• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    వందేమాతరం శ్రీనివాస్

    వందేమాతరం శ్రీనివాస్ అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. తెలుగులో ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు స్వరాలు అందించారు. డైరెక్టర్ టి. కృష్ణ వందేమాతరం సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాటతో తన పేరులో వందేమాతరం వచ్చి చేరింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యధికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, దేవుళ్ళు చిత్రంలో భక్తి పరమైన గీతాలను అందించి తనలోని వైవిధ్యాన్ని చాటాడు. ఆయుధం, దేవుళ్లు, ఎర్రసైన్యం, దండోరా, లాల్‌సలాం, ఎర్రోడు, ఓసెయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా, ఎన్‌కౌంటర్, మిస్సమ్మ(2003), జయంమనదేరా వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. వందేమాతరం శ్రీనివాస్ సినిమాలకే కాక టీవీ సీరియళ్ళకు కూడా నేపథ్య సంగీతం అందించారు. 9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వర రావు, ఎం. ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నారు.


    @2021 KTree