• TFIDB EN
  • జులాయి
    UATelugu2h 32m
    రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన కుర్రాడు. కష్టపడకుండా ఓవర్ నైట్‌లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అయితే బిట్టు(సోనూ సూద్)అనే తెలివైన దొంగ చేసిన రూ.1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్‌ మారి క్రిమినల్స్‌కి మోస్ట్ వాంటెడ్‌గా మారతాడు. రవీందర్‌కు మధు(ఇలియానా)తో ఎలా పరిచయం ఏర్పడింది? క్రిమినల్స్‌ను అతడు ఎదుర్కొన్నాడు? అనేది అసలు కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అల్లు అర్జున్
    రవీంద్ర రవి నారాయణ్
    Ravi love interest
    సోనూ సూద్
    బిట్టు
    రాజేంద్ర ప్రసాద్
    DIG సీతారాం IPS (రవి స్నేహితుడు మరియు గురువు)
    కోట శ్రీనివాసరావు
    ఎమ్మెల్యే వరదరాజులు
    తనికెళ్ల భరణి
    రవి తండ్రి
    బ్రహ్మానందం
    వీరిలో సీతారాం సేవకుడిని ఉంచుకున్నారు
    అలీ
    అతిధి పాత్ర
    రావు రమేష్
    ACP రాజ మాణిక్యం IPS
    బ్రహ్మాజీ
    ట్రావెల్ మూర్తి (ట్రావెల్ ఏజెంట్)
    షఫీ
    బిట్టు తమ్ముడు
    ఎంఎస్ నారాయణ
    సబ్-ఇన్‌స్పెక్టర్ వాల్మీకి
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    మధు తండ్రి
    శీతల్ మీనన్
    బిట్టు ప్రేమ ఆసక్తి
    తులసి
    కామేశ్వరి
    హేమ
    సుజాత
    శ్రీముఖి
    రవి సోదరి
    రవి ప్రకాష్
    బిట్టు అనుచరుడు
    ప్రదీప్ మాచిరాజు
    రవి స్నేహితుడు fm స్టూడియోలో పనిచేస్తున్నాడు
    సప్తగిరి
    రవి స్నేహితుడు
    అమిత్ తివారీ
    బిట్టు అనుచరుడు
    వంశీ కృష్ణ
    బిట్టు అనుచరుడు
    పోసాని కృష్ణ మురళి
    క్లబ్ ఓనర్
    గౌతమ్ రాజు
    పోలీస్ కానిస్టేబుల్
    శివన్నారాయణ నారిపెద్ది
    టీ అమ్మేవాడు
    కల్పికా గణేష్
    నేహా
    శ్రవణ్సత్తారు
    ప్రభుప్రభు
    వెన్నెల కిషోర్
    కేఫ్‌లో కస్టమర్
    రఘు బాబు
    కస్టమర్
    అనంత్ బాబు
    పూజారి
    ధనరాజ్
    ఆసుపత్రిలో రోగి
    రజిత
    రవి పొరుగు
    సన్నీదొంగ
    వెంకట గిరిధర్ వజ్జ
    ఉదయ భాను
    రాజు సుందరం
    ప్రకాష్ రాజ్
    సిబ్బంది
    త్రివిక్రమ్ శ్రీనివాస్
    దర్శకుడు
    ఎస్. రాధా కృష్ణ
    నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    ప్రవీణ్ పూడి
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి
    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి
    టెలివిజన్ షోలకు అందాలను అద్దిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అనసూయ, వర్షిణి, రష్మీ గౌతమ్ రీతిలో శ్రీముఖి అందచందాలకు బుల్లితెర మార్కెట్‌లో తెగ డిమాండ్ ఉంది. టెలివిజన్ షోల్లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ స్టైల్, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పటాస్ షో ద్వారా అభిమానుల్లో పటాస్ రాములమ్మగా మారిపోయింది. ఏ హీరోయిన్‌కు తగ్గని విధంగా శ్రీముఖి క్రేజ్ సోషల్ మీడియాలో ఉంది. ఇన్‌స్టాలో ఈ అందాల భామ ఫాలోవర్ల సంఖ్య 4.7 మిలియన్ల్‌కు మించి ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రీముఖి అందాల జాతర చేస్తోంది. ఒక్క పక్క టెలివిజన్ షోలు చేస్తూనే ఇన్‌స్టాలో హాట్ షో చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. కొద్దిరోజులుగా శ్రీముఖి ఇన్‌స్టాలో హట్ షో చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులకు గురిచేస్తోంది. తాజాగా మిల్కీ వైట్, లైట్ పింక్ లెహంగాలో ఈ శ్రీముఖి తళుక్కున మెరిసింది. ఎప్పటికప్పుడూ హాట్ ఫొటో షూట్లతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతోంది. తన ప్రతి గ్లామరస్ పిక్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తోంది. బిగ్ బాస్ 3 రన్నరప్‌ తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగింది. అప్పట్లో జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత నేను శైలజ సినిమాలో రామ్ పొత్తినేని సిస్టర్ క్యారెక్టర్ చేసింది.  తాజాగా గాడ్‌ఫాదర్ సినిమాలోనూ శ్రీముఖి మెరిసింది. సినిమాల్లో సరైన బ్రేక్ కోసం ఈ అల్లరి పిల్ల ఎదురుచూస్తోంది. బీబీజోడీ, పటాస్ వంటి టెలివిజన్ షోలతో క్రేజ్ సంపాదిస్తోంది. మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ దూసుకెళ్తోంది
    ఏప్రిల్ 06 , 2023
    <strong>Ram Nagar Bunny Review: థియేటర్లలోకి యాటిట్యూడ్‌ స్టార్‌ మూవీ.. ‘రామ్‌ నగర్‌ బన్నీ’తో హిట్ కొట్టినట్లేనా?&nbsp;</strong>
    Ram Nagar Bunny Review: థియేటర్లలోకి యాటిట్యూడ్‌ స్టార్‌ మూవీ.. ‘రామ్‌ నగర్‌ బన్నీ’తో హిట్ కొట్టినట్లేనా?&nbsp;
    నటీనటులు : చంద్రహాస్‌, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్రా, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీనివాస్‌ మెహత్‌ సంగీతం : అశ్విన్‌ హేమంత్‌ సినిమాటోగ్రఫీ : అస్కర్‌ అలీ ఎడిటిర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌ నిర్మాతలు: ప్రభాకర్‌, మలయజ ప్రభాకర్‌ విడుదల తేదీ: 04-10-2024 బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్‌ (Prabhakar) కుమారుడు చంద్రహాస్‌ (Chandrahas) యాటిట్యూడ్‌ స్టార్‌ (Attitude Star)గా సోషల్‌ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం 'రామ్‌ నగర్‌ బన్నీ' గురించి కూడా కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వాపస్‌ అంటూ చంద్రహాస్‌ చేసిన కామెంట్స్‌ తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యాటిట్యూడ్‌ స్టార్‌ హిట్‌ కొట్టాడా? హీరోగా ఆకట్టుకున్నాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీ (చంద్రహాస్‌)కి అమ్మాయిలు అంటే వీక్‌నెస్. చూసిన ప్రతి అ‍మ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఏకంగా ముగ్గురితో (విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి)తో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు లవ్‌ ట్రాక్‌ నడిపిస్తాడు. అనుకోని పరిస్థితులు ఎదురై పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి సైతం మాటిస్తాడు. ఆమె కంపెనీలోనే ఉద్యోగానికి కూడా చేరతాడు. అయితే ఆంటీపై తనకు ఎలాంటి ఇష్టం లేదని బన్నీ గ్రహిస్తాడు. తను నిజంగా ప్రేమిస్తోందని శైలు (విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే శైలుకు మరొకరితో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతుంది. అప్పుడు బన్నీ ఏం చేశాడు? శైలు ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అన్నది తెలియాలంటే థియేటర్లలో చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే నటుడు చంద్రహాస్‌ పలు వేదికలపై చూపించిన యాటిట్యూడే ఈ సినిమాకు ప్రధాన బలం అయ్యింది. నటుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ నటన పరంగా ఎంతో ఆకట్టుకున్నాడు. ఎక్కడా భయం, బెరుకు లేకుండా నటించాడు. డ్యాన్స్‌, పైట్స్‌లో అదరగొట్టాడు. రొమాంటిక్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు. శైలుగా చేసిన విస్మయ శ్రీ క్యూట్‌గా ఉంది. బన్నీ ప్రేమించిన మిగతా ముగ్గురు అమ్మాయిలు ఓకే అనిపించారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తనవంతు ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్ర దారులు పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శ్రీనివాస్ మహత్ యూత్‌ను ఆకట్టుకునే విధంగా ‘రామ్‌ నగర్‌ బన్నీ’ని తెరకెక్కించారు. చంద్రహాస్ కోసమే ఈ కథను రాసినట్టుగా అనిపిస్తుంది. సింపుల్ కథకు అద్భుతమైన స్క్రీన్‌ప్లేను జోడించి ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు దర్శకుడు. చంద్రహాస్‌ని ఒక సూపర్ హీరో మాదిరిగా కాకుండా జులాయిగా తిరిగే సాధారణ కుర్రాడిగా చూపించి సక్సెస్‌ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు సరదాగా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కామెడీ సీన్స్, కాసిన్ని ఎమోషనల్ సీన్స్, మధ్యలో నాలుగు పాటలు, ఇవి కాదన్నట్లు రెండు ఫైట్స్‌ను కలగలిపి పక్కా కమర్షియల్‌ మూవీగా తీర్చిదిద్దారు. సాగదీత సన్నివేశాలు, ఎమోషనల్‌ సీన్స్‌లో చంద్రహాస్‌ తడబాటు కాస్త మైనస్‌గా చెప్పుకోవచ్చు.&nbsp;&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికొస్తే మూడు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ హైదరాబాద్ సిటీనీ చూపించే డ్రోన్ షాట్స్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ చంద్రహాస్‌ నటనకమర్షియల్‌ హంగులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సన్నివేశాలుపేలవమైన ఎమోషనల్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    <strong>Allu Arjun - Trivikram: బన్నీ-త్రివిక్రమ్‌ కాంబోపై క్రేజీ అప్‌డేట్‌.. వరుసగా నాల్గో బ్లాక్‌బాస్టర్‌ లోడింగ్‌!</strong>
    Allu Arjun - Trivikram: బన్నీ-త్రివిక్రమ్‌ కాంబోపై క్రేజీ అప్‌డేట్‌.. వరుసగా నాల్గో బ్లాక్‌బాస్టర్‌ లోడింగ్‌!
    టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్ ఉంది. మరి ముఖ్యంగా కొద్దిమంది హీరోలు, డైరెక్టర్ల కాంబో అంటే ఆడియన్స్‌ పిచ్చెక్కిపోతారు. ప్రభాస్‌-రాజమౌళి, త్రివిక్రమ్‌-పవన్‌ కల్యాణ్‌, తారక్‌ - కొరటాల శివ, అల్లు అర్జున్‌-సుకుమార్‌, హరీష్‌ శంకర్‌-రవితేజ కాంబోలో చిత్రం అంటే అభిమానులకు పూనకాలే అని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు మరో క్రేజీ కాంబోలో కూడా టాలీవుడ్‌లో ఉంది. వాస్తవానికి ఈ కాంబినేషన్స్‌లో అదే టాప్‌ అని చెప్పవచ్చు. అదే బన్నీ-త్రివిక్రమ్‌ కాంబో. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే అది పక్కాగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్‌ నమ్మకం. గతంలో వీరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాయి. వీరి కాంబోలో ఫోర్త్‌ ఫిల్మ్ కూడా ఉండనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయకొచ్చాయి.&nbsp; ముహోర్తం ఫిక్స్‌! అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ మూవీ కోసం ఆడియన్స్‌ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ముహోర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్‌ చేసి ఆ తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తారని సమాచారం. ప్రస్తుతం పాన్‌ ఇండియా హవా నడుస్తుండటంతో ఈ సినిమా కూడా మల్టీ లాంగ్వేజెస్‌లో రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రం ద్వారానే తొలిసారి పాన్ ఇండియా మార్కెట్‌లో అగుడుపెడతారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.&nbsp; ఆ ఇద్దరిలో ఎవరు! బన్నీ-త్రివిక్రమ్‌ చిత్రానికి సంబంధించి హీరోయిన్‌ ఎంపిక కూడా దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ భామలు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), అలియా భట్‌ (Alia Bhatt)లలో ఒకర్ని బన్నీకి జోడీగా తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. 'దేవర' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన నేపథ్యంలో జాన్వీకి తెలుగులో క్రేజ్‌ ఏర్పడింది. దీంతో జాన్వీ వైపే త్రివిక్రమ్ మెుగ్గు చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అటు బన్నీ సరసన ఆలియా కంటే జాన్వీనే బాగా సెట్‌ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే బాలీవుడ్‌లో జాన్వీ కంటే ఆలియాకు ఎక్కువ క్రేజ్ ఉండటం వల్ల ఆమెను తీసుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలియాను తీసుకుంటే పాన్‌ ఇండియా స్థాయిలో కలిసిరావొచ్చని కూడా భావిస్తున్నారట. హీరోయిన్ ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; హ్యాట్రిక్ హిట్స్‌ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో గతంలో మూడు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రూపొందిన ‘జులాయి’(Julayi), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (S/o Satyamurthy), ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. హీరో అల్లు అర్జున్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేలా చేశాయి. ఈ మూడు కూడా హిలేరియస్ ఎంటర్‌టైనర్స్‌గా సగటు సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీరి కాంబోలో రానున్న నాల్గో చిత్రం కూడా ఆ స్థాయిలోనే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత రికార్డులను ఈ మూవీ చెరిపేయాలని ఆశిస్తున్నారు.&nbsp; ‘పుష్ప 2’తో బిజీ బిజీ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రస్తుతం డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)తో 'పుష్ప 2' (Pushpa 2) చేస్తున్నాడు. డిసెంబర్‌ 6న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప' (Pushpa)కు సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతోంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ వ్యయంతో నిర్మించిన ఓ సెట్‌లో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. పతాక సన్నివేశాలను ఈ సెట్‌లో షూట్‌ చేస్తున్నట్లు సమాచారం. హీరో బన్నీతో పాటు కీలక నటులంతా ఈ షూట్‌లో పాల్గొంటున్నారు.
    ఆగస్టు 07 , 2024
    Guntur Kaaram: త్రివిక్రమ్‌తో ఆ విషయంలో కుదరకే పూజా హెగ్డే బయటకొచ్చిందా? సంయుక్త మీనన్ ఎంట్రీ!
    Guntur Kaaram: త్రివిక్రమ్‌తో ఆ విషయంలో కుదరకే పూజా హెగ్డే బయటకొచ్చిందా? సంయుక్త మీనన్ ఎంట్రీ!
    మహేష్ బాబు, త్రివిక్రమ్(Mahesh Babu-Trivikram) కాంబినేషన్‌లో గుంటూరు కారం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ గురించి ఏదొక వివాదం చర్చలకు మూల కేంద్రంగా మారుతునే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్పులే మార్పులు ఇప్పటికే స్టోరీ మహేష్‌బాబుకు తగ్గట్టు లేదని ఓసారి మార్చివేశారు. కొన్ని కారణాల వల్ల ఫైట్ మాస్టర్స్‌ను తొలగించారు. రెండు షెడ్యూల్స్‌లో జరిగిన షూటింగ్‌ను కంప్లీట్‌గా పక్కకు పెట్టారు. ఇప్పుడు పూజా హెగ్డే సైతం బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఫలితంగా ఈ చిత్రం కాస్టింగ్‌లో భారీగా మార్పులు రానున్నాయి. పూజా హెగ్డే స్థానంలో మరొక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంయుక్త మీనన్‌ లేదా త్రిషను సినిమాలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. అదే అసలు సమస్య డేట్ సమస్యల కారణంగా పూజా హెగ్డే సినిమా నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. జూన్- ఆగస్టు టైమ్‌ఫ్రేమ్‌లో పూజా హెగ్డే ఇతర సినిమాలు చేయాల్సి ఉంది. ఈ టైమ్‌లో గుంటూరు కారం సినిమా వల్ల ఇతర చిత్రాల షెడ్యూల్‌కు ఆటంకం కలుగుతుందని ఆమె భావించిందని సమాచారం. షెడ్యూల్స్ సరైన టైమ్‌కి పూర్తికాకపోవడం, కొన్ని సీన్లు రీషూట్ చేయడం, అనుకున్న సమయానికి షెడ్యూల్స్ పూర్తికాకపోయినా.. కొత్త షెడ్యూల్స్ ప్రకటించడం, కొన్ని షెడ్యూల్స్‌లో జరిగిన సన్నివేశాలను రీ షూట్ చేయడం వంటి వాటి పట్ల పూజా హెగ్డే తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేందుకే.. గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే వైదొలిగినట్లు తెలిసింది. తమన్ తప్పుకున్నట్లు ప్రచారం.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. తమన్‌కు బదులు అనిరుధ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్లు బజ్ నడిచింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తమన్ క్లారిటీ ఇచ్చారు. కావాలని కొంత మంది కడుపు మంటతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కడుపుమంట ఉన్నవాళ్లు తన ఆఫీస్ వద్దకు రావాలని సూచించారు. ఆఫీస్ ముందు మజ్జిగ స్టాల్ ఏర్పాటు చేశానని అక్కడ ఫ్రీగా మజ్జిగ తాగి కడుపు మంట తగ్గించుకోవాలని సూచించారు.&nbsp; ఈసారి తాను అందించే మ్యూజిక్‌తో బాక్స్‌లు బద్దలు అవుతాయని చెప్పుకొచ్చారు. https://twitter.com/MusicThaman/status/1670846867650002946?s=20 పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్? పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్‌ కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలు పెట్టిందని సమాచారం. మహేష్ సరసన సంయుక్త మీనన్‌(Samyuktha Menon)ను హీరోయిన్‌గా తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. సంయుక్త మీనన్ కాకపోతే.. త్రిష(Trisha)ను కూడా సంప్రదించాలని భావిస్తున్నారట. మరి పూజా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవర్నీ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. https://twitter.com/SSMB28_29/status/1671043502451609601?s=20 పూజా ఓవర్ యాటిట్యూడ్ అయితే కొంత మంది అభిమానులు పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు పూజా హెగ్డేను ఎంకరేజ్ చేయడం ఆపాలని సూచిస్తున్నారు. ఆమెకు తెలుగు సినిమాలంటే గౌరవం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభాస్‌తో తీసిన సినిమాలోనూ ఇదే జరిగిందని కామెంట్ చేస్తున్నారు.&nbsp; ప్రమోషన్స్ విషయంలో హిందీ, తమిళ్‌ సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇవ్వదని ఏకిపారేస్తున్నారు. https://twitter.com/898SAG/status/1671025365240942595?s=20 పూజా హెగ్డే స్థానంలో కియరా అద్వానిని మహేష్‌కు జోడీగా తీసుకొస్తే బాగుంటుందని మరికొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.&nbsp; మూవీ బృందం క్లారిటీ గుంటూరు కారం మూవీలో జరుగుతున్న మార్పులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. పూజా హెగ్డేని హీరోయిన్‌గా మూవీ నుంచి తీసివేసే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఆమెతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.&nbsp; సినిమా షూటింగ్ 24 జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుంది అని స్పష్టం చేసినట్లు తెలిసింది. https://twitter.com/TheAakashavaani/status/1671040847054528512?s=20 అల్లు అర్జున్‌తో మళ్లీ... మరోవైపు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు త్రివిక్రమ్ ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనుండగా... నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఇంతకుముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు వచ్చాయి.
    జూన్ 20 , 2023
    Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
    Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
    భారత ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి. ఇందులోని సారాన్ని సినిమాల్లో సందర్భానుసారంగా ప్రస్తావిస్తుంటారు. మహాభారతంలోని ఔన్నత్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలని కొందరు దర్శకులు, రచయితలు ఆరాట పడుతుంటారు. అందులో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గురూజీ తీసిన సినిమాల్లో కచ్చితంగా రామాయణ, మహాభారత ఇతిహాసాల తాలూకూ ఘటనలు, ఆదర్శాలు ఉంటాయి. సరదాగానో, సీరియస్‌గానో వీటిని తన సినిమాల్లో ప్రస్తావిస్తాడు. అలాంటివి ఇప్పుడు చూద్దాం.&nbsp; అరవింద సమేత వీరరాఘవ హీరోయిన్ పూజా హెగ్డేని వెంటాడుతుండగా ఎన్టీఆర్ కంట పడుతుంది. ఈ సమయంలో వారిని అడ్డుకోవాలనే ఎన్టీఆర్ ప్రయత్నాన్ని పూజా హెగ్డే నిలువరిస్తుంది. ‘భీముడు, అర్జునుడు ఒక్క చేత్తో వందమందిని చంపగలరు. కానీ, కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫొటో అయినా చూశావా. ఆయనకు 8మంది భార్యలు. అర్థమైందా మా ఆడవాళ్లకు ఎలాంటి వారు నచ్చుతారో’ అంటూ ఎన్టీఆర్ ఆలోచన తీరును మార్చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=qmqQHtla20w S/O సత్యమూర్తి ఈ సినిమాలో రెండు, మూడు సందర్భాల్లో మహాభారతం ప్రస్తావనను గురూజీ తీసుకొచ్చాడు. పార్టీలో అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుండగాా ఓ ఉదాహరణను చెబుతాడు. ‘కౌరవులు జూదంలో గెలిచారు. కురుక్షేత్రంలో పోయారు. జూదంలో ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకునే వారు’ అని చెబుతాడు. ఇందులోనే రాజేంద్ర ప్రసాద్ సమంతతో మాట్లాడుతూ.. ‘కర్ణుడిలా అన్నీ ఇచ్చేసి చివరికి అనాథలా పోతాడు’ అనేస్తాడు. ఇక బ్రహ్మానందం.. ‘వినటానికి విల్లింగ్‌గా ఉంటే భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇంత చెప్పాడంటా’ అంటూ దీర్ఘం తీస్తాడు. ‘యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటోడే ఒక అబద్ధం ఆడాడు’&nbsp; (అల్లు అర్జున్‌తో శ్రీవిష్ణు)అని మరో డైలాగ్ ఉంటుంది. https://www.youtube.com/watch?v=x0jKDVs34xQ అజ్ఞాతవాసి ఈ సినిమాలో ఓ మాస్టారు సందర్భోచితంగా నకుల ధర్మం గురించి వివరిస్తాడు. హీరో పవన్ కళ్యాణ్‌పై దుండగులు దాడికి దిగుతారు. ఈ సమయంలోనే ‘పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవుల గూఢచారులు గుర్తిస్తారు. ఈ సమయంలో నకులుడు ఒక ఉపాయం చెబుతాడు. చుట్టు పక్కల పరిసరాల్లో ఎలాంటి మార్పు లేకుండా వారిని సంహరించేలా ప్లాన్ చేస్తాడు. నిశ్శబ్దంగా చేసే ఈ యుద్ధాన్నే నకుల ధర్మం అని అంటారు’ అని చెబుతారు. https://www.youtube.com/watch?v=6Fdb2UUhRzc జులాయి తనికెల్ల భరణి ఆసుపత్రిలో చేరిన సమయంలో అల్లు అర్జున్‌తో ఓ డైలాగ్ చెబుతాడు. ‘ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి’ అంటూ తనికెళ్ల భరణి అల్లు అర్జున్‌లో స్ఫూర్తిని నింపుతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ypYkw6sHO_U ఖలేజా&nbsp; మహేశ్ బాబు, అనుష్కల మధ్య జరిగే సన్నివేశంలోనూ గురూజీ ఓ విషయాన్ని ఫన్నీ టోన్‌లో చెబుతారు. గ్రామస్థులంతా తనను దేవుడని నమ్ముతున్నారని మహేశ్ బాబుతో అనుష్క చెబితే.. ‘ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చుగా’ అని బాబు రిప్లై ఇస్తాడు. దీంతో ‘కృష్ణుడు కూడా అర్జునిడికి డ్రైవరే అని చెప్పారు’ అంటూ స్వీటీ బదులిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=LFnZyjBZzKE ఇంకా మీకు తెలిసిన సన్నివేశాలు ఉంటే కామెంట్లలో మాతో పంచుకోండి.  https://telugu.yousay.tv/ramayanam-references-in-guruji-trivikram-movies.html
    జూన్ 12 , 2023
    Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
    Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
    నటీనటులు: సుమంత్‌ ప్రభాస్‌, సిరి రాశి, మురళిధర్‌ గౌడ్‌, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి,&nbsp; డైరెక్టర్‌: సుమంత్‌ ప్రభాస్‌ సంగీతం: కళ్యాణ్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ దూపాటి నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, సూర్య చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా వరకూ సినిమాలు తెలంగాణ నేపథ్యంతోనే తెరకెక్కుతున్నాయి. ఇలా వచ్చిన బలగం, జాతిరత్నాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్స్‌ సాధించాయి. తాజాగా ఇదే కోవలో తెరకెక్కిన సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. `రైటర్‌ పద్మభూషణ్‌` వంటి సూపర్‌ హిట్‌ సినిమాను నిర్మించిన ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిల్మ్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. అంతేగాక టాలీవుడ్ స్టార్స్‌తో చేసిన విభిన్న ప్రమోషన్స్‌ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 26) రిలీజ్‌ అయిన ‘మేమ్‌ ఫేమస్‌’ అందరి అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి త‌న మ‌ర‌ద‌లు మౌనిక (సార్య ల‌క్ష్మ‌ణ్‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. మయి ఫ్రెండ్‌ బాలి కూడా ఊరిలోని ఇంకో అమ్మాయిని ఇష్టపడుతుంటాడు.&nbsp; అయితే జులాయిగా తిరిగే స్నేహితులంతా కలిసి ఓ టెంట్‌ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్‌ సర్య్కూట్‌కి టెంట్‌ హౌజ్‌ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్‌ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? మయి, బాలి ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? అనేది మిగతా కథ. ఇది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే.. ముగ్గ‌రు ఫ్రెండ్స్ ఎడాపెడా తప్పులు చేస్తూ పంచాయతీలో నిలబడటం ఫ‌స్టాఫ్ అంతా రిపీట్‌ మోడ్‌లో క‌నిపిస్తుంది. అది చూసేవారికి కాస్త బోరింగ్‌ అనిపిస్తుంది. అసలు సినిమాలో కథ ఉందా అన్న ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. ఊరి ప్రజల సూటిపోటీ మాటలతో టెంట్‌ హౌజ్‌ పెట్టుకొని స్నేహితులు బాధ్యత తెలుసుకున్నట్లు కనిపిస్తారు. ఈ క్రమంలో వచ్చే లవ్‌ ఇష్యూస్‌, టెంట్‌హౌజ్‌ అగ్నిప్రమాదానికి గురికావడం సెకాండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకాండాఫ్‌ అంతా యూట్యూబ్‌ వీడియోస్‌ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ పంచ్‌లు నవ్విస్తాయి.&nbsp; అలాగే సుమంత్ ప్ర‌భాస్‌, సార్య ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ యూత్‌కి క‌నెక్ట్ అవుతుంది. సుమంత్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌ణి, సార్య ల‌క్ష్మ‌ణ్‌, మ‌ణి ఏగుర్ల, ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు.&nbsp; ఎవరెలా చేశారంటే? నటన పరంగా సుమంత్ ప్రభాస్ ఫ‌ర్వాలేద‌నిపించాడు.&nbsp; నటనలో ఇంకాస్తా రాటుదేలాల్సి ఉంది. అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన మ‌ణి, మౌర్య పాత్రల పరిధి మేరకు నటించారు. అంజిమామ‌, ముర‌ళీధ‌ర్ గౌడ్, కిర‌ణ్ మ‌చ్చా పాత్రలు గుర్తిండి పోతాయి. లిప్‌స్టిక్ స్పాయిల‌ర్ రోల్‌లో యాక్ట్ చేసిన శివ‌నంద‌న్ కామెడీ బాగుంది.&nbsp; అన‌వ‌స‌ర స‌న్నివేశాలు సినిమాలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా క‌నిపిస్తాయి.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? మేమ్‌ ఫేమస్‌ సినిమా చూస్తున్నంత సేపు ‘పెళ్లిచూపులు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలే గుర్తుకువస్తాయి. సుమంత్‌ ప్రభాస్‌ కథను తన స్టైల్‌లో అద్భుతంగా రాసుకున్నప్పటికీ దానిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో విఫలమైనట్లు కనిపించింది. &nbsp;సుమంత్ రాసుకున్న స్టోరీలో ఏమాత్రం బ‌లం లేదు. రోటీన్‌గా ఉంది. కామెడీ, భావోద్వేగాల్ని తాను రాసుకున్న విధంగా తెరపై చూపించలేకపోయాడు. షార్ట్‌ఫిల్మ్‌ను తలపిస్తుంది. సినిమాను సరదాగా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో ఎమోషనల్‌ సీన్స్‌ను ఇరికించారు. ఇక రైతు పడే కష్టం గురించి చెప్పే సీన్లు సందర్భానుసారంగా అనిపించదు. అయితే కొన్ని సీన్లు చాలా కొత్తగా అన్నిపిస్తాయి. కామెడీ కూడా నచ్చుతుంది. అయితే కొన్ని సీన్లు మినహా సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వ‌ర్క్ బావుంది. క‌ళ్యాణ్ నాయ‌క్ పాట‌ల కంటే నేప‌థ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా సో సో గానే ఉన్నాయి. సినిమాకు ఎక్కువ బడ్జెట్‌ ఎందుకని భావించినట్లు అనిపించింది. ప్లస్‌ పాయింట్స్‌ కామెడీనేపథ్య సంగీతంఇంటర్‌వెల్‌కు ముందు సీన్లు మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5
    మే 26 , 2023
