• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీజేపీని గెలిపిస్తే అయోధ్య దర్శనం ఉచితం: అమిత్ షా

    తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనానికి ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. గద్వాలలో సకల జనుల సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంతో తమ పార్టీ గెలిపిస్తే రాష్ట్రానికి తొలి బీసీ సీఎంని చేసి తీరుతామని చెప్పారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది. గద్వాలలో 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పి చేయలేదని చెప్పారు. రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయలేదని అమిత్ … Read more

    పట్వారీ వ్యవస్థ కావాలా? ధరణి కావాలా?: KTR

    రైతులను ఇబ్బంది పెట్టేందుకే కాంగ్రెస్‌ పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కామారెడ్డిలో రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు బీఆర్‌ఎస్ రైతులకు మేలు చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో పట్వారీ వ్యవస్థ కావాలా? ధరణి కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. 24 గంటల కరెంట్‌ కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయాలని కోరారు.

    విజయశాంతికి కాంగ్రెస్ కొత్త బాధ్యతలు

    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బీజేపీని వీడి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రచార, ప్లానింగ్‌ కమిటీని కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. అందులో15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతలను విజయశాంతికి అప్పగించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, రామ్మూర్తి నాయక్‌, అలీ బిన్‌ ఇబ్రహీం, తదితరులను నియమించింది.

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు

    గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసునమోదైంది. అఫ్జల్‌గంజ్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం లేపాయి. ఈనేపథ్యంలో రాజాసింగ్‌పై సెక్షన్‌ 153, 153(ఏ) ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. రాజకీయంగా తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలను తరిమికొట్టాలని రాజాసింగ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

    కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఉండదు: KCR

    ధరణి పోర్టల్‌తో అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేసి దందాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల అవసరాల కోసం ధరణిని వినియోగిస్తున్నామని చెప్పారు. కరీంనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినపుడు తలసరి ఆదాయంలో రాష్ట్రం 19-20 స్థానాల్లో ఉండేదని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన తర్వాత 3.18లక్షల తలసరి ఆదాయంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

    BRSకు అంతం పలికే రోజు వచ్చింది: రాహుల్

    బీఆర్‌ఎస్‌‌కు అంతం పలికే రోజు వచ్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. పినపాక ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని తాను స్వయంగా చూసానని చెప్పారు. ఆ ప్రాజెక్టుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో 24 గంటల కరెంట్‌ కేవలం కేసీఆర్‌ ఇంట్లోమాత్రమే వస్తుందని రాహుల్ ఎద్దేవా చేశారు.

    హారతి పళ్లెంలో డబ్బులు.. మంత్రిపై కేసు

    తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదైంది. గూడూరులో ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు కొందరు మహిళలు ఆమెకు హారతి ఇచ్చారు. ఈ క్రమంలో సత్యవతి హారతి పళ్లెంలో రూ.4వేలు వేశారు. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్‌ఎస్‌టీ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

    ‘ఓటర్ల లిస్ట్‌ కంటే అక్రమ కేసుల లిస్టే పెద్దది’

    ఏపీలో ఓటర్ల లిస్ట్‌ కంటే ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నించినందుకు ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా తమ పార్టీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇక ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయని.. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ అచ్చెన్నాడు సవాల్ విసిరారు.

    మరో ఆరు హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

    తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజా మేనిఫెస్టోలో 1) తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు ₹25వేల పింఛను, ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 2) ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం, 3) రైతులకు ఏకకాలంలో ₹2లక్షల పంట రుణమాఫీ, 4) రైతులకు ₹3లక్షల వడ్డీ లేని రుణాలు, ధరణీ స్థానంలో ‘భూమాత’ పోర్టల్‌, 5) వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ₹2లక్షల ఉద్యోగాల భర్తీ, 6) ఆడపిల్లల పెళ్లికి ₹లక్షతో … Read more

    కేంద్రానికి ‘అల్టిమేటం’ జారీ చేసిన సీఎం

    కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ అల్టిమేటం జారీ చేశారు. బిహార్‌కు త్వరలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కేంద్రంపై వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. డిమాండ్‌ను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మూలమూలన ప్రత్యేక హోదా కోసం డిమాండ్ వినిపిస్తుందని పేర్కొన్నారు.