• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Priya Prakash Varrier: బికినితో సముద్రాన్నే హీటెక్కిస్తున్న ప్రియా వారియర్‌!
    Disha Patani: ఎద పొంగులతో రెచ్చిపోయిన దిశా పటానీ..!
    Shraddha Das: మత్తెక్కించే అందాలతో కాకరేపుతున్న శ్రద్ధా దాస్‌..!
    Aditi Rao Hydari : స్ట్రాప్‌లెస్‌ గౌన్‌లో అదితి అందాల తెగింపు !
    See More

    పుష్ప 2 ఆరిస్టుల బస్సుకు ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలా మంది ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సును మరో ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మారెడుపల్లిలో షూటింగ్ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

    హీరోయిన్ సమంత తన తొలి హాలీవుడ్ మూవీకి రెడీ అవుతోంది. ‘చెన్నై స్టోరీ’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని ఫిలిప్ జాన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా వివేక్ కల్రా నటించనున్నాడు. లండన్‌లో స్థిరపడ్డ భారత సంతతి యువకుడు నిఖిల్( వివేక్ కల్రా) తన తండ్రిని వెతుక్కుంటూ చెన్నై వస్తాడు. అతనికి అను( సమంత) పరిచయమైతుంది. అతని తండ్రిని వెతకడంలో సాయం చేసేందుకు ఒప్పుకుంటుంది. వీరిద్ద మధ్య ఏం జరుగుతుంది? అనే కథతో సినిమా రానుంది.

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పడుకొణె హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ K’ మూవీ సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమాలో విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో కమల్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఈ పాత్ర కోసం కమల్‌కు ఏకంగా రూ.150 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని నాగ్‌అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.

    నంది అవార్డులపై టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల విషయమై వెంకటేశ్ మాట్లాడుతూ ‘‘నేను నంది అవార్డుల గురించి ఎక్కువగా ఆలోచించను. ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇస్తుంది.. లేదంటే లేదు. కానీ ఇలాంటి అవార్డులు మాకు బాగా ప్రోత్సాహం అందిస్తాయి.’’ అంటూ పేర్కొన్నారు. కాగా 2018 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నంది అవార్డుల ప్రధానోత్సవం నిలిపేశాయి. దీంతో అవార్డులపై ఇండస్ట్రీలో చర్చే నడుస్తోంది.

    బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి మడివాడ తన అందచందాలతో అదరగొడుతోంది. ఎద అందాలు చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. అందాల ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ అమ్మడు అందాలు సెగలు పుట్టిస్తున్నాయి. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు అంతగా లేవనే చెప్పుకోవాలి. పలు వెబ్‌సీరీస్‌లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. Screengrab Instagram: tejaswimadivada Screengrab Instagram: tejaswimadivada

    నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ‘ఎన్‌బీకే108’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే టైటిల్ ఫిక్స్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. కాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.

    టాలీవుడ్ హీరో శర్వానంద్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సందడి చేశాడు. జూన్ 3న రక్షితారెడ్డి అనే యువతితో శర్వానంద్ వివాహం జరగనుంది. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌ను కలసి పెళ్లికార్డు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సీఎం కేసీఆర్‌ను కూడా పెళ్లికి ఆహ్వానించినట్లు సమాచారం. కాగా ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలే రక్షితారెడ్డి. ఈమె యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

    సార్ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌‌తో హీరో ధనుష్ ఫుల్ జోస్‌లో ఉన్నారు. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా కోసం ధనుష్ తన పూర్తి లుక్‌ని మార్చేశాడు. ముంబై ఎయిర్‌పోర్టులో ఆ హీరో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం కూడిన కొత్త గెటప్‌లో కనిపించి అందరినీ షాక్‌కి గురిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ధనుష్‌ లుక్‌ని పలువురు బాబా రామ్‌దేవ్‌తో సరి పోలుస్తున్నారు. అచ్చం ఆయనలాగే ...

