• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?
    MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!
    ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!
    Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!
    See More

    #KavyaMaran: సన్‌రైజర్స్‌ సంచలన విజయంతో ట్రెండింగ్‌లోకి ‘కావ్య మారన్‌’.. ఈసారి కప్‌ మనదే!

    ఐపీఎల్‌ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని 31పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ఏకంగా 277/3 స్కోర్‌ చేసి ఐపీఎల్‌లో సహా ఇతర అంతర్జాతీయ టీ20 ఫార్మెట్స్‌లో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా రికార్డ్‌ సృష్టించింది. భారీ హిట్టింగ్స్‌తో హైదరాబాద్‌ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న క్రమంలో ఆ జట్టు యజమాని ‘కావ్యా మారన్‌’ (Kavya Maran) ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎప్పుడు … Read more

    IPL 2024: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. సీజన్‌ మెుత్తానికి దూరమవుతున్న స్టార్‌ ప్లేయర్లు వీరే!

    క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్‌ (IPL 2024) మెగా సమరం సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న 17వ సీజన్‌ కోసం అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. టైటిలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని జట్లకు కొత్త సారథులు వచ్చారు. అయితే కొంతమంది స్టార్ ప్లేయర్లు వివిధ కారణాల వల్ల సీజన్‌ మెుత్తానికి దూరమవుతున్నారు. మరికొందరు పాక్షికంగా కొన్ని ఆటలకు అందుబాటులో ఉండటం లేదు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.  మహ్మద్‌ షమీ (Mohammed Shami) ఐపీఎల్‌లో ‘గుజరాత్‌ టైటాన్స్‌’ (Gujarat … Read more

    Vamshhi Krrishna: ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదిన ఆంధ్ర క్రికెటర్.. ఎలా కొట్టాడంటే..!

    ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరుగుతున్న కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ (Col CK Nayudu Trophy)లో ఆంధ్రా బ్యాటర్‌ వంశీ కృష్ణ(Vamshhi Krrishna) విధ్వంసం సృష్టించాడు. రైల్వే జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాది ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. రైల్వే జట్టు బౌలర్‌ దమన్‌దీప్‌ సింగ్‌ వేసిన ఓవర్‌లో ప్రతీ బంతిని సిక్స్‌గా మలిచిన వంశీ కృష్ణ.. ఆ ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 64 బంతుల్లో 110 రన్స్‌తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. … Read more

    రంజీ గెలిస్తే ఆటగాళ్లకు BMW కార్లు: HCA

    రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుపై HCA అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ జట్టుకు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. దీంతో పాటు రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే టీంకు రూ.కోటి, ప్రతి ప్లేయర్‌కు బీఎండబ్ల్యూ కారు బహుకరిస్తామని వెల్లడించారు. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్‌ తిలక్‌వర్మ, ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌, స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్‌ రెడ్డి, ప్రజ్ఞయ్‌ రెడ్డికి తలో రూ.50 వేలు ప్రత్యేక నగదు … Read more

    Beautiful Cricketers Wives: ఇర్పాన్ పఠాన్ భార్యతో పాటు ఈ భారత క్రికెటర్ల భార్యలు ఎంత ఫేమస్సో తెలుసా?

    భారత మాజీ క్రికెటర్‌ ‘ఇర్ఫాన్ పఠాన్‌’ (Irfan pathan) పేరు నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా తన 8వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఇర్ఫాన్‌.. తొలిసారి తన భార్య ముఖాన్ని ప్రపంచానికి చూపించాడు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో ఇర్ఫాన్‌ (#IrfanPathan) పేరు వైరల్‌ అవుతోంది. ఇర్ఫాన్‌ భార్యను తొలిసారి చూసిన వారంతా ఫీదా అవుతున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇర్ఫాన్‌ భార్య సఫా బేగ్ ఓ సెలబ్రిటీ అన్న విషయం చాలా మందికి … Read more

    ‘మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోంది’

    టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మపై దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోందని చెప్పారు. ‘ఛాంపియన్స్‌లా ఆడారు. సగర్వంగా తల ఎత్తుకోండి. మీరెప్పుడో విజేతలుగా నిలిచారు. మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇది కష్టకాలమని నాకు తెలుసు. కానీ రోహిత్ స్ఫూర్తిని కోల్పోవద్దు. భారత్‌ నీకు మద్దతుగా ఉంది’. అని కపిల్‌ పేర్కొన్నాడు.

    ఆసీస్‌తో టీ20లకు కెప్టెన్‌గా సూర్య

    ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు జట్లును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌. పేర్లను వెల్లడించింది.

    ‘జట్టును గెలిపించడం రోహిత్‌కు తెలుసు’

    భారత్, ఆసీస్‌ రేపు టైటిల్‌ పోరులో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్‌ శర్మపై టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ జహీర్‌ఖాన్ ప్రశంసలు కురిపించాడు. అతడు అద్భుతమైన నాయకుడని కొనియాడారు. ‘అతడు బ్యాటింగ్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు. మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. ఎన్నోసార్లు ఫైనల్‌ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం రోహిత్‌కు ఉంది. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి బాగా తెలుసు’. అని జహీర్ చెప్పుకొచ్చాడు.

    ఫైనల్ మ్యాచ్‌కు మోదీ, రిచర్డ్‌ మార్లెస్‌

    రేపు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌ ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వస్తున్నారు. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు భారత వాయుసేన ఆధ్వర్యంలోని సూర్యకిరణ్‌ ఎయిరోబాటిక్‌ బృందం విన్యాసాలు చేయనుంది. టాస్‌కు ముందు ముంబయికి చెందిన 500 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. స్టేడియంలో లక్షా 30 వేల మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది.

    టీ20లకు కెప్టెన్‌గా సూర్య?

    ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌లో గాయపడిన హార్దిక్‌ పాండ్య కోలుకోకపోవడంతో సూర్యకు పగ్గాలు అప్పగించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్య వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆసీస్‌తో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ ఈనెల 23న విశాఖపట్నంలో ఆరంభమవుతుంది.