యువతను జగన్ను మోసం చేశారు: లోకేష్
సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యలకు యువత బలి అవుతోందని ఆరోపించారు. జగన్ మాయమాటలు నమ్మి యువత మోసపోయిందన్నారు. మేనిఫెస్టోలో ప్రకారం ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఏటా 2 లక్షలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని చెప్పి యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక.. ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారని లోకేష్ తెలిపారు.