ఈరోజుల్లో వివాహేతర సంబంధాలు అనేకం అవుతున్నాయి. రిలేషన్ షిప్లో భాగస్వాముల మధ్య మనస్పర్దలు రావడమే ఇందుకు ప్రధాన కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శారీరక కోరికలు తీరకపోవడం, ఒంటరితనం, ఒకరికొపై మరొకరికి నమ్మకం లేకపోవడం, ప్రేమ తగ్గిపోవడం కూడా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ అవసరాల కోసం వేరొక వ్యక్తిని స్త్రీ, పురుషులు ఆశ్రయిస్తున్నారట. ఈ సమస్య నుంచి బయట పడేందుకు భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని, ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు.
టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మల వల్ల భారత జట్టుకు ఒరిగేదేం లేదని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. 35 ఏళ్ల రోహిత్ టీ20లకు పనికిరాడని, ఇప్పటికే తన చివరి మ్యాచ్ ఆడేశాడని అనుకుంటున్నానన్నాడు. కోహ్లీ, రోహిత్లు వచ్చే టీ20 వరల్డ్కప్లో ఆడేది లేనిదీ అనుమానమేనని పేర్కొన్నాడు. వీరిద్దరి మార్గదర్శనాలు కూడా యంగ్ క్రికెటర్లకు అక్కర్లేదని అభిప్రాయపడ్డాడు. వీరు తప్పుకుని యువకులకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.
నాందేడ్లో రేపు జరగనున్న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి రానున్నారు. తొలిసారిగా జాతీయ స్థాయిలో పెడుతున్న బహిరంగ సభ కావడంతో బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ వహించింది. శనివారం మంత్రి ఇంద్రకరణ రెడ్డి సభా ప్రాంగణ ఏర్పాట్లు పరిశీలించారు. నాందేడ్ పట్టణానికి నలువైపులా కిలోమీటరు పరిధిలో గులాబీ జెండాలు, హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పరిసర ప్రాంతాలు గులాబీ మయమయ్యాయి. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు.
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్.. ఫిబ్రవరి 10నుంచి ప్రారంభం కానుంది. ఈ సమరంలో భారత జట్టు రన్నరప్గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ వంటి మేటి జట్లను భారత్ ఎదుర్కోనుంది. భారత బృందానికి హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. టీమిండియా షెడ్యూలు ఇలా.. Vs పాకిస్థాన్, ఫిబ్రవరి 12, కేప్టౌన్ Vs వెస్టిండీస్, ఫిబ్రవరి 15, కేప్టౌన్ Vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 18, జ్కబెర్హా Vs ఐర్లాండ్, ఫిబ్రవరి 20, జ్కబెర్హా
మహేశ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది జూన్లో సినిమా పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి కాగానే రాజమౌలితో చేతులు కలపనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై భారీ వ్యయంతో నిర్మాణం కానుంది. ఈ మేరకు రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కనుంది. అయితే, దీనిపై అధికారిక ...
తనపై రెండేళ్ల పాటు నిషేధం పడిందన్న ఆరోపణ తప్పేనని భారత జిమ్నాస్టర్ దీపా కర్మాకర్ వెల్లడించారు. డోపింగ్ పరీక్షలో దోషిగా తేలిన దీపా కర్మాకర్పై ఈ ఏడాది జులై వరకు నిషేధం అమలులో ఉంది. 2021లోనే ఆమెకు పరీక్షలు నిర్వహించగా నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో దీపపై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల పాటు నిషేధం విధించింది. అయితే, తాజాగా ఈ ప్రకటన చేయడంతో నాటి నుంచే నిషేధం అమల్లోకి వస్తోంది. తనకు 3 నెలల పాటు శిక్ష తగ్గించారని, జులైలో ...
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆండ్రూ టై అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసుకున్న బౌలర్గా టై రికార్డు సృష్టించాడు. 211 మ్యాచుల్లో టై 300 వికెట్ల మార్కుని చేరుకుని ఏకైక బౌలర్గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్(213 మ్యాచుల్లో) పేరిట ఉండేది. బిగ్బాష్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో పెర్త్ స్కార్చర్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న టై ఈ రికార్డును సాధించాడు. కాగా, ఆండ్రూ టైని ఇటీవల ఐపీఎల్ వేలంలో జట్లు కొనుగోలు చేయకపోవడం ...
టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన ‘గీత గోవిందం’ సీక్వేల్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో చేయాల్సిన సినిమా రద్దు కావడంతో డైరెక్టర్ పరుశురామ్ సీక్వేల్పై దృష్టిసారించినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా చకచకా రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. హిట్ కోసం ఎదురుచూస్తున్న గీతాఆర్ట్స్కు, లైగర్తో ఫ్లాప్ అందుకున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా కీలకం కానుంది. గీతా గోవిందం-2 నిర్మాణ వ్యయం 130కోట్లుగా ఉండొచ్చని చిత్ర బృందం అంచనా వేస్తోంది.
