రివ్యూస్
YouSay Review
The Warrior Movie Review
రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ నేడు థియేటర్లలో రిలీజైంది. తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రంగా ‘ది వారియర్’ తెరకెక్కింది. కృతిశెట్టి ఈ సినిమాల...read more
How was the movie?
తారాగణం
రామ్ పోతినేని
DSP డా. సత్యఆది పినిశెట్టి
గురూకృతి శెట్టి
విజిల్ మహాలక్ష్మిఅక్షర గౌడ
స్వర్ణనదియా
సత్య తల్లిరెడిన్ కింగ్స్లీ
జైలులో ఉన్న వ్యక్తిబ్రహ్మాజీ
దేవరాజ్జయప్రకాష్
రాబర్ట్అజయ్
రవిలాల్
కుమారప్పశరణ్య ప్రదీప్నిత్య
నాగ మహేష్
పోసాని కృష్ణ మురళి
మాధవ్రాఘవన్ మురుగన్
టీ బాయ్ఎస్పీ శ్రీకుమార్
జాన్ విజయ్
ఎస్పీ జాషువాసిబ్బంది
ఎన్. లింగుసామి
దర్శకుడుశ్రీనివాస చిట్టూరినిర్మాత
దేవి శ్రీ ప్రసాద్
సంగీతకారుడుసుజిత్ వాసుదేవ్
సినిమాటోగ్రాఫర్నవీన్ నూలి
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
2022లో మార్మోగిన పాటలు
]రామ్ పోతినేని నటించిన చిత్రంలో ఈ ఎనర్జిటిక్ పాటను తమిళ్ సూపర్ స్టార్ శింబు పాడాడు. శింబు వాయిస్తో పాటు రామ్ డాన్స్తో చాలా పాపులర్ అయ్యింది.12. బుల్లెట్ ( ది వారియర్ )Listen nowమరికొన్ని హిట్స్కల్యాణం ( సీతారామం )నీతో ఉంటే చాలు ( బింబిసార )మరికొన్ని హిట్స్నామది ( తిరు )మేఘం కరిగేనా ( తిరు )మరికొన్ని హిట్స్కోకా ( లైగర్ )విజిల్( ది వారియర్)మరికొన్ని హిట్స్రా రా రక్కమ్మ ( విక్రాంత్ రోణ )నాకోసం మారావా నువ్వు ( బంగార్రాజు )
ఫిబ్రవరి 13 , 2023
Devi Sri Prasad Hits: DSP టాప్-10 బెస్ట్ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. 1999లో విడుదలైన దేవి చిత్రంతో దేవిశ్రీ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పాటలు సూపర్హిట్ కావడంతో దేవిశ్రీ కెరీర్కు తిరుగులేకుండా పోయింది. దేవి సినిమా నుంచి రీసెంట్ వాల్తేరు వీరయ్య వరకు డీఎస్పీ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. హీరోకు తగ్గట్లు మ్యూజిక్ అందించే దేవి.. మాస్, క్లాస్, మెలోడి, ట్రెడిషనల్ సాంగ్స్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఇచ్చిన టాప్-10 సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం..
1. పూనకాలు లోడింగ్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇందులో అన్ని పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే ‘పూనకాలు లోడింగ్’ పాట మాత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించిందనే చెప్పాలి. దేవిశ్రీ సంగీతానికి తోడు చిరు, రవితేజ డ్యాన్స్ నిజంగానే థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది.
https://www.youtube.com/watch?v=4JMpHGMYm1w
2. శ్రీవల్లి
సుకుమార్ డైరెక్షన్లో అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించింది. సినిమా విజయానికి దేవిశ్రీ ఇచ్చిన పాటలు సైతం ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా ‘శ్రీవల్లి’ పాట అప్పట్లో మార్మోగింది. పందిళ్లు, శుభకార్యాలు, వేడుకలు ఇలా ఏ కార్యక్రమమైన శ్రీవల్లి పాట వినిపించాల్సిందే. ఈ పాట ద్వారా సింగర్ సిద్ శ్రీరామ్కు మంచి పేరు వచ్చింది.
