• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రంజీ గెలిస్తే ఆటగాళ్లకు BMW కార్లు: HCA

    రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుపై HCA అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ జట్టుకు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. దీంతో పాటు రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే టీంకు రూ.కోటి, ప్రతి ప్లేయర్‌కు బీఎండబ్ల్యూ కారు బహుకరిస్తామని వెల్లడించారు. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్‌ తిలక్‌వర్మ, ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌, స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్‌ రెడ్డి, ప్రజ్ఞయ్‌ రెడ్డికి తలో రూ.50 వేలు ప్రత్యేక నగదు … Read more

    పాలల్లో కల్తీని గుర్తించే 3డీ డివైజ్

    పాలల్లో కల్తీని గుర్తించే 3డీ పరికరాన్ని ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. యూరియా, ఉప్పు, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోప్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తదితర పదార్థాల్ని ఈ పరికరం 30 సెకన్లలో గుర్తిస్తుందట. ఈ టెస్టు చేయడానికి కేవలం ఒక మిల్లీలీటర్ శాంపిల్ అయితే చాలని పరిశోధకులు వెల్లడించారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం నేతృత్వంలో రీసెర్చ్ స్కాలర్లు సుభాషిస్ పఠారి, డా.ప్రియాంకన్ దత్తాలు ఈ 3డీ డివైజ్‌ని రూపొందించారు. మారుమూల ప్రాంతాల్లో కల్తీ పాలను గుర్తించడానికి ఈ డివైజ్ సులభంగా ఉపయోగపడుతుందని వీరు … Read more

    అమేజాన్ ప్రైమ్‌లో ‘మార్క్ ఆంటోనీ’

    కోలీవుడ్ హీరో విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైన ‘మార్క్ ఆంటోనీ’ మంచి విజయం సాధించి విశాల్ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో విశాల్‌తో పాటు డెరెక్టర్ ఎస్‌జే సూర్య నటించాడు.

    హైదరాబాద్ పోలీస్ బాస్ ఎవరు..?

    ఎన్నికల వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. తెలంగాణ సీఎస్ శాంతికుమారి ముగ్గురు పేర్లతో కూడిన లిస్టును సీఈసీకి పంపించారు. ఈ ముగ్గురిలో ఒకరి పేరును నగర సీపీగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం లోపు ఈసీ నిర్ణయం వెలువడుతుందనే చర్చ జరుగుతోంది. కీలకమైన పోస్ట్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.

    ఏపీలో రూ.750 కోట్లతో స్టార్ హోటల్స్

    టెక్ మహీంద్రా సంస్థ ఏపీలో రూ.750 కోట్ల పెట్టుబడితో మూడు స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ సీఎం జగన్‌ను కలిసి వివరాలు వెల్లడించారు. వైజాగ్ సహా మూడు పర్యాటక ప్రాంతాల్లో ఒక్కోదానికి రూ.250 కోట్ల చొప్పున ఖర్చు చేసి మూడు స్టార్ హోటల్స్ నిర్మించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరో రెండు నెలల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మాణానికి శంకుస్థాప చేస్తామని చెప్పారు.

    హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

    జాతీయ స్థాయి టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో తిలక్ వర్మకు జట్టు బాధ్యతలు అప్పగించారు. ఈ టోర్నీ అక్టోబర్ 16 నుంచి దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది. హైదరాబాద్ జట్టులో తిలక్ వర్మ, సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, రాహుల్ బుద్ధి, రాహుల్ రాధేశ్, చందన్ సహానీ, రోహిత్ రాయుడు, రవితేజ, భవేశ్ సేథ్, రక్షణ్ రెడ్డి, సంకేత్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, షౌనక్ కులకర్ణి, … Read more

    ఇద్దరు కుమార్తెలతో సహా తండ్రి సూసైడ్

    హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఓ వ్యక్తి ఇద్దరు కుమార్తెలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు శ్రీకాంత్ చారి(42), స్రవంతి(8), శ్రావ్య(7)గా గుర్తించారు. మృతదేహాల పక్కన నిద్ర మాత్రలు ఉండటంతో వీరు గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర మాత్రలు మింగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

    రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    ఈ నెల 14 నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 19న సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారి గరుడ ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా 14వ తేదీ నుంచి 23 వరకు స్వామివారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

    ‘రామ మందిరం ప్రతిష్ఠ రోజు వారు రావొద్దు’

    అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిరం ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు రావొద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోరింది. వారికి తగిన ఏర్పాట్లు చేయలేమని, అధికారులు సైతం ప్రొటోకాల్ పాటించే పరిస్థితి ఉండదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులను విడతల వారీగా ఆహ్వానించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి 26 తర్వాత భారత్‌తో పాటు విదేశాల్లోని భక్తులకు సైతం అవకాశం కల్పిస్తామన్నారు.

    ‘స్మార్ట్ ఫోన్’తో నోటి కేన్సర్‌ గుర్తింపు

    నోటి కేన్సర్‌ను గుర్తించేందుకు స్పెషల్ స్మార్ట్ ఫోన్ త్వరలో ప్రభుత్వ వైద్యులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐ హబ్, ఏఎన్ఏఐ ప్రతినిధులు దీనిని కనుగొన్నారు. ఈ ఫోన్‌తో నోటిని ఫొటో తీస్తే అందులో ఉన్న ఏఐ కేన్సర్ ఉందా లేదా అనేది చెబుతుంది. బయాప్సీ అవసరం లేకుండానే వ్యాధిని గుర్తించడంతో పాటు ఏ దశలో ఉందనేది తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌తో ఆరోగ్య సర్వే నిర్వహించేటప్పుడు నోటి కేన్సర్‌ను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.