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్‌ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) తల్లి కాబోతుంది గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చిన్నారి టీషర్ట్‌ని, తన మెడలోని ‘మామా’ అంటూ ఉన్న ఫోటోలను షేర్‌ చేసినా హీరోయిన్… “లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సుందరి గుడ్‌ న్యూస్‌ చెబుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) ఇలియానా జీవితం కెరీర్‌ పీక్ దశలో ఉండగానే ఇలియానా సినిమాలకు దూరం అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలే విడిపోవడానికి కారణం. &nbsp; ఆమె సోదరుడితో డేటింగ్ ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇల్లీ బేబి అధికారికంగా ధ్రువీకరించలేదు. స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో వార్తలు నిజేమనని అనుమానాలు చాలామందిలో కలిగాయి.&nbsp; తండ్రి ఎవరు?&nbsp; ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది ఇలియానా. భర్తతో విడిపోయి మూడేళ్ల తర్వాత ఇలా&nbsp; ప్రకటించడంతో.. తండ్రి ఎవరంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసని.. ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.&nbsp; పరిచయం చేస్తుందా? బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రేమికుడిని ఇలియానా పరిచయం చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. అటు సరోగసి లేదా దత్తత తీసుకోవటం ద్వారా ఆమె తల్లి అవుతుందేమో అని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇలియానా జీవిత భాగస్వామి ఎవరనేది సస్పెన్స్‌. దీనికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. టాప్ హీరోయిన్ దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కొద్ది రోజుల్లోనే గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్‌తో ఏకంగా మహేశ్ సరసన పోకిరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించి హిట్లు అందుకుంది. అల్లు అర్జున్‌తో జులాయి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ…. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం… ఇలియానా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి.&nbsp;
    ఏప్రిల్ 18 , 2023
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), ‌అలీ (Ali), సునీల్‌ (Sunil), వేణుమాదవ్‌ (Venu Madhav) లాంటి సీనియర్‌ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్‌ కమెడియన్స్‌ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్‌ సైతం&nbsp; సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; సుహాస్‌ (Suhas) ప్రముఖ నటుడు సుహాస్‌.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్‌ అయిన సుహాస్‌.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్‌ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్‌..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్‌ నటిస్తున్నాడు. వైవా హర్ష (Harsha Chemudu)&nbsp; షార్ట్‌ఫిల్మ్స్‌ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది.&nbsp;&nbsp; అభినవ్‌ గోమటం (Abhinav Gomatam) యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్‌ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్‌.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా&nbsp; ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్‌ హీరోగా మారాడు.&nbsp; సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) ‘జబర్దస్త్‌’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్‌.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్‌ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు. సత్యం రాజేష్‌ (Satyam Rajesh) సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్‌.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ప్రియదర్శి (Priyadarsi) యంగ్‌ కమెడియన్‌ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’&nbsp; (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు. వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) టాలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్‌.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్‌ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’తో కథానాయకుడిగా మారిన కిషోర్‌.. రీసెంట్‌గా&nbsp; ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.&nbsp; ధన్‌రాజ్‌ (Dhanraj) జబర్దస్త్‌ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్‌ ధన్‌రాజ్‌. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్‌.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.&nbsp;
    మార్చి 14 , 2024
    <strong>RC16: రామ్‌చరణ్‌కు విలన్‌గా మున్నా భయ్యా.. అతడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా!&nbsp;</strong>
    RC16: రామ్‌చరణ్‌కు విలన్‌గా మున్నా భయ్యా.. అతడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా!&nbsp;
    'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) చేస్తున్న ప్రాజెక్ట్‌ 'RC 16'. ఉప్పెన ఫేమ్‌ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం మైసూర్‌లో షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో రామ్‌ చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాహ్నవి కపూర్‌ నటించనుంది. ఇటీవలే తెలుగు స్టార్‌ నటుడు జగపతిబాబు సైతం ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్‌ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్‌ నటుడు సైతం&nbsp; 'RC 16' ప్రాజెక్టులో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా మేకర్స్ ప్రకటించారు.&nbsp; మున్నా భాయ్‌ ఆగమనం.. హిందీ వెబ్‌ సిరీస్ ‘మీర్జాపూర్‌’ (Mirzapur Series) ఎంత పెద్ద సక్సెస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సిరీస్‌లో మున్నాభాయ్‌ పాత్ర తెగ హైలెట్‌ అయ్యింది. సిరీస్‌ విజయవంతం కావడంలో ఆ పాత్ర చేసిన దివ్యేందు (Divyenndu) కీలక పాత్ర పోషించాడు. అటువంటి దివ్యేందు తాజాగా&nbsp; 'RC 16' జాయిన్‌ అయ్యాడు. ఈ విషయాన్నితెలియజేస్తూ దర్శకుడు బుచ్చిబాబు (Director Buchi Babu) స్పెషల్‌ పోస్టు రిలీజ్‌ చేశాడు. దీనికి ఆసక్తికర క్యాప్షన్‌ పెట్టాడు. ‘మా భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా. వెల్‌కమ్‌ దివ్యేందు. లెట్స్‌ రాక్‌ ఇట్‌' అని రాసుకొచ్చాడు. అయితే ఇందులో అతడు నెగిటివ్‌ రోల్‌ చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు దివ్యేందు రాకతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/BuchiBabuSana/status/1862732574239678593 దివ్యేందు ఎంత కష్టపడ్డాడో! బాలీవుడ్‌ నటుడు దివ్యేందు శర్మ 1983 జూన్‌ 19న జన్మించాడు. ఢిల్లీ యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న కిరోరి మల్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్ చేశాడు. యాక్టింగ్‌లో రెండేళ్ల డిప్లమో కోర్స్‌ చేశాడు. సినిమాల్లోకి రాకముందు పలు యాడ్స్‌లో దివ్యేందు నటించాడు. 'ఆజా నచ్లె' (2007) చిత్రంలో మైనర్ రౌడీగా తొలిసారి సిల్వర్‌ స్క్రీన్‌పై అడుగుపెట్టాడు. తొలి మూడేళ్లు చిన్న వేషాలు వేసుకుంటూ అనేక స్ట్రగుల్స్‌ పడ్డాడు. 2011లో వచ్చిన 'ప్యార్‌ కా పంచ్‌నామా' చిత్రంతో ఇండ్రస్ట్రీలో కాస్త గుర్తింపు తగ్గింది. 2018లో వచ్చి మీర్జాపూర్‌ సిరీస్‌ అతడి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. దాని తర్వాత వరుసగా హిందీ చిత్రాల్లో అవకాశాలు దక్కాయి. అదే ఏడాది వచ్చిన 'బట్టి గుల్‌ మీటర్‌ చాలు' సినిమాలో ముఖ్యమైన పాత్రలో మెరిశాడు. ఆ తర్వాతి ఏడాది 'బద్నాం గలి' చిత్రంలో ఏకంగా లీడ్‌ రోల్‌ చేశాడు. ఈ ఏడాది 'మడ్‌గాన్‌ ఎక్స్‌ప్రెస్‌'తో హిందీ ఆడియన్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హీరోగ 'అగ్ని' చిత్రంలో చేస్తున్నాడు. ఇప్పుడు రామ్‌చరణ్‌ మూవీలో అవకాశం దక్కించుకొని తెలుగు ప్రేక్షకులను నేరుగా ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అయ్యాడు. రెండేళ్లుగా స్ట్రిప్ట్‌పైనే.. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రెండో చిత్రమే రామ్‌ చరణ్‌తో చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. RC 16 ప్రాజెక్టు కోసం దాదాపు రెండేళ్ల నుంచి బుచ్చిబాబు వర్క్‌ చేస్తున్నారు. సోర్ట్స్‌ డ్రామాగా వీలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రానుంది. ఇందులో దివ్యేందుతో పాటు కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌కుమార్‌ (Siva Raj Kumar) సైతం కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘పెద్ది’ (RC 16 Title) అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఏ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు అందించనున్నాడు. ‘RC16’ కథ ఇదే? ‘RC16’ చిత్రాన్ని బుచ్చిబాబు వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మలయుద్ధం కాన్సెప్ట్‌లో ఈ సినిమా రానున్నట్లు టాక్‌. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్‌ మేకోవర్‌ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్‌ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో 'బీస్ట్‌ మోడ్‌ ఆన్‌' అంటూ ఓ ఫొటోను సైతం అభిమానులతో చరణ్‌ పంచుకున్నాడు. ‘గేమ్‌ ఛేంజర్‌’ లుక్‌తో పోలిస్తే చరణ్‌ బాడీతో పాటు, లాంగ్‌ హెయిర్‌, గడ్డం పెంచాడు.&nbsp; https://twitter.com/BabaiAbbaiFC/status/1859625463477567813
    నవంబర్ 30 , 2024
    <strong>War 2: ‘వార్‌ 2’ షూటింగ్ నుంచి మళ్లీ తారక్‌ ఫొటో లీక్!&nbsp;</strong>
    War 2: ‘వార్‌ 2’ షూటింగ్ నుంచి మళ్లీ తారక్‌ ఫొటో లీక్!&nbsp;