    ‘పుష్ప2’ సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తాజాగా ఇండియన్ ఐడల్ సీజన్2 ఫినాలేకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌లతో సరదాగా గడిపాడు. కంటెస్టెంట్ శృతి పాట పాడటం పూర్తయ్యాక.. ‘నాకు నీ పేరు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే నా మొదటి గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శృతినే’ అంటూ నవ్వాడు. దీంతో షో జడ్జి గీతా మాధురి స్పందించి ‘గర్ల్ ఫ్రెండ్ అంటే చిన్నప్పుడు ఒకటో తరగతిలోనా?’ అంటూ ప్రశ్నించడంతో షోలో నవ్వులు పూచాయి. ఇండియన్ ఐడల్ 2 సీజన్ ఆహాలో ప్రసారం ...

    సినీనటులు నరేష్, పవిత్ర లోకేష్ గత కొన్నాళ్లుగా రిలేషిన్ షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పడు తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్‌గా ఉన్నామని ఇప్పటికీ పవిత్రతో కలిసి పిల్లలు కనడంతో తప్పేమి లేదని తెలిపాడు. భార్యభర్తలుగా మేము కలిసి ఉంటామని, పవిత్ర పిల్లలు, నా పిల్లలు ఇద్దరూ మా బిడ్డలే అనుకుంటామని చెప్పుకొచ్చారు.

    ‘బ్యాంకాక్ పిల్ల’గా పాపులరైన శ్రావణి సామంతపూడి తన టాలెంట్, క్రియేటివిటీతో రెండు చేతులా సంపాదిస్తోంది. తన భర్త ఉద్యోగరీత్యా థాయిలాండ్‌లో ఉండటంతో తాను కూడా అక్కడే ఉండి వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ‘బ్యాంకాక్ పిల్ల’ ఛానెల్‌కు 18 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. శ్రావణి వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. ప్రస్తుతం ఆమె సంపాదన నెలకు రూ.10 లక్షలు ఉన్నట్లు సమాచారం. తన క్రియేటివిటీతో ‘బ్యాంకాక్ పిల్ల’ రెండు చేతులతో సంపాదిస్తోంది.

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతిసనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఆదిపురుష్’ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. రూ.160 కోట్ల నుంచి రూ.170 కోట్ల భారీ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ థియేట్రికల్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్కించుకున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

    సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్‌కు యంగ్‌టైగన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరైటీ శిక్ష విధించారు. ఓ ఇంటర్వ్యూలో సునిశిత్.. ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. ఎన్టీఆర్ గతంలో పోర్న్ సినిమాల్లో నటించాడని.. ఆ విషయం తనకు మాత్రమే తెలుసని బీరాలు పోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడిని పట్టేశారు. కానీ అతడిని చితక బాదకుండా వెరైటీ పనిష్‌మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ చిత్రపటానికి హారతి ఇప్పించారు. Kotatalu,Sorry chepinchatalu evadina cjesthadu Thitinodithone Harathi ...

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ‘బ్రో’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా కొత్త పోస్టర్ రిలీజైంది. కానీ ఈ పోస్టర్‌లో పవన్ ధరించిన షూస్ అందరిని ఆకర్షించాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో చూడగానే ఆకర్షిస్తున్నాయి. కాగా బాల్మైన్ కంపెనీకి చెందిన ఈ బూట్ల విలువ అక్షరాలా లక్షా ఆరు వేల డెబ్బై రూపాయలు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఈ షూస్ నెట్టింట వైరల్‌గా మారాయి. Courtesy ...

    సుమంత్ ప్రభాస్ హీరోగా, సార్య హీరోయిన్‌గా నటించిన ‘మేమ్‌ ఫేమస్’ మూవీ థియేటర్ల వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా విమర్శకులు ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. చాలా రోజుల తర్వాత ఓ వినోదాత్మక చిత్రం చూశానంటూ ప్రశంసించారు. హీరో సుమంత్ ప్రభాస్‌కు మంచి భవిష్యత్ ఉందంటూ మెచ్చుకున్నారు. ఈ సినిమాలో అందరూ బాగా నటించారని.. అంజిమామ అదరగొట్టాడని కొనియాడారు.

