• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు: KTR

    తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు, ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్టు ఖర్చు పెట్టడమే కాకుండా.. నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నిర్మించినట్లు వివరించారు. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని కేటీఆర్ సూచించారు.

    చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా

    అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ వాయిదా పడింది. నేడు ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించగా శుక్రవారం సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

    27 నుంచి మళ్లీ లోకేష్ పాదయాత్ర

    టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 27 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. డిసెంబరు నెలాఖరు వరకు సాగే పాదయాత్ర విశాఖపట్నంలో ముగియనుంది. చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయడంతో సెప్టెంబర్ 9 నుంచి లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిలు లభించడంతో పాదయాత్ర కొనసాగించాలని లోకేష్ నిర్ణయించారు. పొదలాడ నుంచే తిరిగి లోకేష్ యాత్ర ప్రారంభం కానుంది.

    కాంగ్రెస్ ఉంటే దేశాభివృద్ధి కష్టమే: మోదీ

    కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్‌ ప్రతీక అని విమర్శించారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ చోరులకు, అల్లరి మూకలకు అప్పగించిందని ఆరోపించారు.

    కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లే వస్తాయి: KCR

    ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తామని సీఎం కేసీఆర్ జోష్యం చెప్పారు. మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే ప్రజలు నష్టపోతారన్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

    కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావొద్దు: హరీశ్‌‌రావు

    కాంగ్రెస్‌కు అధికారమిచ్చి ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్‌నే కాంగ్రెస్ ఇస్తానంటోందని తెలిపారు. రైతుబంధు ఖర్చు దుబారా అని ఉత్తమ్‌కుమారెడ్డి చెబుతున్నారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మి ఓటేస్తే మోసపోవడం ఖాయమని మంత్రి చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక ఉపన్యాసాలతో ఊదరగొట్టారని విమర్శించారు.

    IRR కేసు.. చంద్రబాబు బెయిల్‌పై విచారణ వాయిదా

    రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఐడీ సమయం కోరడంతో విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

    సీఎం జగన్ పర్యటన వాయిదా

    సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా ప‌డిన‌ట్లు సీఎంవో ప్రకటించింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్ద సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే రీ షెడ్యూల్‌ చేసి మరో తేదీని ప్రకటించనున్నారు.

    ఒక్క పథకం ఆపితే.. రోడ్లు వేయొచ్చు: కొడాలి నాని

    వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వాటిలో ఏ ఒక్క పథకం ఆపినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. గుడివాడలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వేయాలంటే రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దీనికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపినా సరిపోతుందని తెలిపారు. రోడ్లపై ఉన్న చిన్నచిన్న గుంతల వద్ద చేరి టీడీపీ, జనసేన నేతలు రాద్ధాంతం చేస్తున్నారని నాని మండిపడ్డారు.

    చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు

    AP: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.