• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరో ఆరు హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

    తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజా మేనిఫెస్టోలో 1) తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు ₹25వేల పింఛను, ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 2) ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం, 3) రైతులకు ఏకకాలంలో ₹2లక్షల పంట రుణమాఫీ, 4) రైతులకు ₹3లక్షల వడ్డీ లేని రుణాలు, ధరణీ స్థానంలో ‘భూమాత’ పోర్టల్‌, 5) వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ₹2లక్షల ఉద్యోగాల భర్తీ, 6) ఆడపిల్లల పెళ్లికి ₹లక్షతో … Read more

    కేంద్రానికి ‘అల్టిమేటం’ జారీ చేసిన సీఎం

    కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ అల్టిమేటం జారీ చేశారు. బిహార్‌కు త్వరలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కేంద్రంపై వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. డిమాండ్‌ను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మూలమూలన ప్రత్యేక హోదా కోసం డిమాండ్ వినిపిస్తుందని పేర్కొన్నారు.

    అప్పులు తప్ప అభివృద్ధి లేదు: పురందేశ్వరి

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి అప్పులు చేయడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి చేయడంలో లేదన్నారు. పేదలకు గృహాలు, సంక్షేమ పథకాలను కేంద్రమే అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతోందని తెలిపారు. ఆ నిధులను తమ నిధులుగా చెప్పుకుంటూ వైసీపీ గొప్పలకు పోతుందని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున కేంద్రం నిధులు మంజూరు చేసిందని పురందేశ్వరి పేర్కొన్నారు.

    పవన్‌ది నాది ఒకే మనస్తత్వం: బాలకృష్ణ

    జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ది.. తనది ఒకే మనస్తత్వమని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇద్దం ముక్కుసూటిగా మాట్లాడే అలవాలు ఉందన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలవటం నవశకానికి నాంది అని పేర్కొన్నారు. కలసికట్టుగా ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని ఆరోపించారు. టీడీపీ పాలనలో రూ.23 కోట్లతో నిర్మించిన బసవతారకరామ మాతాశిశు ఆసుపత్రి వద్ద సెల్ఫీ తీసుకొని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు.

    మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన పోలింగ్‌

    మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు నేడు రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మధ్యప్రదేశ్‌లో ఎస్టీ రిజర్వుడు సీట్లు 47, ఎస్సీ రిజర్వుడు 35 ఉన్నాయి. ఛతీస్‌గఢ్‌లో ఈ నెల 7న 20 నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్‌ జరిగింది.

    BRSకు 100 సీట్లు గ్యారంటీ: కవిత

    TS: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని ఆశించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోరుట్లలో తమ పార్టీ భారీ మెజారిటీ సాధిస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో ఈ పదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కవిత పేర్కొన్నారు.

    రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదు: రేవంత్

    తెలంగాణలో పేదలు బతికే పరిస్థితి లేదని. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వస్తే వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మేడ్చల్‌ నియోజకవర్గం జవహర్‌నగర్‌ రోడ్‌షోలో రేవంత్ మాట్లాడారు. మంత్రి కేటీఆర్ మేడ్చల్‌కు తెస్తామన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2,500 అందజేస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు.

    కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. ముహూర్తం ఫిక్స్?

    బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారని సమాచారం. పార్టీలో చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి విజయశాంతి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు.

    కర్ణాటక మాజీ సీఎంపై కేసు

    కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఆ రాష్ట్ర ప్రభుత్యం షాకిచ్చింది. విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్‌ వినియోగించుకున్నారని ఆయనపై కేసు నమోదుచేసింది. దీపావళికి బెంగళూరులోని తన నివాసాన్ని అలంకరించేందుకు ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలతో కరెంట్ లాగినందుకు బెస్కాం ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై కుమారస్వామి స్పందిస్తూ కేవలం టెస్టింగ్‌ కోసమే బయట నుంచి విద్యుత్తు తీసుకున్నారని చెప్పారు.

    రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమి లేదు: రేవంత్

    బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో పండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ విజయం సాధిస్తే రైతుబంధు ఆపేస్తామని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని రేవంత్ హమీ ఇచ్చారు.