ 30 , 2024
Telugu Youthful Songs: తెలుగులో యూత్ను అమితంగా ఆకట్టుకున్న టాప్-10 సాంగ్స్ ఇవే!
ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్ లవ్ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్ హిట్గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ ఆల్బమ్స్లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్లోనూ అత్యధిక వ్యూస్తో ఆ సాంగ్స్ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్ఫుల్ సాంగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
1. మాష్టారు మాష్టారు
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్ సాంగ్గా మారిపోయింది. అటు యూట్యూబ్లోనూ ఈ సాంగ్ అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్ను వీక్షించారు.
https://www.youtube.com/watch?v=AXSm49NGkg8
2. నీ కన్ను నీలి సముద్రం
ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్ పాడారు. యూట్యూబ్లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.
https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek
3. చిట్టి నీ నవ్వంటే
జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్ను ఎంతగానో ఆకర్షించింది. రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్కు కనెక్ట్ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.
https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU
4. ఇంకేం ఇంకేం కావాలి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA
5. అడిగా అడిగా
నాని, నివేదా థామస్ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్ లవర్స్ను మెప్పించాయి.
https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU
6. చూసి చూడంగానే
2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్ మారుమోగేది. అనురాగ్ కులకర్ణి, స్వరసాగర్ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు.
https://www.youtube.com/watch?v=_JVghQCWnRI
7. పూలనే కునుకేయమంటా
శంకర్ డైరెక్షన్లో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్ను చిత్రీకరించిన లోకేషన్స్ కూడా ఆకట్టుకుంటాయి.
https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs
8. మాటే వినదుగా
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చి హిట్ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్ను ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్ను రిపీట్ మోడ్లో పెట్టుకొని వింటుంటారు.
https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc
9. మధురమే
విజయ్ దేవరకొండ కెరీర్ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్ రొమాంటిక్ సాంగ్గా గుర్తింపు పొందింది. యూత్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్, హీరోయిన్ షాలిని పాండే రొమాన్స్ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది.
https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&feature=youtu.be
10. ఎంత సక్కగున్నావే
రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్చరణ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ హైలెట్గా నిలుస్తాయి. యూట్యూబ్లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.
https://www.youtube.com/watch?v=eABViudPBFE
మే 31 , 2023
New Ott Releases This Week: ఈ వారం సందడంతా చిన్న చిత్రాలదే.. ఓ లుక్కేయండి!
దసరా పండగను పురస్కరించుకొని గతవారం పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తాయి. ఇక ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
లవ్రెడ్డి
అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్రెడ్డి’ (Love Reddy Movie). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా దీనిని తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.
సముద్రుడు
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేశ్ నారదాసి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సముద్రుడు’ (Samudrudu). అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వీక్షణం
రామ్ కార్తీక్ (Ram Karthik), కశ్వి (Kashvi) జంటగా చేసిన తాజా చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). మనోజ్ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 18న థియేటర్లో విడుదల కానుంది. చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
రివైండ్
సాయి రోనక్ హీరోగా కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘రివైండ్’ (Rewind Movie). అమృత చౌదరి కథానాయిక. ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్కు మనసుకు హత్తుకునే లవ్స్టోరీని జోడించి ఈ సినిమా తీసినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.
‘ఖడ్గం’ రీ-రిలీజ్
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్రాజ్ కీలకపాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఖడ్గం’. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అక్టోబరు 18న (khadgam re release date) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్లు
1000 బేబీస్
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న ఆసక్తికరమైన వెబ్ సిరీస్ '1000 బేబీస్ (1000 Babies). అక్టోబర్ 18న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. ఇందులో రెహమాన్, నీనా గుప్తా ముఖ్యపాత్రలు పోషించారు. నజీమ్ దర్శకత్వం వహించారు.
కలి
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి 'కలి' (Kali Movie OTT Release) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 17నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రిన్స్, నరేశ్ అగస్త్య ముఖ్య పాత్రలు పోషించారు. నేహా కృష్ణన్ హీరోయిన్గా చేసింది. శివ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
TitleCategoryLanguagePlatformRelease DateThe Linkan LawyerMovieEnglishNetflixOct 17Fabulous Lives vs Bollywood Wives S3SeriesEnglishNetflixOct 19The Pradeeps Of PittsburghSeriesEnglishAmazonOct 17Citadel Honey BunnySeriesTelugu/HindiAmazonNov 7Kali MovieTeluguETV WinOct 17Reeta SanyalMovieHindiHotstarOct 14NemesisMovieEnglish/DutchHotstarOct 161000 BabiesSeriesTelugu/MalayalamHotstarOct 18RivalsMovieEnglishHotstarOct 18Crime Reels MovieTeluguAhaOct 13Janaka Aithe GanakaMovieMovieAhaNov 5Maa Nanna Super HeroMovieMovieZee 5Nov 8
అక్టోబర్ 14 , 2024
Devara Song: ఒక్క సాంగ్తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి!
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తారక్ బర్త్డే (మే 20)ను పురస్కరించుకొని నిన్ననే మూవీ టీమ్.. తొలి సాంగ్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సాంగ్ను ప్రశంసిస్తుంటే ఎక్కువ మంది సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దూసుకెళ్తున్న సాంగ్
దేవర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను ఆదివారం (మే 19) సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'ఫియర్ సాంగ్' (Fear Song) పేరుతో సాంగ్ లిరికల్ వీడియోను యూట్యూబ్లో రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగులో ఈ పాట లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాయగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్ తొలి 20 గంటల్లో 47 లక్షల వ్యూస్ (తెలుగులో) దూసుకెళ్తోంది. అటు ఇతర భాషల్లోనూ ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.
https://www.youtube.com/watch?v=CKpbdCciELk&list=PLTtJUIuknk91d-Sq1qbTeI0WM0R6EbuZS&index=3
‘అనిరుధ్ ఎలివేషన్స్ ఏంటి’
దేవర ఫస్ట్ సాంగ్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గూస్బంప్స్ వచ్చినా.. మిగతా మ్యూజిక్ లవర్స్, నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ బర్త్డే సాంగ్లో అనిరుద్ ఎలివేషన్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తారక్ కంటే ఎక్కువగా అనిరుధ్ కనిపించాడని మండిపడుతున్నారు. విక్రమ్ సినిమా టైటిల్ ట్రాక్ని తీసుకొచ్చి ‘దేవర’కు పెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు. పాట మెుత్తాన్ని మ్యూజిక్ డామినేట్ చేసిందని పోస్టులు పెడుతున్నారు. ఆ మ్యూజిక్ మధ్యలో లిరిక్స్ ఏమి వినిపింలేదని మండిపతున్నారు. 'దేవర ముంగిట నువ్వెంత' అన్న పదం తప్ప ఇంకేమి స్పష్టంగా వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్ విన్న తర్వాత ‘దేవర’ ఫిల్మ్పై ఉన్న అంచనాలు కూడా సన్నగిల్లుతున్ననయని మరికొందరు వ్యాఖ్యానించారు.
