![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Gangs_Of_Godavari_cxs9UUU8a1_624_528.jpeg)
UATelugu
పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం అనే కుర్రాడు.. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో పాలిటిక్స్లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఇంగ్లీష్లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
ఇన్ ( Kannada, Tamil, Malayalam, Telugu )
Watch
2024 June 201 month ago
నెట్ఫ్లిక్స్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టాప్ 2లో ట్రెండ్ అవుతోంది
2024 June 101 month ago
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నెట్ఫ్లిక్స్లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
2024 June 31 month ago
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి శాటిలైట్ ప్రసార హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది
రివ్యూస్
YouSay Review
Gangs Of Godavari Review: విష్వక్ సేన్- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). న...read more
How was the movie?
తారాగణం
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Vishwak_Sen_250_250.jpeg)
విశ్వక్ సేన్
"టైగర్" రత్నాకర్ "రత్న"![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/50df727e-dc94-4bc9-ab0a-95100025d09d.jpeg)
అంజలి
రత్నమాల![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/9a6de554-dede-49b5-a724-14ce22485a30.jpeg)
నేహా శెట్టి
బుజ్జి![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Nassar_250_250.jpeg)
నాసర్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/P_Sai_Kumar_9x9KrHKZzCVX9kGl_250_250.jpeg)
పి. సాయి కుమార్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/f9e2c6aa-429a-4e64-86f5-afd4654dd498.jpeg)
హైపర్ ఆది
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Madhunandan_250_250.jpeg)
మధునందన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Praveen_250_250.jpeg)
ప్రవీణ్
గోపరాజు రమణ
పృధ్వీ రాజ్ పాలపర్తి
మయాంక్ పరాఖ్
సిబ్బంది
కృష్ణ చైతన్య
దర్శకుడుసాయి సౌజన్యనిర్మాత
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Yuvan_Shankar_Raja_250_250.jpeg)
యువన్ శంకర్ రాజా
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
![Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/31140916/Untitled-design-2024-05-31T140705.043.jpg)
Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ నటి అంజలి (Actress Anjali)ని బాలకృష్ణ నెట్టివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రెండ్రోజులుగా వైరల్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్ అంజలి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రోలర్స్కు ఇండైరెక్ట్గా గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘మేము గొప్ప స్నేహితులం’
స్టార్ హీరోయిన్ అంజలి (Anjali).. బాలకృష్ణపై వస్తోన్న విమర్శలపై పరోక్షంగా స్పందించింది. ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో పాటు ఉన్న ఓ మెమోరబుల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో అంజలి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అంజలి పోస్టును షేర్ చేస్తూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/yoursanjali/status/1796260781551682021
నెటిజన్లు భిన్నాభిప్రాయాలు
అంజలి పోస్టుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని ఆమెపై మండిపతున్నారు. బాలకృష్ణ తోసేసిన వ్యవహారం రెండ్రోజులుగా సోషల్ మీడియాను ఊదరకొడుతున్న క్రమంలో కాస్త త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటి స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. మరోవైపు బాలయ్య యాంటి ఫ్యాన్స్ నటి అంజలిపై సానుభూతి చూపిస్తున్నారు. కొందరి ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
https://twitter.com/GoneWorse/status/1796158320778117123
నిర్మాత ఏమన్నారంటే..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య వైరల్ వీడియోపై ఇటీవలే స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు. పూర్తి వీడియోను ఓ సారి చూసేయండి.
https://twitter.com/DeepikaBhardwaj/status/1796143784851325044
నేషనల్ వైడ్గా వైరల్
నటుడు బాలకృష్ణ.. నటి అంజలిని ఏ ఉద్దేశ్యంతో తోసిన అది.. నేషనల్ వైడ్గా మాత్రం ట్రెండ్ అయింది. ప్రముఖ జాతీయ మీడియాలు సైతం ఆ వీడియోను ప్రసారం చేశాయి. ఎంత చనువు ఉన్నా ఒక నటితో అలా ప్రవర్తిస్తారా అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం పక్కకు వెళ్లింది. అంతా బాలయ్య-అంజిలి గురించే చర్చించుకున్నారు.
మే 31 , 2024
![OTT Release Movies Telugu: ఈ వారం ఓటీటీల్లో/ థియేటర్లలో రిలీజ్ కానున్న చిత్రాల లిస్ట్ ఇదే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/14142619/Untitled-design-2024-05-14T142614.423.jpg)
OTT Release Movies Telugu: ఈ వారం ఓటీటీల్లో/ థియేటర్లలో రిలీజ్ కానున్న చిత్రాల లిస్ట్ ఇదే!
ఎన్నికల హడావుడితో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు థియేటర్లలో విడుదల కావడం లేదు. అనుకున్న దాని ప్రకారం మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా మే 31 కి వాయిదా పడింది. కానీ జబర్దస్త్ కమెడియన్ గెటప్(OTT Release Movies Telugu) శ్రీను హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ చిత్రం ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే విక్రమ్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం అపరిచితుడు సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఇవి తప్పితే థియేటర్లలో అలరించే చిత్రాలేవి ఈవారం లేవు. అయితే ఓటీటీల్లో మాత్రం 20కి పైగా చిత్రాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి వాటిపై ఓ లుక్ వేద్దాం
థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు
రాజు యాదవ్
గెటప్ శ్రీను, అంకిత ఖారత్ జంటగా నటిస్తున్న చిత్రం రాజు యాదవ్(Raju yadav). ఈ సినిమాను సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. క్రికెట్ ఆడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రాజు యాదవ్(గెటప్ శ్రీను) మూతికి బలమైన గాయం అవుతుంది. ఆ గాయం వల్ల అతను ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటాడు. అతని స్మైలింగ్ ఫేస్ చూసిన అంకిత ఖారత్ అతనికి దగ్గరవుతుంది. అయితే కొన్నినాటకీయ పరిణామాల తర్వాత అతన్ని దూరం పెడుతుంది. అప్పుడు రాజు యాదవ్ ఏం చేశాడు. తన లోపాన్ని అధిగమించేందుకు ఏం చేశాడు అనేది మిగతా కథ. కాగా ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
ఈవారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న చిత్రాలు(OTT Release Movies Telugu)
ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సందడి చేసేందుకు 20పైగా సినిమాలు సిద్ధమయ్యాయి. వాటిలో ముఖ్యంగా గాడ్జిల్లాX కాంగ్(తెలుగు డబ్బింగ్), చోరుడు(తెలుగు డబ్బింగ్)తో పాటు బస్తర్: ది నక్సల్స్ స్టోరీ, జర హట్కే జర బచ్కే వంటి హిందీ చిత్రాలు ఉన్నాయి. మరి ఏఏ ప్లాట్ ఫామ్స్లో ఏ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్ వేయండి.
TitleCategoryLanguagePlatformRelease DateVidya Vasula AhamMovieTeluguAhaMay 17Blood of Zeus S2Series EnglishNetflixMay 15Ashley Madison: Sex, Lies & ScandalSeries EnglishNetflixMay 15Madame WebMovieEnglishNetflixMay 16Bridgerton Season3 Part - 1 SeriesEnglishNetflixMay 16The 8 ShowSeriesKoreanNetflixMay 17Thelma the UnicornMovieEnglish NetflixMay 17PowerMovieEnglishNetflixMay 17CrashSeriesKoreanDisney+ HotstarMay 13ChoruduMovieTelugu DubbedDisney+ HotstarMay 14Uncle SamsikSeriesKoreanDisney+ HotstarMay 15Bahubali: Crown of BloodAnimates SeriesHindiDisney+ HotstarMay 17Outer Range Season 2SeriesEnglishAmazon PrimeMay 16AaveshamMovieTelugu DubbedAmazon PrimeMay 1799SeriesEnglishAmazon PrimeMay 17Bastar: The Naxal StoryMovieHindiZee5May 17Thalaimai SeyalagamSeriesTamilZee5May 17Godzilla x Kong: The New EmpireMovieTelugu DubbedBook My ShowMay 13Demon SlayerSeriesJapaneseJio CinemaMay 13C.H.U.E.C.O Season 2SeriesSpanishJio CinemaMay 14Zara Hatke Zara BachkeMovieHindiJio CinemaMay 17LampanSeriesMarathiSony LivMay 16
మే 14 , 2024
![నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/04105959/123.-28.jpg)
నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
నేహా శెట్టి మెహబూబా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, గల్లీ రౌడి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నేహా శెట్టి.. డిజే టిల్లు చిత్రంలో హీరోయిన్గా అలరించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన రాధిక పాత్ర యూత్లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. జోమాటో యాడ్ షూటింగ్లో అల్లు అర్జున్తో కలిసి నటించింది. ఈక్రమంలో నేహా శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Neha Shetty ) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేహా శెట్టి దేనికి ఫేమస్?
నేహా శెట్టి డీజే టిల్లు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
నేహా శెట్టి వయస్సు ఎంత?