https://www.youtube.com/watch?v=txHO7PLGE3o
3. బుల్లెట్ సాంగ్
రామ్ పోతినేని, కృతి శెెట్టి జంటగా నటించిన ‘వారియర్’ సినిమాలో ‘బుల్లెట్ సాంగ్’ బాగా హిట్ అయింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ పాట మాత్రం మ్యూజిక్ లవర్స్కు బాగా దగ్గరైంది. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్కు రామ్, కృతి డ్యాన్స్ తోడవడంతో ఈ సాంగ్ ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది.
https://www.youtube.com/watch?v=WgrLE4Fqxeo
4. జల జల జలపాతం నువ్వు
చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో దేవిశ్రీ ఇచ్చిన పాటలు కూాడా అంతే ఆదరణ పొందాయి. ముఖ్యంగా ‘జల జల జలపాతం’ నువ్వు అనే పాట యూత్కు చాలా బాగా కనెక్ట్ అయింది.
https://www.youtube.com/watch?v=PTpimuHzlvE
5. ఎంత సక్కగున్నావే
రామ్చరణ్లోని గొప్ప నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ‘రంగస్థలం’. ఇందులో చెర్రీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేగాక దేవిశ్రీ ఇచ్చిన పాటల్లో చరణ్ తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. ముఖ్యంగా ‘ఎంత సక్కగున్నావే’ పాట అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఇందులో సమంత హోయలు, రామ్చరణ్ ఎక్స్ప్రెషన్స్ పాటకు మరింత హైప్ తీసుకొచ్చింది.
https://www.youtube.com/watch?v=NuWs_eKu_ic
6. ప్రేమ వెన్నెల
చిరు మేనల్లుడు సాయిధరమ్ కెరీర్లో మంచి వసూళ్లను రాబట్టిన సినిమా చిత్ర లహరి. ఇందులో తేజ్ నటనతో పాటు దేవిశ్రీ సంగీతానికి ప్రేక్షుకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ‘ప్రేమ వెన్నెల’ పాట సినిమాకే హైలెట్ అని చెప్పాలి. లవ్ మెలోడీగా రూపొందిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. తేజ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడి సాంగ్గా నిలించింది.
https://www.youtube.com/watch?v=tpvNtKjlf5E
7. మైండ్ బ్లాక్
మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దేవి శ్రీ అందించిన సంగీతం ఈ సినిమాకా బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా ‘మైండ్ బ్లాక్’ పాటపై చాలా మంచి హైప్ వచ్చింది. దేవి శ్రీ ఇచ్చిన హై ఎనర్జిటిక్ మ్యూజిక్కు మహేశ్, రష్మి హై వోల్టెజ్ పర్ఫార్మెన్స్ తోడవడంతో సాంగ్ సూపర్ హిట్గా నిలిచింది.
https://www.youtube.com/watch?v=ZBDSNy4Yn9Q
8. సీటీ మార్
అల్లుఅర్జున్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి దేవిశ్రీనే సంగీతం ఇచ్చారు. ఇందులోని అన్ని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా ‘సీటీమార్’ పాట అప్పట్లో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. దేవిశ్రీ ఎనర్జీటిక్ మ్యూజిక్కు అల్లు అర్జున్ క్లాస్ స్పెప్పులు జతకావడంతో పాట రేంజ్ పెరిగిపోయింది.
https://www.youtube.com/watch?v=F5X694sak5U
9. నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ప్రభాస్ హీరోగా చేసిన వర్షం సినిమాకు దేవిశ్రీ ఫీల్గుడ్ సాంగ్స్ను అందించారు. ముఖ్యంగా హీరోయిన్ త్రిష వర్షంలో డ్యాన్స్ చేసే పాట ఎప్పటికీ దేవిశ్రీ టాప్ సాంగ్స్లో ఒకటిగా ఉంటుంది.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ సాగే ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.
