• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vijay Political Party: కేసీఆర్‌ సలహాతోనే విజయ్ పార్టీ పెట్టాడా? దీని వెనక పెద్ద స్కెచ్చే ఉంది!

    తమిళనాట (Tamil Nadu) మరో కొత్త రాజకీయ పార్టీ (Political Party) ఆవిర్భవించింది. ప్రముఖ నటుడు, దళపతి విజయ్‌ (thalapathy Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘తమిళగ వెట్రి కళగం’ (Tamilaga Vettri Kazhagam) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ్‌ నేడు అధికారికంగా సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అయితే వచ్చే  లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయమని, తమ పార్టీ ఎవరికీ మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని విజయ్‌ వెల్లడించారు. ఇక పార్టీ … Read more

    Interim Budget 2024: వస్తువుల ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!

    ఏప్రిల్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా పూర్తి బడ్జెట్‌ను కాకుండా తాత్కాలిక బడ్టెట్‌ (Union Budget 2024)ను ఆమె ప్రకటించారు. 2024-25 నాటికి బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. వీటిలో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు కాగా.. పన్ను వసూళ్లు రూ. 26.02 లక్షల కోట్లు ఉంటాయని నిర్మల అన్నారు. అయితే … Read more

    Ayodhya Ram Mandir: చిరంజీవి, రామ్‌చరణ్‌కు రాముడంటే ఎంత భక్తో చూడండి!

    వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని చేతుల మీదుగా రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం పులకరించిపోయింది. ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పరవశించిపోయారు.  మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభం కాగా ప్రధాని … Read more

    Maldives Row: మాల్దీవులు VS లక్షద్వీప్‌ వివాదం.. రంగంలోకి బాలీవుడ్‌ ప్రముఖులు!

    ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడంపై కొంతమంది మాల్దీవుల (Maldives Row) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భారత్‌కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లను సినీ, క్రీడా రంగ ప్రముఖులు ఖండిస్తున్నారు.  భారత్‌లోనూ మాల్దీవులకు మించిన ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, మన పర్యాటక రంగానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఏర్పడిందని సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌. ధోని భారత పర్యాటకంపై మాట్లాడిన ఓ పాత వీడియో తాజాగా వైరల్ అవుతోంది. … Read more

    ఓటర్లకు రామ్‌గోపాల్‌ వర్మ సూచనలు

    హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్రాటు చేసిన ఆర్ట్‌ ఫర్‌ డెమోక్రసీ కార్టూన్‌ చిత్రాలను సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు పలు సూచనలు చేశారు. నిష్పక్షపాతంగా, నిజాయతీగా ఓటు వేసి మంచి పాలకుల్ని ఎన్నుకోవాలని సూచించారు.

    టీడీపీ-జనసేన గెలుపు ఖాయం: లోకేష్

    2024లో టీడీపీ-జనసేన గెలుపు ఖాయమని టీడీపీ నేత నారా లోకేశ్‌ అన్నారు. 212వరోజు ముమ్మిడివరంలో లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదన్నారు. తాను చేస్తున్నపాదయాత్ర అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పిల్ల సైకోలు తాననేమి చేయలేవని విమర్శించారు. ఏ అధికారులైతే జగన్‌ మాట విన్నారో.. వాళ్లంతా దిల్లీకి క్యూ కడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

    చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

    IRR కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఐఆర్‌ఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం విచారణ డిసెంబర్‌ 1కి వాయిదా వేసింది.

    జగన్‌ పాలనకు ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలే: లోకేష్

    సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖ తరలించేందుకు జగన్‌ జీవోలు ఇస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో సెక్రటేరియట్‌లో కూర్చుని జగన్‌ ఇదేం రాజధాని అంటున్నారని విమర్శించారు. వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలను జగన్ రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ పాలన ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలు మాత్రమే ఉందన్నారు.

    IRR కేసు.. చంద్రబాబుపై చర్యలొద్దు: హైకోర్టు

    అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి రాష్ట్ర హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

    డీప్‌ఫేక్‌పై శ్రేణులు అప్రమతంగా ఉండండి: కేటీఆర్

    డీప్‌ఫేక్‌పై బీఆర్‌ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ రానున్న 4-5 రోజుల్లో అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ వాళ్లు ఇలా చేస్తారని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఓటర్లను చైతన్యం చేయాలని కేటీఆర్ సూచించారు.