• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hyderabad Street Food Centers: కుమారి ఆంటీ కంటే చీప్‌కే అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. ఓ లుక్కేయండి!

    హైదరాబాద్‌లో కుమారి ఆంటీ స్ట్రీట్‌ ఫుడ్స్‌ (Kumari Aunty Street Food) ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆమె దగ్గర తక్కువ ధరకే రుచికరమైన ఫుడ్‌ దొరుకుతుండటంతో భారీ సంఖ్యలో ఫుడ్ లవర్స్‌ ఆమె వద్దకు క్యూ కట్టారు. అటు యూట్యూబ్‌ ఛానెల్స్‌ సైతం ఆమెపై ఫోకస్‌ పెట్టడంతో కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది. అయితే నగరంలో కుమారి ఆంటీ తరహాలోనే చాలా స్ట్రీట్‌ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. అద్భుతమైన రుచితో తక్కువ ధరకే నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తున్నాయి. … Read more

    Sanjay Shah: విస్టెక్స్‌ వ్యవస్థాపకుడు సంజయ్‌ షా దుర్మరణం.. ఎలా జరిగిందంటే?

    విస్టెక్స్‌ (Vistex) వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్‌షా (Sanjay Shah) దుర్మరణం చెందారు. సంస్థ ఉద్యోగులతో కలిసి కంపెనీ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని హైదరాబాద్‌ వచ్చిన ఆయన సంబురాలు చేసుకుంటుండగానే మృతిచెందారు. నగర శివార్లలోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో విస్టెక్స్‌ సంస్థ ప్రెసిడెంట్‌ విశ్వనాథ్‌రాజ్‌ కూడా తీవ్ర గాయాలపాలై మృత్యువుతో పోరాడుతున్నారు.  ముంబైకి చెందిన సంజయ్‌షా 25 ఏళ్ల కిందట విస్టెక్స్‌ ఏషియా (Vistex Asia) కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ అంచెలంచెలుగా దేశవిదేశాలకు విస్తరించింది. … Read more

    ఐటీ ఉద్యోగులకు మరో ఏడాది నిరాశే

    ఐటీ రంగానికి సంబంధించిన తాజా నివేదిక ఒకటి ఐటీ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. 2024లో సైతం ఈ రంగం మెరుగుపడే అవకాశాలు లేవని ప్రముఖ ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్‌కు చెందిన విశ్లేషకులు వెల్లడించారు. అయితే 2025లో మాత్రం పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. ఇన్వెస్టర్లు 2024ని ‘వాష్ అవుట్’గా పేర్కొంటారని, ఇక 2025పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగితే ప్రతికూల పరిస్థితులే ఉంటాయని ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ సంస్థలు హెచ్చరించాయి.

    వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ

    వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ వెల్లడించింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రెపో రేటు: 6.5%, రివర్స్ రెపో రేటు: 3.35%, ఎస్‌డీఎఫ్‌ఆర్: 6.25%, ఎమ్ఎస్ఎఫ్ఆర్:6.75%, బ్యాంక్ రేటు: 6.75% వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. వృద్ధి రేటు బాగానే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది.

    New Parliament Building: నూతన పార్లమెంటు భవనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా? 

    96 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాత పార్లమెంట్ భవనానికి విడ్కోలు చెబుతూ.. కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. స్వాతంత్రోధ్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది పాత పార్లమెంట్. నూతన పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. “చిన్న కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద … Read more

    SkyWalk Glass Bridge: 3,600 అడుగుల ఎత్తులో స్కైవాక్‌.. దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన ఇదే!

    కేరళ అంటే ముందుగా ప్రకృతి అందాలు, నదీ పాయలు, సుగంద ద్రవ్యాలు, పర్యాటక ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. పర్యాటకానికి పెద్ద పీట వేసే రాష్ట్రాల జాబితాలో కేరళ (Kerala State) ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్కైవాక్‌ గాజు వంతెన (SkyWalk Glass bridge)ను ప్రారంభించింది.  విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఇడుక్కి జిల్లాలోని వాగమన్‌ ప్రాంతంలో ఈ గాజు వంతెనను నిర్మించింది. గాజు వంతెనల్లో దేశంలోనే అతి పొడవైన వంతెన ఇదే కావడం విశేషం. … Read more

    పాఠాలు చెబుతున్న రోబో టీచర్

    బెంగళూరులో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, రోబో టీచర్‌ను పరిచయం చేసింది. ఈ రోబో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులను బోధిస్తుంది. ఇలా పాఠాలు చెబుతున్నఈ రోబో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో రోబో పాఠాలతో పాటు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన రోబో టీచర్ ప్రపంచంలో మొట్టమొదటిది కావడం విశేషం. World's first ROBOT teacher designed by Indian AI experts,started teaching at Bangalore in INDUS school.This 5 feet … Read more

    హైదరాబాద్‌లో దంచికొడుతున్న వానలు.. ఈ పనులు మాత్రమే చేయండి! తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ!

    హైదరాబాద్‌లో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాన నీరు రోడ్లపైకి రావడంతో పలు చోట్ల పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు వానలో తడుస్తూ ఇబ్బంది పడ్డారు.  వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ క్లియర్ అయ్యేవరకు వర్షంలో తడుస్తూ కాలం వెల్లదిశారు. పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వెళ్లే రూట్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి … Read more

    Pawan Kalyan: వాలంటీర్లపై పవన్ కామెంట్స్.. వైసీపీకి అనుకూలంగా మారాయా?

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నిరేపాయి. వాలంటీర్లు సేకరించే సమాచారం వల్లే యువతులు అదృశ్యమవుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రంలో వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పవన్​ దిష్టి బొమ్మలను దగ్దం చేస్తూ నిరసన తెలిపారు. వీరికి వైసీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. కొందరు వైసీపీ నేతలైతే పవన్ వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతూ వారంటీర్ల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటున్నారు. దీంతో … Read more

    Daggubati Purandeswari: జూ. ఎన్టీఆర్‌ను దువ్వే పనిలో బీజేపీ.. అందుకే పురంధేశ్వరికి అధ్యక్ష పగ్గాలు… ఇవిగో ప్రూఫ్స్!

     తెలుగు రాష్ట్రాల్లో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను తొలగిస్తూ  ఆ పార్టీ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. వ్యూహాత్మ ఎత్తులకు బీజేపీ సమాయత్తం అయింది. తొలుత ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే  ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రాజును ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బీజేపీ చీఫ్‌గా తనను … Read more