https://www.youtube.com/watch?v=eUrC0jWdu-M
10. నువ్వుంటే
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని సినిమాాల్లో కెల్లా కెరీర్ స్టార్టింగ్లో చేసిన ఆర్య చిత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ ఇప్పటికీ సూపర్హిట్గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ‘నువ్వుంటే’ పాటను ఇప్పటికీ గుర్తుచేసుకొని వినేవాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రేమ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాటలో అల్లుఅర్జున్ నటన ఆకట్టుకుంటుంది.
https://www.youtube.com/watch?v=Llw7cXHmDDo
ఏప్రిల్ 04 , 2023
Virat Kohli Biopic: విరాట్ కోహ్లీగా రామ్చరణ్ సెట్ అవుతాడా? సినిమా స్టోరీ, క్లైమాక్స్, డైరెక్టర్లపై నెట్టింట్లో రచ్చ..
రామ్చరణ్.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడు. సినిమా సినిమాకు తనలోని నటుడుని మెరుగు పరుచుకుంటూ స్థాయిని పెంచుకుంటున్న హీరో. RRR తర్వాత చరణ్ మేనియా మరింత పెరిగింది. దీంతో చెర్రీ అప్కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్కి ఎనలేని ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో రామ్చరణ్ చెప్పిన చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టౌన్గా మారాయి.
అవకాశం వస్తే రన్ మెషిన్ Virat Kohli Biopicలో నటిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు చరణ్. ఎప్పటి నుంచో క్రీడా నేపథ్యం కలిగిన సినిమా చేయాలని భావిస్తున్నట్లు మనసులో మాటను బయటపెట్టాడు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ బయోపిక్ మూవీ స్టోరీ ఇలా ఉంటే బాగుంటుంది అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఫస్టాఫ్లో కథ ఇలా..
విరాట్ కోహ్లీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను సినిమాలో చూపించొచ్చు. అండర్19 వరల్డ్కప్ ఛాంపియన్, జాతీయ జట్టుకు ఎంపిక, 2011 వన్డే వరల్డ్కప్, కెప్టెన్సీ బాధ్యతలు, రికార్డులు, ఫామ్ లేమి, కమ్బ్యాక్ వంటి దశలను ఫస్టాప్లో చపిస్తే బాగుంటుంది. అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అతడి జీవితంలో కీలక ఘట్టం. దీంతో సినిమాలో లవ్ ట్రాక్కి రూట్ క్లియర్ అయినట్లే. విరాట్ కోహ్లీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. కెరీర్లో వివిధ స్థాయుల్లో కొనసాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మనోగతం ఏంటో సినిమా ద్వారా చూపించొచ్చు.
క్లైమాక్స్ ఇలా ఉంటే సూపర్బ్
భారత్కు కోహ్లీ ఎన్నో విజయాలు అందించాడు. జట్టును అత్యుత్తమంగా నడిపించాడు. కానీ, చిరస్థాయిలో నిలిచిపోయే ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోలేక పోయాడు. వన్డే, టీ20 వరల్డ్కప్, టెస్టు ఛాంపియన్షిప్.. ఇలా కీలక ట్రోఫీలన్నీ నోటిదాకా అంది చేజారిపోయినవే. ఇలాంటివి సినిమాలో మంచి ఎమోషన్స్ను పండిస్తాయి. టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్ గెలిస్తే విరాట్ బయోపిక్కి స్టోరీ లైన్ దొరుకుతుంది. అప్పుడు సినిమాకు మంచి క్లైమాక్స్ పాయింట్ దొరుకుతుంది.
