• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రహానేకు ద్రావిడ్ కీలక సూచన

    టీమ్‌ఇండియా బ్యాటర్‌ అజింక్యా రహానేపై కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్ ప్రశంసలు కురిపించాడు. WTC ఫైనల్లో రహానే కీలక పాత్ర పోషిస్తాడని అభిప్రాయపడ్డాడు. ‘రహానే తన అనుభవాన్ని సహచరులకు అందించాలి. ఓవర్సీస్‌ పరిస్థితుల్లో అద్భుతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై రహానే మంచి ప్రదర్శనే చేశాడు. చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫీల్డర్‌గానూ రహానే అదరగొడతాడు. స్లిప్స్‌లో మంచి క్యాచ్‌లను అందుకోగలడు. రహానేకు నాదో సూచన. అతడు తన వ్యక్తిగత ప్రదర్శనను సహచరులకూ అందించాలి’ అని ద్రావిడ్ విజ్ఞప్తి చేశాడు.

    WTC ప్రైజ్‌ మనీ ఎంతంటే?

    వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC) రేపు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఇందులో విజేతగా నిలిచి గదను దక్కించుకున్న జట్టు ప్రైజ్‌ మనీగా రూ.13 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) అందుకోనుంది. రన్నరప్ టీమ్‌ రూ.6.5 కోట్లు (8లక్షల డాలర్లు)తో సరిపెట్టుకోనుంది. జూన్‌ 07-11 తేదీల మధ్య జరగనున్న WTC ఫైనల్‌ మ్యాచ్‌కు లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదిక కానుంది. వర్షం వల్ల ఏదైనా రోజు ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్‌డే అయిన 12వ తేదీ వరకూ మ్యాచ్‌ను కొనసాగిస్తారు.

    వెబ్‌సిరీస్‌ చూసి దొంగతనానికి ప్లాన్‌!

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ముగ్గురు స్నేహితులకు బర్త్‌డే పార్టీ కోసం రూ.25 వేలు అవసరమైంది. దీంతో వారు ఒక వెబ్‌ సిరీస్ కథనాన్ని ఆధారంగా చేసుకొని దోపిడీకి పథకం వేశారు. ముఖాన ముసుగులతో ఓ నగల దుకాణానికి వెళ్లారు. తుపాకీతో నగల యజమానిని బెదిరించారు. దీంతో భయపడిపోయిన యజమని అక్కడనుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.

    గిల్‌ నాణ్యమైన ఆటగాడు: పాక్‌ క్రికెటర్

    టీమ్‌ఇండియా యువ క్రికెట్‌ శుభమన్‌ గిల్‌పై పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్ భట్ ప్రశంసలు కురిపించాడు. గిల్ అద్భుతమైన ఫామ్‌తో అందరి అభిమానాన్ని సంపాదించాడని కొనియాడాడు. ‘గిల్‌కు బౌలింగ్‌ చేస్తే సచిన్‌కు వేసినట్లు భావిస్తానని వసీమ్‌ అక్రమ్‌ చెప్పాడు. ఈ వ్యాఖ్యలకు గిల్‌ పూర్తిగా అర్హుడు. ప్రస్తుత క్రికెటర్లలో నాణ్యమైన ఆటగాడు గిల్‌ అని అనడంలో సందేహం లేదు’’ అని సల్మాన్‌ భట్‌ వ్యాఖ్యానించాడు. గతేడాది నుంచి సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌ ఈ ఐపీఎల్‌లో పరుగుల వరద పారించాడు. WTC ఫైనల్లోనూ ఇదే … Read more

    ‘ఏజెంట్‌’ స్ట్రీమింగ్‌ డేట్ షురూ!

    అక్కినేని అఖిల్ రీసెంట్ మూవీ ‘ఏజెంట్‌’ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 23న సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మే 19న ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. గత నెలలో విడుదలైన ఏజెంట్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అఖిల్‌కు భారీ హిట్‌ తీసుకొస్తుందనకున్న ఏజెంట్‌ అతడి కెరీర్‌లో మాయని మచ్చగా మారింది. ఏజెంట్‌ ఫ్లాపుతో డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డిపై అక్కినేని ఫ్యాన్స్‌ విరుచుకుపడ్డారు. మమ్ముటి కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో … Read more

    పెరగనున్న ‘ఆదిపురుష్‌’ టికెట్‌ ధరలు!

