గాజర్ల రవిని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాజ్ గణేశ్పై NIA ₹10లక్షల రివార్డు ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న రవి ఆచూకీ తెలిపిన వారికి ఈ మొత్తం అందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన రవి… 1992లో నక్సల్ ఉద్యమంలో చేరాడు. 2004లో అప్పటి పీపుల్స్ వార్ ప్రతినిధిగా చర్చల్లో పాల్గొన్నాడు. అయితే రవి ఉగ్రవాది అంటూ NIA తాజాగా పోస్టర్లు వేసింది. దీనిపై మావోయిస్టు వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది.