• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోకేష్ పాదయాత్రలో డబ్బుల కలకలం!

    మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రకు హాజరైన ప్రజలకు డబ్బులు పంచుతున్నట్లు ఉన్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పుట్టపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ పల్లె రఘునాథరెడ్డి ఈ డబ్బులు పంచుతున్నట్లుగా ఉంది. రూ.1000 ఇస్తామని..రూ.500 పంచుతున్నారని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గొడవకు దిగారు. ఈ యాత్ర కోసం మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    4 జిల్లాల రైతుల్ని పరామర్శించనున్న కేసీఆర్

    TG: సీఎం కేసీఆర్‌ ఇవాళ నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలను కోల్పోయిన రైతులను పరామర్శించనున్నారు. మహబూబాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలకు వెళ్లనున్న కేసీఆర్‌ అక్కడి రైతాంగాన్ని కలుసుకుంటారు. దెబ్బతిన్న పంటల్ని స్వయంగా పరిశీలిస్తారు. కష్టాల్లో మునిగిన రైతులకు ధైర్యం చెప్పి వారికి భరోసా కల్పిస్తారు. ఇటీవల తెలంగాణలో వడగండ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. దీంతో వరి, మొక్కజొన్నతో పాటు భారీస్థాయిలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

    కేసీఆర్‌ రాకకై మరాఠీల ఎదురుచూపు: జీవన్‌రెడ్డి

    దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ మోడల్‌ను చూసి సీఎం కేసీఆర్‌కు మహారాష్ట్ర ప్రజలు జై కొడుతున్నారని BRS ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఈ నెల 26న మహారాష్ట్రలో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షమందికి పైగా ప్రజలు వస్తారని పేర్కొన్నారు. కేసీఆర్‌ రాక కోసం మరాఠీలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ది దేశానికి అన్నం పెట్టే మోడల్‌ అయితే, మోదీది అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే రకమని ఎద్దేవా చేశారు.కేసీఆర్‌ అంటే నమ్మకం, మోదీ అంటే అమ్మకమని ఆయన అభివర్ణించారు.

    AP; నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

    ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని కమిటీ హాల్ నెంబర్-1లో ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. అనంతరం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. కాగా ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంటుంది.

    కేంద్ర దర్యాప్తు సంస్థలపై పోరాడనున్న ప్రతిపక్షాలు

    కేంద్ర దర్యాప్తు సంస్థలపై పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఒక్కతాటిపైకి వచ్చిన 8 పార్టీలు… సుప్రీంకోర్టు లేదా దిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయనున్నాయి. ఈ మేరకు కేసీఆర్, మమతా బెనర్జీ సహా 8 మంది అంతర్గతంగా చర్చించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తమపై కేంద్ర పెద్దలకు అనుగుణంగా నడుచుకుంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మోదీకి లేఖలు కూడా రాసిన సంగతి తెలిసిందే.

    వ్యంగ్యంగా KTR ఉగాది పంచాంగం

    బీజపీపై విమర్శలు గుప్పిస్తూ ఉగాది సందర్భంగా తనకు వచ్చిన ఓ ఫార్వర్డ్‌ మెసేజ్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. “ ఆదాయం: అదానీకి! వ్యయం: జనానికి, బ్యాంకులకు! అవమానం: నెహ్రూకి! రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!! బస్, బభ్రాజీమానం భజగోవిందం! దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!” అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.

    ప్రగతిభవన్‌కు కవిత

    దిల్లీలో ఈడీ విచారణ తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానశ్రయం నుంచి నేరుగా ప్రగతిభవన్‌కి చేరుకున్నారు. ఆమె వెంట మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కవిత భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈడీ విచారణకు సంబంధించి వివరించారని సమాచారం. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

    మోదీ పేరుతో పోస్టర్లు-100 FIRలు నమోదు

    దేశ రాజధాని దిల్లీలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపాయి. వేల సంఖ్యలో వెలిసిన పోస్టర్లు తీవ్ర రాజకీయ దుమారం సృష్టించాయి. ‘మోదీ హఠావో దేశ్‌ బచావో’ పేరిట నగరంలోని పలు ప్రాంతాల్లో గోడపత్రికలు అంటిస్తున్నారు. వీటిపై చర్యలకు దిగిన దిల్లీ పోలీసులు ఇప్పటికి 100 FIRలు నమోదు చేశారు. ఆరుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

    సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించండి: బండి

    టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే తన వద్దనున్న ఆధారాలను సమర్పిస్తానని బండి సంజయ్ వెల్లడించారు. పేపర్ లీక్ విషయంలో చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలంటూ సంజయ్‌కి సిట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందిస్తూ తొలుత కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులు ఇవ్వాలని హితవు పలికారు. ‘సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోని సంస్థ. సిట్ అంటే కూర్చుంటుంది. స్టాండ్ అంటే నిల్చుంటుంది. సమాచారం ఉంది కాబట్టే నేను, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం. పేపర్ లీకేజీపై మాట్లాడిన మంత్రులకు … Read more

    ముగిసిన కవిత ఈడీ విచారణ

    ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలపాటు ఈడీ కవితను విచారించింది. దాదాపు 9.40 గంటల ప్రాంతంలో ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా తుగ్లక్ రోడ్‌లో సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కాగా కవిత ఈడీ ఆఫీస్ నుంచి బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కవిత తదుపరి విచారణ ఎప్పుడు అనేది ఇంకా తెలియరాలేదు.