• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పార్శిల్ లారీ బోల్తా, నిలిచిన ట్రాఫిక్

    విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్‌పల్లి మండలంలోని గోపాలయపల్లి వద్ద లారీ అదుపు తప్పి డివైడర్‌‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. రహదారికి మధ్యలో లారీ అడ్డంగా పడిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరిస్తున్నారు. లారీ హైదరాబాద్‌కు పార్సిల్‌ లోడుతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

    లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి రజినీ

    AP: మంత్రి విడదల రజినీకి ప్రమాదం తప్పింది. విశాఖ పర్యటనకు వెళ్లిన రజినీ లిఫ్టులో ఇరుక్కుపోయారు. ఓవర్ లోడ్ కావడంతో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో స్పందించిన సిబ్బంది ఎమర్జెన్సీ కీ ద్వారా డోర్ ఓపెన్ చేశారు. మంత్రి రజినీతో పాటు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులు లిఫ్టులో ఉన్నారు.

    బట్టతల వస్తుందని కానిస్టేబుల్ ఆత్మహత్య

    TS: తల వెంట్రుకలు ఊడుతున్నాయని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారంకు చెందిన వినోద్ మల్కాజిగిరి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో జుట్టు క్రమంగా తగ్గిపోయింది. దీంతో పూర్తిగా బట్టతల వస్తుందేమోనని ఆందోళనకు గురైన వినోద్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో అధికారులు ఆత్మహత్య చేసుకోవడం ఇటీవల పెరిగిపోతుండటం గమనార్హం.

    గాడ్సే భరతమాత సుపుత్రుడు: కేంద్రమంత్రి

    గాడ్సే, గాంధీ వివాదంపై దేశంలో ఇప్పటికీ చర్చ జరుగుతుంటుంది. తాజాగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ గాడ్సేపై కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సేని భరతమాత సుపుత్రుడు అని అభివర్ణించారు. మొగలు రాజులైన బాబర్, ఔరంగజేబుల్లా గాడ్సే ఆక్రమణదారు కాదని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. బాబర్, ఔరంగజేబుల వారసుల్లా భావించేవారు నిజమైన భారత పుత్రులు కాదని విమర్శించారు. ఒక వేళ గాడ్సే హంతకుడైతే.. అంతకన్నా ముందు భరతమాత పుత్రుడని చెప్పారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఇలా రిప్లై ఇచ్చారు.

    రాష్ట్రంలో బీజేపీ ఫోకస్.. నేడు బహిరంగ సభ

    ప్రాంతీయ పార్టీలకు కంచుకోటగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని విస్తరించాలని జాతీయ పార్టీ బీజేపీ యోచిస్తోంది. ఈ మేరకు ఏపీపై అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. నేడు రాష్ట్రంలోని తిరుపతి, శ్రీకాళహస్తిల్లో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. అనంతరం శ్రీకాళహస్తిలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే నడ్డా రాష్ట్రానికి చేరుకున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. Courtesy Twitter:@somuveerraju Courtesy Twitter:@somuveerraju

    మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.460 పెరిగింది. నిన్న బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.60,220గా ఉండగా నేడు రూ.60,680కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.55,600కు ఎగబాకింది. మరోవైపు, వెండి ధరల్లోనూ పెరుగుదల నమోదైంది. కిలో వెండి రూ.2 వేలు పెరిగి రూ.79,700కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఈ ధరలు అమల్లో ఉంటాయి.

    రేపటికల్లా రాష్ట్రంలోకి రుతు పవనాలు

    AP: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రేపటికల్లా రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి. సాధారణంగా కేరళ నుంచి ఆంధ్రాకు చేరుకోవడానికి 4 రోజులు సమయం పడుతుంది. కానీ, గత 24 గంటల్లో వాటి గమనంలో వేగం పెరిగి తమిళనాడు, కర్ణాకటకు విస్తరించాయి. ఈరోజు, రేపు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండనుంది. మరోవైపు, తెలంగాణకు ఒక రోజు ఆలస్యంగా రానున్నాయి.

    TS: వారికి రూ.4,116 పెన్షన్

    రాష్ట్రంలోని దివ్యాంగులకు పింఛన్ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఈ విషయాన్ని తెలిపారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.1000 మేర పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన మొత్తంతో కలిపి రూ.4116లు పెన్షన్ ఇవ్వనున్నారు. పెంచిన పెన్షన్ వచ్చే నెల నుంచి అమలు కానుంది. కాగా ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ.3,116 పింఛన్ ఇస్తున్నారు.

    TS: మంత్రికి తప్పిన ప్రమాదం

    తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. తెలంగాణ ‘చెరువుల పండుగ’ సందర్భంగా కమలాకర్ కరీంనగర్ జిల్లాలోని ఆసిఫ్ నగర్‌లోని ఓ చెరువు సందర్శనకు వెళ్లారు. చెరువులో ఆయన పడవపై ప్రయాణిస్తుండగా అది బోల్తా పడింది. దీంతో కమలాకర్ నీటిలో పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి ఆయనను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మంత్రి సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. Minister and Karimnagar MLA Gangula Kamalakar escapes boat mishap, alert security rescues him … Read more

    వైఎస్సార్‌సీపీలో అందరూ జోకర్లే: చంద్రబాబు

    వైఎస్సార్‌సీపీలో అందరూ జోకర్లేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంగళగిరిలో జరిగిన ఐటీడీపీ సమావేశంలో బాబు మాట్లాడుతూ ‘‘సీఎం జగన్‌ను వివేకా హత్య కేసు నుంచి తప్పించాలని దేవదాయశాఖమంత్రి పూజలు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. రైతుబజారును తాకట్టు పెట్టేందుకు ఆర్థికమంత్రి ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీలో ఉన్న నాయకులంతా పెద్ద జోకర్లు.’’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.