    సినీ హీరో నందమూరి బాలకృష్ణ కోనసీమ జిల్లాలోని పుల్లేటికుర్రులో ఉన్న రామేలింగేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గతంలో కూడా తన తనయుడు మోక్షజ్ణతో కలసి ఇక్కడ పూజలు నిర్వహించారు. ప్రస్తుతం మోక్షు సినీ ఎంట్రీపై జోరుగా చర్చలు జరుగుతున్న సమయంలో బాలయ్య పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే మోక్షజ్ణ హీరోగా ఎంట్రీ ఇస్తారని ఓ వార్త వైరల్ అవుతోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మోక్షజ్ణ సినీ ఎంట్రీ ఇస్తారని టాక్.

    సుమంత్ ప్రభాస్ హీరోగా, సార్య హీరోయిన్‌గా నటించిన ‘మేమ్‌ ఫేమస్’ మూవీ థియేటర్ల వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లో రూ.3.1 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. లాంగ్ రన్‌లో ఈ మూవీ ఇంకా ఎక్కువ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వం వహించారు. చాయ్ బిస్కెట్స్ ఫిల్మ్, లహరి ఫిల్మ్ సంయుక్తంగా నిర్మించాయి. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు.

    గార్గి సినిమా తర్వాత సాయిపల్లవి నుంచి మరొక సినిమా రాలేదు. ఇటీవల శివకార్తికేయన్ సినిమాకు ఒకే చెప్పి మరోసారి జర్నీని ప్రారంభించింది. ఈ రెండు సినిమాలకు మధ్య దాదాపు ఒక ఏడాది విరామం వచ్చింది. ఇలా గ్యాప్ రావడంపై సాయిపల్లవి స్పందించింది. అవకాశాలు ఉన్నప్పటికీ తానే కాస్త విరామం తీసుకోవాలని అనుకున్నట్లు ఈ లేడీ పవర్‌స్టార్ వెల్లడించింది. తాజాగా ఎస్‌కే21 మూవీకి సైన్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పుష్ప2 సినిమాలోనూ సాయిపల్లవి ఓ క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం.

    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 29 నుంచి జూన్‌ 4వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అయితే ఈ వీక్‌ అన్నీ చిన్న సినిమాలు రిలీజ్‌ కావడం విశేషం. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు అహింస ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా ‘అహింస’ సినిమా ...

    హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తోంది. మహారాష్ట్రలోని లోనావాలోలో ఉన్న ఓ రిసార్టులో రాత్రిపూట జలకాలాడుతోంది. ‘నక్షత్రాల కింద ఈత కొట్టడం ఎంతో అద్భుతంగా ఉంది. మా ఇంటికి దగ్గర్లోనే ఒక కొత్త ప్రదేశాన్ని కనుగొన్నా. ఈ రిసార్టులోనే అలా ఓ రాత్రి మొత్తం గడిపా’ అంటూ ఇన్‌స్టాగ్రాంలో ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. స్విమ్ సూట్‌లో శ్రద్ధా హాట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధా పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. Courtesy Instagram:Shraddha Das ...

    పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’. ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. పవన్ కళ్యాణ్, సాయితేజ్ కలిసి ఉన్న పోస్టర్ ఇది. మామా, అల్లుడిని ఒకే పోస్టర్‌లో చూపించడంతో ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఈ సినమాలో సాయితేజ్ మార్క్(మార్కండేయులు) పాత్ర పోషిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ‘టైం గాడ్’గా నటించాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించాడు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. జులై 28న సినిమాను రిలీజ్ చేయనున్నారు.

    ఆదిపురుష్ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. ‘రామ్ సీతారాం సీతారాం జయ జయరాం’ పాట రిలీజైంది. సాంగ్‌లో విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. రాముడు- సీత పాత్రల మధ్య పరిణయాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

    బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దంగల్‌ నటి ఫాతిమా సన షేక్‌తో అమీర్‌ డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. వీటిని ఖండిస్తూ అమీర్‌ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. కెరీర్‌ ప్రారంభంలో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న అమీర్‌, కొంత కాలానికే విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత కిరణ్‌ రావును పెళ్లి చేసుకున్న ఆమెతోనూ విభేదాలు రావడంతో ఇటీవలే విడిపోయాడు. కిరణ్‌రావుతో విభేదాలు రావడానికి కారణం కూడా ఫాతిమానే అని వార్తలు కూడా ...