1999, డిసెంబర్ 6న జన్మించింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు
నేహా శెట్టి ముద్దు పేరు?
నేహా
నేహా శెట్టి ఎత్తు ఎంత?
5 అడుగుల 6 అంగుళాలు
నేహా శెట్టి ఎక్కడ పుట్టింది?
మంగళూరు, కర్నాటక
నేహా శెట్టి అభిరుచులు?
డ్యాన్సింగ్, షాపింగ్
నేహా శెట్టికి ఇష్టమైన ఆహారం?
దోశ, బిర్యాని
నేహా శెట్టి తల్లిదండ్రుల పేర్లు?
హరిరాజ్ శెట్టి, నిమ్మి శెట్టి
నేహా శెట్టి ఫెవరెట్ హీరో?
అల్లు అర్జున్
నేహా శెట్టి ఇష్టమైన కలర్ ?
పింక్, వైట్
నేహా శెట్టి ఇష్టమైన హీరోయిన్స్
దీపిక పదుకునే
నేహా శెట్టి తెలుగులో హీరోయిన్గా నటించిన ఫస్ట్ సినిమా?
డీజే టిల్లు
నేహా శెట్టి ఏం చదివింది?
డిగ్రీ
నేహా శెట్టి పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్ నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మోడలింగ్, మిస్ మంగళూరు(2014)లో అందాల పోటీలో విజేతగా నిలిచింది.
More Information About Neha Shetty
నేహా శెట్టి హాట్ ఫొటోలు (Neha Shetty Hot Images)
నేహా శెట్టి పోషించిన బెస్ట్ రోల్ ఏంటి?
డీజే టిల్లు సినిమా చేసిన రాధిక పాత్ర.. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాల్లో బెస్ట్ అని చెప్పవచ్చు.
నేహా శెట్టి మూవీస్ లిస్ట్
ముంగారు మలె 2 (Mungaru Male 2), మెహబూబా (Mehbooba), గల్లీ రౌడి (Gully Rowdy), మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor), డీజే టిల్లు (DJ Tillu), బెదురులంక 2012 (Bedurulanka 2012), రూల్స్ రంజన్ (Rules Ranjann), టిల్లు స్క్వేర్ (Tillu Square)
నేహా శెట్టి అప్కమింగ్ మూవీ?
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari)
నేహా శెట్టి చీరలో దిగిన టాప్ ఫొటోలు( Neha shetty in Saree)
నేహా శెట్టి బ్లౌజ్ కలెక్షన్స్(Neha Shetty Blouse Collections)
నేహా శెట్టి బ్లౌజింగ్కు స్టైల్కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ట్రెండ్ తగ్గట్లు బ్లౌజులు ధరిస్తూ ఆమె చాలా మంది యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. ఆ ట్రెండీ బ్లౌజులు ఏవో ఇప్పుడు చూద్దాం.
కోల్డ్ షోల్డర్ బ్లౌజ్
నేహా ధరించిన ఈ కోల్డ్ షోల్డర్ బ్లౌజ్ అమె అందాన్ని రెట్టింపు చేసింది. నలుగురిలో ప్రత్యేకంగా కలిపించాలని భావించే వారికి ఈ బ్లౌజ్ తప్పక నచ్చుతుంది.
వి-నెక్ కట్ స్లీవ్ బ్లౌజ్
ట్రెడిషన్తో పాటు ట్రెండీగా కనిపించాలని భావించిన సమయంలో నేహా వి - నెక్ కట్ స్లీవ్ బ్లౌజ్లను దరిస్తూ ఉంటుంది. బ్లౌజ్కు తగ్గ శారీ, జ్యూయలరీ ధరించి కుర్రకారును ఫిదా చేస్తుంటుంది.
డీప్ ప్లంగింగ్ హల్టర్ నెక్ బ్లౌజ్
నేహా ధరించిన ఈ బ్లౌజ్ ట్రెండీ లుక్ను తీసుకొస్తుంది. యువతులు మరింత అందంగా.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది.
ఆఫ్ షోల్డర్ బ్లౌజ్
నేహా ధరించిన ఈ బ్లౌజ్ చాలా మోడరన్ లుక్ను అందిస్తుంది. యువతుల అందాలను చాలా బాగా ఎలివేట్ చేస్తుంది.
రౌండ్ నెక్ హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్
నేహా ధరించిన ఈ రౌండ్ నెక్ హాఫ్ స్లీవ్ బ్లౌజ్.. మంచి ట్రెడిషనల్ లుక్ తీసుకొస్తుంది. గోల్డెన్ ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ బ్లౌజ్ను శుభకార్యాలకు ధరించవచ్చు.
క్లాసిక్ స్లీవ్లెస్ బ్లౌజ్
నేహా.. ట్రెడిషన్, మోడరన్, ట్రెండ్ తగ్గట్లు ఇట్టే మారిపోగలదు. అయితే కాస్త సాఫ్ట్ లుక్లో కనిపించాలని భావించినప్పుడు ఈ అమ్మడు క్లాసిక్ స్లీవ్లెస్ బ్లౌజ్ను ధరిస్తుంది. ఈ లుక్లో నేహాకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు.
నేహా శెట్టిని వైరల్ చేసిన పోస్టు/ రీల్?
‘రూల్స్ రంజన్’ సినిమాలో తాను చేసిన ‘సమ్మోహనుడా’ సాంగ్కు నేహా శెట్టి రీల్ చేసింది. దీనిని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయగా అది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. చాలా మంది యువతులు ఈ పాటపై రీల్స్ చేసి వైరల్ అయ్యారు.
View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu)
సోషల్ మీడియాలో ఉన్న నేహా శెట్టి హాట్ వీడియోస్?
https://twitter.com/i/status/1730782118777950693
నేహా శెట్టి చేసిన బెస్ట్ స్టేజీ పర్ఫార్మెన్స్ ఏది?
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోని ‘సుట్టంలా సూసి’ సాంగ్ రిలీజ్ సందర్భంగా హీరో విశ్వక్తో నేహాశెట్టి స్టేజీపై డ్యాన్స్ వేస్తుంది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.
View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens)
నేహా శెట్టి ఏ ఏ భాషలు మాట్లాడగలదు?
ఇంగ్లీష్, హిందీ, తెలుగు
నేహా శెట్టిది ఏ రాశి?
మిథున రాశి
నేహా శెట్టికి సోదరుడు/ సోదరి ఎవరైనా ఉన్నారా?
నేహాకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు నవామి శెట్టి
నేహా శెట్టి పైన వచ్చిన రూమర్లు ఏంటి?
ఈ బ్యూటీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, ఆకాష్ పూరితో అప్పట్లో ప్రేమయాణం కొనసాగించినట్లు రూమర్లు ఉన్నాయి.
నేహా శెట్టికి ఇష్టమైన గాయకులు ఎవరు?
ఏ.ఆర్ రెహమాన్, శంకర్ మహదేవన్, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
నేహా శెట్టి ఫేవరేట్ స్పోర్ట్స్ ఏది?
క్రికెట్
నేహాశెట్టి ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు?
ధోని, విరాట్ కోహ్లీ
నేహా శెట్టికి ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు?
మైసూర్, గోవా, కర్ణాటక
నేహా శెట్టి చేసిన చిత్రాల్లోని బెస్ట్ సీన్?
https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_
నేహా శెట్టి జ్యూయలరీ ఫొటోలు?
నేహా శెట్టి చిన్నప్పటి ఫొటోలు?
నేహా శెట్టి సినిమాలోని బెస్ట్ డైలాగ్స్ ఏవి?
డీజే టిల్లులో నేహా శెట్టి చేసిన సన్నివేశాలన్నీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా టిల్లు.. రాధిక (నేహా శెట్టి) ప్లాటులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చే సీన్ హైలెట్గా అని చెప్పవచ్చు. ఎందుకంటే కథలో రాధిక పుల్ లెంగ్త్ పాత్ర పరిచయమయ్యేది ఈ సీన్ నుంచే. రాధిక ఓ హత్య చేసి అమాయకంగా చెప్పే డైైలాగ్స్ ఆమె కెరీర్లోనే బెస్ట్ అని చెప్పవచ్చు. ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.
డీజే టిల్లులో రాధిక పాత్రకు సంబంధించి మరో కీలకమైన సన్నివేశం కూడా ఉంది. నేహా శెట్టి బాగా పాపులర్ అవ్వడానికి అందులో ఆమె చెప్పే డైలాగ్స్ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
టిల్లు : ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావ్ రాధిక నాతోని..!
రాధిక : ఎందుకు టిల్లు.. నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్ నీకు?
టిల్లు: నిజంగా ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక?
రాధిక : అవును టిల్లు.. చెప్పు?
టిల్లు: నేను ఇది నీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్న చూడు ఇది సెకండ్ హైలెట్ ఆఫ్ ది నైట్ అది. కానీ చెప్తా.. నేను హౌలా గాడ్ని కాబట్టి.
https://youtu.be/r6L5KO89Azs?si=wuYC205pIGEZWNMB
టిల్లు : ఐ హ్యావ్ ఏ స్మాల్ డౌట్.. ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్లోనే జరిగింది కదా? కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే కాదు కదా?
