• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?
    MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!
    ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!
    Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!
    See More

    ఏది జరగాలని ఉందో అదే జరిగింది: సంజూ

    వన్డే వరల్డ్‌కప్‌-2023లో సంజూను శాంసన్ సెలక్టర్లు మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడికి చోటివ్వలేదు. దీనిపై సంజూ స్పందిస్తూ. ‘‘ఏది జరగాలని ఉందో అదే జరిగింది. నేను మాత్రం ముందుకు సాగిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అంటూ సంజూ ట్వీట్ చేశారు. అతడు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

    WarmUp: భారత్‌- నెదర్లాండ్స్ మ్యాచ్ రద్దు

    భారత్‌- నెదర్లాండ్స్ వార్మప్‌ మ్యాచ్‌ రద్దయింది. వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ రద్దయింది. ఇప్పటికే సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్‌.. భారత్‌, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన వార్మప్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అలాగే నేడు టీమిండియా, నెదర్లాండ్స్‌ మధ్య వార్మప్ మ్యాచ్‌కు కూడా వర్షం కారణంగా రద్దయింది. ఇవాళ్టితో వార్మప్‌ మ్యాచ్‌లు ముగిసాయి. అక్టోబర్‌ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత్ తన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.

    World Cup 2023: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?

    ఈ సారి వరల్డ్‌కప్‌కు ప్రకటనల ఆదాయం భారీగా పెరుగుతుందన్న అంచాలు నెలకొన్నాయి. ఈ కప్, దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2019 ప్రపంచకప్‌లో కంటే ఈ సారి రెట్టింపు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగుతాయని యాడ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అయితే 2019 వరల్డ్‌కప్‌లో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆదాయం రూ.400-500 కోట్ల లోపే ఉంది. ఈ సారి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో క్రికెట్‌కు భారీ క్రేజ్ ఏర్పడి నందున ఆదాయం … Read more

    నేపాల్‌పై భారత్ ఘన విజయం

    ఆసియాకప్‌లో నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో గెలుపొందింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసిన నేపాల్ గొప్ప పోరాటం చేసింది. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ 32, సందీప్ జోరా 29 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ తలా 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. నేపాల్ స్కోరు 179/9, ఇండియా స్కోరు 202/4.

    భారీ స్కోరు చేసిన టీమిండియా

    ఆసియా గేమ్స్‌లో పసికూన నేపాల్‌కు టీమిండియా భారీ టార్గెట్ విధించింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. చివర్లో రింకూ సింగ్ 15 బంతుల్లో 37 పరుగులు చేయడంతో నిర్ణిత 20 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 3 వికెట్లు, సోంపాల్ కామి ఒక వికెట్ పడగొట్టారు.

    ధోని నుంచి అవి నేర్చుకోవాలి: గైక్వాడ్

    ఆసియా క్రీడల్లో భారత జట్టుకు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహిస్తున్నాడు. తొలి మ్యాచ్ రేపు నేపాల్‌తో జరగనుంది. ఈ నేపథ్యంలో గైక్వాడ్‌ స్పందించాడు. ‘ధోనీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన స్టైల్‌, ఆయన వ్యక్తిత్వం విభిన్నం. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి? మ్యాచ్‌ సమయంలో కొందరు ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలి? వంటివి ఆయన నుంచి నేర్చుకోవాలి. అయితే, నా స్టైల్‌లోనే కెప్టెన్సీని నిర్వర్తించాలని కోరుకుంటున్నా. ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చేలా వారికి పూర్తి స్వేచ్ఛనిస్తా’ అని గైక్వాడ్‌ చెప్పాడు.

    వరల్డ్‌కప్‌ టోర్ని గిల్‌దే: ఆకాశ్‌చోప్రా

    టీమ్‌ఇండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్‌పై మాజీ బ్యాటర్‌ ఆకాశ్‌చోప్రా ప్రశంసలు కురిపించాడు. వరల్డ్‌కప్‌ టోర్నిలో గిల్‌ బ్యాట్‌ నుంచి పరుగుల వరద పారుతుందని జోస్యం చెప్పాడు. ‘ఈ టోర్నమెంట్‌ గిల్‌దే కావచ్చు. ఈ టోర్నిలో భారత టాప్‌ త్రీ బ్యాటర్లు రాణించే అవకాశం ఉంది. వీరిలో ఎవరు బాగా ఆడితే వారు రికార్డులు బద్దలు కొడతారు. నా అంచనా ప్రకారం శుభ్‌మన్‌ గిల్‌ భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. కనీసం రెండు శతకాలు బాదవచ్చు. మూడో శతకం కొట్టినా నేను ఆశ్చర్యపోను’ అని అన్నారు.

    ఇంగ్లాండ్‌ జట్టుకు చేదు అనుభవం

    వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌ జట్టుకు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. దాదాపు 38 గంటల పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఎకానమీ క్లాస్‌లో విమానంలో ప్రయాణించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘అంతా గందరగోళంగా ఉంది. విమానంలోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు 38 గంటలకుపైగా ప్రయాణం సాగింది’ అంటూ నవ్వుతున్న ఎమోజిని బెయిర్‌ స్టో క్యాప్షన్‌గా పెట్టాడు. ఆ ఫోటోలో కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌ … Read more

    ‘భారత్ అంటే పాక్‌ వణుకుతోంది’

    భారత్‌తో మ్యాచ్‌ అంటేనే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్ మొయిన్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. సీనియర్లు ఎవరూ కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌కు సలహాలు ఇవ్వడం లేదన్నాడు. ‘పాక్‌ జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదు. గేమ్‌ ప్లాన్‌ గురించి ఆటగాళ్ల మధ్య చర్చలు జరుగుతున్నాయో లేదో అని నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ సీనియర్లు సలహాలు ఇచ్చినా.. వాటిని పాటించడం లేదేమో. ఎందుకో తెలియదు కానీ, భారత్‌తో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ ప్లేయర్స్ వణికిపోతున్నారు’ అని అన్నాడు.

    రోహిత్ ఫామ్‌లో ఉంటే కష్టమే: పాక్ వైస్ కెప్టెన్

    భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టమే అని పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ అన్నారు. అలాగే బౌలర్లలో కుల్‌దీప్ మంచి ఫామ్‌లో ఉన్నాడని చెప్పారు. హైదరాబాద్ ఆతిథ్యం తమ జట్టుకు ఎంతో నచ్చిందన్నారు. తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. భారత జట్టు గెలుపుకు అత్యుత్తమైన బౌలింగ్ ప్రదర్శన దోహదపడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ఉప్పల్ మైదానంలో పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది.