ఓటీటీలోకి ‘రూల్స్ రంజన్’
కిరణ్ అబ్బవరం హీరోగా, నేహాశెట్టి హారోయిన్గా తెరకెక్కిన ‘రూల్స్ రంజన్’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఆహాలో నవంబరు 30 సాయంత్రం 6గంటల నుంచి ‘రూల్స్ రంజన్’ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ తెలిపింది.