కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు: KTR
తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు, ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్టు ఖర్చు పెట్టడమే కాకుండా.. నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నిర్మించినట్లు వివరించారు. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని కేటీఆర్ సూచించారు.