ఆ సాంగ్ను కాపీ కొట్టాడా?
‘దేవర’లోని ఫియర్ సాంగ్ను విన్న కొందరు నెటిజన్లు.. ఈ పాటను గతంలో వచ్చిన సాంగ్స్తో కంపేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ 'లియో' చిత్రంలోని 'బ్యాడ్ యాస్' పాటలా ఉందంటూ తమిళ ఆడియన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. తమిళంలోనూ ఈ సాంగ్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అనిరుధ్ మళ్లీ కాపీ కొట్టాడంటూ కామెంట్ బాక్స్లో పోస్టులు చేస్తున్నారు.
‘దేవర’లో ఎన్టీఆర్ పాత్ర ఇదే!
‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజల సమస్యలను తీర్చే నాయకుడిగా తారక్.. దేవరలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాలు ఈ మూవీతో పతాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు సమాచారం.
మే 20 , 2024
SRIDEVI: శ్రీదేవితో బాలకృష్ణ అందుకే నటించలేదు...NTR అసలు కారణం కాదు
]అంతే తప్ప ఎన్టీఆర్తో నటించిన హీరోయిన్లతో నటించొద్దనే నియమం బాలయ్య పెట్టుకోలేదనేది నిజం
ఫిబ్రవరి 24 , 2023
Fastest 500Cr Movies: జెట్ వేగంతో రూ.500 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలు.. ఎన్ని రోజుల్లో తెలుసా?
ఒకప్పుడు దేశంలో సూపర్ హిట్ సినిమా అనగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల కలెక్షన్స్ బట్టి చెప్పేవారు. ఆ స్థాయి వసూళ్లు వస్తే తప్ప సినిమాను బ్లాక్ బాస్టర్గా పరిగణించేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సరైన కంటెంట్తో వస్తే చిన్న సినిమా అయినా తేలికగా రూ.500 కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో వేగంగా రూ. 500 కోట్లను కొల్లగొట్టిన టాప్ 10 భారతీయ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. బాహుబలి-2
ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం.
2. ఆర్ఆర్ఆర్
బాహుబలి-2 తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా ‘RRR’ నిలిచింది. ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లోనే రూ.570 కోట్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే.
3. కేజీఎఫ్ 2
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్-2’ చిత్రం కూడా నాలుగు రోజుల్లోనే రూ.560 కోట్లు రాబట్టింది. RRRతో పోలిస్తే రూ.10 కోట్లు తక్కువ రావడంతో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1,200-1,250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం.
4. పఠాన్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రీసెంట్ మూవీ ‘పఠాన్’ సైతం అత్యంత వేగంగా రూ.500 కోట్లను రాబట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.545 కోట్లు వసూలు చేసింది.
5. రోబో 2.0
రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘రోబో 2.0’ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. అయినప్పటికీ ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా రాబట్టడం విశేషం.
6. సుల్తాన్
సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘సుల్తాన్’ చిత్రం కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా 12 రోజుల్లోనే ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్లో చేరింది.
7. దంగల్
బాలీవుడ్ స్టార్ అమీర్ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దంగల్’ చిత్రం పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం 13 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్ను అందుకుంది. వరల్డ్వైడ్గా రూ.1,968-2,200 కోట్లను రాబట్టింది.
8. పీకే
అమీర్ ఖాన్ హీరోగా చేసిన ‘పీకే’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆ మూవీ సైతం 14 రోజుల్లో రూ. 500 కోట్లు రాబట్టడం జరిగింది.
9. టైగర్ జిందా హై
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ జిందా హై’ చిత్రం 15 రోజుల్లోనే రూ.500 కోట్లు రాబట్టింది.
10. సంజు
బాలీవుడ్ నటుడు సంజయ్దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. ఇందులో రణ్బీర్ కపూర్ హీరోగా చేశాడు. ఈ చిత్రం విడుదలైన 21 రోజుల్లో రూ.586 కోట్ల వసూళ్లను రాబట్టింది.
సెప్టెంబర్ 05 , 2023
Fahadh Faasil: పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
‘పుష్ప’ (Pushpa) సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో చివరి 30 నిమిషాలు అల్లు అర్జున్ (Allu Arjun)తో పోటీ పడి మరి నటించాడు. విలన్ షేడ్స్ ఉన్న ఎస్పీ భన్వర్సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఆ స్థాయిలో ఆయన తన పాత్రపై ముద్ర వేశాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో ఫహాద్కు నేషనల్ వైడ్గా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం అతడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఫహాద్ తాజాగా ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఫహాద్కు వచ్చిన వ్యాధి ఇదే!
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్.. అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన ఫహాద్.. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీని వల్ల దేనిపైనా ఎక్కువ శ్రద్ద పెట్టలేకపోతున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి గమనించినట్లు చెప్పారు. తన సమస్య గురించి డాక్టర్ను అడిగినట్లు ఫహాద్ తెలిపాడు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించాడు.
ADHD వ్యాధిని ఎలా గుర్తించాలి?
ADHD రుగ్మత పిల్లల్లో చాలా సాధారణం. కానీ, పెద్దల్లో మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆజాగ్రత్తగా తప్పులు చేయడం, స్థిరంగా ఒక చోట కూర్చోలేకపోవడం, పరిగెత్తడం, గెంతడం, అతిగా మాట్లాడటం, తరచూ చేతులు కాళ్లు కదిలిస్తూ ఉండటం చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం,, ప్రతీ దానికి తొందరపడటం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
ADHD వ్యాధి ఎలా వస్తుంది?
ఒక వ్యక్తి ADHD వ్యాధి ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఇటువంటి పిల్లలను నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అటు పెద్దలు కూడా ఇదే ఫార్మూలాను అనుసరించాల్సి ఉంటుందని సమాచారం.
కెరీర్లో బిగ్గెస్ట్ హిట్
ఇటీవలే ‘ఆవేశం’ (Aavesham) సినిమాతో ఫహాద్ ఫాజిల్ సూపర్ హిట్ను అందుకున్నాడు. ఆ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. రూ.150 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది భారీ వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఫహాద్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం ఫహాద్.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2' (Pushpa 2: The Rule) లో నటిస్తున్నాడు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది. అలాగే తమిళంలో 'మారీసన్' (Maareesan), రజనీకాంత్తో 'వట్టైయాన్' (Vettaiyan) చిత్రంలో నటిస్తున్నాడు.
మే 28 , 2024
Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సైతం తెరకెక్కింది. రామాయణం గొప్పతనాన్ని ఈ తరం వారికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. అయితే రామాయణంలోని పాత్రలు లేకుండా కథను మాత్రమే ప్రతిబింబిస్తూ కమర్షియల్ హంగులతో రూపొందిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిని పరిశీలనగా చూస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. అటువంటి చిత్రాలను YouSay మీ ముందుకు తెచ్చింది. ఆయా చిత్రాల్లోని రామాయణం తాలుకూ మూలాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
దసరా (Dasara)
హీరో నాని రీసెంట్ చిత్రం ‘దసరా’లోనూ రామాయణం కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ పాత్రలు రావణుడి ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్పై కన్నేసిన విలన్.. ఆమెను సొంతం చేసుకోవడానికి కుట్రలు చేస్తుంటాడు. చివరికి హీరో అతడ్ని చంపి తన భార్యకు, ఊరికి ప్రశాంతత కల్పిస్తాడు.
ఆర్ఆర్ఆర్ (RRR)
ఆర్ఆర్ఆర్లోనూ తారక్ (Jr NTR) పాత్రను గమనిస్తే ఆంజనేయుడు గుర్తుకు రాక మానడు. తన గూడెం నుంచి బ్రిటిష్ వారు ఎత్తుకెళ్లిన పాప ఆచూకి కోసం తారక్ హస్తినకు వెళ్తాడు. రావణకోట లాంటి బ్రిటిష్ బంగ్లాలోకి వెళ్లి బందింపబడిన బాలికలో ధైర్యం నింపుతాడు. చివరికి పాపను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. రాముడి వద్దకు సీతను ఆంజనేయుడు ఎలా చేర్చాడో అచ్చం అలాగే.
వర్షం (Varsham)
ప్రభాస్ - త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గాఢంగా ప్రేమించుకోగా వీరి మధ్యలోకి విలన్ (గోపీచంద్) ఎంట్రీ ఇస్తాడు. త్రిషను ఇష్టపడి ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అతడ్ని అంతం చేసి చివరికి ప్రభాస్ (Prabhas) తన ప్రేమను గెలిపించుకుంటాడు. ఈ కథను పరిశీలిస్తే రామాయణంలో సీతపై మనసు పడ్డ రావణుడు.. అతడ్ని సంహరించిన రాముడు గుర్తుకు వస్తారు.
వరుడు (Varudu)
2010లో వచ్చిన ఈ చిత్రానికి గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ (Allu Arjun), భానుశ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆర్య (Actor Arya) చేశాడు. కథలోకి వెళ్తే హీరో హీరోయిన్లకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి పీటలపై నుంచి కథానాయకిని విలన్ ఎత్తుకెళ్తాడు. విలన్ను కనిపెట్టి అంతం చేయడం ద్వారా హీరో తన భార్యను పొందుతాడు. ఈ మూవీ స్టోరీ కూడా రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒక్కడు (Okkadu)
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu), భూమిక (Bhumika) జంటగా నటించిన బ్లాక్బాస్టర్ చిత్రం ‘ఒక్కడు’. ఇందులో హీరోయిన్పై మనసు పడ్డ విలన్ (ప్రకాష్రాజ్) ఆమె కుటుంబాన్ని చంపి మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. భూమిక అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హీరో కంట పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. విలన్ను అంతం చేసి హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
రావణన్ (Raavanan)
విక్రమ్, ఐశ్వర్యరాయ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'రావణన్' చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. ఇందులో రాముడు లాంటి ఎస్పీ దేవ్ (పృథ్వీ) భార్య ఐశ్వర్యరాయ్ను నల్లమల్ల అడవులకు విక్రమ్ తీసుకొస్తాడు. సీతలాంటి ఆమెను వెత్తుక్కుంటూ పోలీసు ఆఫీసర్ పృథ్వీ, ఆంజనేయుడి పాత్ర లాంటి అడవులు తెలిసిన కానిస్టేబుల్ కార్తిక్ వెళ్తారు. రామాయణాన్ని ఆధునీకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ ఈ చిత్రం వచ్చింది.
సైనికుడు (Sainikudu)
మహేష్ - త్రిష జంటగా చేసిన ‘సైనికుడు’ సినిమా కథ రామాయణానికి కాస్త ఆపోజిట్గా ఉంటుంది. విలన్ మంచోడని భావించిన హీరోయిన్ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఓ కారణం చేత హీరోయిన్ను హీరో ఎత్తుకెళ్తాడు. విలన్ నిజస్వరూపం తెలుసుకున్నాక త్రిష.. మహేష్బాబుని ప్రేమిస్తుంది. త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విలన్ ప్రయత్నించడంతో హీరో అతడ్ని చంపి ఆమెను సొంతం చేసుకుంటాడు.
రోబో (Robo)
రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన చిత్రం ‘రోబో’. కథలోకి వెళితే సైంటిస్ట్ వశీకర్ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. దానిలో మనుషులకు లాగే ఫీలింగ్స్ ఉండేలా చేస్తాడు. దీంతో ఆ రోబో హీరోయిన్పై మనసు పడుతుంది. ఆమెను ఎత్తుకెళ్లి పోతుంది. రక్షణగా తనలాగా ఉండే వందలాది రోబోలను సైన్యంగా చేసుకుంటుంది. చివరికీ హీరో ఆ రోబోను నిర్విర్యం చేసి ప్రేయసిని దక్కించుకుంటాడు.
ఆదిపురుష్ (Adipurush)
గతేడాది ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు.
సీతారాముల కల్యాణం లంకలో
నితిన్ - హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం (Seeta Ramula Kalyanam Lankalo) టైటిల్కు తగ్గట్లే రామయాణ కథను గుర్తు చేస్తుంది. కాలేజీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ కుటుంబానికి విలన్కు మధ్య కుటుంబ కక్ష్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విలన్ కథానాయికను రావణాసురుడిలా మాయ చేసి ఎత్తుకెళ్తాడు. అది గ్రహించిన హీరో లంక లాంటి అతడి ఇంటికి మారు వేషంలో వెళ్లి వారితో కలిసిపోతాడు. విలన్లను మాయ చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.
ఫిబ్రవరి 19 , 2024
3rd Day BOX OFFICE: స్టార్ హీరో లేకున్నా కలెక్షన్లు కుమ్మేసిన టాప్-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్ ఇమేజ్ ప్రేక్షకులను థియేటర్కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్ వస్తే తప్ప థియేటర్కు ఎవరూ వెళ్లరు. అలా తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
ఉప్పెన
మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించినా.. హిట్ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి. ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్ వచ్చింది.
దసరా
నేచురల్ స్టార్ నాని నటించిన పవర్ ప్యాక్డ్ మాస్ చిత్రం దసరా. లుక్, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాడు నాని.
విరూపాక్ష
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది.
https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్ చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.
బింబిసార
కల్యాణ్రామ్కు మంచి హిట్ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్పై కల్యాణ్రామ్ స్వయంగా నిర్మించాడు.
ఇస్మార్ట్ శంకర్
హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, పూరి జగన్నాథ్లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్, నిధి అగర్వాల్కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.
భీష్మ
వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్టైనర్ భీష్మ. బాక్సీఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు.