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌, టాలీవుడ్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్‌ ఏర్పడింది. ‘RRR’, 'దేవర' లాంటి బ్లాక్‌ బాస్టర్స్‌ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్‌ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. ఇటీవలే తారక్‌ సైతం షూటింగ్‌ జాయిన్‌ అయ్యాడు. ఈ క్రమంలోనే షూటింగ్‌ స్పాట్‌ నుంచి తారక్‌కు సంబంధించిన ఫొటో లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.&nbsp; స్టైలిష్‌ లుక్‌లో అదరహో ప్రస్తుతం తారక్‌ ‘వార్‌ 2’ (War 2) షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన పాత్రకు సంబంధించిన సీన్స్‌లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే షూటింగ్‌ స్పాట్‌ నుంచి తారక్ ఫొటో ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్షమైంది. అందులో తారక్‌ స్టైలిష్‌ లుక్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. లీకైన ఫొటోలో తారక్‌ సైడ్‌ లుక్‌ కనిపించింది. టీషర్ట్‌ మీద మిలటరీ తరహా గళ్ల చొక్క వేసి కనిపించాడు. అంతేకాదు షూటింగ్‌ కోసం వినియోగిస్తున్న గన్స్‌ను కూడా లీకైన ఫొటోల్లో గమనించవచ్చు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారింది. తారక్‌ లుక్‌ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే గతంలోనూ ‘వార్‌ 2’ షూటింగ్‌కి సంబంధించి తారక్ ఫొటోలు లీకయ్యాయి.&nbsp; https://twitter.com/Brajm10/status/1849731080183513184 హాలీవుడ్‌ రేంజ్‌ ఎంట్రీ 'వార్‌ 2'లో తారక్ ఇంట్రడక్షన్‌ సీన్‌కు సంబంధించి బీ టౌన్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పైరేట్‌ తరహా థీమ్‌తో తారక్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ను దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఈ సీన్‌లో యాక్షన్‌ డోస్‌ కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. తారక్‌ చేసే ఫైట్స్ హాలీవుడ్‌ స్థాయిలో ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆడియన్స్‌ తప్పకుండా సర్‌ప్రైజ్‌ అవుతారని అంచనా వేస్తున్నాయి. అలాగే హృతిక్‌ను ఎదుర్కొనే సన్నివేశాలు కూడా గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయని సమాచారం. యశ్‌రాజ్‌ సంస్థ ఇప్పటివరకూ నిర్మించిన స్పై యూనివర్స్‌లో 'వార్‌ 2' స్పెషల్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. కాగా, ఇందులో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్.&nbsp; షారుక్‌ స్పెషల్‌ రోల్‌? ‘వార్ 2’ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ వార్త కూడా బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan) ఈ సినిమాలో స్పెషల్ క్యామియో ఇవ్వనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దాదాపు 15 నిమిషాల పాటు షారుక్‌ రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి షూట్‌ కూడా మెుదలైనట్లు చెబుతున్నారు. అంతేకాదు తారక్‌-షారుక్‌ మధ్య ఫేస్‌ టు ఫేస్ యాక్షన్ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. హిందీలో ఫస్ట్ ఫిల్మ్‌తోనే హృతిక్‌, షారుక్‌ వంటి స్టాన్‌ నటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే ఛాన్స్ తారక్‌ రావడం నిజంగా గొప్ప విషయమే.&nbsp; ‘NTR 31’ లోడింగ్‌! ‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR), ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్‌ నీల్‌ ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్‌ పార్ట్‌గా తీసుకురావాలని నిర్ణయించారట. అంతేకాదు ఇందులో బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌ కనిపిస్తారని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. కథ మెుత్తం బంగ్లాదేశ్‌ నేపథ్యంలోనే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హీరోయిన్‌ను కూడా ఈ మూవీ కోసం లాక్‌ చేశారని తెలుస్తోంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ ఇందులో తారక్‌కు జోడీగా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో ‘అప్పుడో ఇప్పుడో’ అనే సినిమా చేస్తోంది.&nbsp;
    అక్టోబర్ 25 , 2024
    <strong>Rashmika Mandanna: రష్మిక మందన్నకు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్</strong>
    Rashmika Mandanna: రష్మిక మందన్నకు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్
    టాలీవుడ్ సూపర్‌స్టార్ రష్మిక మందన్న గాయపడింది. ఇటీవల జిమ్‌లో వ్యాయామం చేస్తూ ప్రమాదవశాత్తు  గాయపడింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జిమ్‌ సెషన్‌ సమయంలో జరిగిన ఈ ప్రమాదం గురించి ఆమె సన్నిహిత వర్గాలు సమాచారం అందించాయి. గాయం తీవ్రతపై వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించగా, ప్రస్తుతం రష్మిక కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె షూటింగ్‌లకు హాజరు కానుంది. రష్మిక మందన్న ఈ మధ్యకాలంలో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాల ద్వారా తన స్థాయిని కొత్త ఎత్తుకు తీసుకెళ్లారు. ఇటీవల విడుదలైన పుష్ప 2లో "శ్రీవల్లి"గా ఆమె చూపించిన నటన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సీక్వెల్‌లో ఆమె పాత్ర సినిమా మొత్తానికే కీలకంగా నిలిచింది. కేవలం ఒక సంవత్సరం వ్యవధిలో రెండు పాన్ ఇండియా హిట్లు సాధించి, నెం.1 హీరోయిన్‌గా రష్మిక పేరుగాంచారు. రష్మిక సత్తాసాండల్‌వుడ్‌తో తన ప్రయాణం మొదలు పెట్టిన రష్మిక, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక హిందీ చిత్రసీమలో కూడా అడుగుపెట్టి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆల్బమ్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన రష్మిక, గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్ వంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బిజీ ప్రాజెక్టులురష్మిక ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగంగా బిజీగా ఉన్నారు: సికందర్: సల్మాన్‌ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈద్ సందర్భంగా విడుదల కానుంది.కుబేర: తెలుగులో ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.చావా: విక్కీ కౌశల్ హీరోగా, లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.రెయిన్ బో &amp;ది గర్ల్‌ఫ్రెండ్: తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్న ఈ చిత్రాల్లో రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌తో డేటింగ్ ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda - Rashmika Mandanna) చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే రష్మిక - విజయ్‌ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ నెట్టింట పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్‌ చెప్పిన సమయం అదే కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.  జిమ్‌లో ప్రమాదం తర్వాత, రష్మిక అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆమె కోలుకుని మరింత శక్తివంతమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తారని ఆశిద్దాం.
    జనవరి 10 , 2025
    <strong>Allu Arjun: ‘నరబలి జరిగితే.. నా సినిమా హిట్టని అల్లు అర్జున్‌ అన్నాడు’.. కాంగ్రెస్‌ MLA షాకింగ్ కామెంట్స్</strong>
    Allu Arjun: ‘నరబలి జరిగితే.. నా సినిమా హిట్టని అల్లు అర్జున్‌ అన్నాడు’.. కాంగ్రెస్‌ MLA షాకింగ్ కామెంట్స్
    హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన రోజు రోజుకు మరింత ముదురుతోంది. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం.. ఆపై వెంటనే అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి కౌంటర్‌ ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే జేఏసీ నేతలు బన్నీ ఇంటిపై రాళ్లదాడి కూడా చేశారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను పిలిపించి మూడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ నేపథ్యంలో బన్నీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. పగటి వేషగాడు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.&nbsp; ‘సీఎంను అంటే ఖబర్దార్‌’ అల్లు అర్జున్‌పై నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rekulapally Bhoopathi Reddy) తీవ్ర విమర్శలు చేశారు. 'పుష్ప అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమానా? స్మగ్లర్ సినిమా అది. ఎర్రచందనం అమ్ముకోడానికి నువ్వు చేసిన దందాలన్నీ చూపించినావ్‌. నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఖబర్దార్‌' అంటూ హెచ్చరించారు.&nbsp; https://twitter.com/pakkatelugunewz/status/1871514076037415308 ‘నువ్వు ఆంధ్రోనివి’ అల్లు అర్జున్‌ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటూ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మండిపడ్డారు. ‘నువ్వు ఆంధ్రోనివి.. ఆంధ్రోడిలా ఉండు. ఇక్కడ బతకడానికి వచ్చినావ్‌. మీకిచ్చిన గౌరవాన్ని కాపాడుకొని ఇక్కడ వ్యాపారం (సినిమాలు) చేసుకో. మా ముఖ్యమంత్రి మీద మాట్లాడితే ఊరుకోం. తెలంగాణకు నీ కాంట్రిబ్యూషన్ ఏముంది?' అంటూ తీవ్రంగా విమర్శించారు.&nbsp; 'నీ సినిమాలు ఆడనివ్వం’ అల్లు అర్జున్‌ ఇంటిని ఓయూ జేఏసీ నేతలు ముట్టడించిన సంగతి తెలిసిందే. దీనిపై మాట్లాడిన సదరు ఎమ్మెల్యే మరిన్ని హెచ్చరికలు జారీ చేశారు. 'కొంత మంది జాయింట్ యాక్షన్‌ కమిటీ వారు ఏదో చేసినట్లు ఉన్నారు. బన్నీ పద్దతి మార్చుకోకుండా ఉంటే కాంగ్రెస్‌ శ్రేణులు కూడా రంగంలోకి దిగుతాయి. నీ సినిమాలు కూడా ఆడనివ్వం. ఒళ్లు దగ్గరపెట్టుకొని సీఎం గురించి మాట్లాడు' అంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘నరబలి జరిగిందన్నాడు’ సంధ్యా థియేటర్‌ తొక్కిసలాటపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడినప్పుడు ఓ విషయాన్ని దాచారని ఎమ్మెల్యే అన్నారు. జరిగిన సంఘటన ఇదంటూ సంచలన ఆరోపణలు చేశారు. “తొక్కిసలాటలో ఒక లేడీ చనిపోయింది. ‘ఏసీపీ వెళ్లి మహిళ చనిపోయింది.. ఓ బాబు తీవ్రంగా గాయపడ్డాడు.. సార్‌ మీరు ఇక్కడ ఉండకండి వెళ్లిపోండి’ అంటే ఆయన ఏమంటాడో తెలుసా. ‘నరబలి అయిపోయింది సినిమా హిట్‌ అవుతుంది’ అన్నారు. ఆయనకు మానవత్వం ఉందా” అంటూ మండిపడ్డారు. ‘నీ పని నువ్వు చేసుకో.. లేదంటే చప్పుడు చేయకుండా ఆంధ్రాకి వెళ్లిపో’ అని సూచించారు.
    జనవరి 04 , 2025
    <strong>Urvashi Apsara: శ్రీలీల కంటే ‘కిస్సిక్‌’ కొరియోగ్రాఫరే కస్సక్‌లా ఉందే?&nbsp;</strong>
    Urvashi Apsara: శ్రీలీల కంటే ‘కిస్సిక్‌’ కొరియోగ్రాఫరే కస్సక్‌లా ఉందే?&nbsp;
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం అత్యంత భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని ‘కిస్సిక్‌’ సాంగ్ నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్టార్ హీరోయిన్ శ్రీలీల వేసిన స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ సాంగ్‌ షూట్‌ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌తో స్టెప్పులేసి ఓ యువతి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఊర్వశి అప్సర (Urvashi Apsara) అయిన ఆ యువతి తాజాగా మరోమారు కిస్సిక్‌ పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. దీంతో శ్రీలీల కంటే ఆమెనే చాలా బాగుందన్న కామెంట్స్‌ నెట్టింట గట్టిగా వినిపిస్తున్నాయి. శ్రీలీలను తలదన్నేలా..! టాలెంటెడ్‌ లేడీ కొరియోగ్రాఫర్‌ ఊర్వశి అప్సర (Urvashi Apsara) పేరు.. ప్రస్తుతం తెగ ట్రెండింగ్ అవుతోంది. కిస్సిక్‌ పాట (Kissik Song)కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఆమె వర్క్ చేసింది. న్యూయర్‌ సందర్భంగా జనవరి 1న కిస్సిక్ సాంగ్‌కు స్టెప్పులేస్తూ నెట్టింట ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టింది. ఎద, థైస్‌, నాబి అందాలు ఆరబోస్టూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ వీడియో చూసి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొందరైతే శ్రీలీల కంటే ఈమెనే కస్సక్‌లా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె డ్యాన్స్‌ చేస్తుంటే చూపులు తిప్పుకోలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.&nbsp; https://twitter.com/mohith000000/status/1874421324338397493 బన్నీతో స్టెప్పులేసి ఫేమస్‌ కిస్సిక్‌ సాంగ్ ప్రాక్టిస్ సందర్భంగా అల్లు అర్జున్‌తో ఊర్వశి అప్సర స్టెప్పులు వేసింది. డిసెంబర్‌ 22న ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో అప్సర పోస్టు చేసింది. క్షణాల వ్యవధిలోనే అది నెట్టింట వైరల్‌గా మారింది. మెరుపు తీగలా కదులుతూ మెస్మరైజింగ్ మూమెంట్స్‌తో అప్సర అదరగొట్టింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఈ భామ ఎవరు? అంటూ అందరూ తెగ సెర్చ్‌ చేశారు. ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ అని తెలిసీ మరింత స్టన్ అయ్యారు. హీరోయిన్‌ తలదన్నే గ్లామర్‌ ఆమెదంటూ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ‘పుష్ప’లోని ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ పాటకు సైతం ఊర్వశినే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసింది. ఆ సాంగ్‌ కూడా బ్లాక్ బాస్టర్‌ అయిన సంగతి తెలిసిందే.&nbsp; https://twitter.com/Movies4uOfficl/status/1871124384683020485 ఆమె గురించి ఇవి తెలుసా? ఊర్వశి అప్సర (Urvashi Apsara) విషయానికి వస్తే ఆమె కొరియోగ్రాఫర్‌తో పాటు నటి కూడా. బాలీవుడ్‌లో వచ్చిన ‘కిట్టి పార్టీ’, ‘డిసెంబర్‌ 31’, ‘అనంత్‌’, 'పింటు కి పప్పి' వంటి చిత్రాల్లో ఆమె నటించింది. గుజరాత్‌లో పుట్టిన ఆమె 100 పైగా పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసింది. 2016లో డ్యాన్సర్‌గా కెరీర్ మెుదలుపెట్టి గణేష్ ఆచర్య దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ అయ్యింది. 2016లో 'మిస్‌ ముంబయి' అందాల పోటీల్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆమెకు బెల్లీ డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యం ఉంది. ఖాళీ సమయాల్లో డ్యాన్స్ రీల్స్‌ చేస్తూ సోషల్ మీడియాలోనూ బాగా పాపులర్‌ అయింది. అలాగే హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తోంది.&nbsp;
    జనవరి 02 , 2025
    <strong>Rashmika Mandanna: బాగానే మెనేజ్ చేశారు.. కానీ ఇలా దొరికిపోయారు!</strong>
    Rashmika Mandanna: బాగానే మెనేజ్ చేశారు.. కానీ ఇలా దొరికిపోయారు!
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులమని ఇద్దరూ చెప్పినా తరచూ టూర్లు, రెస్టారెంట్స్‌లో దర్శనమివ్వడంతో ఎవరూ నమ్మడం లేదు. ఈ క్రమంలో తాజాగా మారుమారు ఈ జంట కెమెరాలకు చిక్కింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  విడివిడిగా వచ్చినా.. దొరికేశారు! స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఎక్కడ కనిపించినా వెంటనే కెమెరాలు వారి మీదకి వెళ్లిపోతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్స్‌ ఇద్దరూ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. సోమవారం రాత్రి విమానశ్రయంలో విజయ్‌ కనిపించగా.. కొద్దిసేపటి తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రష్మిక కూడా వచ్చింది. రష్మిక ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన సమయంలో ఆమె చేతిలో ఎల్లో కలర్‌ క్యాప్‌ ఉంది. అంతకుముందు విజయ్‌ తలకు బ్లాక్‌ కలర్‌ క్యాప్‌ పెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి దగ్గర ఉన్న క్యాప్స్‌ చేతులు మారడం గమనించవచ్చు. విజయ్‌ తలపైకి ఎల్లో క్యాప్‌ రాగా, రష్మిక హెడ్‌ పైకి బ్లాక్‌ క్యాప్‌ వచ్చింది. దీంతో ఇద్దరూ విడివిడిగానే కనిపించినా క్యాప్‌ మాత్రం వారు జంటగా వచ్చారని ఇరికించేసింది. కాగా, క్రిస్మస్‌, న్యూయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా వారు విదేశాలకు వెళ్లబోతున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  https://twitter.com/pakkatelugunewz/status/1871451463966404651 అనుమానాలు మరింత బలోపేతం గత కొద్దిరోజులుగా విజయ్‌- రష్మిక ప్రేమ గాసిప్ తెగ చర్చకు వస్తోంది. వీరిద్దరు ఏ ఈవెంట్‌లో పాల్గొన్నా ప్రేమ, డేటింగ్‌కు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే వీరిద్దరు ఇప్పటివరకూ తమ లవ్‌ను ధ్రువీకరించలేదు. తాజాగా ఎయిర్‌పోర్టు వీడియోలు బయటకు రావడంతో వారి రిలేషన్‌పై అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పవచ్చు. వారిద్దరు కచ్చితంగా రిలేషన్‌లో ఉన్నారని ఫ్యాన్స్‌ కూడా చర్చించుకుంటున్నారు. ఎన్నాళ్లు ఈ దాపరికమని, మీ ప్రేమ గురించి అనౌన్స్‌ చేయమని సూచిస్తున్నారు.  ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. చేతిలో ఏకంగా ఐదు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల 'పుష్ప 2' సాలిడ్‌ హిట్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగులో ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ వంటి ప్రాజెక్ట్స్‌ చేస్తోంది. హిందీలో ‘చావా’, ‘సికిందర్‌’, ‘తమ’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు విజయ్‌ దేవరకొండ సైతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో 'VD12' మూవీ చేస్తున్నాడు. రాహుల్‌ సంకృత్యన్‌ డైరెక్షన్‌లో మరో మూవీకి అంగీకరించాడు. అలాగే దిల్‌రాజు నిర్మాణంలో ఓ మూవీ కూడా విజయ్‌ ఓకే చేశాడు. వచ్చే ఏడాదే పెళ్లి! విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే రష్మిక - విజయ్‌ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ నెట్టింట పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్‌ చెప్పిన సమయం అదే కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.&nbsp;
    డిసెంబర్ 24 , 2024
    <strong>Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్‌ కామెంట్స్‌ రష్మిక గురించేనా?</strong>
    Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్‌ కామెంట్స్‌ రష్మిక గురించేనా?
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులమని ఇద్దరూ చెప్పినా తరచూ టూర్లు, రెస్టారెంట్స్‌లో దర్శనమివ్వడంతో ఎవరూ నమ్మడం లేదు. ఈ క్రమంలో తాజాగా నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ మాట్లాడారు. లవ్‌, డేటింగ్‌ అంటూ జరుగుతున్న ప్రచారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ రోజున బయటపెడతా’ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు తెలుగుతోపాటు నేషనల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. దీంతో మీరు రిలేషన్‌లో ఉన్నారా? అంటూ జాతీయ మీడియా ప్రతినిధి విజయ్‌ దేవరకొండను ప్రశ్నించారు. దీనిపై విజయ్‌ మాట్లాడుతూ ‘నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతా. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం ఉండాలి. కాబట్టి, అలాంటిరోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా’ అని విజయ్‌ సమాధానం ఇచ్చాడు.  వ్యక్తిగత జీవితంపైనా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ప్రేమ వ్యవహారం తరుచూ వార్తల్లో నిలవడంపైనా విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) స్పందించాడు. ‘పబ్లిక్‌ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అదీ వృత్తిలో భాగంగానే భావిస్తా. దానినుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా’ అని విజయ్‌ దేవరకొండ తెలిపాడు. మీడియా, సోషల్‌ మీడియాల్లో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఏదీ మనసుకు తీసుకోనని పరోక్షంగా తెలియజేశాడు.  ప్రేమపై షాకింగ్‌ కామెంట్స్‌ ‘హద్దులు లేని ప్రేమ’ అనే బంధంపై మీ అభిప్రాయం ఏంటని విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)ను మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దీనిపై విజయ్‌ మాట్లాడుతూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ‘అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే ఉంటే దానితోపాటే బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది’ అని విజయ్‌ తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ రష్మికను ఉద్దేశించి చేశాడా? అని కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రష్మికను అమితంగా ప్రేమించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.  నాకు అలాంటివాడే కావాలి: రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరోయిన్ రష్మిక కాబోయో వాడు ఎలా ఉండాలో స్పష్టం చేసింది. 'నా భాగస్వామి నా జీవితంలోని ప్రతీ దశలోను తోడుండాలి. అన్నివేళలా భద్రతనివ్వాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్‌ చేయాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసిఉండొచ్చు’ అని తెలిపింది. అటు ప్రేమ గురించి సైతం మాట్లాడుతూ ‘నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగిఉండడమే. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. ఒడుదొడుకుల్లో మనతో ఉండి సపోర్ట్‌ చేసేవారు ఉండాలి’ అని రష్మిక చెప్పుకొచ్చింది.  వచ్చే ఏడాదే పెళ్లి! ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న నిశ్చితార్థం (Vijay Devarakonda - Rashmika Mandanna Engagement) చేసుకోబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది.  దీనిపై త్వరలోనే రష్మిక - విజయ్‌ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ నెట్టింట పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్‌ చెప్పిన సమయం అదే కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
    డిసెంబర్ 19 , 2024
    <strong>Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి</strong>
    Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి
    బాలీవుడ్‌ నటి అర్చిత అగర్వాల్‌ (Arrchita Agarwaal) షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఆమె లీడ్‌ యాక్ట్రెస్‌గా చేసిన ‘దెస్‌పాచ్‌’ (Despatch) చిత్రం ఇటీవల జీ 5 (Zee 5) ఓటీటీలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో మనోజ్‌ బాజ్‌పాయి (Manoj Bajpayee) హీరోగా చేశారు. ఈ మూవీ సక్సెస్‌ నేపథ్యంలో బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడిన అర్చిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే తన లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలు పంచుకుంది.&nbsp; అర్చిత ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఏళ్లు అయినప్పటికీ రీసెంట్‌గా వచ్చిన 'దెస్‌పాచ్‌' (Despatch) చిత్రంతోనే ఆమె నటిగా తెరంగేట్రం చేసింది. తొలి ఫిల్మ్‌తోనే నటిగా మంచి మార్కులు సంపాదించింది.&nbsp; నటి కాకముందు కాస్ట్యూమ్‌ అసిస్టెంట్‌గా తాను వర్క్‌ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. ‘బంగిస్తాన్‌’ (2015), ‘పికు’ (2015), ‘రాయిస్‌’ (2016) తదితర చిత్రాలకు పని చేసినట్లు స్పష్టం చేసింది.&nbsp; కాస్ట్యూమ్‌ వర్క్‌లో సంతృప్తి లేకపోవడంతో నటన వైపునకు అర్చిత వచ్చింది. ఇందుకోసం అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో జాయిన్‌ అయ్యింది. అక్కడ నటనకు సంబంధించిన ఎన్నో వర్క్ షాప్స్‌లో పాల్గొంది.&nbsp; 'దెస్‌పాచ్‌'కు ముందు 2020లోనే అర్చిత (Arrchita Agarwaal)కు సినిమా ఆఫర్‌ వచ్చింది. అయితే ఎలాంటి కారణం లేకుండా తనను రిజెక్ట్‌ చేసినట్లు అర్చిత తెలిపింది. అది జరిగిన నాలుగేళ్లకు సినమా ఆఫర్‌ దక్కించుకున్నట్లు నటి తెలిపింది.&nbsp; ‘డెస్‌పాచ్‌’లో శృంగార సన్నివేశాల్లో నటించడంపైనా అర్చిత మాట్లాడింది. తనకు అసౌకర్యమైన రొమాంటిక్‌, ఇంటిమేట్‌ సీన్స్‌లో తాను చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఆడియన్స్‌ వాటిని తప్పుగా తీసుకోలేదని చెప్పుకొచ్చింది.&nbsp; వాస్తవానికి స్కూల్‌ డేస్‌ నుంచే నటి కావాలన్న కోరిక అర్చితకు ఉండేది. అయితే తాను పెద్దగా అందంగా లేనని ఆమె అనుకునేది. కానీ ఇండస్ట్రీలోనే సెటిల్‌ అవ్వాలన్న కోరిక ఉండటంతో తొలుత కాస్ట్యూమ్ అసిస్టెంట్‌గా సినిమాలకు వర్క్‌ చేసింది.&nbsp; అర్చిత అగర్వాల్‌ తండ్రి ఒక బిజినెస్‌ మ్యాన్‌. ఆమె ఎదుగుతున్న క్రమంలో ఆయన ఎన్నో ఆర్థిక నష్టాలను చూశాడు. అయినప్పటికీ ప్రయత్నం ఆపలేదని అర్చిత తెలిపింది. అతనే తనకు ప్రేరణ అని తెలిపింది.&nbsp; నటి అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు మీ చుట్టు పక్కల వారు ఎలా రియాక్ట్‌ అయ్యారు? అన్న ప్రశ్నకు అర్చిత ఆసక్తికర సమాధానం చెప్పింది.&nbsp; తాను నటి అవ్వాలని అనుకుంటున్నట్లు చిన్నప్పుడే చెప్పి ఉంటే ‘నువ్వు అనుష్క శర్మ లేదా ప్రియాంక చోప్రాలాగా లేవు’ అనే పోలికలు తన చెవిన పడేవని పేర్కొంది.&nbsp; తాను ఆ విషయం కాలేజీ డేస్‌ వరకూ దాచానని చెప్పింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోగా ‘నీకేమైనా పిచ్చా’ అన్నట్లు చూశారని చెప్పింది. నటి కావాలని కోరుకుంటున్నట్లు బంధువులకు తెలియగానే 'బట్టలు అలా వేసుకోవాలి.. ఇలా వేసుకోవాలి.. ముంబయి ఆ విధంగా జీవించాలి' అంటూ తీర్పులు చెప్పడం మెుదలుపెట్టారని అర్చిత తెలిపింది.&nbsp; అయితే ఒకటి మాత్రం నిజమని ఇండస్ట్రీలోకి రావాలంటే ‘థిక్‌ స్కిన్‌’ అవసరమని.. అది తనకు ఉందని’ అర్చిత తెలిపింది.&nbsp; ‘దెస్‌పాచ్‌’ తర్వాత ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదని అర్చిత స్పష్టం చేసింది. అయితే చాలా మంది దర్శకులతో మాట్లాడానని, తిరిగి సంప్రదిస్తామని చెప్పారని పేర్కొంది.&nbsp;
    డిసెంబర్ 18 , 2024
    <strong>Prabhas: చికిత్స కోసం జర్మనీకి ప్రభాస్‌? రాజాసాబ్‌ రిలీజ్‌ డౌటే!</strong>
    Prabhas: చికిత్స కోసం జర్మనీకి ప్రభాస్‌? రాజాసాబ్‌ రిలీజ్‌ డౌటే!
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం అతడు ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ప్రభాస్‌ నుంచి రానున్న మూవీ కావడంతో ‘రాజాసాబ్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తన కాలుకు గాయమైనట్లు ప్రభాస్ సోమవారం (డిసెంబర్‌ 16) స్వయంగా ప్రకటించడంతో ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు ఏర్పడ్డాయి.  జర్మనీలో చికిత్స హీరో ప్రభాస్ (Rebel Star Prabhas) చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చికిత్స అనంతరం కొంతకాలం పాటు ప్రభాస్‌ విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. అయితే తొలుత ప్రభాస్‌ కాలు బెణికిందని మాత్రమే వార్తలు వచ్చాయి. ప్రభాస్‌ సైతం స్వల్పగాయమే అంటూ స్పెషల్‌ నోట్‌లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే గాయం తీవ్రత పెద్దదిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.  https://twitter.com/TeluguChitraalu/status/1868623178979024900 రాజాసాబ్‌ వాయిదా? ప్రభాస్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab) చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం వేగంగా షూటింగ్‌ కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌ కాలికి గాయం కావడం షూటింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ప్రభాస్‌, కమెడియన్‌ సత్య మధ్య చాలా వరకూ సీన్స్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ జనవరి చివరి వారంలో తిరిగి షూటింగ్‌లో జాయిన్‌ అయ్యే ఛాన్స్‌ ఉందంటున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్‌ సైతం పెండింగ్‌ ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘రాజాసాబ్‌’ చెప్పిన టైమ్‌కు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాయిదా పడేందుకే ఎక్కువ ఛాన్స్ ఉందని ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గాయంపై ప్రభాస్‌ ఏమన్నారంటే? ప్రభాస్‌ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) జపాన్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే కాలికి గాయం కావడం వల్ల ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నట్లు ప్రభాస్ ఓ పోస్టు రిలీజ్‌ చేశారు. ‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ, మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయమవడంతో రాలేకపోతున్నా’ అని ప్రభాస్‌ పేర్కొన్న పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ 2025 జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది. https://twitter.com/NishitShawHere/status/1868554693749960915 నయన్‌ స్పెషల్‌ సాంగ్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్‌’ చిత్రంలో మాళవిక మోహన్‌, రిద్ది కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లేటెస్ట్ బజ్‌ ప్రకారం వీరితో పాటు నయనతార (Nayanthara) కూడా సినిమాలో యాడ్ అయినట్లు తెలుస్తోంది. నయన్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌పై ఉన్న అభిమానంతోనే ఈ స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు లేడీ సూపర్‌ స్టార్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్‌ - నయనతార కలిసి ‘యోగి’ (Yogi) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వారిద్దరు సిల్వర్‌ స్క్రీన్‌పై మెరవబోతున్నారు. 
    డిసెంబర్ 17 , 2024
    <strong>Rashmika Mandanna: ‘పుష్ప 2’ రిలీజ్‌ తర్వాత రష్మిక - విజయ్‌ దేవరకొండ పెళ్లి?</strong>
    Rashmika Mandanna: ‘పుష్ప 2’ రిలీజ్‌ తర్వాత రష్మిక - విజయ్‌ దేవరకొండ పెళ్లి?
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ చెప్పినా అభిమానులు మాత్రం నమ్మడం లేదు. వారిద్దరు కలిసి విహారయాత్రలు, రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటమే ఇందుకు కారణం. రీసెంట్‌గా 'పుష్ప 2' కి సంబంధించి జరిగిన చెన్నై ఈవెంట్‌లో రష్మిక నేరుగా విజయ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు హింట్‌ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా వీరి రిలేషన్‌ (Vijay Devarakonda - Rashmika Mandanna Engagement)కు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌ చేస్తోంది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  పుష్ప 2 రిలీజ్‌ తర్వాత నిశ్చితార్థం? అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. గత మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడిపింది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆడియన్స్‌లో భారీగా అంచనాలు పెంచేస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న నిశ్చితార్థం (Vijay Devarakonda - Rashmika Mandanna Engagement) చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 విడుదలైన డిసెంబర్‌ 5 తర్వాత ఏ క్షణమైన ఈ గుడ్‌న్యూస్‌ వినొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రష్మిక - విజయ్‌ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో రష్మిక, విజయ్‌ ఫ్యాన్స్‌ ఈ వార్త నిజం కావాలని బలంగా కోరుకుంటున్నారు. అదే జరిగితే తమ సంతోషానికి అవధులు ఉండవని కామెంట్స్ చేస్తున్నారు.  చెన్నై ఈవెంట్‌లో రష్మిక హింట్‌ కొద్దిరోజుల క్రితం చెన్నై వేదికగా జరిగిన 'పుష్ప 2' ప్రమోషనల్ ఈవెంట్‌లో రష్మిక మందన్న కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్‌ దేవరకొండతో లవ్‌&nbsp; (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. యాంకర్ అడిగిన ప్రేమ, పెళ్లి ప్రశ్నలపై ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇచ్చింది. ‘మీకు చాక్లెట్‌ బాయ్‌ అంటే ఇష్టమా? లేదా రౌడీ బాయ్‌ అంటే ఇష్టమా?’ అని అడగ్గా ‘ఆ రెండింటి కాంబినేషన్‌ అంటే ఇష్టం’ అని రష్మిక అన్నది. ‘సినీ పరిశ్రమలో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేదా బయట వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా?’ అని యాంకర్‌ ప్రశ్నించగా ‘ఇది అందరికీ తెలిసిన విషయమే’ అని నవ్వులు పూయించింది. దీంతో విజయ్‌ దేవరకొండతో ప్రేమలో ఉన్నానని రష్మిక చెప్పకనే చెప్పిందని నెటిజన్లు చర్చించుకున్నారు.&nbsp; https://twitter.com/BRKTelugu_1/status/1860986326138671208 విజయ్‌-రష్మిక రెస్టారెంట్‌ పిక్‌ వైరల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Mandanna) జోడి గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే ఒకే ఏరియా బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న వారి ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా ఇలాంటి ఫొటో ఒకటి మరోమారు నెట్టింట వైరల్ అయ్యింది. ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి ఫుడ్‌ తిన్నట్లు ఆ ఫొటోలో కనిపించింది. ఎవరో ఈ ఫొటో సీక్రెట్‌గా తీసి నెట్టింట పంచుకున్నారు. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారన్ని మాత్రం తెలియలేదు. ఇందులో విజయ్ ఫేస్‌ స్పష్టంగా కనిపించినప్పటికీ రష్మిక ఫేస్‌ సరిగా కనిపించలేదు. అయితే తాను ఫుడ్‌ తింటున్నట్లు రష్మిక ఓ ఫొటో షేర్‌ చేయగా అది ఆ రెస్టారెంట్‌లో తీసింది కావడం గమనార్హం. ఈ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి నెటిజన్లు ట్రెండ్ చేశారు. మరోమారు విజయ్‌ జోడి దొరికేసిందంటూ పోస్టులు పెట్టారు. https://twitter.com/celebspot8688/status/1860540536295424339 డేటింగ్‌పై లీక్‌ ఇచ్చేసిన విజయ్‌! రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఇటీవల 'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించాడు. ఆ సాంగ్‌ ప్రమోషన్స్ సందర్భంగా రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సింగిల్‌ కాదని, కోస్టార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇటీవల ఈ వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్‌&nbsp; 'VD12' ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది.&nbsp; ఇది పూర్తయ్యాక ఆయన మైత్రి మూవీ మేకర్స్‌లో రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారు.&nbsp; విజయ్‌ తమ్ముడితో చెప్పింది గుర్తుందా! విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన 'గం గం గణేశా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్‌ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో  రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. అప్పట్లో రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా, ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని రష్మిక చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని ‘ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా’ అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బాయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. https://twitter.com/GulteOfficial/status/1795136777625403525
    డిసెంబర్ 02 , 2024
    <strong>OG Movie: ‘ఓజీ’లో ప్రభాస్‌? సాహోతో కనెక్షన్!</strong>
    OG Movie: ‘ఓజీ’లో ప్రభాస్‌? సాహోతో కనెక్షన్!
    పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన పెండింగ్‌ ప్రాజెక్ట్స్‌ హరి హర వీరమల్లు, ఓజీ (OG Movie) చిత్రాలను ఫినిష్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్‌ ఈ వీకెండ్‌తో పూర్తవుతుందన్న వార్తలు సైతం వచ్చాయి. మరోవైపు యంగ్ డైరెక్టర్ సుజీత్‌ సైతం ‘ఓజీ’ శరవేగంగా ఫినిష్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్‌ లేని సన్నివేశాలను చకా చకా షూట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఓజీ’ సంబంధించి దిమ్మతిరిగే బజ్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమని చెప్పవచ్చు.&nbsp; ‘ఓజీ’లో ప్రభాస్‌..? పవన్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ (OG Movie) చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ అందుతోంది. ఈ సినిమాలో పాన్‌ ఇండియా స్థార్ ప్రభాస్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ప్రభాస్‌కు సంబంధించి కళ్లు చెదిరే క్యామియో ఉంటుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని కూడా ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే 'ఓజీ'పై ఉన్న అంచనాలు తారా స్థాయికి వెళ్లడం ఖాయం. ప్రభాస్‌, పవన్‌ను ఒకే స్క్రీన్‌పై చూడటం కన్నుల పండగా ఉంటుందని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/TBO_Updates/status/1862813629441011860 ‘సాహో’తో కనెక్షన్ ఉందా? ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో (Saaho) చిత్రానికి కూడా యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ (Director Sujeeth) దర్శకత్వం వహించారు. అందులో ప్రభాస్‌ను చూపించిన విధానం, మేకింగ్స్‌ స్కిల్స్‌ ఆడియన్స్‌ను చాలా ఇంప్రెస్‌ చేశాయి. అయితే ప్రభాస్‌ ‘ఓజీ’తో ‘సాహో’కి కనెక్షన్ ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘సాహో’లోని ప్రభాస్‌ పాత్ర ‘ఓజీ’లో కనిపించొచ్చని చర్చించుకుంటున్నారు. కాగా, ఆ సినిమాలో ప్రభాస్‌ సైతం గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. ఫస్టాఫ్‌ మెుత్తం పోలీసు ఆఫీసర్‌గా కనిపించి తోటి అధికారులను బురిడి కొట్టిస్తాడు. సెకండాఫ్‌లో అతడి ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్ రోల్‌ను దర్శకుడు సూజీత్‌ చూపించాడు. ఓజీలోనూ పవన్‌ గ్యాంగ్‌స్టర్‌ గానే చేస్తుండటంతో ఆ పరంగా ‘సాహో’తో ఏమైనా లింక్ ఉండే అవకాశముందని నెటిజన్లు భావిస్తున్నారు.&nbsp; https://twitter.com/GetsCinema/status/1862830321810493680 బ్యాంకాక్‌లో కలుస్తారా? ‘ఓజీ’ (OG) షూటింగ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ బయట కొచ్చింది. బ్యాంకాంక్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్‌తో పవన్‌ (Pawan Kalyan) షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్‌ వచ్చేవారంలో బ్యాంకాంక్‌ వెళ్లి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ప్రస్తుత అప్‌డేట్స్‌ ప్రకారం హీరో ప్రభాస్‌ సైతం బ్యాంకాక్‌ షూట్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. అదే జరిగితే ప్రభాస్‌, పవన్‌లను భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లో చూసే అవకాశం దక్కుతుంది. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; అకీరానందన్‌ సైతం! పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరానందన్ (Akira Nandan) ఫిల్మ్‌ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న ఓజీతోనే అకీరా తెరంగేట్రం చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సర్‌ప్రైజింగ్‌గా అకీరా నందన్‌పై షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అకీరానందన్ ఎంట్రీ వందశాతం ‘ఓజీ’తోనే ఉండనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వచ్చింది. అయితే అకీరా తెరంగేట్రాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచనున్నారట. అతడి ఎంట్రీ నేరుగా తెరపై చూడాల్సిందేనని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘ఓజీ’లో అకీరా ఏ పాత్రలో కనిపిస్తాడనేది మాత్రం ఎక్కడా రివీల్ కాలేదు.&nbsp;
    నవంబర్ 30 , 2024
    <strong>Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలే!&nbsp;</strong>
    Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలే!&nbsp;
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్‌ చేతిలో 'ఓజీ' (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ పరంగా ‘హరి హర వీరమల్లు’ చాలా అడ్వాన్స్‌గా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ ఒకటి బయటకొచ్చింది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. అందుకు కారణమెంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఫైనల్‌ షెడ్యూల్‌ షురూ పవన్‌ హీరోగా చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను క్రిష్‌, జ్యోతి కృష్ణ డైరెక్ట్‌ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుండగా తొలి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ మూవీ ఆఖరి షెడ్యూల్‌ ఈ వీకెండ్‌లో విజయవాడలో వేసిన సెట్‌లో మెుదలుకానుంది. సినిమాకు అత్యంత కీలకమైన సీన్స్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కూడా జాయిన్‌ అవుతారని టాక్‌. మెుత్తం 200 మంది ఆర్టిస్టులతో కలిసి పవన్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. యానిమల్ ఫేమ్‌ బాబి డియోల్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.దీంతో పవన్‌ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తోనే షూటింగ్ పూర్తి కానుండటంతో ఈ సినిమా రిలీజ్‌పై ఎలాంటి సందేహాం పెట్టుకోవాల్సిన పనిలేదని ఆనందిస్తున్నారు. 500 మందితో ఫైట్‌ సీన్స్‌ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని 2025 మార్చి 28న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగా సినిమాను ఫినిష్‌ చేసేందుకు గత కొంతకాలంగా చురుగ్గా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే హాలీవుడ్‌ యాక్షన్‌ దర్శకుడు నిక్‌ పావెల్‌ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలను సైతం మూవీ టీమ్‌ చిత్రీకరించింది. పవన్‌తో పాటు దాదాపు 400 నుంచి 500 మంది ఈ యుద్ధ సన్నివేశంలో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫైట్‌ సినిమాకే హైలెట్‌ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సీన్‌లో పవన్‌ యాక్షన్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుందని అంటున్నారు. కాగా, హరిహర వీరమల్లు చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా చేస్తోంది.&nbsp; బ్యాంకాక్‌ వెళ్లనున్న పవన్‌! హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu)తో పాటే ‘ఓజీ’ (OG) షూటింగ్‌ కూడా ప్యార్లర్‌గా జరుగుతోంది. యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ పవన్‌ లేని సన్నివేశాలను ఎంతో ఫాస్ట్‌గా చిత్రీకరిస్తున్నారు. మరోవైపు పవన్‌ సైతం ఈ రెండు చిత్రాలను డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌ కల్లా ఫినిష్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ వీకెండ్‌ హరి హర వీరమల్లును షూట్‌ను పవన్‌ పూర్తి చేయనున్నారు. అనంతరం ‘ఓజీ’ టీమ్‌లో పవన్‌ జాయిన్‌ కానున్నారు. బ్యాంకాంక్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్‌తో పవన్‌ షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్‌ వచ్చేవారంలో బ్యాంకాంక్‌ వెళ్లి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.&nbsp; పవన్‌తో విజయ్‌ దేవరకొండ బిగ్‌ ఫైట్‌ 2025 సమ్మర్‌ బరిలో పవన్‌ను విజయ్‌ దేవరకొండ ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్‌ కానున్న అదే డేట్‌కు విజయ్‌ నటిస్తున్న 'VD 12' కూడా విడుదల కాబోతోంది. ఆ తేదీని ‘హరి హర వీరమల్లు’ కంటే ముందే&nbsp; 'VD 12' టీమ్‌ లాక్‌ చేసింది. దీంతో పవన్‌తో విజయ్‌ దేవరకొండకు బిగ్‌ ఫైట్‌ తప్పదని చెప్పవచ్చు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp;
    నవంబర్ 28 , 2024

    @2021 KTree