• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్యాస్‌ లీక్‌ ఘటన.. ముగ్గురి మృతి

    విశాఖలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గాయపడి వారిలో చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. ఇంట్లో వంటగ్యాస్‌ సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చే క్రమంలో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    హెల్మెట్‌లో దూరిన పాము.. వీడియో

    ఓ వ్యక్తి హెల్మెట్‌లో పాము దూరడం కలకలం రేపింది. హెల్మెట్‌లో నాగుపాము బుసలు కొట్టుకుంటూ ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో నేలపై ఉంచిన హెల్మెట్‌లో పాము కనిపిస్తుంది. దగ్గరగా ముడుచుకొని హెల్మెట్‌లో నుంచి బయటకు చూస్తూ ఉంది. అయితే హెల్మెట్‌లో పాము ఉన్న విషయాన్ని అతడు ముందుగానే గమనించడంతో ప్రాణాలుదక్కించుకున్నాడు. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. https://www.instagram.com/reel/CzGQXf0Np5P/?utm_source=ig_embed&ig_rid=1cdbf287-c1c7-4d5f-bb83-1d16db43b19d

    జగన్‌, సీబీఐలకు సుప్రీం నోటీసులు

    సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు సీబీఐ సహా, జగన్‌కు కేసు ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. గత పదేళ్లుగా జగన్‌ బెయిల్‌పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని.. వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.

    పర్సనల్‌ లోన్లపై కఠిన నిబంధనలు

    క్రెడిట్‌కార్డ్‌ సహా వ్యక్తిగత రుణ మంజూరీలపై ఆర్‌బీఐ నిబందనలను కఠినతరం చేసింది. నాన్‌–బ్యాంకు ఆర్థిక సంస్థలు రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని తాజా నిబందనలపై అంచనాలు నెలకొన్నాయి. ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీలు అన్‌సెక్యూర్డ్‌ వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మూలధనంపై కూడా ఈ నిర్ణయ ప్రభావం ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

    బిర్యానీకి డబ్బులివ్వలేదని దారుణ హత్య

    దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బిర్యానీ కొనుక్కోవడానికి డబ్బులివ్వలేదన్న 16 ఏళ్ల మైనర్ బాలుడు మద్యం మత్తులో మరో మైనర్ బాలుడిని విచక్షణారహితంగా పొడిచాడు. శరీరంపై 55 సార్లు కత్తితో పొడిచి పాశవికంగా గొంతు కోశాడు. అనంతరం కొనఊపిరితో ఉన్న అతణ్ని వీధిలో ఈడ్చుకుంటూ వెళ్తూ, నృత్యం చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. అతడి జుత్తు పట్టుకుని పైకి లేపి, జేబులోంచి రూ.350 తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

    స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 36 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 19,816 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను లాభాల బాట పట్టించాయి. ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    ఓట్ల లెక్కింపు కోసం 119 మంది పరిశీలకులు

    అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రానికి 119 మంది పరిశీలకులను ఈసీఐ నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించింది. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణకు మరో ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కూడా పంపింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తామని ఈసీ పేర్కొంది. పరిశీలకుడి ఆమోదం తర్వాతే ప్రతి రౌండ్‌ వివరాలు ప్రకటిస్తామని వెల్లడించింది.

    విమానంలో గుండెపోటుతో మహిళ మృతి

    సౌదీ అరేబియా నుంచి విమానంలో హైదరాబాద్‌ బయల్దేరిన ఓ మహిళ గుండెపోటుకు గురయ్యారు. వైద్యం కోసం పైలట్‌ విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు దృవీకరించారు. ఈ దుర్ఘటన ఇండిగో విమానంలో జరిగింది. అదే విమానంలో శంషాబాద్‌కు తీసుకొచ్చి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

    డీప్‌ఫేక్‌లపై కేంద్రం హెచ్చరిక

    డీప్‌ ఫేక్‌ వీడియోలపై కేంద్రం సీరియస్ చర్యలకు సిద్ధమవుతోంది. డీప్‌ఫేక్‌ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్‌ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ఈ సందర్భంగా డీప్‌ఫేక్ సమాజంలో కొత్త ముప్పుగా మారిందని కేంద్ర మంత్రి వైష్ణవ్ అన్నారు. ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా డీప్‌ఫేక్‌లు ఉద్భవించాయన్నారు. వీటిన సృష్టించి, వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు.

    మంటల్లో ఎలక్ట్రిక్ స్కూటర్.. వీడియో వైరల్!

    గత కొన్ని రోజులకు ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిరోడ్డుపై కాలిపోయిన సంఘటన మరిచిపోక ముందే.. మరో సారి ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నడిరోడ్డులో కాలుతున్న స్కూటర్‌లో మంటలు అదుపుచేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన పూణేలో జరిగినట్లు తెలుస్తోంది. @futureiselectr2 @GreavesCottonIN @airnewsalerts @ABPNews @aajtak @ampere_ev @EVehiclesindia @NITIAayog @rushlane @NetflixIndia @OlaElectric Ampere Battery Blast in Ampere magnus ex, … Read more