జాతి రత్నాలు
కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్ వసూళ్లు వచ్చాయి. బ్లాక్బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
కార్తీకేయ 2
ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్లోకి వెళ్లింది. బాలీవుడ్లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
ఏప్రిల్ 24 , 2023
RRRపై తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు… ఏకిపారేసిన నాగబాబు.. నీయమ్మ *** ఖర్చు పెట్టాడారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు
RRR చిత్రంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ్మారెడ్డిని సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు. తెలుగు చలన చిత్ర స్థాయి పెరగడాన్ని స్వాగతించాల్సింది పోయి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అసలేంటీ వివాదం?
బంగారుతల్లి సినిమా ప్రమోషన్లలో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ RRR చిత్ర యూనిట్పై విమర్శలు చేశారు. “ ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.600 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కోసం రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు. విమాన టికెట్ల కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటితో 8 సినిమాలు తీసి వారి ముఖాన కొట్టచ్చు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/i/status/1633519566235275266
రచ్చ రచ్చ
తమ్మారెడ్డి వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ మెుదలయ్యింది. తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలుస్తుంటే సొంత ఇంటి వాళ్లే విమర్శలు చేయడం ఏంటనే ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. 8 సినిమాలు తీసి నష్టం మిగల్చడం తప్ప మీరు చేసేది ఏముండదంటూ కామెంట్లు పెడుతున్నారు.
అకౌంట్స్ ఉన్నాయా?
ఈ విమర్శలపై దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా , సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మెుదటిసారి ప్రపంచవేదికలపై వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి గర్వపడాలి అన్నారు. అంతే కానీ..రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీదగ్గర అకౌంట్స్ ఉన్నాయా ? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి పేరుపొందిన దర్శకులు డబ్బులు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా? అన్నారు.
https://twitter.com/Ragavendraraoba/status/1633871454445137921
స్ట్రాంగ్ కౌంటర్
ప్రముఖ నటుడు నాగబాబు మరింత ఘాటుగా సమాధాన మిచ్చారు. “ నీయమ్మ మెుగు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు RRRకి ఆస్కారం కోసం” (#RRR మీద కామెంట్కు వైసీపీ వారి భాషలో సమాధానం) అంటూ కౌంటర్ ఇచ్చాడు.
https://twitter.com/NagaBabuOffl/status/1633845057622253568
నాగబాబుపై విమర్శలు
విమర్శలపై కాస్త కఠినంగానే స్పందించే నాగుబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అతడిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గౌరవప్రదమైన కుటుంబంలో ఉండి.. ఇలాంటి విమర్శలతో పేరు చెడగొడుతున్నారని మండిపడ్డారు. చిరంజీవి, పవన్ను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు మరికొందరు.
మార్చి 10 , 2023
EXCLUSIVE: ఇంటర్వెల్కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్ హిట్ కావాలన్న రూల్ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్, ఫ్లాప్స్గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
[toc]
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man)
నితీన్ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్ చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్ కేరీర్లో ఎక్కువగా ట్రోల్స్ గురైన చిత్రంగా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ నిలిచింది.
శాకుంతలం (Shakunthalam)
సమంత (Samantha) లీడ్ రోల్లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.
రాధే శ్యామ్ (Radhe Shyam)
ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్తో స్మార్ట్గా ఉండటంతో ఫ్యాన్స్లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి.
వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover)
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. హీరో విజయ్పై ఈ సినిమా నుంచే ట్రోల్స్ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్ తప్ప కథ లేదని ట్రోల్స్ వచ్చాయి. విజయ్ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.
బ్రహ్మోత్సవం (Brahmotsavam)
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు.
సన్ ఆఫ్ ఇండియా (Son Of India)
దిగ్గజ నటుడు మంచు మోహన్బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్లో రెండే టికెట్లు బుక్ కావడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా ‘సన్ ఆఫ్ ఇండియా’ నిలిచింది.
వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama)
రామ్చరణ్, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్ స్ప్రెడ్ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్ అంటూ చూసిన వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్పై నిలబడి బిహార్కు వెళ్లడం.. హీరో విలన్ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.
లైగర్ (Liger)
విజయ్ దేవరకొండ కెరీర్లో డిజాస్టర్గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి.
శక్తి (Shakthi)
తెలుగులో డిజాస్టర్ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్ రమేష్ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్బ్యాక్లో తారక్ లుక్ అసలు సూట్ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్ వెంకటేష్తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్గా నిలిచింది. మేహర్ రమేష్ రీసెంట్ చిత్రం ‘భోళా శంకర్’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.
సలీం (Saleem)
మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి.
అక్టోబర్ 22 , 2024
Guntur Kaaram: ‘గుంటూరు కారం’పై నెట్టింట ఆసక్తికర చర్చ.. కల్ట్ క్లాసిక్ను ఫ్లాప్ చేశారంటూ ఫైర్!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై ఆశించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించినప్పటికీ అప్పట్లో ఈ మూవీపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ‘గుంటూరు కారం’పై తాజాగా మాట్లాడారు. ఈ చిత్రాన్ని మాస్ సినిమాగా ప్రమోట్ చేసి తప్పు చేశామని క్లాస్ మూవీగా ప్రమోట్ చేసి ఉంటే మంచి రిజల్ట్ వచ్చేదని అభిప్రాయ పడ్డారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో ‘గుంటూరు కారం’ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. ‘అతడు’, ‘ఖలేజా’ తరహాలోనే ఈ మూవీకి అన్యాయం జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నాగవంశీ ఏమన్నారంటే?
త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఆయనకు ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ మూవీ కమర్షియల్గా లాభాలు తెచ్చిపెట్టిందా అంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనిపై నాగవంశీ మాట్లాడుతూ 'గుంటూరు కారం కమర్షియల్గా సూపర్ హిట్. ఒక్క నైజాంలో డ్యామేజ్ జరిగింది తప్పితే అందరూ సేఫే కదా. అది సంక్రాంతి మూలానా జనం సొంతూర్లకు వెళ్తారు కాబట్టి ఎక్కువ వసూళ్లు రాలేదు. మేము అనుకున్నట్లు సినిమాను మీరు అనుకోలేదు. అందులో మా తప్పు కూడా ఉండొచ్చు. గుంటూరు కారం టైటిల్ పెట్టడం తప్పు అయ్యుండొచ్చు. ఫ్యామిలీ సినిమాకు మాస్ టైటిల్ పెట్టడం రాంగ్ ఏమో. ఇంకోటి ఫ్యామిలీ సినిమాకు ఒంటి గంట షో వేయడం ఇంకో తప్పేమో' అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
https://twitter.com/MB_Manish_/status/1845636287744626994
కల్ట్ క్లాసిక్ను ఫ్లాప్ చేశారని ఫైర్!