అశ్విన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా బౌలర్లను తెప్పించుకుని ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ వసీమ్ జాఫర్ సరదా వ్యాఖ్యలు చేశాడు. మొదటి టెస్టు ప్రారంభం కాకముందే కంగారూల బుర్రలో అశ్విన్ తిష్ఠ వేశాడని ట్వీట్ చేశాడు. ఫిబ్రవరి 9నుంచి మొదలు కానున్న టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా బెంగుళూరులో సాధన చేస్తోంది. ఈ క్రమంలో అచ్చం అశ్విన్ శైలిలో బంతులేసే బౌలర్లను తెప్పించుకుని ఆస్ట్రేలియన్లు నెట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నాగ్పూర్ వేదికగా జరగనున్న తొలిటెస్టు కీలకం కానుంది.
అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కీలక మార్పు చోటు చేసుకుంది. తొలుత కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని నిర్వహించనున్నట్లు ఆర్మీ వెల్లడించింది. ప్రస్తుతం మొదట ఫిజికల్ టెస్టు, మెడికల్ టెస్టులను నిర్వహిస్తోంది. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల రద్దీ ఏర్పడుతోంది. అంతేగాకుండా అభ్యర్థులకూ వ్యయప్రయాసలు ఎక్కువవుతున్నాయి. దీన్ని నివారించడానికి తొలుత స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించనుంది. అనంతరం పరీక్షలో ఎంపికైన వారికి ఫిజికల్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. 2023-24 రిక్రూట్మెంట్కి ఇది వర్తించనుంది.
యాక్సిస్ బ్యాంక్ తన వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఫ్రీగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. ఆ కార్డుతో 53 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందవచ్చు.18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ కార్డు పొందటానికి అర్హులు. అప్లై చేసిన 21 రోజులలోగా ఈ కార్డు మీకు అందుతుంది.100 శాతం వెల్కమ్ క్యాష్బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. ఫ్యూయెల్ సర్ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. బుక్మైషోలో ఇన్స్టంట్ తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్ల విలువ అన్నింటినీ కలిపితే 53 లీటర్ల పెట్రోల్ వ్యాల్యూ ...
అదానీ షేర్ల పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. నియంత్రణ సంస్థలు వాటి పని అవి చేసుకు పోతాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మార్కెట్ని క్రమబద్ధీకరించడానికి నియంత్రణ సంస్థలు పనిచేస్తాయని చెప్పారు. ఇదివరకే ఈ అంశంపై ఎల్ఐసీ, బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు స్పందించాయని తెలిపారు.. ప్రభుత్వంతో సంబంధం లేకుండానే నియంత్రణ సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఎఫ్పీఓ ఉపసంహరణపై కూడా ఆమె సమాధానాన్ని తోసిపుచ్చారు.
దేశం చూపు తెలంగాణ వైపు ఉందని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారంంలోకి రాకముందు పరిస్థితి.. ప్రస్తుత స్థితి ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. రాష్ట్రంలో కరెంట్ కష్టాలు, తాగునీటి తిప్పలు లేవని ఆయన స్పష్టం చేశారు. ‘4కోట్ల మంది ప్రజలు మా కుటుంబ సభ్యులే. మాది కుటుంబ పాలనే. దేశంలోని అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీల్లో 9 తెలంగాణలోనే ఉన్నాయి. రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది. నియామకాలు జరుగుతున్నాయి’ అంటూ కేటీఆర్ మాట్లాడారు. అంతకుముందు ఎమ్మెల్యేే ...
పాక్తో పోలిస్తే భారత బౌలింగ్ కాస్త బలహీనంగా ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రమీజ్ విమర్శించారు. ఈ విషయంలో పాక్ బౌలింగ్ను టీమ్ఇండియా అనుసరిస్తోందని పేర్కొన్నాడు. అయితే భారత పేస్ దళం పాక్ కంటే తక్కువే కానీ.. స్పిన్ విభాగం మాత్రం పటిష్ఠమైందని రమీజ్ అన్నారు. ఇటీవల కివీస్తో జరిగిన సిరీస్లో భారత్ బౌలింగ్ సాధారణంగా అనిపించిందని చెప్పారు. కివీస్ ఆందోళనకు గురై సిరీస్ను వదిలేసుకొందని రమీజ్ రజా వ్యాఖ్యానించాడు.
TS: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపై క్రమంలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు పలు సూచనలు చేశారు. 100 గజాల స్థలం ఉన్నవారికి ప్రభుత్వం కల్పిస్తానని చెప్పిన రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని రూ.7.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కేటాయింపును సవరించాలని సూచించారు. ఎస్డీఎఫ్ నిధులు గజ్వేల్ నియోజకవర్గానికి అత్యధికంగా రూ.890 కోట్లు, సిద్దిపేటకు రూ.790 కోట్లు కేటాయించి.. దుబ్బాకకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు.
