పార్శిల్ లారీ బోల్తా, నిలిచిన ట్రాఫిక్
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి మండలంలోని గోపాలయపల్లి వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది. రహదారికి మధ్యలో లారీ అడ్డంగా పడిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు. లారీ హైదరాబాద్కు పార్సిల్ లోడుతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.