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. గతంలో బౌరంపేటలో వేసిన సెట్ వర్షానికి కూలిపోవడంతో దానికి మరమ్మత్తు చేస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేశారు. కాగా, విభిన్నమైన చారిత్రక అంశాలను ఆధారంగా చేసుకుని క్రిష్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ – సమంత కాంబోలో వస్తున్న లవ్ ఎంటర్‌టైనర్ ఖుషి. తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్‌పై ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. సున్నితమైన మత పరమైన అంశం చుట్టూ దర్శకుడు శివ నిర్వాణ డీసెంట్ లవ్ స్టోరీ రాసుకున్నాడట. ఈ తరహా కథని గతంలో ‘సంపంగి’ అనే సినిమాలో చూపించారు. అయితే.. ఈ సినిమా స్టోరీ ప్రజెంటేషన్ కొత్తగా ఆసక్తికరంగా ఉంటుందని తెలిసింది. హృదయానికి హత్తుకునేలా కథ రాసుకున్నారని సమాచారం.

    పుష్ప 2 నుంచి ఓ క్రేజీ గాసిప్ వైరల్ అవుతోంది. పుష్ప 2 సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ డీసీపీ క్యారెక్టర్ చాలా కీలకమట. సినిమాలో అప్పటివరకు ఉన్న పలు అనుమానాలను ఈ డీసీపీ క్యారెక్టరే ట్విస్ట్‌ల రూపంలో రివీల్ చేస్తోందని సమాచారం. ముఖ్యంగా పుష్ప అంటే ఎవరు? అతని ప్రయాణం, ప్రాణం దేని కోసం వంటి అంశాలను ఈ డీసీపీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందట. ఈ క్యారెక్టర్ కోసం సుకుమార్ సెర్చింగ్ మొదలు పెట్టారని తెలిసింది. ఓ సీనియర్ నటున్ని తీసుకోవాలని ...

    ‘మళ్లీ పెళ్లి’ సక్సెస్ మీట్‌లో నరేశ్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తుది శ్వాస వరకూ నటుడిగానే ఉండాలని ఉంది. ప్రేక్షకులతో చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. శరత్ బాబు మృతి కలచివేసింది. ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా కోసం శరత్‌బాబు ఎలాంటి సందేహం లేకుండా ఓకే అన్నారు. పవిత్రను జాగ్రత్తగా చూసుకో. తను చాలా మంచిది. సంతోషంగా ఉండండి’ అని చివరిరోజు షూట్‌ పూర్తి చేసుకుని వెళ్తూ శరత్‌బాబు నాతో చెప్పారు అని భావోద్వేగానికి లోనయ్యారు.

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మరో ఘనత సాధించింది. గత 90 రోజులుగా యూట్యూబ్‌లో అత్యధికంగా వెతికిన టాపిక్‌గా ఆదిపురుష్ ట్రైలర్ నిలిచింది. ఆదిపురుష్ ఫస్ట్ సింగిల్ జైశ్రీరామ్ సాంగ్ అన్ని భాషాల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈసాంగ్ ఒక్క యూట్యూబ్‌లోనే కాకుండా.. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

    రామ్‌చరణ్ కొత్త బ్యానర్ ‘వీ మెగా పిక్చర్స్’ తొలిసారిగా చేయబోతున్న చిత్రం ‘ద ఇండియా హౌస్’. నిఖిల్ సిద్ధార్థ హీరోగా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలు పంచుకోనుంది. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా టీజర్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. స్వాతంత్ర సమరంలో వెలుగులోకి రాని సంఘటన ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

    ఫిల్మ్‌నగర్ సర్కిల్ వద్ద కారు శర్వానంద్ కారు ప్రమాదానికి గురైంది. రేంజ్ రోవర్ కారు డివైడర్‌ని ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో శర్వాకు స్వల్ప గాయాలయ్యాయని తొలుత సమాచారం అందింది. దీనిపై హీరో స్పందించాడు. ఎవరికీ ఏం కాలేదని క్లారిటీ ఇచ్చాడు. తామంతా క్షేమంగా ఉన్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పాడు. జూన్ 2, 3 తేదీల్లో శర్వానంద్ పెళ్లి జరగాల్సి ఉంది. రాజస్థాన్‌లోని కోటలో వివాహ వేడుకలకు ప్లాన్ చేశారు.

    Load More