శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు
భారత టాపార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ గడ్డపై అరుదైన రికార్డు నెలకొల్పాడు. మొదటి వన్డేలో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా ఓ రికార్డుతో మెరిశాడు. కివీస్ గడ్డపై వన్డేల్లో వరుసగా నాలుగు లేదా ఎక్కువసార్లు అర్ధసెంచరీలు సాధించిన రెండో విదేశీ ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా అతడి కంటే ముందున్నాడు. కాగా గత 8 వన్డేల్లో భారత్ తరఫున అయ్యర్ 5 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించి ప్రపంచకప్ రేసులో నిలుస్తున్నాడు.