‘‘మోర్బీ’ ఘటన దైవ నిర్ణయం’
మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలడం దైవ నిర్ణయం అని, అందులో తమ ప్రమేయం లేదని నిందితుల్లో ఒకరైన ఓరెవా కంపెనీ మేనేజర్ దీపక్ చెప్పారు. ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా బ్రిడ్జి కేసులో ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మోర్బీ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపట్టే అర్హత అజంతా ఓరెవా కంపెనీకి లేదని న్యాయస్థానంలో పోలీసులు పేర్కొన్నారు. కానీ ఇదే కంపెనీకిి పలుమార్లు కాంట్రాక్టులు అప్పగించినట్లు తెలిపారు.