• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరు మూవీ టైటిల్ ‘ముల్లోక వీరుడు’?

    వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రానికి ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరు గెటప్‌‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. ఈ సోషియో ఫాంటసీ మూవీలో చిరు పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంటుందని చెబుతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    చంద్రబాబుకు స్కిన్ అలర్జీ

    రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. ఉక్కపోత కారణంగా ఆయనకు ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరు స్కిన్ స్పెషలిస్టులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని జైలు అధికారులు ప్రకటించారు.

    ‘బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు’

    రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా 54 మందితో కూడిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే 45 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

    హైదరాబాద్ ఇన్‌చార్జ్‌ సీపీగా విక్రమ్‌సింగ్

    హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఇన్‌చార్జ్ సీపీగా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నలుగురు కలెక్టర్లు, పది మంది ఎస్పీలతో సహా మొత్తం 20 మంది ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బదిలీ అయిన వారి స్థానంలో ఇన్‌చార్జ్‌లను నియమించారు.

    సినీ అభిమానులకు బంపర్ ఆఫర్

    ఈ నెల 13న నేషనల్ మూవీ డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ అభిమానులకు బంపరాఫర్ ప్రకటించింది. ఆ రోజు దేశ వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో కేవలం రూ.99కే టికెట్ బుక్ చేసుకోవచ్చిన చెప్పింది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే ఉంటుంది. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, డిలైట్, ఎం2కేలో ఆన్‌లైన్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

    గాజా స్ట్రిప్‌లో తీవ్రంగా ఫుడ్ కొరత

    గాజా స్ట్రిప్ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల కొరత సైతం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంపై గత గురువారం జరిగిన రాకెట్ల దాడిలో వెయ్యి మందకి పైగా పౌరులు మృతి చెందారు. యుద్ధ వాతావరణం కారణంగా అక్కడి ప్రజలు చాలా మంది ఇజ్రాయెల్, ఈజిప్ట్ భూ భాగంలోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు వారిని నిలువరించడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

    మరికాసేపట్లో ‘సైంధవ్’ టీజర్

    ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సైంధవ్’ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా టీజర్ రిలీజ్ కాబోతుందనే చర్చ మొదలైంది. వెంకటేశ్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ మూవీని శైలేశ్ కొలను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ‘సైంధవ్’ రాబోతోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.

    కోహ్లీ పోలికలతో వ్యక్తి.. వైరల్ వీడియో

    చండీఘర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కార్తీక్ శర్మ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్, వీడియో వైరల్‌ అవుతున్నాయి. అతడు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పోలికలతో ఉండటమే దీనికి కారణం. ఈ ఫొటోలు చూస్తే కోహ్లీ, కార్తీక్ మధ్య వ్యత్యాసం తెలియడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ, కార్తీక్ ట్విన్ బ్రదర్స్‌లా ఉన్నారని మరికొందరు అంటున్నారు. కోహ్లీ అభిమాని అయిన తాను జీవితంలో ఒక్కసారి అయినా ఆయనను కలుసుకోవాలని ఉందని కార్తీక్ చెబుతున్నాడు. https://www.instagram.com/reel/Cug-n5rMuZE/?utm_source=ig_embed&ig_rid=c406d3c2-f820-4efa-b895-77c9a294b5c2

    గుడ్ న్యూస్.. పాక్‌‌ మ్యాచ్‌లో గిల్?

    డెంగ్యూ కారణంగా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్తాన్‌ మ్యాచ్‌లకు దూరమైన శుభ్‌మన్ గిల్ అహ్మదాబార్ చేరుకున్నాడు. అతడు ఫిట్‌నెస్ సాధిస్తే ఈ నెల 14న పాకిస్తాన్‌తో జిరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇటీవల మంచి ఫామ్ కొనసాగిస్తున్న శుభ్‌మన్ గిల్ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు డెంగ్యూ బారిన పడటంతో ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న గిల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైతే పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

    ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?

    బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం నామినేషన్స్ లిస్ట్‌లో ఉన్న శోభాశెట్టికి అతి తక్కువ ఓటింగ్ రావడంతో ఆమె ఎలిమినేట్ కానుందనే చర్చ జరుగుతోంది. శోభాశెట్టితో పాటు యావర్, అశ్వినీ, అమర్ దీప్, పావని, పూజా మూర్తి, తేజ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. యావర్‌కు టాప్ ఓటింగ్ వస్తుండగా.. అమర్ దీప్, తేజ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పూజా మూర్తి, శోభాశెట్టికి తక్కువ ఓటింగ్ వస్తోంది. దీంతో అతి తక్కువ ఓటింగ్ వస్తున్న శోభాశెట్టిని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించనున్నట్లు తెలుస్తోంది.