బహుశా విరాట్ కోహ్లీ ఆడబోయే చివరి వన్డే వరల్డ్కప్ కూడా ఇదే అయ్యుంటుంది. మళ్ళీ వరల్డ్కప్ 2027లో జరుగుతుంది. అప్పటికి కోహ్లీ వయసు 38కి చేరుకుంటుంది. కాబట్టి ఈ వరల్డ్కప్ కోహ్లీకి గొప్ప జ్ఞాపకంగా మిగిలే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా బయోపిక్ కోసం ఈ వరల్డ్కప్ విజయాన్నే స్ఫూర్తిగా తీసుకోవచ్చు.
ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా..
విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించిన ఘటనను ఇంటర్వేల్ బ్యాంగ్గా ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ తర్వాత వరుస సెంచరీలతో కోహ్లీ కమ్ బ్యాక్ ఇచ్చిన తీరును సెకండాఫ్లో హైలెట్ చేస్తే బాగుంటుంది.
వివాదాలపై క్లారిటీ..
విరాట్ ఓ పోరాటయోధుడు. కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగాడు. అతనిపై కెప్టెన్సీ వివాదం తీవ్ర ప్రభావం చూపించింది. భారత జట్టుకు నాయకత్వ బాధ్యతల నుంచి తనను అర్ధంతరంగా తప్పించారని విరాట్ ఆరోపించాడు. అయితే, ఇది వాస్తవం కాదని అప్పటి బీసీసీఐ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో ఇలాంటి వివాదాలపై సినిమాలో ఓ క్లారిటీ ఇస్తే అది ఫలప్రదంగా ఉంటుందని విరాట్ ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.
రామ్ చరణ్- కోహ్లీ పోలికలు
రామ్చరణ్, విరాట్ కోహ్లీ ముఖ కవలికలు ఒకే విధంగా ఉంటాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ మేరకు విరాట్, చెర్రీల ఫొటోలను పక్కపక్కన పెట్టి పోల్చుతున్నారు. విరాట్ బయోపిక్ని చేయడానికి చరణ్ సరిగ్గా నప్పుతాడని అంటున్నారు.
https://twitter.com/Thyview/status/1636936587237003264?s=20
చరణ్లోనూ క్రికెటర్..
రామ్చరణ్లోనూ ఓ క్రికెటర్ ఉన్నాడు. సెలబ్రిటీల కోసం జరుపుతున్న ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’లోనూ చరణ్ పాల్గొన్నాడు. తెలుగు వారియర్స్ తరఫున కొన్ని మ్యాచ్లు ఆడాడు. క్రికెట్ ఆడటం చరణ్కి అలవాటే కాబట్టి విరాట్ స్టైల్లో షాట్లు ఆడగలడని చెబుతున్నారు.
https://twitter.com/AlwysVenuCharan/status/1337393959786532867?s=20
ఫిట్నెస్..
విరాట్ కోహ్లీ ఫిట్నెస్కి కేరాఫ్ అడ్రస్లా ఉంటాడు. రామ్చరణ్కూ ఫిట్నెస్ మెరుగ్గా ఉంటుంది. క్రికెట్ ఆడాలన్నా, ఆడుతున్నట్లు నటించాలన్నా ఫిట్నెస్ అవసరం. కొన్ని షాట్లు ఎక్కువ టేక్లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలోనూ చరణ్ మనుగడ సాగించగలడు.
https://twitter.com/BingedHelps/status/1636943158197252097?s=20
ఈ డైరెక్టర్లు కావాలంట..
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును టేకప్ చేయడం కూడా డైరెక్టర్లకు ఒక సవాళే. కాబట్టి, ఫ్యాన్స్ కొందరి డైరెక్టర్ల పేర్లు సూచిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి పేరు ముందుగా వినిపిస్తోంది. ఎం.ఎస్ ధోనీ సినిమా తీసిన ‘నీరజ్ పాండే’కు అనుభవం కలిసొస్తుంది. ఇక విలక్షణ దర్శకుడు సుకుమార్ ఈ ప్రాజెక్టును మరో స్థాయికి తీసుకెళ్తాడని భావిస్తున్నారు. హీరోయిజంను పండించే సందీప్ రెడ్డి వంగా, పూరీ జగన్నాథ్; కొరటాల శివ, గౌతమ్ మీనన్, ప్రశాంత్ నీల్, హను రాఘవపూడి పేర్లను సూచిస్తున్నారు.
