• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ కళ్యాణ్‌ను గెలిపించండి: చిరంజీవి

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన సొంత డబ్బుతో కౌలు రైతుల కన్నీళ్లు తుడిచిన పవన్.. వీరమరణం పొంది జవాన్ల కుటుంబాలకు అండగా ఉన్నారన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేకుండా పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చట్ట సభల్లో అతని గొంతు వినాలన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. https://youtube.com/watch?v=WUvzfeRufulDpMW9

    IRR కేసు.. చంద్రబాబు బెయిల్‌పై విచారణ వాయిదా

    రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఐడీ సమయం కోరడంతో విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

    మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల

    ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    సీఎం జగన్ పర్యటన వాయిదా

    సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా ప‌డిన‌ట్లు సీఎంవో ప్రకటించింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్ద సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే రీ షెడ్యూల్‌ చేసి మరో తేదీని ప్రకటించనున్నారు.

    ఒక్క పథకం ఆపితే.. రోడ్లు వేయొచ్చు: కొడాలి నాని

    వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వాటిలో ఏ ఒక్క పథకం ఆపినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. గుడివాడలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వేయాలంటే రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దీనికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపినా సరిపోతుందని తెలిపారు. రోడ్లపై ఉన్న చిన్నచిన్న గుంతల వద్ద చేరి టీడీపీ, జనసేన నేతలు రాద్ధాంతం చేస్తున్నారని నాని మండిపడ్డారు.

    చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు

    AP: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

    ‘ఓటర్ల లిస్ట్‌ కంటే అక్రమ కేసుల లిస్టే పెద్దది’

    ఏపీలో ఓటర్ల లిస్ట్‌ కంటే ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నించినందుకు ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా తమ పార్టీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇక ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయని.. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ అచ్చెన్నాడు సవాల్ విసిరారు.

    అప్పులు తప్ప అభివృద్ధి లేదు: పురందేశ్వరి

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి అప్పులు చేయడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి చేయడంలో లేదన్నారు. పేదలకు గృహాలు, సంక్షేమ పథకాలను కేంద్రమే అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతోందని తెలిపారు. ఆ నిధులను తమ నిధులుగా చెప్పుకుంటూ వైసీపీ గొప్పలకు పోతుందని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున కేంద్రం నిధులు మంజూరు చేసిందని పురందేశ్వరి పేర్కొన్నారు.

    పవన్‌ది నాది ఒకే మనస్తత్వం: బాలకృష్ణ

    జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ది.. తనది ఒకే మనస్తత్వమని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇద్దం ముక్కుసూటిగా మాట్లాడే అలవాలు ఉందన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలవటం నవశకానికి నాంది అని పేర్కొన్నారు. కలసికట్టుగా ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని ఆరోపించారు. టీడీపీ పాలనలో రూ.23 కోట్లతో నిర్మించిన బసవతారకరామ మాతాశిశు ఆసుపత్రి వద్ద సెల్ఫీ తీసుకొని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు.

    శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత సంచారం

    తిరుమల శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. భక్తులు రోడ్డు దాటుతున్న సమయంలో చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే భక్తులు టీడీపీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ కాలినడక భక్తులను గుంపులుగా అనుమతిస్తుంది. వాటర్‌ హౌస్‌ వద్ద భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు.