• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AP: వైసీపీ బహిష్కృత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఇటీవల పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబును కలిసిన సందర్భంగా పార్టీలో చేరతాననే సూచన చేసినట్లు ఆనం వెల్లడించారు. ఇందుకు ఆయన స్వాగతించారని చెప్పారు. ఈ క్రమంలో వచ్చే నెలలో టీడీపీలో చేరి సభ్యత్వం తీసుకుంటానని ఆనం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రను దిగ్విజయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కి పాల్పడటంతో ఆనంని వైసీపీ సస్పెండ్ చేసింది.

    జపాన్ రాజధాని టోక్కో విమానాశ్రయంలో త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సారి రన్‌వేపైకి రావడంతో ఆ రెండు విమానాలు ఒక దానికొకటి స్వల్పంగా రాసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన ఫైలట్‌లు విమానాలను అక్కడే నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. అయితే ఓ విమానం వింగ్‌లెట్ స్వల్పంగా దెబ్బతింది.

    సరిగ్గా నాలుగేళ్ల కిందట తన కెరీర్‌కు ముగింపు పలికాడు స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. 2007లో టీమిండియా టీ20 క్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2011లో ప్లేయర్ ఆఫ్ ద టౌర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. అనంతరం ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని జయించి తిరిగి జట్టులోకి వచ్చాడు. కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్న యువీకి ఘనమైన నిష్క్రమణ లభించలేదు. కనీసం, ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా ఆడకుండానే యువీ రిటైర్మెంట్ ప్రకటించాల్సి రావడం బాధాకరం.

    సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో నం.1 సీడ్ అల్కరాజ్‌ని ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టాడు. టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్లేయర్‌గా జకోవిచ్ నాదల్‌(22)తో సమానంగా ఉన్నాడు. ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిస్తే జకోవిచ్ చరిత్ర సృష్టిస్తాడు. కాస్పర్ రూడ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగే సెమీఫైనల్ పోరులో గెలిచిన వారితో జకో రేపు ఫైనల్ ఆడనున్నాడు.

    సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజికారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం ఎదుట ఉంచిన కారు అద్దాలను పగలగొట్టి అందులో 11 ఖరీదైన మద్యం బాటిళ్లు, రూ.50 వేల నగదును దొంగిలించారు. సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. అయితే ఒక వక్తి వద్ద 5 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు ఉండకూడదు అయితే బెల్లంకొండ వద్ద 11 బాటిళ్లు ఉన్నాయని చెప్పడంపై పోలీసులు విచారిస్తున్నారు.

    బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తెలుగు సినిమా రీమేక్‌లో నడించబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీ చేసేందుకు అభిషేక్ కూడా ఒకే చెప్పారని సమాచారం. ‘అరి’ మూవీ జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే అభిషేక్ ఒకే చెప్పడం గమనార్హం. ‘అరి’ సినిమాను ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హిందీ రీమేక్ ను కూడా జయశంకరే డైరక్ట్ చేసే అవకాశం ఉంది.

    విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్‌పల్లి మండలంలోని గోపాలయపల్లి వద్ద లారీ అదుపు తప్పి డివైడర్‌‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. రహదారికి మధ్యలో లారీ అడ్డంగా పడిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరిస్తున్నారు. లారీ హైదరాబాద్‌కు పార్సిల్‌ లోడుతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

    AP: మంత్రి విడదల రజినీకి ప్రమాదం తప్పింది. విశాఖ పర్యటనకు వెళ్లిన రజినీ లిఫ్టులో ఇరుక్కుపోయారు. ఓవర్ లోడ్ కావడంతో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో స్పందించిన సిబ్బంది ఎమర్జెన్సీ కీ ద్వారా డోర్ ఓపెన్ చేశారు. మంత్రి రజినీతో పాటు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులు లిఫ్టులో ఉన్నారు.

    నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ జరగనుంది. వరుసగా రెండో సారి టైటిల్ సాధించేందుకు ఇగా స్వైటెక్(పోలండ్) ఎదురు చూస్తోంది. మరోవైపు, టోర్నీలో అద్భుతంగా పుంజుకున్న చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ముచోవా తొలి టైటిల్ గెల్చుకోవాలని ఆరాట పడుతోంది. 2019లో వీరిద్దరూ ఓసారి తలపడ్డారు. నాడు 95వ ర్యాంకర్‌గా ఉన్న స్వైటెక్, 106 ర్యాంకర్ ముచోవా చేతిలో ఓటమి చవిచూసింది. కానీ, నేడు స్వైటెక్ నం.1 ర్యాంకర్. 43వ స్థానంలో ముచోవా ఉంది. స్వైటెక్‌కి గత నాలుగేళ్లలో ఇది మూడో ఫ్రెంచ్ టైటిల్ ...