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియానే ఫేవరేట్ అని టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్ వెల్లడించారు. సొంతగడ్డపై భారత్ బలహీన జట్టని వ్యాఖ్యలు చేశాడు. సిరీస్ని కంగారూ జట్టు గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. ‘బుమ్రా, జడేజా, పంత్ లాంటి కీలక ఆటగాళ్లు లేరు. కేవలం విరాట్పై ఆధారపడాల్సి వస్తుంది. అందువల్ల జట్టు బలహీనంగా మారింది. స్పిన్కు అనుకూలిస్తున్నందున ఆసీస్ బౌలర్లు సత్తా చాటే అవకాశం ఉంది’ అని చాపెల్ చెప్పాడు. ఈ నెల 9నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
బిల్గేట్స్ కుకింగ్ వీడియోపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. భారత వంటకమైన రోటీని బిల్గేట్స్ తయారు చేయడాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభినందించారు. ‘‘సూపర్. ఇప్పుడు భారత్లో మిల్లెట్స్ ట్రెండ్ నడుస్తోంది. అవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. తృణధాన్యాలతోనూ ఎన్నో వంటకాలు చేయొచ్చు. వాటిని కూడా ట్రై చేయండి’’ అంటూ గేట్స్కు ప్రధాని సూచించారు. కాగా బిలగేట్స్తో కలిసి ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ ఐటన్ బెర్నాత్ చేసిన కుకింగ్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
వికీపీడియాను పాకిస్థాన్ బ్యాన్ చేసింది. ఓ మతానికి సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ని తొలగించాలని వికీపీడియాకు పాక్ ప్రభుత్వం సూచించినా తీరు మారకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కంటెంట్ని తొలగించడానికి 48 గంటల గడువు ఇచ్చినా వికీ స్పందించకపోవడంతో పాకిస్థాన్ బ్యాన్ చేసింది. 2012లోనూ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉన్న 700 యూట్యూబ్ ఛానెళ్లపై పాకిస్థాన్ కొరడా ఝులిపించింది. తాజాగా ఈ లిస్టులోకి వికీపీడియా చేరింది. పాక్ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెబుతున్నారు.
అదానీ గ్రూప్ షేర్ల పతనంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పరోక్షంగా స్పందించారు. అదానీ సంస్థకు మద్దతుగా మాట్లాడారు. ‘ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉండాలన్న భారత్ లక్ష్యాన్ని ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లు దెబ్బతీస్తాయా..? అని అంతర్జాతీయ మీడియా ఊహాగానాలు చేస్తోంది. నేను నా జీవితకాలంలో భూకంపాలు, కరవుకాటకాలు, యుద్ధాలు, ఉగ్రదాడులు, మాంద్యం పరిస్థితులను చాలినన్ని చూశాను. వాటిని చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. ఎప్పుడూ భారత్కు సవాళ్లు విసరకండి’ అని మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి జరిగే బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది.కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ , గిల్, జడేజా, సిరాజ్, ఉనద్కత్ వంటి కీలక ఆటగాళ్లు ప్రాక్టిస్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పేస్ను ఎదుర్కొవడంపై బ్యాటర్లు దృష్టి సారించారు. ఇందుకోసం పేసర్లు సిరాజ్, జయ్దేవ్ బౌలింగ్లో సాధన చేస్తున్నారు. మరోవైపు భారత స్పిన్ దళాన్ని ఎదుర్కొనేందుకు కంగారూ బ్యాటర్లు కసరత్తు ప్రారంభించారు. స్పిన్నర్లు నాథన్ లియాన్, ఆష్టన్ అగర్, టాడ్ మర్ఫీ, మిచెల్ స్వేప్సన్ చేత బౌలింగ్ ...
అజిత్, విఘ్నేష్ శివన్ కాంబోలో తెరకెక్కాల్సిన సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. AK62 వర్కింగ్ టైటిల్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమాను నిర్మించనుంది. అయితే, ఈ మూవీ నుంచి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ట్విటర్ బయోలో AK62ని తొలగించడమే ఇందుకు కారణం. దీంతో సినిమా నుంచి విఘ్నేష్ వైదొలిగారన్న చర్చ ఊపందుకుంది. స్టోరీలో సూచించిన మార్పులను సవరించడం ఇష్టం లేకే విఘ్నేష్ వైదొలిగినట్లు సమాచారం. అయితే, నిర్మాణ సంస్థ దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. © File Photo ...
