• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆఫర్లు

    ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ హాప్(HOP) పండగ ఆఫర్లను ప్రకటించింది. హాప్ లియో, లైఫ్ మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. లియో మోడల్ పై రూ. 4,100, లైఫ్ మోడల్ పై రూ. 3,100 తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ల సాయంతో పండగల సీజన్లో అత్యధిక సేల్స్ రాబట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. సేల్స్‌ను బట్టి రానున్న దసరా, దీపావళి ఫెస్టివల్స్‌ టైంలో మరిన్ని ఆఫర్లు తీసుకొస్తామని కంపెనీ ప్రకటించింది.

    New Parliament Building: నూతన పార్లమెంటు భవనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా? 

    96 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాత పార్లమెంట్ భవనానికి విడ్కోలు చెబుతూ.. కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. స్వాతంత్రోధ్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది పాత పార్లమెంట్. నూతన పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. “చిన్న కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద … Read more

    రూ.90 వేల కోట్లకు ఆన్‌లైన్ విక్రయాలు

    రాబోయే పండగ సీజన్‌లో ఆన్‌లైన్‌ విక్రయాలు రూ.90,000 కోట్లకు చేరొచ్చని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ అంచనా వేసింది. గతేడాది పండగ విక్రయాలతో పోలిస్తే 18-20 శాతం వృద్ధి నమోదుకావొచ్చని పేర్కొంది. మార్జిన్‌ల పరంగా రాబోయే సీజన్‌ అత్యంత మెరుగైనదని, కంపెనీలు విస్తృతమైన ఉత్పత్తులు, అధిక ప్రకటనలు, భారీ ఆదాయాలను ఆర్జించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ పండగ విక్రయాల్లో దాదాపు 14 కోట్ల మంది పాల్గొనవచ్చని, వీరు కనీసం ఒక్కసారి అయినా కొనుగోళ్లు చేసే అవకాశం ఉందని వివరించింది.

    అమెజాన్‌ కీలక నిర్ణయం

    ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యాష్‌ ఆన్‌ డెలివరీ చెల్లింపులకు రూ.2,000 నోట్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది. రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో మార్చుకునేందుకు సెప్టెంబరు 30న గడువు ముగుస్తుండటంతో ఆమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది.

    వాట్సాప్‌ యూజర్లకు అద్భుత ఫీచర్‌

    వాట్సాప్‌ యూజర్లకు ఆ సంస్థ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. బ్రాడ్‌కాస్ట్‌ తరహాలో వాట్సాప్‌ ఛానెల్స్‌ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఫీచర్ సాయంతో ఒకేసారి పెద్దసంఖ్యలో మెసెజ్‌లు పంపవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఈ ఛానెల్‌ అడ్మినిస్ట్రేటర్‌ తమ ఫాలోవర్లకు టెక్ట్స్‌, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు, పోల్స్‌ను ఓకేసారి పంపించుకునే సదుపాయం ఉంటుంది.

    SkyWalk Glass Bridge: 3,600 అడుగుల ఎత్తులో స్కైవాక్‌.. దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన ఇదే!

    కేరళ అంటే ముందుగా ప్రకృతి అందాలు, నదీ పాయలు, సుగంద ద్రవ్యాలు, పర్యాటక ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. పర్యాటకానికి పెద్ద పీట వేసే రాష్ట్రాల జాబితాలో కేరళ (Kerala State) ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్కైవాక్‌ గాజు వంతెన (SkyWalk Glass bridge)ను ప్రారంభించింది.  విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఇడుక్కి జిల్లాలోని వాగమన్‌ ప్రాంతంలో ఈ గాజు వంతెనను నిర్మించింది. గాజు వంతెనల్లో దేశంలోనే అతి పొడవైన వంతెన ఇదే కావడం విశేషం. … Read more

    SBIలో భారీ నోటిఫికేషన్

    నిరుద్యోగులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా పీఓ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జీతం రూ.41960గా ఉండనుంది. 21 ఏళ్లు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు. 30 ఏళ్లు దాటిన వారు అనర్హులు. ఓబీసీలకు ఫీజు రూ.750గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.

    వోల్వో నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు C40 రిచార్జ్

    స్వీడన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఇండియన్‌ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. వచ్చే పండుగ సీజన్‌ దృష్టిలో పెట్టుకొని కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు సీ40 రీచార్జ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ.61.25 లక్షలుగా ఉంది. ఇక కారు ఫీచర్స్ విషయానికొస్తే.. 4.7 సెకన్స్‌లో 100kmph వేగం అందుకోగలదు. దీనిలో ట్విన్ మోటర్ సెటప్ అయితే ఉంది. 78kWH పవర్‌ఫుల్ బ్యాటరీతో ఇది తయారైంది. Courtesy Twitter: Courtesy Twitter:

    కస్టమర్లకు ఎస్‌బీఐ బంపరాఫర్

    తన కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ మరో 3 రోజులు మాత్రమే ఉంది. హోమ్ లోన్లపై వడ్డీ రాయితీతో పాటు ప్రాసెసింగ్ ఫీజులో 50 నుంచి 100 శాతం మాఫీ చేస్తోంది. సిబిల్ స్కోరు 750 నుంచి 800 మధ్య ఉన్నవారికి వడ్డీ రేటు 9.15 శాతం ఉంటుంది. అదే ఈ ఆఫర్ సమయంలో తీసుకుంటే 8.70 శాతానికే రుణాలు ఇస్తుంది. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల లోన్లపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తోంది. … Read more

    జియో కస్టమర్లకు గుడ్ న్యూస్

    వినాయకచవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభించనున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. కాగా జియో ఎయిర్ ఫైబర్ డివైజ్ ఆధారంగా ఉపయోగించుకోవచ్చు. దీనికి ఎలాంటి వైర్లు అవసరం లేదు. ఎయిర్ ఫైబర్ డివైజ్‌ను అవసరమైనప్పుడు ఆన్ చేయవచ్చు. లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సెకనుకు 1000 మెగా బైట్స్ వేగంతో ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవచ్చు. దీని ధర సుమారు రూ.9999 ఉండవచ్చని అంచనా.