గుంటూరు కారం చిత్రాన్ని రీసెంట్గా ఓటీటీ, టీవీలో చూసినవారంతా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ను థియేటర్లో తప్ప మళ్లీ చూడలేదని, కానీ గుంటూరు కారంను థియేటర్తో పాటు ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్లోనూ రెండుసార్లు చూశానని చెప్పుకొచ్చారు. ఇది తెలుగు ఇండస్ట్రీ ఫెయిల్యూర్ అని పోస్టు పెట్టాడు. మహేష్ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఇలా గుంటూరు కారం మూవీని ఆకాశానికెత్తుతూ #GunturKaaram హ్యాష్ట్యాగ్ను ఒక్కసారిగా ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ మూవీలోని హైలెట్ సీన్స్ను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
https://twitter.com/NikhilKalyan88/status/1845478831462789400
https://twitter.com/dheeraj_0718/status/1845744116237234401
https://twitter.com/RKMSD147/status/1845562518246396065
https://twitter.com/ursrulymahesh02/status/1845547017428447593
https://twitter.com/Areykrishna_/status/1845539794740216028
https://twitter.com/i/status/1845524403872051336
https://twitter.com/i/status/1845515851140825401
‘కుర్చి మడతపెట్టి’ మరో రికార్డు!
గుంటూరు కారం చిత్రంలోని ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్ మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా మహేష్, శ్రీలీల స్టెప్పులు ఫ్యాన్స్ను ఎంతగానో అలరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఈ సాంగ్ మారుమోగేది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్లో మరో రికార్డు సొంతం చేసుకుంది. 450 మిలియన్ల వ్యూస్ మార్క్ను అందుకొని సత్తా చాటింది. దీంతో #KurchiMadathapetti హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ సంబంధించిన వీడియోలను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.
https://twitter.com/AtTheatres/status/1845773602467053815
https://twitter.com/i/status/1845743865938247921
https://twitter.com/i/status/1845712856580333801
మహేష్-త్రివిక్రమ్ మూవీలే ఎందుకు?
మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటివరకూ మూడు చిత్రాలు రూపొందాయి. గతంలో వచ్చిన ‘అతడు’ (Athadu), ‘ఖలేజా’ (Khaleja) చిత్రాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. కమర్షియల్గానూ పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే బుల్లితెర ఆడియన్స్ను మాత్రం ఈ రెండు చిత్రాలు విశేషంగా ఆకర్షించాయి. అత్యధిక టీఆర్పీ సాధించి టెలివిజన్ ప్రీమియర్స్లో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ సినిమాను ఎలా ఫ్లాప్ చేశారన్న ఫీలింగ్ను అందరిలోనూ కలిగించాయి. ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయంలోనూ సరిగ్గా ఇదే జరుగుతోందని నెటిజన్లు అంటున్నారు. థియేటర్లలో పెద్దగా పట్టించుకోని ఆడియన్స్ ఓటీటీ, టెలివిజన్లో చూసి ప్రశంసలు కురిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్-త్రివిక్రమ్ చిత్రాలకే ఇలా ఎందుకు జరుగుతోందంటూ ఫిల్మ్ వర్గాలు సైతం నివ్వేరపోతున్నాయి.
అక్టోబర్ 14 , 2024
Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?
నటీనటులు : అలియా భట్, రాహుల్ రవీంద్రన్, వేదాంగ్ రైనా, అకాంక్ష రంజన్ కపూర్, మనోజ్ పహ్వా, యువరాజ్ విజయన్, జసన్ షా, ధీర్ హిరా, ఆదిత్య నంద తదితరులు
దర్శకత్వం : వాసన్ బాల
సంగీతం : అచింత్ థక్కర్
సినిమాటోగ్రఫీ : స్వప్నిల్ ఎస్. సోనావానే
ఎడిటింగ్ : ప్రేర్నా సైగల్
నిర్మాతలు : కరణ్ జోహార్, అలియా భట్, షాహీన్ భట్, అపూర్వ మెహతా
విడుదల తేదీ : 11-10-2024
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అటువంటి అలియా భట్ లీడ్రోల్ చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘జిగ్రా’ (Jigra Movie Review). వాసన్ బాలా దర్శకుడు. తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబరు 11న (Jigra Release Date) ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్ను మెప్పించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్ మేనేజ్మెంట్ స్టాఫ్గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. మంచి బిజినెస్ ఐడియాతో ఉన్న అంకుర్ ఇన్వెస్టర్లను కలిసేందుకు మలేషియా దగ్గర్లో ఉన్న హన్షి దావో దేశానికి వెళ్తాడు. అక్కడ పార్టీలో డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి మరణశిక్ష విధిస్తారు. దీంతో తమ్ముడిని కాపాడటానికి సత్యభామ తనకు కుదిరిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. దీంతో జైలు నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని సత్య నిర్ణయిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో సత్య విజయం సాధించిందా? ముత్తు (రాహుల్ రవీంద్రన్), భాటియా (మనోజ్ పహ్వా) ఎవరు? సత్యకు వారు ఏ విధంగా సాయపడ్డారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సత్యభామగా ఆలియా భట్ అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తమ్ముడిని కాపాడుకునే అక్క పాత్రలో అలియాను తప్ప మరొకరిని ఊహించలేనంత బాగా నటించింది. యాక్షన్ సీక్వెన్స్లోనూ దుమ్మురేపింది. తమ్ముడు అంకుర్ పాత్రలో వేదాంగ్ రైనా మంచి నటన కనబరిచాడు. అటు ముత్తు రూపంలో తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్కు మంచి పాత్ర దక్కింది. కథలో అతడి రోల్ ఎంతో కీలకం. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వాసన్ బాలా జైల్ బ్రేక్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన వెంటనే నేరుగా కథలోకి వెళ్లి అక్క, తమ్ముళ్ల బాండింగ్ను చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. వారి మధ్య ఉన్న స్ట్రాంగ్ రిలేషన్ను ఆడియన్స్ ఫీలయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే అంకుర్ అరెస్టు వరకూ కథను అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అరెస్టు తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. జైలులో అతడు పడే తిప్పలు, తమ్ముడ్ని బయటకు తీసుకొచ్చేందుకు సత్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తమ్ముడ్ని జైలు నుంచి తప్పించాలని సత్య నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అందుకు ఆమె చేసే సాహాసోపేత ప్రయాణాన్ని చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. క్లైమాక్స్ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. అయితే సాగదీత సన్నివేశాలు, ఊహజనీతంగా కథనం, ట్విస్టులు లేకపోవడం మైనస్గా చెప్పవచ్చు.
టెక్నికల్గా
సాంకేతిక విభాగాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. జైలు వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ చక్కగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్లో కొన్ని షాట్లు విజువల్ ఫీస్ట్లా అనిపిస్తాయి. సంగీతం కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు ఉంది. ఎడిటర్ మూవీని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అలియా భట్ నటనఅక్కా-తమ్ముడి సెంటిమెంట్యాక్షన్ సీక్వెన్స్సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్ఊహాజనీత కథనం
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 11 , 2024
Mahesh - Balakrishna Multi Starrer: క్లాస్-మాస్ కాంబినేషన్లో క్రేజీ మల్టీస్టారర్? స్టోరీ కూడా రెడీ అట!
టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Balakrishna), మహేష్బాబు (Mahesh Babu) ఒకరు. క్లాసీ లుక్స్తో మహేష్ ఫ్యాన్స్ను అలరిస్తే, బాలకృష్ణ తనదైన మాస్ డైలాగ్స్తో అభిమానులను ఉర్రూతలూగిస్తారు. అటువంటి ఈ ఇరువురు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య, మహేష్ కాంబోలో మల్టీస్టారర్ అంటే ఆ ఊహే ఎంతో బాగుంది కదూ!. అయితే టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వ్యాఖ్యలను బట్టి ఈ మల్టీస్టారర్ త్వరలోనే సాధ్యమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఓ షోలో తమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
థమన్ ఏమన్నారంటే?
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’లో తెలుగు ఇండియన్ ఐడల్ (Indian Idol) సింగింగ్ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో మూడవ సీజన్కు సంగీత దర్శకుడు తమన్ జడ్జిగా వ్యవహరిస్తుండగా సింగర్ శ్రీరామచంద్ర యాంకరింగ్ చేస్తున్నాడు. ఈ షో సెమీఫైనల్లో భాగంగా యాంకర్ శ్రీరామచంద్ర తమన్ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. 'బాలకృష్ణ, మహేష్ బాబు ఇద్దరి సినిమాలకు ఒకేసారి మ్యూజిక్ డైరెక్షన్ చేసే అవకాశమొస్తే ఇద్దరిలో ఎవరి చిత్రానికి పని చేస్తారు?' అని అడిగారు. దీనిపై తమన్ ఇచ్చిన సమాధానం టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారిపోయింది. బాలయ్య బాబు, మహేష్ బాబు కలిసి మల్టీసారర్ సినిమా చేస్తారని ఆ సినిమా కథ కూడా తాను విన్నానని చెప్పుకొచ్చాడు. దీనికి యాంకర్ శ్రీరామచంద్రతో పాటు ప్రేక్షకులంతా ఈలలు వేస్తూ గోల చేశారు.
https://twitter.com/CINE_EXPLORERS/status/1832658977953607782
రచ్చ చేస్తున్న ఫ్యాన్స్!
క్లాస్, మాస్ కాంబోలో మల్టీస్టారర్ రానున్నట్లు తమన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్, బాలయ్య కాంబోలో సినిమా వస్తే రికార్డులు చెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. గతంలో సూపర్ కృష్ణ (Super Star Krishna), ఎన్టీఆర్ (N T Rama Rao) కలిసి నటించిన విషయాన్ని నెట్టింట ప్రస్తావిస్తున్నారు. తిరిగి వారి కుమారులు కూడా కలిసి నటిస్తే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమన్ ఈ వ్యాక్యలు సరదాగా చేశారా? లేదా నిజంగానే అందులో వాస్తవముందా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ గురించి ప్రేక్షకుల ఊహలే తప్ప సినిమా కథ, దర్శకత్వం లాంటి వాటి గురించి ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇదే నిజమైతే స్పీకర్లే కాదు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని ఇరు హీరోల అభిమానులు చెబుతున్నారు.
ఒకవేళ ఉన్నా.. ఇప్పట్లో లేనట్టే!
‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ తన తర్వాతి చిత్రాన్ని దర్శకుధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం ఇంకో మూడేళ్లు మహేశ్ మరే మూవీ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బాలయ్యతో కలిసి ఇప్పట్లో మూవీ చేసే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ నిజంగానే ఆ కథ ఉండి.. ఆ ఇద్దరూ ఓకే చెప్పినా ఈ మూవీ పట్టాలెక్కేందుకు నాలుగు సంవత్సరాలైనా పడుతుంది. ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ తన లుక్ను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే జుట్టు, గడ్డం భారీగా పెంచేశారు. గ్లోబల్ రేంజ్లో భారీ బడ్జెట్తో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీ రూపొందనుంది.
బాలయ్య బిజీ బిజీ
బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లితో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీ (NBK 109) చేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ మూవీకి థమనే సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు బాబీ డియోల్ (Bobby Deol), ఉర్వశి రౌతేలా (Urvashi Rautela) కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటూ బాలయ్య బిజీ బిజీగా ఉన్నారు.
సెప్టెంబర్ 09 , 2024
Thangalaan Telugu Review: విక్రమ్ కెరీర్లోనే మరో మైలురాయి చిత్రం.. ‘తంగలాన్’ ఎలా ఉందంటే?
నటీనటులు: విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్ కాల్టాగిరోన్ తదితరులు
దర్శకత్వం: పా.రంజిత్
సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్
ఎడిటింగ్: సెల్వ ఆర్.కె.
సినిమాటోగ్రఫీ: ఎ.కిషోర్ కుమార్
నిర్మాతలు: కె.ఇ.జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్, జ్యోతి దేశ్ పాండే
విడుదల: 15-08-2024
‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగులోనూ పాపులర్ అయిన నటుడు విక్రమ్ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'తంగలాన్' చిత్రంలో ఆటవిక మనిషిగా విక్రమ్ కనిపించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్ తనను తాను మార్చుకున్న తీరు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్, టీజర్ కూడా వాటిని రెట్టింపు చేసింది. ఆగస్టు 15న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా విడుదలైంది. మరీ తంగలాన్ ఎలా ఉంది? విక్రమ్ మరోమారు తన నటనతో మెస్మరైజ్ చేశాడా? సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి ఇచ్చింది? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కథ సాగుతుంటుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురవుతాయి. నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్) తన అతీంద్రియ శక్తులతో బంగారాన్ని రక్షిస్తున్నట్లు తంగలాన్కు కలలు వస్తుంటాయి. మరి ఆమె నిజంగానే బంగారాన్ని రక్షిస్తుందా? తంగలాన్కు అతడి బృందానికి ఆమె వల్ల ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్ ఏం తెలుసుకున్నాడు? చివరకు బంగారం కనిపెట్టాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
తంగలాన్ పాత్రలో విక్రమ్ అదరగొట్టేశారు. అతడు తప్ప మరొకర్ని ఊహించుకోలేనంతగా ఆ పాత్రపై ప్రభావం చూపించారు. ఆదివాసిలా తను కనిపించిన తీరు, పలికించిన హావభావాలు అందర్నీ కట్టిపడేస్తాయి. ఇది విక్రమ్ కెరీర్లో మరో మైలురాయిగా చెప్పవచ్చు. తంగలాన్ భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువత్తు ఉన్నంతలో పర్వాలేదనిపించింది. నాగిని జాతి నాయకురాలు ఆరతిగా మాళవిక మోహనన్ కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకుంది. తన లుక్స్, నటనతో ఆడియన్స్ను భయపెట్టింది. విక్రమ్ తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపిన పాత్ర ఆమెదే. విక్రమ్తో ఆమె చేసే యాక్షన్ హంగామా అలరిస్తాయి. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
తంగలాన్ చిత్రం ప్రధానంగా బంగారం అన్వేషణ చుట్టూ తిరిగినా అంతర్లీనంగా ఓ అణగారిన వర్గం చేసే పోరాటంగా దర్శకుడు పా.రంజిత్ ఈ మూవీని తెరెక్కించారు. బ్రిటిషర్ల కాలంలోని వర్ణ వివక్షను కళ్లకు కట్టారు. కథ చెప్పేందుకు దర్శకుడు సృష్టించిన ప్రపంచం, ప్రజల వస్త్రధారణలు ఆడియన్స్ను కొత్త లోకానికి తీసుకెళ్తాయి. బిటిషర్లతో కలిసి తంగలాన్ బంగారం వేటకు వెళ్లడం, ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లు ఉత్కంఠను రేపుతాయి. విరామంలో వచ్చే సీన్స్ సెకండాఫ్పై మరింతగా అంచనాలు పెంచేస్తాయి. అయితే సెకండ్ పార్ట్కు వచ్చే సరికి కథ గాడితప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్లో బ్రిటిషర్లు-తంగలాన్-నాగజాతి తెగకు మధ్య జరిగే పోరు గందరగోళానికి గురిచేస్తుంది. ఏది తంగలాన్ ఊహో, ఏది నిజమో తెలియక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అయితే క్లైమాక్స్లో తంగలాన్ పాత్రలోని మరో కోణం చూపించి దర్శకుడు మంచి ముగింపును ఇచ్చాడు.