చెన్నైలోని తన నివాసంలో ప్రముఖ సింగర్ వాణి జయరాం కన్నుమూశారు. అయితే, ఆమె మరణంపై కొన్ని అనుమానాలు వ్యక్తమతున్నాయి. అనారోగ్యంతో ఆమె చనిపోలేదట. ఇంట్లో అచేతనంగా పడి ఉన్న వాణి జైరాం నుదుటిపై ఎవరో కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె ఇంటిని అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖంపై బలమైన గాయాలు చూసి వాణి జయయరాం పనిమనిషి పోలీసులకు సమాచారం ఇవ్వడం గమనార్హం.
బాలీవుడ్ నటులు కియారా అద్వానీ, నటుడు సిద్దార్ద్ మల్హోత్రా పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 6న రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యఘర్ ప్యాలెస్లో వీరి వివాహం జరగనుంది. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటు మొత్తం 150మంది వీవీఐపీలను మాత్రమే ఈ వెడ్డింగ్కి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా ఫిబ్రవరి 5న జైసల్మేర్ చేరుకోనున్నట్లు సమాచారం. అటు వివాహ ఏర్పాట్లను ముంబైకి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానర్ కంపెనీ చూస్తోంది.
బ్రిటన్ పీఎంగా బాధ్యతలు చేపట్టి 100 రోజులైన సందర్భగా రిషి సునాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందుత్వంలో ధర్మం ఉందని అది కర్తవ్యాన్ని బోదిస్తుందని పేర్కొన్నారు. మీ ఆస్తి ఎంత అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా తన బ్యాంకు ఖాతాలో ఎంత ఉందనేది ఇప్పుడు ముఖ్యం కాదని రిషి అన్నారు. తన విలువలు, తీసుకుంటున్న చర్యలే ఇక్కడ ప్రాధాన్యమని బదులిచ్చారు. రిషి సునాక్ గతేడాది అక్టోబరు 25న బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటన మణిపూర్ రాజధాని ఇంపాల్లో చోటుచేసుకుంది. నగరంలో జరిగే ఓ ఫ్యాషన్ షోలో సన్నీ లియోనీ పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్యాషన్ షో వేదికకు 100 మీటర్ల దూరంలోనే బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా ఈ ఫ్యాషన్ షోను కొన్ని అతివాద సంఘాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలో పేలుడు జరగడంతో వారిని పోలీసులు అనుమానిస్తున్నారు. Courtesy Twitter: Rocket ...
తెలంగాణలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి 9,51,321 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. శుక్రవారం సాయంత్రం దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో ఈ మేరకు అభ్యర్థుల వివరాలు ప్రకటించింది. కాగా మొదట 9,168 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కానీ తుది నోటిఫికేషన్లో మాత్రం పోస్టుల సంఖ్య 8039గా పేర్కొంది
ఒలింపిక్స్ పతక విజేత, స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ-ఐటీఏ నిషేధం విధించింది.నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు గాను ఐటీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 2021 అక్టోబర్లో దీపా కర్మాకర్పై నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. అయినప్పటికీ ఈ విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. అయితే తాజాగా ఈ విషయం వెలుగుచూడటంతో ఐటీఐ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నిషేధంతో దీపా పలు అంతర్జాతీయ టోర్నీలకు దూరం కానుంది.
ప్రముఖ సింగర్ వాణిజయరామ్(77) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో జారిపడి తలకు బలమైన గాయం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. తెలుగుతో పాటు 19కి పైగా భాషల్లో ఆమె పాటలు పాడారు. ఆమె తన కెరీర్లో 20,000 కంటే ఎక్కువ గీతాలను ఆలపించారు. వాణీజయరామ్ తెలుగులో ఏ సింగర్ సాధించలేని ఘనతలను కలిగి ఉన్నారు. ఆమె సంగీత ప్రస్థానం తెలుసుకునేందుకు పైన YouSay Webపై క్లిక్ చేయండి
ప్రముఖ నిర్మాత ఆర్వీ గురుపాదం కన్నుమూశారు. బెంగళూరులోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీలో 25కు పైగా చిత్రాలను నిర్మించారు. చిరంజీవి నటించిన పులి బెబ్బులితో పాటు వయ్యారి భామలు వగలమారి భర్తలు వంటి చిత్రాలను నిర్మించారు. హిందీలో శ్రీదేవి నటించిన అకాల్ మంద్ వంటి హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. ఆయన మరణంతో సినీలోకం తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
మధ్యప్రదేశ్: భోపాల్లో దారుణం జరిగింది. మూఢనమ్మకంతో సొంత తల్లిదండ్రులే తమ చిన్నారిని బలిగొన్నారు.. కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి రుచితా కోల్ నిమోనియా బారినపడింది దీంతో చిన్నారి తల్లిదండ్రులు స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు పాపను చూపించారు. అక్కడ వ్యాధి తగ్గాలంటూ చిన్నారి పొట్టపై కాలిన ఇనుపరాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు. ఆ తర్వాత పాప పరిస్థితి మరింత దిగజారింది. పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి మరణించింది.