    ‘ఆదిపురుష్‌’ చిత్రం జూన్‌ 16న విడుదల కానుంది. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. బడ్జెట్‌తోపాటు భారీ వసూళ్లను రాబట్టేందుకు ఏపీ, తెలంగాణల్లో టికెట్‌ ధరలు పెంచాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. తెలుగు ప్రసార హక్కులను దక్కించుకున్నపీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌తినిధులు ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌ను క‌ల‌వ‌నున్న‌ట్లు సమాాచారం. మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.100 – రూ.150, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 – రూ.100 వ‌ర‌కు టికెట్ పెంచ‌మ‌ని కోరే ఛాన్స్‌ ఉంది.

    పోక్సో చట్టం అభియోగాలు ఎత్తివేత!

    మహిళా రెజ్లర్లపై WFI చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిజ్‌ భూషణ్‌ తన కూతురును లైంగికంగా వేధించాడంటూ గతంలో ఆరోపణలు చేసిన 17 ఏళ్ల మహిళా రెజ్లర్ తండ్రి తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిజ్‌ భూషణ్‌పై పోక్సో చట్టం కింద నమోదు చేసిన అభియోగాలు నిర్వీర్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రిజ్‌భూషణ్‌ను పోక్సో చట్టం నుంచి మినహాయించొచ్చని సమాచారం. కాగా రెజ్లర్ల ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ అధికారులు ఇవాళ … Read more

    బ్రిజ్‌భూషణ్‌ ఇంట్లో పోలీసుల విచారణ

    WFI చీఫ్‌ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెళ్లారు. యూపీలోని గోండాలో ఉన్న ఆయ‌న ఇంట్లో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఆ ఇంట్లో ఉన్న సుమారు 12 మంది నుంచి వాంగ్మూలాన్ని సేక‌రించారు. ఆ స్టేట్మెంట్ల‌ను రికార్డు చేశారు. సాక్ష్యం కోస‌మే ఆ డేటాను సేక‌రించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. అలాగే బ్రిజ్‌భూషణ్‌కు అనుకూలంగా ఉన్న అనేక మందిని ఢిల్లీ పోలీసులు ప్ర‌శ్నించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో సిట్‌ ఇప్ప‌టి వ‌ర‌కు 137 మంది నుంచి స్టేట్మెంట్ల‌ను రికార్డు … Read more

    ‘హెవీ వాట‌ర్ టార్పిడో’ పరీక్ష సక్సెస్‌

    స్వదేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన ‘హెవీ వాట‌ర్ టార్పిడో’ను భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. సముద్ర గర్భంలో ఈ పరీక్ష నిర్వహించగా.. అందుకు సంబంధించిన [వీడియో](url)ను నేవీ అధికారులు రిలీజ్ చేశారు. నిర్ధేశిత లక్ష్యాన్ని టార్పిడో ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఇండియన్‌ నేవీలో ఇది సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు. సముద్ర గర్భ యుద్ద కార్యకలాపాల్లో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుందని అధికారులు ప్రకటించారు. Successful engagement of an Underwater Target by an indigenously developed Heavy Weight Torpedo is … Read more

    చనిపోయిన తండ్రి పేరిట 12 ఏళ్లుగా పింఛను

    ఏపీ: మృతి చెందిన తండ్రి పేరిట 12 ఏళ్లుగా కుమారుడు వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన పారా కిరిటీ 2001లో చనిపోయాడు. దీంతో ఆయన చిన్న కుమారుడు తన మామను తండ్రిగా చూపించి పింఛనుకు దరఖాస్తు చేశాడు. 2011లో అధికారులు పింఛను మంజూరు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ కుమారుడు ప్రతినెలా పింఛను పొందుతూనే ఉన్నాడు. దీనిపై సొంత బంధువులు జేసీకి ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.