    భారత వాతావరణ శాఖ(IMD) తుపాను హెచ్చరికలను జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ‘బిపర్ జోయ్’ తుపాను మరింత తీవ్రం కానుందని పేర్కొంది. గోవాకి పచ్చిమ దిశలో 690 కి.మీ ముంబైకి పశ్చిమ నైరుతి 870 కి.మీ దూరంలో బిపర్ తుపాను కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా మహారాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. తుపాన్ ప్రభావ రాష్ట్రాల్లో 14 తేదీ వరకు బీచ్‌లను మూసివేస్తునట్లు ప్రకటించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

    TS: తల వెంట్రుకలు ఊడుతున్నాయని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారంకు చెందిన వినోద్ మల్కాజిగిరి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో జుట్టు క్రమంగా తగ్గిపోయింది. దీంతో పూర్తిగా బట్టతల వస్తుందేమోనని ఆందోళనకు గురైన వినోద్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో అధికారులు ఆత్మహత్య చేసుకోవడం ఇటీవల పెరిగిపోతుండటం గమనార్హం.

    నేటి సమాజంలో ప్రతి ఇంటిలో ఫ్రిజ్ వాడకం తప్పని సరి అయిపోయింది. మనం కూరగాయలను, పండ్లను ఎక్కువగా ఫ్రిజ్‌లోనే పెడతాం, అయితే కొన్ని పండ్లను మాత్రం ఫ్రిజ్‌లో పెట్టడం అంత మంచిది కాదు. ఫ్రిజ్‌లో రకరకాల వాసనలు ఉంటాయి. కొన్ని పండ్లకు వాటిని పీల్చుకునే గుణం ఉంటుంది. అందుకే చుట్టూ కవర్‌తో కప్పిన పండ్లనే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇక కూరగాయలు, పండ్లను ఒకే చోట ఉంచకూడదు, కలిపి ఉంచితే వాటి రుచి మారిపోతుంది. మామిడిపండ్లు, పుచ్చకాయల వంటివి బయటి వాతావరణంలోనే చక్కగా ఉంటాయి. ఫ్రిజ్‌లో ...

    హీరో వరుణ్ తేజ్. లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిందే..అయితే వీరి ప్రేమయాణం ఎలా మొదలైయిందో చూద్దాం, మొదట వీళ్లిద్దరూ మిస్టర్ సినిమాలో కలసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తరువాత ఓ కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఇద్దరు ఒకరిపై ఒకరు అభిప్రాయాలను వెల్లడించుకునట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వీళ్లిద్దరు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారు ఓకే అనడంతో వీళ్లిద్దరు త్వరలో ఒక్కటి కాబోతున్నారు.

    తెలుగు రాష్ట్రాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య తక్కువే ఉన్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. తెలంగాణలో 9.9శాతం, ఏపీలో 9.5శాతం మందికి మధుమేహం ఉందని మెటబాలిక్ రిపోర్టులో పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల వారికే షుగర్ వ్యాధి తక్కువగా ఉందట. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో 30 శాతం మందికి పైగా బీపీ, 25 శాతానికి పైగా స్థూలకాయంతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. 14.9 శాతం మంది ప్రీ డయాబెటిక్ స్టేజిలో ఉన్నారట. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే అసాంక్రామిక వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి.

    TS: హైదరాబాద్‌లో కలకలం రేపిన అప్సర హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన నిందితుడు సాయికృష్ణకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. చర్లపల్లి జైలుకు నిందితుడిని పోలీసులు తరలిస్తారు. సాయికృష్ణ, అప్సర మధ్య కలిగిన పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో అప్సర గర్భం దాల్చగా పెళ్లి చేసుకోవాలని కోరింది. అప్పటికే సాయికృష్ణకు భార్య, కుమార్తె ఉండటంతో నిరాకరించాడు. అడ్డు తొలగించుకోవడానికి హత్య చేశాడు.