రాధిక : కాదు, టిల్లు.. ఐ ప్రామిస్
టిల్లు : అయితే పోదాం కదా.. పోలీసు స్టేషన్కు వెళ్లి నిజం చెప్పేద్దాం.
రాధిక : పోలీసు.. పోలీసు.. అనొద్దు టిల్లు ప్లీజ్..
టిల్లు : ఎందుకట్ల పోలీసు.. పోలీసు.. అంటే భయపడుతున్నావ్? హా.. పాత కేసులేమైనా ఉన్నాయా నీ మీద? హే ఉంటే చెప్పు నేనేమి అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్లో ఒక సర్ప్రైజే హ్యాండిల్ చేయగల్గుతా. ఇట్ల మల్టిపుల్ అంటే నోతోని గాదు. ఇప్పుడు పోలీసు స్టేషన్కు పోయినాక ఆడ సడెన్గా యూ ఆర్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నెంబర్ వన్ క్రిమినల్ అని తెలిసినాక గుండె ఆగి చస్తా. అసలే డెలికేట్ మైండ్ నాది.
రాధిక: అవును టిల్లు 40 మర్డర్స్ చేశాను.. ఐదేళ్లుగా నాకోసం వెతుకున్నారు.
టిల్లు: అట్ల అనకు ప్లీజ్.. నాకు నిజంగా భయమైతాంది.
రాధిక: ఇంకేం టిల్లు.. అప్పటి నుంచి చెప్తున్నా పోలీసు పోలీసు అంటే వద్దని. మళ్లీ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇద్దరం ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి పోలీసు పోలీసు అని ఒకటే నస.
టిల్లు: వన్ మినిట్.. వన్ మినిట్.. ఒక వన్ స్టెప్ బ్యాక్ వద్దాం. ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటాం అని అన్నావ్ కదా. అంటే నేనెందుకు ఇరుక్కుంటాను. నాకేం సంబంధం. నాకు వాడు రూమ్లో ఉన్నట్లు కూడా తెల్వదు.
రాధిక: టిల్లు.. మన ఇద్దరి ఫొటోస్ ఇంక ఎక్కడ సేవ్ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.
https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_
నేహా శెట్టి ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/iamnehashetty/?hl=en
https://www.youtube.com/watch?v=sv7EkhD7c1U
ఏప్రిల్ 25 , 2024
![Latest OTT telugu Movies: ఈ వీకెండ్లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/15165129/Untitled-design-2024-06-15T165119.773.jpg)
Latest OTT telugu Movies: ఈ వీకెండ్లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
రీసెంట్గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్ను ఎంచుకుని వీకెండ్ను ఎంజాయ్ చేయండి
లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ
రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లవ్ మీ’ (Love Me). ఇఫ్ యూ డేర్ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్ తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్లో కాస్త రొమాంటిక్ డోస్ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్మెంట్కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్పామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి.
ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే.. పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
పారిజాత పర్వం
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్లో వచ్చిన ఈ సినిమా వీకెండ్లో చూసేందుకు మంచి ఛాయిస్గా చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైతన్య (చైతన్యరావు) డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. స్నేహితుడ్ని (హర్ష) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో చివరికి తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు. మరోవైపు బారు శ్రీను (సునీల్), పారు (శ్రద్దా దాస్) కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? అతడి కథేంటి? చైతన్య డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నది కథ.
యక్షిణి
మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్ సిరీస్ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్.. నేరుగా డిస్నీ హాట్స్టార్లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్ సిరీస్పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్లో మంచి హరర్ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్ను చూడవచ్చు.
ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు, మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన కృష్ణ (రాహుల్ విజయ్)ని ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ.
పరువు
నివేదా పేతురాజ్, నరేష్ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్పైన మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
జూన్ 15 , 2024
![EXCLUSIVE: టాలీవుడ్లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/01153846/Untitled-design-2024-04-01T153823.632.jpg)
EXCLUSIVE: టాలీవుడ్లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. టాలీవుడ్లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి ఓసారి చూద్దాం.
అడవి శేషు(Adivi Sesh)
ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు. 'కర్మ' అనే సినిమాతో డెరెక్టర్గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.
విశ్వక్ సేన్(Vishwak Sen)
ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్ప్లే రైటర్గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. మరో నాలుగేళ్ల తర్వాత దాస్ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.
సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)
ప్రస్తుతం టాలీవుడ్లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్గా, స్క్రీన్ప్లే రచయితగా, ఎడిటర్గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు.
రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)
'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్లో ఈ జనరేషన్లో హీరో నుంచి డైరెక్టర్గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
ఆర్ నారాయణ మూర్తి(R. Narayana Murthy)
విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ
లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే డైరెక్టర్గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ఏప్రిల్ 01 , 2024
![Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్’లో ఆ యంగ్ హీరోనే టాప్.. పాజిటివ్ టాక్ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే! ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/01154141/Untitled-design-2024-06-01T154116.058.jpg)
Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్’లో ఆ యంగ్ హీరోనే టాప్.. పాజిటివ్ టాక్ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే!
గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే ఈ వీకెండు మూడు ఆసక్తికర సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కుర్ర హీరోలు విష్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ చిత్రాలతో పోటీపడ్డారు. శుక్రవారం (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాలు పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజు ఏ సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి? ఏ కుర్ర హీరో బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధించాడు? ఈ కథనంలో చూద్దాం.
[toc]
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్గా రూ. 8.2 కోట్లకు గ్రాస్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ను సైతం రిలీజ్ చేసింది. ఫలితంగా విశ్వక్ సేన్ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిలిచింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్.. ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. నైజాంలో తొలిరోజు ఈ మూవీ కోటికిపైనే వసూళ్లను రాబట్టినట్లు తెలిసింది. శని, ఆదివారాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాక్సాఫీస్ వద్ద జోరు చూపించే అవకాశం ఉందని అంటున్నారు.
విశ్వక్ వన్మ్యాన్ షో
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లంక గ్రామాల బ్యాక్డ్రాప్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో లంకల రత్న అనే యువకుడిగా విశ్వక్ సేన్ యాక్టింగ్, అతడి క్యారెక్టరైజేషన్ అభిమానులను ఫిదా చేసింది. నెగెటివ్ షేడ్స్తో కూడిన పాత్రలో విశ్వక్ సేన్ అదరగొట్టాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. మరోవైపు హీరోయిన్ నెహా శెట్టితో అతడి కెమెస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.
కథేంటి
కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్ లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
గం.. గం.. గణేశా
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశా’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ విష్వక్ మూవీతో పోలిస్తే కలెక్షన్ల పరంగా బాగా వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఫస్ట్ డే రూ.80-90 లక్షల వరకు గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.50 లక్షలకుపైగా షేర్ రాబట్టినట్లు పేర్కొంటున్నాయి. ఈ మౌత్ టాక్ పబ్లిసిటీతో శని, ఆదివారాల్లో కలెక్షన్లు బాగా పెరిగే అవకాశముందని అభిప్రాయ పడుతున్నాయి.
కామెడీ ప్రధానం బలం
క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ‘గం గం గణేశా’ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించాడు. కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచింది. గం గం గణేశా మూవీలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్సారిక హీరోయిన్లుగా నటించారు. బేబీ సక్సెస్ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ ఇది. ఇందులో ఆనంద్ దేవరకొండ తన కామెడీ టైమింగ్తో అదరగొట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు. హాస్యనటులు ఇమ్మాన్యుయెల్, వెన్నెల కిషోర్తో కలిసి నవ్వులు పూయించాడని కామెంట్స్ చేస్తున్నారు.
కథేంటి
గణేష్ (ఆనంద్ దేవరకొండ).. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయెల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్తో కలిసి వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్ల మధ్య భీకర షూటౌట్ జరుగుతుంది. అయితే వాటికి గణేష్కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్ గణేష్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్ శ్రీవాస్తవతో అతడి లవ్ట్రాక్ ఏంటి? అన్నది కథ.
భజే వాయు వేగం
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’.. శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే మెుదటి రోజు ఆశించిన స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. తొలి రోజు ఈ చిత్రం రూ.50 లక్షల లోపే గ్రాస్ రాబట్టినట్లు ట్రెడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశముందని చెబుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రలు పోషించారు.
కథేంటి
తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్ విలన్ గ్యాంగ్ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్ ఐశ్వర్య మీనన్తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
జూన్ 01 , 2024
![Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్ ఆరోజు మాత్రమే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/29160953/Untitled-design-2024-03-19T160143.558.jpg)
Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్ ఆరోజు మాత్రమే!
సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్కు రూ. 250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మే 31న మాత్రం.. సినీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. కేవలం రూ.99 టికెట్తో ఎంచక్కా మల్టీప్లెక్సుల్లో ఎంచక్కా సినిమాను చూసేయచ్చు. ఏ షో అయినా, ఏ సినిమా అయిన చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ కల్పిస్తోంది. రిక్లైనర్స్, ప్రీమియం ఫార్మాట్స్ మినహాయించి మిగతా సీట్లకు మాత్రమే ఈ ఛాన్స్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఆఫర్ ఎందుకంటే?
మే 31న సినిమా లవర్స్ డే సందర్భంగా… మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association Of India) సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. ఆ రోజున రూ.99లకే తమ మల్టీప్లెక్స్లలో సినిమా చూసే వెసులుబాటు కల్పిస్తుసందర్భంగా న్నట్లు చెప్పింది. పీవీఆర్ - ఐనాక్స్ సినీ పోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్త ఏ2, మూవీ టైం, మూవీ మ్యాక్స్, వేవ్, ఎం2కే, డిలైట్ సహా అనేక మల్టీప్లెక్సుల్లో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశం మే 31 ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని అసోసియేషన్ స్పష్టం చేసింది.
https://twitter.com/MAofIndia/status/1795374893879710125
ఇలా బుక్ చేసుకోండి!
మే 31 సినిమా చూడాలని భావిస్తున్న వారు టికెట్ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కొనుగోలు చేయవచ్చు. పేటీఎం, అమెజాన్ పే, బుక్మై షో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ.99తో పాటు అదనంగా జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా థియేటర్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకుంటే ఎలాంటి అదనపు రుసుము లేకుండా కేవలం రూ.99కే సినిమాను వీక్షించవచ్చు. మీ వెసులుబాటుకు తగ్గట్లు టికెట్ కొనుగోలు చేసుకోండి.
https://twitter.com/girishjohar/status/1795734272068006128
ఈ సినిమాలు చూడొచ్చు!
ప్రస్తుతం థియేటర్లలో ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’, ‘రాజు యాదవ్’ సహా అనేక సినిమాలు ఉన్నాయి. అలానే ఈ శుక్రవారం పలు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. జాన్వీకపూర్, రాజ్ కుమార్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా మూవీ, కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘భజే వాయు వేగం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే యంగ్ హీరో విష్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ రోజే థియేటర్లలోకి వస్తోంది. కాబట్టి మే 31న కొత్త సినిమాలను రూ.99లకే చూసే అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. లవర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి.
https://twitter.com/tanaymehrotra1/status/1795748420206100853
గతంలోనూ ఇలాగే..
రూ.99లకే మల్టీప్లెక్స్ టికెట్ ఆఫర్ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ 13న 'నేషనల్ సినిమా డే' సందర్భంగా కూడా ఈ ఆఫర్ను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సినీ లవర్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 6.5 మిలియన్స్కుపైగా ఆడియన్స్ మల్టీప్లెక్స్ల్లో సినిమాలు చూశారు. ఈసారి కూడా ఆ స్థాయిలోనే స్పందన ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. ఫ్యామిలీ అంతా తక్కువ ఖర్చుతో కొత్త సినిమా చూడాలనుకుంటే ఈ సదావకాశాన్ని మిస్ చేసుకోవద్దని అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు.
https://twitter.com/AndhraBoxOffice/status/1711404182790680809
మే 29 , 2024
![New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్చల్.. ఓ లుక్కేయండి!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/01/17135051/Untitled-design-2024-01-17T135032.160.jpg)
New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్చల్.. ఓ లుక్కేయండి!
కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఆడియన్స్కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈగల్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ చిత్రం ‘ఈగల్ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు.
రాజా సాబ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అది ట్రెండింగ్గా మారింది. ఈ పోస్టర్లో ప్రభాస్ లుంగీతో కనిపించడం విశేషం.
ఆపరేషన్ వాలెంటైన్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఫీ మేల్ లీడ్ రోల్లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. అమృత్సర్లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.
భీమా
ప్రముఖ హీరో గోపిచంద్ పోలీసు ఆఫీసర్గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ సైతం హల్చల్ చేసింది. ఇందులో గోపిచంద్ ఎద్దుపై కూర్చొని చాలా పవర్ఫుల్గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వెట్టైయాన్
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్'. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ సంక్రాంతి రోజున విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ వింటేజ్ రజనీకాంత్ను గుర్తుకు తెచ్చింది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్టైమ్ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్లో విజయ్తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు.
కెప్టెన్ మిల్లర్
తమిళ హీరో ధనుష్ నటించిన లెటేస్ట్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్ మతేశ్వరణ్ డైరెక్ట్ చేశారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
యంగ్ హీరో సుహాస్, డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.
జనవరి 17 , 2024
![Weekend Collections: లాభాల్లోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘భజే వాయు వేగం’.. ‘గం గం గణేశా’ పరిస్థితి ఏంటంటే?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/03154044/Untitled-design-2024-06-03T153906.810.jpg)
Weekend Collections: లాభాల్లోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘భజే వాయు వేగం’.. ‘గం గం గణేశా’ పరిస్థితి ఏంటంటే?
గత శుక్రవారం (మే 31) విడుదలైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గం గం గణేశా’, ‘భజే వాయు వేగం’ చిత్రాలు.. థియేటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే విష్వక్ నటించిన గ్యాంగ్య్ ఆఫ్ గోదావరి తొలి రోజు రికార్డు ఓపెనింగ్స్ రాబట్టగా.. ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’, కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’ చెప్పుకోతగ్గ స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే మౌత్ టాక్తో శని, ఆదివారాలు మంచి కలెక్షన్స్ను ఆకర్షిస్తాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. మరి ఆ అంచనాలు నిజమయ్యాయా? వీకెండ్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్స్ ఎంత? మిగిలిన రెండు చిత్రాల వసూళ్లు పుంజుకున్నాయా? లేదా? ఈ కథనంలో పరిశీలిద్దాం.
దుమ్మురేపిన విష్వక్
విష్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. శుక్ర, శని, ఆదివారాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. తొలి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.16.2 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్ను సైతం రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాలో లంకల రత్న అనే పాత్రలో విశ్వక్సేన్ యాక్టింగ్, హీరోయిజంతో పాటు అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న విష్వక్ సేన్ క్యారెక్టర్ను దర్శకుడు రాసుకున్న తీరు బాగుందంటూ అభిమానులు చెబుతున్నారు. అటు హీరోయిన్ నేహా శెట్టి.. ఇందులో అంజలి అనే కీలక పాత్రను పోషించింది.
https://twitter.com/vamsikaka/status/1797530286579917125
లాభాల్లోకి వచ్చినట్లేనా?
యంగ్ హీరో విష్వక్ సేన్.. నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. ఆయన గత చిత్రాలు నిర్మాతలకు రూపాయి మిగిల్చిందే గానీ, నష్టాల పాలు చేయలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.10 కోట్లకు మేర ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాతలు ప్రకటించిన గ్రాస్ రూ.16.2 కోట్లుగా ఉంది. ట్యాక్స్లు, థియేటర్ల అద్దెలు మినహాయిస్తే 95 శాతానికి పైగా పెట్టుబడి మెుత్తం వచ్చేసినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. నేటి నుంచి ఈ సినిమా లాభాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు చెబుతున్నారు.
నిరాశ పరిచిన ‘గం గం గణేశా’
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘గం గం గణేశా’ చిత్రం... బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వీకెండ్లో ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదని సమాచారం. ఈ మూవీ తొలి మూడు రోజులు.. వరల్డ్ వైడ్గా రూ.1.94 కోట్ల గ్రాస్ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.68 కోట్లు కలెక్ట్ చేసినట్లు స్పష్టం చేశాయి. కాగా, గం గం గణేశా... బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ.5.50 కోట్లుగా ఉంది. ఈ మార్క్ను అందుకోవాలంటే ఈ వర్కింగ్ డేస్లో ఆడియన్స్ను మరింత అట్రాక్ట్ చేయాల్సి ఉంది.
‘భజే వాయు వేగం’కు బెటర్ రెస్పాన్స్
యంగ్ హీరో కార్తికేయ నటించిన 'భజే వాయు వేగం'.. మే 31న విడుదలై సాలిడ్ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజు రూ. కోటి లోపే కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. శని, ఆదివారాల్లో గణనీయంగా పుంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్ల మేర గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. కాగా, భజే వాయు వేగం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత గ్రాస్ కాకుండా షేర్ను పరిగణలోకి తీసుకుంటే నేటి నుంచి ఈ మూవీ కూడా లాభాల్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
జూన్ 03 , 2024
![EXCLUSIVE : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/24175357/Untitled-design-2024-04-24T175330.623.jpg)
EXCLUSIVE : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).. ఇటీవల ‘గామి’ (Gaami) సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. డిఫరెంట్ స్టోరీ లైన్తో రూపొందిన ఈ చిత్రంలో అఘోరా శంకర్ పాత్రలో అదరగొట్టాడు. మరోవైపు విశ్వక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) రిలీజ్కు సిద్ధమవుతోంది. మెున్నటి వరకూ ఎలాంటి అప్డేట్ లేని ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. వాస్తవానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గతే ఏడాదే రిలీజ్ కావాల్సింది. రిలీజ్ తేదీని ప్రకటించి కూడా పలుమార్లు సినిమాను వాయిదా వేశారు. అందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
పోస్ట్పోన్పై విష్వక్ అసహనం!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్గా చేసింది. మే 17న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండటంతో ఏప్రిల్ 27 సా. 4.01 గం.లకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం 2023 డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సింది. అయితే ‘హాయ్ నాన్న’ (Hi Nanna), ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) వంటి సినిమాలతో పోటీ కారణంగా ఆ సినిమాను నిర్మాతలు వాయిదా వేశారు. ఒకవేళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకున్న సమయానికి రాకపోతే తాను ఆ సినిమాను ప్రమోట్ చేయనని అప్పట్లో విశ్వక్ ప్రకటించడం వివాదస్పదంగా మారింది.
నిర్మాత రియాక్షన్ ఇదే!
‘ఆదికేశవ’ ప్రమోషన్ ఈవెంట్ సందర్భంగా అప్పట్లో నిర్మాత నాగ వంశీ.. విష్వక్ వ్యాఖ్యలపై స్పందించారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 8న విడుదల చేయాలన్నది విష్వక్ మాటల వెనక ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. తమ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సందర్భంలో వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' పోటీకి సిద్ధంగా ఉందని అన్నారు. అనుకోకుండా హాయ్ నాన్న, ఎక్ట్ట్రా ఆర్డినరీ మ్యాన్, సలార్ తెరపైకి వచ్చాయని పేర్కొన్నారు. అంత కాంపింటీషన్కు వెళ్లి సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని అంటానని భావించి విష్వక్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని నాగ వంశీ అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగ్ దశలోనే ఉన్నందున దీనిపై ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఏదోక కారణంతో వాయిదా పడుతూనే వచ్చింది.
https://www.youtube.com/watch?v=hpFNP5gptFU
ఐటెం సాంగ్తో గ్యాప్
ఈ ఏడాది ప్రారంభంలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ అది జరగలేదు. ఐటెం సాంగ్ షూట్లో జరిగిన మార్పు వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమైంది. తొలుత ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఈషా రెబ్బను మూవీ టీమ్ ఎంపిక చేసింది. ఒక రోజు షూటింగ్ కూడా నిర్వహించింది. మళ్లీ ఈషాను కాదని ఆమె స్థానంలో అయేషా ఖాన్ను రంగంలోకి దింపారు. అటు ఇళయరాజా ఇంట విషాధం కూడా ఈ మూవీ వాయిదాకు కారణమైంది. ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. జనవరి 25న అతడి సోదరి చనిపోవడంతో అతను సినిమా పనుల్లో పాల్గొనలేకపోయారు. దీంతో టెక్నికల్ వర్క్ పనులు ఆలస్యం అయ్యాయి.
ఈ సారి విశ్వక్ వల్లే వాయిదా?
దీంతో మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ శివరాత్రికి ‘గామి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు విశ్వక్ అనౌన్స్ చేశారు. దీంతో వెనక్కి తగ్గిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యూనిట్ ఎప్పటిలాగే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మే 17న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలని సంకల్పంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్స్పైనా టీమ్ ఫోకస్ పెట్టింది. నెల రోజుల క్రితం అయేషా ఖాన్ నటించిన ‘మోతా’ అనే ఐటెం సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. లేటెస్ట్గా టీజర్ అప్డేట్ను ఇచ్చింది. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది.
ఏప్రిల్ 24 , 2024
![Neha Shetty: టాలీవుడ్లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/04/13175524/123.-85.jpg)
Neha Shetty: టాలీవుడ్లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!
యంగ్ బ్యూటీ నేహా శెట్టి.. టాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. కుర్ర హీరోలకు ప్రధాన ఆప్షన్గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రంలో.. నేహా హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 17న రిలీజ్ కానుంది.
ఇటీవల వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) చిత్రంలోనూ ఈ బ్యూటీ మెరిసింది. తనకు పాపులారిటీ తీసుకొచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu)లోని రాధిక పాత్రలో మరోమారు తెరపై సందడి చేసింది.
నేహా శెట్టి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే.. ఈ భామ కర్ణాటకలోని మంగళూరులో డిసెంబర్ 6, 1999లో జన్మించింది.
సినిమాల్లోకి రాకముందు మోడల్గా కెరీర్ను ప్రారంభించిన నేహా.. మిస్ మంగళూరు-2014 టైటిల్ను గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2016లో వచ్చిన 'ముంగరు మలే 2' (Mungaru Male 2) అనే కన్నడ చిత్రంతో నేహా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో నందిని పాత్ర పోషించి ఆకట్టుకుంది.
పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘మెహాబూబా’ (Mehbooba) ద్వారా నేహా శెట్టి.. తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఇందులో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా చేశాడు.
ఆ తర్వాత 'గల్లీ రౌడీ' (Gully Rowdy), ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) చిత్రాలు చేసింది. ఆ రెండూ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు.
2022లో వచ్చిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాతో నేహా శెట్టి రాత్రికి రాత్రి విపరీతమైన పాపులారిటీ సంపాదించింది.
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తో నేహా చేసినా రొమాన్స్ యూత్కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఆమె చేసిన రాధిక పాత్ర యూత్లో చెరగని ముద్ర వేసింది.
ఆ తర్వాత చేసిన 'బెదురులంక 2012' (Bedurulanka 2012) చిత్రం హిట్ టాక్ తెచ్చుకోగా.. అనంతరం చేసిన 'రూల్స్ రంజన్' మాత్రం ఈ భామ ఆశలను అడియాశలు చేసింది.
ప్రస్తుతం నేహా శెట్టి ఆశలన్నీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్లో తనకు తిరుగుండదని ఈ అమ్మడు భావిస్తోంది.
యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నేహా.. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను తన మాయలో పడేస్తోంది. నేహా పోస్టు చేసిన ప్రతీ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం నేహా ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
ఏప్రిల్ 13 , 2024
![Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/06171813/Untitled-design-2024-06-06T171747.653.jpg)
Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
సాధారణంగా ప్రతీ మే నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో కీలకమైనది. సమ్మర్లో భాగంగా ఏటా స్టార్ హీరోల చిత్రాలు ప్రధానంగా ఈ నెలలోనే విడుదలవుతుంటాయి. తద్వారా బాక్సాఫీస్ను షేక్ చేసి రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే ఈ వేసవి కాలంలో చిన్న చిత్రాలే పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేశాయి. టాలీవుడ్కు చెందిన ప్రముఖ కుర్ర హీరోల సినిమాలు.. మే నెలలో విడుదలై ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావం ఎలా ఉంది? నిర్మాతలు లాభపడ్డారా? నష్టపోయారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
[toc]
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ తాజా మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. మే 31న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కాగా.. ఇప్పటిరవరకూ వరల్డ్ వైడ్గా రూ.18 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ.9.85 కోట్ల షేర్ రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11 కోట్లుగా ఉంది. అంటే షేర్ పరంగా చూస్తే ఈ మూవీ ఇంకా 1.15 కోట్లు వెనకబడి ఉంది.
మూవీ ప్లాట్ ఏంటంటే..
కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్ లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
భజే వాయు వేగం
యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా మే 31న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.7.1 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ. 4.5 కోట్లుగా ఉంది. తొలి ఆరు రోజుల లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ. 3.5 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
మూవీ కథ ఏంటంటే..
తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్ విలన్ గ్యాంగ్ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్ ఐశ్వర్య మీనన్తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
గం గం గణేశా
స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ఈ చిత్రం.. కామెడీ ఎంటర్టైనర్గా మే 31న ఆడియన్స్ ముందుకు వచ్చింది. గత ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ. 5.25 కోట్ల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల మేర వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు రూ.2.41 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.19 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశాయి. ‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
స్టోరీ ఏంటంటే..
గణేష్ (ఆనంద్ దేవరకొండ).. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయెల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్తో కలిసి వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్ల మధ్య భీకర షూటౌట్ జరుగుతుంది. అయితే వాటికి గణేష్కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్ గణేష్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్ శ్రీవాస్తవతో అతడి లవ్ట్రాక్ ఏంటి? అన్నది కథ.
లవ్ మీ
యంగ్ హీరో ఆశిష్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం 'లవ్ మీ'. మే 25న రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం ఓవరాల్గా రూ.6.30 కోట్ల గ్రాస్.. రూ.2.75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అందుకోలేక నిర్మాతలను లాస్లోకి నెట్టింది.
కథ ఏంటంటే..
‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్మెంట్కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ.
ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ చిత్రంగా నిలిచిన ఫ్యూరియోసా.. కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దాదాపు రూ.1,410 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్గా రూ.950 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశంలో రూ.15 కోట్ల రేంజ్లో గ్రాస్ సాధించింది.
కథ ఏంటంటే..
‘ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్.. సిటాడెల్ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ.
కృష్ణమ్మ
సత్యదేవ్ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' చిత్రం మేలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆపై వారానికే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఆరో రోజుల్లో వరల్డ్ వైడ్గారు రూ.3.9 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.3.50 కాగా, షేర్ అంతకంటే తక్కువే రావడంతో నిర్మాతలు నష్టాలను చవిచూశారు.
కథ ఏంటంటే..
‘భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో ఎలా రివేంజ్ తీర్చుకుంటాడు? అన్నది కథ.
ఆ ఒక్కటి అడక్కు
అల్లరి నరేష్ రీసెంట్ రీసెంట్ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'.. గత నెల మేలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.5 కోట్లుగా ఉంది.
కథ ఏంటంటే..
‘గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది కథ.
ప్రసన్న వదనం
సుహాస్ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ చిత్రం.. మే మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా తొలి 7 రోజుల్లో రూ.3.65 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లోనూ మంచి వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లను అందుకున్నట్లు ఫిల్మ్ వర్గాలు తెలిపాయి.
కథ ఏంటంటే..
రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్ బ్లైండ్నెస్ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్యని ఇరికించింది ఎవరు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది ప్లాట్.
జూన్ 06 , 2024
![<strong>Laila Movie : అమ్మాయి గెటప్లో విశ్వక్ సేన్.. హీరోయిన్స్ను తలదన్నేలా మేకోవర్! </strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/03141909/123.-2024-07-03T141845.399.jpg)
Laila Movie : అమ్మాయి గెటప్లో విశ్వక్ సేన్.. హీరోయిన్స్ను తలదన్నేలా మేకోవర్!
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).. విభిన్న తరహా చిత్రాలకు కేరాఫ్గా మారిపోయాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విశ్వక్.. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్తో రాబోతున్నాడో అని ఆడియన్స్లో ఆసక్తి ఏర్పడింది. అయితే తాజాగా ఈ యంగ్ హీరో.. తన కొత్త సినిమాను మెుదలు పెట్టారు. ఈ మూవీలో విశ్వక్ పాత్రకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కాగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటివరకూ చేయని గెటప్లో విశ్వక్ ఈ పోస్టర్లో కనిపించాడు.
‘లైలా’గా విశ్వక్ సేన్..
ప్రస్తుతం విష్వక్ సేన్.. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. షైన్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ మూవీకి 'లైలా' (Laila Movie) అనే టైటిల్ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం జరగ్గా.. ఫస్ట్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో విశ్వక్ లేడీ గెటప్లో కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే క్లోజ్గా ఫేస్లో కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ను రిలీజ్ చేసారు. కెరీర్లో తొలిసారి ఓ లేడీ గెటప్లో విశ్వక్ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. అమ్మాయిగా విశ్వక్ సేన్ భలే క్యూట్గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్లను తలదన్నే అందంతో కనిపించి సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాడని పోస్టులు పెడుతున్నారు. తమ హీరో డేరింగ్ డెసిషన్కు సెల్యూట్ అంటూ పోస్టర్ను వైరల్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా తప్పక విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
https://twitter.com/pudiharicharan/status/1808373415163973920
రిలీజ్ ఎప్పుడంటే..!
తాజాగా పూజా కార్యక్రమం జరుపుకున్న 'లైలా' చిత్రం.. త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విశ్వక్కు జోడీగా ఆకాంక్ష శర్మ (Akanksha Sharma)నటించనుంది. ఈ మూవీని వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న (Laila Movie Release Date Announced) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన ప్రధాన తారాగణాన్ని కూడా ఫైనల్ చేసి.. షూటింగ్ మెుదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు మెుదలు పెట్టింది. ఈ మూవీ విశ్వక్ కెరీర్లోనే మరుపురాని చిత్రంగా మిగిలిపోతుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
https://twitter.com/AndhraBoxOffice/status/1808389179472060518
‘రెమో’ తరహాలో మేకోవర్!
విశ్వక్ సేన్ లేటెస్ట్ ‘లైలా’ పోస్టర్.. తమిళ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన 'రెమో' (Remo) చిత్రాన్ని గుర్తు చేస్తోంది. బక్కియారాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా చేసింది. ఇందులో కూడా హీరో శివకార్తికేయన్.. అందమైన అమ్మాయి గెటప్లో కనిపిస్తాడు. హీరోయిన్ను ఇంప్రెస్ చేసే క్రమంలో సినిమా మెుత్తం ఆ పాత్రలోనే అలరిస్తాడు. అయితే విశ్వక్ సేన్ కూడా లైలాలో ఎక్కువ నిడివి లేడీ గెటప్లోనే కనిపించే అవకాశముందని అంటున్నారు. లైలా పోస్టర్లోని అతడి మేకోవర్ చూస్తే.. ఏదో ఒక సీన్ కోసం చేసినట్లు కనిపించడం లేదు. అచ్చమైన అమ్మాయిలాగా కనిపించేలా అతడి మేకోవర్ను డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
‘మెకానిక్ రాకీ’గా విశ్వక్..
ప్రస్తుతం విశ్వక్ సేన్.. 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky) అనే ప్రాజెక్ట్లో నటిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్ పాత్ర.. చాలా పవర్ఫుల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్లో రానున్న చిత్రంలో.. విశ్వక్కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) కనిపించనుంది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా విశ్వక్ సేన్ కేరీర్లో 10వ మూవీగా రానుంది. ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
జూలై 03 , 2024
![Gangs Of Godavari Review: విష్వక్ సేన్- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/31111414/Movie-Review-40.jpg)
Gangs Of Godavari Review: విష్వక్ సేన్- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు
దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీతం: యువన్ శంకర్
సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ : 31-05-2024
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో విష్వక్ సేన్.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్ క్యారెక్టర్లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో మాస్ జాతరే అన్నట్లు విష్వక్ నటన ఉంటుంది. ఇక హీరోయిన్ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచ్లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్గా తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ స్లోగా నడవడం, రొటీన్ సన్నివేశాలు, రెగ్యులర్ స్టోరీ మూవీకి కాస్త మైనస్గా చెప్పవచ్చు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్ను ఎలివేట్ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
విష్వక్ సేన్ నటన
డైలాగ్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
రెగ్యులర్ స్టోరీ
స్లో నారేషన్
Telugu.yousay.tv Rating : 3/5
Public Talk On Gangs of Godavari
సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయని, స్క్రీన్ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/raghav917252/status/1796382241532334575
చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్స్ చూస్తున్నట్లు మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్ అంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/PulakithSai/status/1796399917969412273
ఫస్టాఫ్ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్ కొట్టదని స్పష్టం చేశాడు.
https://twitter.com/PinkCancerian/status/1796336006402355622
పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్ వెర్షన్లా గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఉందని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు బాలేదని పేర్కొన్నాడు. రన్టైమ్ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు.
https://twitter.com/Kamal_Tweetz/status/1796330322730373525
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-neha-shetty.html
మే 31 , 2024
![This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/05/27143156/Untitled-design-2024-05-27T143145.963.jpg)
This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!
టాలీవుడ్లో గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ సమ్మర్లో స్టార్ హీరోల చిత్రాలు లేకపోవడంతో యంగ్ హీరోలు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మే చివరి వారంలో పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్సిరీస్లు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం మే 31న విడుదలవుతోంది. ఓ సామాన్యుడిగా చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టి అసామాన్యుడిగా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్తో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
భజే వాయు వేగం
యంగ్ హీరో కార్తికేయ.. ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) చిత్రంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సామాన్య వ్యక్తి అసాధారణ సమస్యలో ఇరుక్కుని తిరిగి అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అన్న కాన్సెప్ట్తో ఈ మూవీ రానున్నట్లు చెప్పింది.
గం.. గం.. గణేశా
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం.. ‘గం.. గం.. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ శెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. రిష్మా, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూత్ను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ మే 31న విడుదల కానుంది.
మిస్టర్ అండ్ మిస్సెస్ మహి
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించిన లేటెస్ట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా ‘మిస్టర్ అండ్ మిస్సెస్ మహి’ (Mr. & Mrs. Mahi). శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ క్రికెటర్గా కనిపించనుంది.
