చత్రపతి శేఖర్
ఛత్రపతి శేఖర్గా తెలుగు చిత్రసీమకు సుపరిచుతులయ్యారు. ప్రధానంగా రాజమౌళి చిత్రాలలో ఎక్కువగా కనిపించారు. సై (2004)లో న్యాయవాదిగా నటించారు. ఛత్రపతి(2005)లో ప్రభాస్కు స్నేహితుడిగా నటించి ప్రశంసలు అందుకున్నారు. విక్రమార్కుడు (2006), మగధీర (2009), ఈగ (2012), రంగస్థలం (2018), యు టర్న్ (2018) సహా పలు తెలుగు చిత్రాలలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. విశ్వాసం (2019)తో తమిళ్లో అరంగేట్రం చేశారు. ఇందులో అజిత్ కుమార్కి స్నేహితుడిగా నటించారు. మమ్మూట్టి నటించిన ‘యాత్ర’లో రైతు పాత్ర పోషించారు. దిక్సూచి (2019)లో ప్రధాన పాత్రలో నటించారు. RRRలో జూనియర్ ఎన్టీఆర్కి స్నేహితుడిగా నటించారు.