    ఓ యువతికి కుక్కలు, గుర్రాలకు వాడే ఇంజక్షన్లు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది. మాయమాటలతో ఆ యువతికి అర్జున్ సింగ్ అనే వ్యక్తి దగ్గరైయ్యాడు. ఓ రోజు కలుద్దామని యువతిని పిలిపించాడు. వచ్చిన తరువాత ఆమెను బంధించి కుక్కలకు గుర్రాలకు వాడే ఇంజక్షన్లు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

    బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘భగవంత్ కేసరి’ నుంచి టీజర్ విడుదలైంది. ‘నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటాది’ అని చిత్రబృందం ప్రచారం చేస్తోంది. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. పక్కా తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా తెరకెక్కింది. కాజల్ బాలయ్య సరసన నటిస్తోంది. శ్రీలీల బాలయ్యకు కూతురిగా కనిపించనుంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ విడుదలైంది.

    పొట్టిగా ఉన్న కారణంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఝార్ఖాండ్‌లోని రాంచీ సమీపంలో చోటుచేసుకుంది. పొట్టిగా ఉన్న కారణంతో తనకు వచ్చిన మూడు పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయాయని మనస్థాపానికి గురైన శ్వేత ఆత్మహత్యకు చేసుకుంది. రాత్రి శ్వేత, అక్కతో బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంతలో ఈ దుర్ఘటనకు పాల్పడింది.

    హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడళ్ల జాబితాలో చేరిపోయింది. వరుణ్ తేజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతోంది. అయితే, లావణ్య తొలి నుంచి సమాజ సేవకురాలు. వీలు దొరికినప్పుడల్లా ఏదైనా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనూ హైదరాబాద్‌లోని ఓ ఎన్జీవోకి వెళ్లి చిన్నారులకు సాయం చేసింది. వరుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమాజంపై లావణ్యకు మంచి అవగాహన కూడా ఉంది.

    ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌తో ఇంటర్నెట్‌ అందుతుంది. సముద్ర గర్భంలో నుంచి కేబుల్‌ని పంపించి ఖండాంతరాలుగా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు. ఇలా సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకు కేబుల్ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టుకు తొలుత చైనాకు చెందిన హెచ్ఎంఎన్ టెక్ కేబుల్ నెట్‌వర్క్స్ పోటీపడింది. ఇందులో హువావే ఉండటంతో అమెరికా ఆందోళన చెందింది. పట్టుబట్టి మరీ ఈ ప్రాజెక్టును సబ్‌‌కామ్‌కు అప్పజెప్పింది. గతంలో హువావేపై భద్రతాపరమై ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టును అప్పజెపితే కేబుళ్లతో డేటా చోరీకి చైనా పాల్పడే అవకాశం ఉందని అమెరికా వాదిస్తోంది.

    హీరో బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గాయకుడు నోయల్‌ సేన్‌ ఓ ర్యాప్ సాంగ్‌ను తీర్చిదిద్దారు. బాలయ్య వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఈ సాంగ్ ఉంటుంది. నేడు బాలయ్య పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ పాటను యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. నోయల్ స్వయంగా రాసిన ఈ పాటకు అభిమానులు జై బాలయ్య అంటూ తెగ సంబుర పడిపోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

    శ్రద్ధావాకర్ తరహా హత్య ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు మనోజ్ పానె(56) వైద్య(36)తో సహజీవనం చేసి హత్య చేశాడు. ఆమె శరీర భాగాలు కోసి ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టాడు. అనంతరం వాటిని కుక్కలకు వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కానీ, బయటకు వెల్లడించలేదు. దీంతో వైద్య అక్కా చెల్లెళ్ల వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. వైద్యను చంపలేదని, తనే ఆత్మహత్య చేసుకుందని మనోజ్ చెబుతున్నాడు.

    ఆర్థిక సంక్షోభంలో మునిగి తేలుతున్న పాకిస్థాన్‌ తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. మొత్తం 14.5 ట్రిలియన్ల పాక్ రుపాయల బడ్జెట్ పెట్టగా ఇందులో సగం 7.3 ట్రిలియన్ పాక్ రుపాయలు అప్పుల చెల్లించడానికే కేటాయింపులు జరిపారు. అప్పుల తర్వాత అధికంగా కేటాయించింది రక్షణ రంగానికే. గతేడాది 1.5 బిలియన్ రుపాయలను కేటాయిస్తే.. ఈ సారి 1.8 బిలియన్ రుపాయలకు పెంచింది. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది.

    బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటివరకు 107 సినిమాలు పూర్తి చేశాడు. తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ పంచుకున్నాడు బాలయ్య. తెలుగు, దక్షిణాది హీరోయిన్లనే కాకుండా బాలీవుడ్ నటీమణులతో కూడా ఎన్‌బీకే ఆడిపాడాడు. ముఖ్యంగా, చెన్నకేశవ రెడ్డిలో టబుతో కలిసి బాలయ్య నటించాడు. పాండురంగడులోనూ టబు అతిథి పాత్ర పోషించింది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన కథానాయకుడు, మహానాయకుడులో విద్యాబాలన్, లెజెండ్, లయన్ సినిమాల్లో రాధిక ఆప్టే, అల్లరి పిడుగులో కత్రినా కైఫ్ బాలయ్య సరసన నటిచారు.

    గాడ్సే, గాంధీ వివాదంపై దేశంలో ఇప్పటికీ చర్చ జరుగుతుంటుంది. తాజాగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ గాడ్సేపై కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సేని భరతమాత సుపుత్రుడు అని అభివర్ణించారు. మొగలు రాజులైన బాబర్, ఔరంగజేబుల్లా గాడ్సే ఆక్రమణదారు కాదని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. బాబర్, ఔరంగజేబుల వారసుల్లా భావించేవారు నిజమైన భారత పుత్రులు కాదని విమర్శించారు. ఒక వేళ గాడ్సే హంతకుడైతే.. అంతకన్నా ముందు భరతమాత పుత్రుడని చెప్పారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఇలా రిప్లై ఇచ్చారు.

    TS: రాష్ట్రంలో నేడు, రేపు భిన్న వాతావరణం ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మెదక్ జిల్లాలో వడదెబ్బకు ఓ వ్యక్తి మృతిచెందాడు.

    ప్రాంతీయ పార్టీలకు కంచుకోటగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని విస్తరించాలని జాతీయ పార్టీ బీజేపీ యోచిస్తోంది. ఈ మేరకు ఏపీపై అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. నేడు రాష్ట్రంలోని తిరుపతి, శ్రీకాళహస్తిల్లో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. అనంతరం శ్రీకాళహస్తిలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే నడ్డా రాష్ట్రానికి చేరుకున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. Courtesy Twitter:@somuveerraju Courtesy Twitter:@somuveerraju

    పెద్దల సమక్షంలో వరుణ్ తేజ్, లావాణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ మేరకు అభిమానులు, నెటిజన్లు ఈ సెలబ్రిటీ కపుల్‌ని విష్ చేస్తున్నారు. సోషల్ మీడియాల్లో ఫొటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. నాగబాబు ఇంట్లో కొద్ది మంది అతిథుల మధ్య వరుణ్‌లవ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అల్లు అర్జున్, రామ్‌చరణ్ దంపతులు, పంజా వైష్ణవ్ తేజ్ సహా పలువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ ఏడాదే వరుణ్, లావాణ్యల పెళ్లి జరగనుంది. Courtesy Twitter:@SKNonline Courtesy Twitter:@SKNonline

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.460 పెరిగింది. నిన్న బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.60,220గా ఉండగా నేడు రూ.60,680కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.55,600కు ఎగబాకింది. మరోవైపు, వెండి ధరల్లోనూ పెరుగుదల నమోదైంది. కిలో వెండి రూ.2 వేలు పెరిగి రూ.79,700కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఈ ధరలు అమల్లో ఉంటాయి.

    పుజారా బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అసహం వ్యక్తం చేశాడు. WTC ఫైనల్‌లో తొలి ఇన్నింగ్సులో పుజారా(14) క్లీన్ బోల్డ్ అయ్యాడు. ‘బంతిని సరిగా అంచనా వేయడంలో పుజారా తడబడ్డాడు. బాదాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉండిపోయి బంతిని విడిచిపెట్టాడు. అదేమో సరిగ్గా లైన్‌లో పడి ఆఫ్ స్టంప్ వైపు దూసుకొచ్చింది. ఇంగ్లాండ్‌లో బంతి ఎటు వెళ్తుంది? ఆఫ్ స్టంప్ ఎక్కడుందనే విషయాన్ని బ్యాటర్లు తెలుసుకోవాలి’ అని రవిశాస్త్రి సూచించాడు.

    Load More