టెక్నికల్గా
ఈ చిత్రం సాంకేతికంగా చాలా విషయాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాయి. అలాగే కథకు తగ్గట్లుగా జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనంవిక్రమ్, మాళవిక నటనఫాంటసీ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్లోని సాగదీత సీన్స్స్లో నారేషన్
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 16 , 2024
Mega Multi Starrer Movie: చిరు, పవన్, చరణ్ కాంబోలో మల్టీస్టారర్.. డైరెక్టర్ హారీష్ శంకర్ బిగ్ ప్లాన్!
టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుటుంబాల్లో 'మెగా ఫ్యామిలీ' (Mega Family) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ఈ ఫ్యామిలీకి మూల పురుషుడు కాగా ఆయన తర్వాత ఎంతో మంది హీరోలు టాలీవుడ్లో అడుగుపెట్టారు. అలా వచ్చిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా అది టాలీవుడ్లో సెన్సేషనే అని చెప్పవచ్చు. అటువంటిది చిరు, పవన్, చరణ్ కలిసి ఒక మల్టీస్టారర్ తీస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే ఎంతో బాగుంది కదూ..! అయితే ఇది త్వరలోనే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దిశగా డైరెక్టర్ హరీష్ శంకర్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
‘అదే అతి పెద్ద పాన్ ఇండియా’..
మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. ఆయన పవన్ కల్యాణ్ భక్తుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. అటువంటి హరీశ్ శంకర్ తన 'మిస్టర్ బచ్చన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'పాన్ ఇండియా కోసం అని కథ రాయలేం. ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా అని తీయలేదు. 'కాంతార' పాన్ ఇండియా కోసం చేయలేదు. వాళ్ళ మట్టి కథను చెప్పారు. పాన్ ఇండియా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సహజసిద్ధంగా అలా జరగాలి. కల్యాణ్ గారు, రామ్ చరణ్, చిరంజీవి ఈ ముగ్గురి కోసం ఒక లైన్ ఎప్పటి నుంచో వర్కవుట్ చేస్తున్నాను. చేస్తే అన్ని పాన్ ఇండియాల కంటే అదే పాన్ ఇండియా అవుతుంది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారిపోయింది. ఈ సినిమా సెట్స్పైకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1817891248398795055
గతంలోనే స్పెషల్ క్యామియోలు!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గతంలోనే ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఇందులో చరణ్ ఓ స్పెషల్ క్యామియోతో అలరించాడు. అంతకుముందు ‘బ్రూస్లీ’ ‘మగధీర’ చిత్రాల్లో కుమారుడి కోసం మెగాస్టార్ ఒక చిన్న క్యామియో ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, పవన్ కల్యాణ్ సైతం రెండు సినిమాల్లో కలిసి నటించారు. ‘శంకర్దాదా MBBS’ మూవీలోని ఓ స్పెషల్ సాంగ్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెరిశారు. అలాగే ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా క్లైమాక్స్లోనూ అన్న చిరుతో కలిసి పవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే చిరు, పవన్, చరణ్ ముగ్గురు కలిసి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా నటించలేదు. క్యామియోలు తప్ప కలిసి ఫుల్ లెంగ్త్ రోల్స్లో నటించలేదు. దీంతో మెగా మల్టీస్టారర్ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
మెగా ఫ్యామిలీతో అనుబంధం
దర్శకుడు హరీష్ శంకర్కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. పవన్ కల్యాణ్తో పాటు మెగా ఫ్యామిలీకి వీర విధేయుడన్న పేరు ఈ మాస్ డైరెక్టర్కు ఉంది. మెగా ఆడియన్స్ పల్స్ గురించి హరీష్ శంకర్కు బాగా తెలుసు. ఆయన ఇప్పటికే నలుగురు మెగా హీరోలతో పని చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో 'గబ్బర్ సింగ్' (Gabbar Singh), అల్లు అర్జున్తో 'దువ్వాడ జగన్నాథం' (Duvvada Jagannadham), వరుణ్తేజ్తో 'గద్దలకొండ గణేష్' (Gaddalakonda Ganesh), సాయి ధరమ్ తేజ్తో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' (Subrahmanya For Sale) చిత్రాలు తెరెకెక్కించారు. అందులో మెగా హీరోలను చూపించిన తీరు ఫ్యాన్స్ను ఎంతగానో మెప్పించింది. దీంతో అతడి డైరెక్షన్లో మల్టీస్టారర్ వస్తే ఇక బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యి త్వరలోనే పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్ గుర్తుండిపోతుంది’
పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్కు బ్రేకులు పడ్డాయి. దీంతో ఆ చిత్రాన్ని పక్కన పెట్టి రవితేజతో 'మిస్టర్ బచ్చన్' (Mr.Bachchan) సినిమాను సైతం హరీష్ శంకర్ రూపొందించారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి హరీష్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆయన వీలును బట్టి సినిమా పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఈ చిత్రం చాలా ఏళ్ల పాటు అభిమానులకు గుర్తుండిపోతుందని భరోసా ఇచ్చారు. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏది ఆశించి థియేటర్లకు వస్తోరో ఆ అంశాలన్నీ సంపూర్ణంగా ఉస్తాద్ భగత్ సింగ్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.
జూలై 30 , 2024
Ram Charan New Movie: మూడు నేషనల్ అవార్డ్స్ సాధించిన డైరెక్టర్తో రామ్చరణ్ కొత్త సినిమా!
చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్చరణ్.. తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ను సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో నటనకు పెద్ద స్కోప్ లేని పాత్రలు చేసిన చరణ్.. ‘రంగస్థలం’ సినిమాతో తనలోని అసలైన నటుడ్ని పరిచయం చేశాడు. 'ఆర్ఆర్ఆర్' ద్వారా నటనలో మరో స్టెప్ పైకెక్కి పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ జాతీయ స్థాయిలో బజ్ ఉంది. అటు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, సుకుమార్తోనూ సినిమాను అనౌన్స్ చేశాడు. లేటెస్ట్గా తమిళ స్టార్ డైరెక్టర్తో మరో ప్రాజెక్ట్ను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
డైరెక్టన్ ఎవరంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran)తో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్తో వెట్రిమారన్ సినిమా ఉంటుందని విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ, అది వర్కౌట్ కాలేదు. రీసెంట్గా చరణ్కు తమిళ డైరెక్టర్ కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అది చరణ్కు బాగా నచ్చిందని సమాచారం. కథలో స్వల్ప మార్పులు చేయాలని చరణ్ సూచించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఆ ఛేంజస్ తర్వాత త్వరలోనే వీరి కాంబినేషన్పై అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎవరీ వెట్రిమారన్?
తమిళంలో వెట్రిమారన్ చిత్రాలకు (Vetrimaaran Movies) చాలా గుర్తింపు ఉంది. ఆయన హీరోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన సినిమాల్లో కథే ప్రధాన హీరో. వెట్రిమారన్ తీసిన ‘డుకాలం’, ‘విసారణై’, ‘వడాచైన్నై’, ‘అసురన్’, ‘విడుతలై’ వంటి సినిమాలు గమనిస్తే అందులో కథే కీలక పాత్ర పోషించింది. అందులో నటీనటుల కంటే పాత్రలే ఆడియన్స్ కనిపించాయి. వెట్రిమారన్ ఇప్పటివరకూ 8 చిత్రాలకు దర్శకత్వం వహించగా అందులో మూడు నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్నాయి. అటువంటి డైరెక్టర్తో రామ్చరణ్ ప్రాజెక్ట్ ఓకే అయితే ఫ్యాన్స్కు పండగే అని చెప్పవచ్చు. నటుడిగా రామ్చరణ్ మరో మెట్టు ఎక్కుతాడనడంలో ఎలాంటి సందేహాం ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు.
రెండేళ్లు ఆగాల్సిందే!
ప్రస్తుతం రామ్ చరణ్.. తమిళ డైరెక్టర్ శంకర్తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ‘బుచ్చి బాబు’ దర్శతక్వంలో చరణ్ చేయనున్నాడు. మరోవైపు సుకుమార్తోనూ ఓ సినిమా చేసేందుకు చరణ్ కమిట్మెంట్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాతనే ఆయన వెట్రిమారన్తో సినిమా చేసే అవకాశముంది. ఇందుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టొచ్చు. అటు వెట్రిమారన్ కూడా ప్రస్తుతం 'విడుదతలై పార్ 2'కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే గరుడాన్ అనే ఫిల్మ్కు కూడా వెట్రిమారన్ కథ అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాతనే రామ్చరణ్ మూవీపై ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టనున్నారు.
బిగ్ అప్డేట్స్ ఎక్కడా!
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఒక్క సాంగ్ తప్ప ఎలాంటి బిగ్ అప్డేట్స్ రాలేదు. సినిమా షూట్ నుంచి అప్పుడప్పుడు వస్తున్నా లీక్స్ తప్ప సినిమాలో ఎవరి ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాలేదు. అయితే ఈ సంవత్సరం ఎలాగైన సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్రాజు పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. ప్రముఖ నటి అంజలి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
మే 28 , 2024
Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’.. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ను సైతం చిత్ర యూనిట్ ప్రారంభించింది. అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్, ప్రభాస్ పోస్టర్ ఇప్పటికే విడుదలై ఫ్యాన్స్ అలరించాయి. తాజాగా బుజ్జి అనే రోబోటిక్ వెహికల్ పాత్రను కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఆడియన్స్ పరిచయం చేశారు. అయితే ఈ సినిమా పురణాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటి దిశా పటాని నటిస్తుండగా.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించి క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మోహినిగా దిశా పటానీ!
లేటెస్ట్ బజ్ ప్రకారం 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దిశా పటానీ (Disha Patani) మోహినీ అనే యువతి పాత్రలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. విలన్ అయిన కమల్ హాసన్.. ఆమెను గూఢచారి (స్పై)గా భైరవ (ప్రభాస్) వద్దకు పంపిస్తాడని సమాచారం. మోహిని తన గ్లామర్తో ప్రభాస్ను ఆకట్టుకొని అతడు నుంచి రహాస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ మూవీలో ఆమె పాత్ర చాలా కీలకం కానుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు కొందరు నెటిజన్లు.. దిశా పటానీ పాత్రను ఇతిహాసాలలోని మోహిని పాత్రతో లింకప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఆ లాజిక్ మాటేంటి?
ఇతి హాసాలలోని మోహిని పాత్రతో దిశాపటాని పాత్రను పోల్చడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో అసలు లాజిక్ లేదని అంటున్నారు. పురాణాల ప్రకారం మోహిని పాత్ర అనేది మహా విష్ణువు అవతారం. ఇందులో ప్రభాస్ కూడా మహా విష్ణువు అవతారం (భైరవ)లో కనిపిస్తాడని టాక్ ఉంది. కాబట్టి మోహిని పాత్ర.. ప్రభాస్పై ఎలా స్పై చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ లేటెస్ట్ బజ్లో నిజం లేకపోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దిశాపటానీ పాత్ర పేరు వరకే మోహిని ఉండి, పురణాలతో ఆమెకు సంబంధం లేకపోతే తాజా ప్రచారంపై నమ్మకం ఉంచొచ్చని ఇంకొందరు పోస్టులు చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తే తప్ప ఈ చర్చ ముగిసేలా లేదు.
దిశాతో ప్రభాస్ స్పెషల్ సాంగ్
'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) ప్రభాస్కు జోడీగా చేస్తోంది. ఇక సెకండ్ హీరోయిన్ పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. ప్రభాస్ - దిశా పటానీ మధ్య ‘కల్కి’లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ పాటకు సంబంధించిన షూట్ను నెల రోజుల క్రితం ఇటలీలో నిర్వహించారు. ఇటలీలోని బ్యూటీఫుల్ లోకేషన్స్లో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అప్పట్లో దిశా పటానీ తన ఫ్యాన్స్తో పంచుకుంది. చిత్ర యూనిట్తో పాటు ప్రభాస్తో దిగిన సెల్ఫీ ఫొటోలు అప్పట్లో వైరల్గా మారాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.
View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)
దీపికా, కమల్ పాత్రలు అవేనా?
‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్ హాసన్ (Kamal Haasan) చేస్తున్న రోల్స్పై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కమల్ హాసన్.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. వీరి పాత్రలు కూడా కల్కిలో చాలా కీలకంగా ఉంటాయని.. ముఖ్యంగా ప్రభాస్ను ఢీకొట్టే పాత్రలో కమల్ హాసన్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరి పాత్రలపైనా స్పష్టత రానుంది.
మే 24 , 2024