హిట్ లిస్ట్
తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘హిట్ లిస్ట్’ (Hit List). యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రానికి సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వ వహించారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్ సిరీస్లు
ఆ ఒక్కటి అడక్కు
కామెడీ స్టార్ అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు' (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా చేసింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ వీకెండ్లో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ఈ సినిమాను మే 31 నుంచి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
TitleCategoryLanguagePlatformRelease DateErikSeriesEnglishNetflixMay 30Geek GirlSeriesEnglishNetflixMay 30Panchayat S3SeriesHindiAmazon primeMay 28Aa Okkati AdakkuMovieTeluguAmazon primeMay 31Swatantra Veer SavarkarMovieHindiZee 5May 28ComdenSeriesEnglishDisney + HotstarMay 28The First AmenMovieEnglishDisney + HotstarMay 30Uppu Puli KaramMovieTamilDisney + HotstarMay 30Illegal S3SeriesHindiJio CinemaMay 29Dedh Bigha ZameenMovieHindiJio CinemaMay 31The Last Refill ManMovieEnglishJio CinemaMay 31
మే 27 , 2024
![New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్లు ఇవే!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/06/10143114/Untitled-design-2024-06-10T143059.826.jpg)
New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్లు ఇవే!
ప్రతీ శుక్రవారం టాలీవుడ్లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ వారం కూడా అదే రిపీట్ కానుంది. ఈ వీకెండ్ కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్న చిత్రాలు, తమిళ డబ్బింగ్ మూవీస్ రాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్లు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
హరోం హర
సుధీర్బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, రవి కాలే, కేశవ్ దీపక్, రాజశేఖర్ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 1989 నేపథ్యంలో జరిగే కథ ఇదని, అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రెజెంట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
రాయణ్
తమిళ స్టార్ హీరో ధనుష్ (New OTT Releases Telugu) నటించిన లేటెస్ట్ చిత్ర 'రాయణ్' (Raayan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్గా చేసింది. సందీప్ కిషన్, ఎస్.జే. సూర్య, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్, కాళిదాస్ జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
ఇంద్రాణి
యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంద్రాణి' (Indrani). ఈ చిత్రం స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందింది. జూన్ 14న ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్ కాబోతోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వందేళ్ల తర్వాత టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులేంటి? అన్నది ఇందులో చూడవచ్చని చెప్పింది.
మ్యూజిక్ షాప్ మూర్తి
టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్గా నిర్మించారు. జూన్ 14న (New OTT Releases Telugu) గ్రాండ్ ఈ సినిమా విడుదల కానుంది. 'ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు' అనే కాన్సెప్ట్తో ఈ మూవీ రూపొందింది.
మహారాజా (తెలుగు డబ్)
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన 'మహా రాజా' (Maha Raja).. ఈ వారమే విడుదల కానుంది. నిథిలాన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, మునీశ్ కాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చారు. జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ (OTT Releases This Week Telugu) పోస్టర్ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పారిజాత పర్వం
చైతన్య రావు, శ్రద్ధా దాస్ నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam) ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజై.. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని రెండు నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. జూన్ 12 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు 'ఆహా' (OTT Releases This Week Telugu) అధికారికంగా ప్రకటించింది. కంభంపాటి సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్, హర్ష కీలక పాత్రలు చేశారు.
TitleCategoryLanguagePlatformRelease DateTour Day France Unchained S2SeriesEnglishNetflixJune 11My Next Guest S2SeriesEnglishNetflixJune 12Mysteries Of The Terracotta WarriorsMovieEnglishNetflixJune 12Doctor ClimaxSeriesEnglishNetflixJune 13Gangs Of GodavariMovieTeluguNetflixJune 14Maha RajMovieHindiNetflixJune 14Protecting ParadiseMovieEnglishDisney + HotstarJune 10The Colour Of VictorySeriesEnglishDisney + HotstarJune 10Not Dead At S2SeriesEnglishDisney + HotstarJune 12Gaanth Chapter 1SeriesHindiJio CinemaJune 11GroundMovieTeluguAmazonJune 10The Boys Season 4SeriesTeluguAmazonJune 13Paarijatha ParvamMovieTeluguAhaJune 12Kurangu PedalSeriesTamilAhaJune 14Love Ki Arrange MarriageMovieHindiZee 5June 14ParuvuSeriesTeluguZee 5June 14
జూన్ 10 , 2024
![Ayesha Khan: ‘ఓం భీమ్ బుష్’ భామ అయేషా ఖాన్ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/23195209/page-10.jpg)
Ayesha Khan: ‘ఓం భీమ్ బుష్’ భామ అయేషా ఖాన్ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
యంగ్ బ్యూటీ అయేషా ఖాన్.. తాజాగా విడుదలైన 'ఓం భీమ్ బుష్' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హాస్యనటుడు ప్రియదర్శికి జోడీగా నటించి తన గ్లామర్తో తెలుగు ఆడియన్స్ను కట్టిపడేసింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ భామ తన అందచందాలను ఆరబోస్తుండటంతో టాలీవుడ్కు మరో గ్లామర్ హీరోయిన్ దొరికేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయేషా ఖాన్ (Ayesha Khan) పేరును నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అయేషాఖాన్ ఎవరు? ఆమె చేసిన చిత్రాలు ఎన్ని? అయేషా ఇష్టా ఇష్టాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అయేషా ఖాన్ ఎవరు?
టాలీవుడ్కు చెందిన యువ నటి. హీరోయిన్గా ఇప్పుడిప్పుడే ఆమె ఎదుగుతోంది.
అయేషా ఖాన్ ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్రలోని ముంబయిలో అయేషా పుట్టింది.
అయేషా ఖాన్ పుట్టిన తేదీ?
13 సెప్టెంబర్, 1992
అయేషా ఖాన్ తల్లిదండ్రులు ఎవరు?
అయేషా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు షాదబ్ ఖాన్ & Mrs ఖాన్
అయేషా ఖాన్కు సోదరులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న షాదబ్ ఖాన్ ఓ ప్రైవేటు కంపెనీ పని చేస్తున్నాడు. తమ్ముడు షాబజ్ ఖాన్ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అయేషా ఖాన్ ఎత్తు ఎంత?
162 సెం.మీ
అయేషా ఖాన్ ఏం చదివారు?
ఈ భామ ఇంటర్ వరకూ చదువుకుంది.
అయేషా ఖాన్ ఎక్కడ చదివారు?
ఈ బ్యూటీ విద్యాభ్యాసం అంతా ముంబయిలోనే జరిగింది.
అయేషా ఖాన్ కెరీర్ ఎలా మెుదలైంది?
కెరీర్ ప్రారంభంలో అయేషా మోడల్గా చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గానూ ఆమెకు గుర్తింపు ఉంది.
అయేషా ఖాన్ కెరీర్ను మలుపు తిప్పిన ఘటన?
హిందీలో 'బిగ్ బాస్ 17' సీజన్లో పాల్గొనడం అయేషా ఖాన్ కెరీర్ను మలుపు తిప్పింది. ఈ రియాలిటీ షో ద్వారా అయేషా అందరి దృష్టిలో పడింది.
అయేషా ఖాన్ నటనా ప్రవేశం ఎలా జరిగింది?
హిందీలో స్టార్ప్లస్ ఛానెల్లో వచ్చిన 'కసౌతి జిందగీ కే' సీరియల్తో అయేషా ఖాన్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో 'బల్వీర్ రిటర్న్స్' అనే సీరియల్లోనూ కనిపించింది.
అయేషా ఖాన్ తొలి చిత్రం?
తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది.
అయేషా ఖాన్ లేటెస్ట్ చిత్రం?
అయేషా నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ఇది ఆమెకు రెండో సినిమా. ఇందులో రత్తాలు పాత్రలో అయేషా గ్లామర్ షో చేసింది.
అయేషా ఖాన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం అయేషా.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.
అయేషా ఖాన్ ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్ అంటే ఈ భామకు చాలా ఇష్టం. చికెన్, మటన్, ఫిష్ ఇలా ఏదైనా ఇష్టంగా తింటుందట.
అయేషా ఖాన్ ఫేవరేట్ నటుడు?
ఈ భామకు అక్షయ్ కుమార్ నటన అంటే చాలా ఇష్టమట.
అయేషా ఖాన్ ఫేవరేట్ హీరోయిన్?
ప్రియాంక చోప్రా తన ఫేవరేట్ అని అయేషా ఓ సందర్భంలో తెలిపింది.
అయేషా ఖాన్ ఇష్టమైన కలర్?
నలుపు, తెలుపు
అయేషా ఖాన్ ఫేవరేట్ రియాలిటీ షో?
బిగ్బాస్
అయేషా ఖాన్కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?
మునావర్ ఫారుఖీతో ఆమె రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. దీనిపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయేషా ఖాన్ ఇన్స్టాగ్రామ్ ఐడీ?
https://www.instagram.com/ayeshaakhan_official/?hl=en
మార్చి 23 , 2024
![New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/09143338/Untitled-design-2024-03-09T143321.975.jpg)
New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్ పేరును పోస్టర్ ద్వారా మూవీ టీమ్ తెలియజేసింది. ప్రభాస్ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
కన్నప్ప (Kannappa)
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
NBK109
నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్తో రూపొందించిన గ్లింప్స్లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్లో చాలా స్టైలిష్ లుక్లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉంటుందని తెలుస్తోంది.
https://twitter.com/i/status/1766375268804120887
ఓదెల 2 (Odela 2)
తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది.
షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai)
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.
‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)
తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)
హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu)
సుహాస్ హీరోగా ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్ విడుదలైంది. సుహాస్, కార్తిక్ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కానుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari)
విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా మేకర్స్ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్ను రిలీజ్ చేశారు.
సత్యభామ (Sathyabhama)
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సత్యభామ’. అఖిల్ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
మార్చి 09 , 2024
![Telugu Heroines: టాలీవుడ్లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్ డేస్ తిరిగి వచ్చినట్లేనా? ](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/06132243/Untitled-design-2024-03-06T132213.859.jpg)
Telugu Heroines: టాలీవుడ్లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్ డేస్ తిరిగి వచ్చినట్లేనా?
ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
గౌరి ప్రియ (Gouri Priya)
టాలీవుడ్లో ఇటీవల వచ్చి యూత్ఫుల్ ఎంటర్టైనర్లో ‘మ్యాడ్’ (MAD) చిత్రంలో హీరోయిన్గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్ను కట్టిపడేసింది. రీసెంట్గా తమిళ హీరో మణికందన్ పక్కన ‘లవర్’ సినిమాలో నటించి కోలీవుడ్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
https://www.youtube.com/watch?v=8dwrE0OCq40
ఆనందిని (Anandhi)
వరంగల్కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్ను తమిళ మూవీస్పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్ హీరోల సరసన హీరోయిన్గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్ హీరోగా చేసింది.
చాందిని చౌదరి (Chandini Chowdary)
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. 'కలర్ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్గా 'గామి' (Gaami)లో విష్వక్ సేన్ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్సిరీస్లు సైతం చేసింది.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ (Software Developer) సిరీస్తో ఒక్కసారిగా యూత్లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.
https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI
దివ్య శ్రీపాద (Divya Sripada)
టాలీవుడ్లో తమ క్రేజ్ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్గా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్ కామ్రేడ్’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala)
ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్, మేజర్, పొన్నిసెల్వన్ వంటి హిట్ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్ చిత్రం 'మంకీ మ్యాన్'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
రితు వర్మ (Ritu Varma)
హైదరాబాద్కు చెందిన ఈ సుందరి.. 'బాద్ షా' (Badshah) సినిమాలో కాజల్ ఫ్రెండ్ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్గా ‘మార్క్ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్గా చేసి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.
https://www.youtube.com/watch?v=4hNEsshEeN8
స్వాతి రెడ్డి (Swathi Reddy)
వైజాగ్కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్లో వరుసగా అష్టాచమ్మా, గోల్కొండ స్కూల్, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్గా 'మంత్ ఆఫ్ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.
https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE
డింపుల్ హయాతి (Dimple Hayathi)
ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్ హయాతి.. హైదరాబాద్లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606
శివాని నగరం (Shivani Nagaram)
ఇటీవల టాలీవుడ్లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి.
మానస చౌదరి (Maanasa Choudhary)
ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్గా ‘బబుల్గమ్’ సినిమాతో టాలీవుడ్లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.
https://twitter.com/i/status/1762802318934950146
అంజలి (Anjali)
తూర్పు గోదావరి జిల్లా రాజోల్లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్, సరైనోడు, వకీల్సాబ్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్లోనూ నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
మార్చి 06 , 2024
![<strong>Raayan Movie Review: ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ మెప్పించిందా?</strong>](http://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/07/26130940/Movie-Review-59.jpg)
Raayan Movie Review: ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ మెప్పించిందా?
నటీనటులు : ధనుష్, సందీప్ కిషన్, ఎస్.జే. సూర్య, జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్కుమార్ తదితరులు
కథ & దర్శకత్వం : ధనుష్
సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాష్
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
ఎడిటింగ్ : ప్రసన్న జి.కె
నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్
విడుదల తేదీ : 26 జులై, 2024
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన లేటెస్ట్ చిత్రం 'రాయన్' (Raayan Movie Telugu Review). ధనుష్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) కీలక పాత్ర పోషించాడు. ప్రకాష్ రాజ్(Prakash Raj), ఎస్. జే. సూర్య (S.J. Surya), జయరామ్ (Jayaram), వరలక్ష్మీ (Varalaxmi) ఇతర ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ధనుష్కు మరో విజయాన్ని అందించిందా? ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ సక్సెస్ అయ్యిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
రాయన్ (ధనుష్) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యం(కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషారా విజయన్) దుర్గతో కలిసి జీవిస్తుంటాడు. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే ముత్తువేల్ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(ఎస్.జే. సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో రాయన్ను సీతారం టార్గెట్ చేస్తాడు. దొరైని ఎవరు చంపారు? రాయన్ను సీతారాం ఎందుకు టార్గెట్ చేశాడు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
గ్లోబల్ స్టార్ ధనుష్ ఎప్పటిలాగే ఈ సినిమాలో చక్కటి నటన కనబరిచాడు. రాయన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. యాక్షన్ సీక్వెన్స్లో విశ్వరూపం చూపించాడు. అటు ఎమోషనల్ సీన్స్లోనూ తన మార్క్ చూపించాడు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్కు ఈ సినిమాలో మంచి పాత్రే దక్కింది. రాయన్ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న పాత్ర అతడిది. సందీప్ ఇప్పటివరకూ చేసిన వాటిలో ఈ పాత్ర గుర్తుండిపోతుంది. అటు ఎస్.జే సూర్య, ప్రకాష్ రాజ్ తమ అద్భుత నటనతో తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సెల్వరాఘవన్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్కుమార్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తన కెరీర్లో 50వ చిత్రంగా వచ్చిన రాయన్కు ధనుష్ దర్శకత్వం వహించారు. స్టోరీ పరంగా చూస్తే ఓ సాధారణ రీవేంజ్ డ్రామాగా అనిపించినప్పటికీ ధనుష్ తనదైన డైరెక్షన్, స్క్రీన్ప్లేతో ఆకట్టుకున్నాడు. ముగ్గురు డైమన్షన్స్లో కథ నడిపి మెప్పించాడు. పోరాట ఘట్టాలు, ఎమోషనల్ సీన్స్ను అద్భుతంగా తెరకెక్కించాడు. తద్వారా ప్రేక్షకులను కథలో లీనమయ్యేట్టు చేశారు. అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్తో సెకండాఫ్పై ఆసక్తిని పెంచాడు. ఇక సెకండాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్, క్లైమాక్స్ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే రొటిన్ స్టోరీ కావడం, తర్వాత జరగబోయేది ముందే ఊహించగలడం, తమిళ నేటివిటికి దగ్గరగా ఉండటం, అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ సినిమాకు మైనస్గా మారాయి.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు అతిపెద్ద అసెట్గా మారింది. యాక్షన్ సీక్వెన్స్ను చాలా బాగా ఎలివేట్ చేసింది. అయితే పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. బోరింగ్ సన్నివేశాలను కాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమాకు మరింత వెయిటేజీ వచ్చేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
ధనుష్, సందీప్ కిషన్ నటనయాక్షన్ సీక్వెన్స్నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీఅక్కడక్కడ బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 3/5
‘రాయన్’ సినిమాపై పబ్లిక్ టాక్
'రాయన్' చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ మంది ఈ సినిమాపై పాజిటివ్గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ధనుష్ నటన, నేపథ్య సంగీతాన్ని హైలెట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు ఏవో చూద్దాం.
రాయన్ ఫస్టాఫ్, సెకండాఫ్, ధనుష్ ఎంట్రీ, ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంగ్, సందీప్ కిషన్ నటన అదిపోయాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమాకు ఏకంగా 4.6/5 రేటింగ్ ఇచ్చాడు.
https://twitter.com/review0813/status/1816622242421522704
రాయన్ మూవీ రా అండ్ రస్టిక్గా ఉందని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ధనుష్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయని పేర్కొన్నాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ను ధనుష్ తన వర్కింగ్ స్టైల్తో గుర్తు చేశారని ప్రశంసించారు. ఎస్.జే సూర్య నటన, ఏ.ఆర్. రెహమాన్ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచాయని రాసుకొచ్చాడు.
https://twitter.com/LetsXOtt/status/1816651224956981478
రాయన్ ఒక సాధారణ రివేంజ్ డ్రామా అయినప్పటికీ ధనుష్ టేకింగ్ చాలా కొత్తదనాన్ని ఇచ్చిందని ఇంకో నెటిజన్ పోస్టు పెట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ మూవీకి సెకండ్ హీరో అంటూ రాసుకొచ్చాడు.
https://twitter.com/CinemaWithAB/status/1816657822026764609
రాయన్ సినిమా అద్భుతంగా ఉందంటూ ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. 'ఆల్రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని ధనుష్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. ఈ మూవీలో సందీప్ కిషన్ మేజర్ రోల్ పోషించాడని ఎక్కడా ల్యాగ్స్, బోరింగ్ సీన్స్ లేవని రాసుకొచ్చారు.
https://twitter.com/PikuOffl/status/1816649186571698503
జూలై 26 , 2024