హీరోయిన్లు..
విరాట్ బయోపిక్లో హీరోయిన్గా పూర్తిగా న్యాయం చేయగలిగే నటి అనుష్క శర్మనే. విరాట్ రియల్ లైఫ్ పార్ట్నర్ కావడం ఈమెకు ప్లస్ పాయింట్. పైగా తన అనుభవం కూడా సినిమాకు పనికొస్తుంది. కృతిసనన్, శ్రద్ధా కపూర్, లవ్టుడే నటి ఇవానా, కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ ఈ పాత్రలకు సెట్ కాగలరని ఊహిస్తున్నారు.
మార్చి 18 , 2023
This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్’, ‘ది గోట్ లైఫ్’.. అటు ఓటీటీలో ఏవంటే?
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్సిరీస్లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లో రిలీజయ్యే చిత్రాలు
ది గోట్లైఫ్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్లైఫ్’. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్ తెలిపింది.
టిల్లు స్క్వేర్
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). బ్లాక్ బాస్టర్ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా ఇది రూపొందింది. మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్
మరో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ సిద్ధమైంది. ఆడమ్ విన్గార్డ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది.
కలియుగం పట్టణంలో
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్లు
సుందరం మాస్టర్
వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్ కానుంది.
ఏం చేస్తున్నావ్?
విజయ్ రాజ్కుమార్, నేహా పటాని జంటగా భరత్ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’ (Em chesthunnav OTT Release). నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది.
ట్రూ లవర్
జై భీమ్, గుడ్నైట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కె.మణికందన్ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్రభురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ లవర్’.. మార్చి 27న డిస్నీ+హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
మార్చి 25 , 2024
Rashmika Mandanna: విజయ్, రష్మిక దొరికిపోయారుగా..ఇవిగో సాక్ష్యాలు!
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఏదోక రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేకపోయినా.. సహజీవనం మాత్రం చేస్తున్నారంటూ తాజాగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలో విజయ్, రష్మికలు షేర్ చేసుకున్న సోషల్ మీడియా పోస్టులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి.
https://twitter.com/middaygujarati/status/1746832311000400204?s=20
విజయ్, రష్మికలు సీక్రెట్గా వియత్నాం వెకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ విడివిడిగా తమ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టులను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఒకే బ్యాక్గ్రౌండ్తో వీరిద్దరూ పలుమార్లు విడివిడిగా ఫోటోలను షేర్ చేశారు. దీంతో వీరు లివింగ్ రిలేషన్షిప్ (సహజీవనం) చేస్తున్నారంటూ నేషనల్ మీడియా కోడై కూస్తోంది. అందుకే వారు పెళ్లికి ఆసక్తి చూపడం లేదని చెప్పుకొస్తోంది.
విజయ్, రష్మిక ఎంగేజ్మెంట్ గురించి వార్తలు కూడా ఇటీవల తెగ వైరల్ అయ్యాయి. ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై విజయ్, రష్మిక ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే విజయ్ టీమ్ మాత్రం అవి కేవలం రూమర్స్ మాత్రమేనని ఇందులో నిజం లేదని కొట్టిపారేసింది.
అయితే విజయ్, రష్మిక రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని వారి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం వారు చాలా హ్యాపీగా ఉన్నారని ఇప్పట్లో ఎంగేజ్మెంట్ చేసుకునే ఆలోచన వారికి లేదని తెలిపారు. ఈ జంట ఫోకస్ ప్రస్తుతం కెరీర్పై ఉందని, సినిమాల్లో నటిస్తూ బిజీగా వారు ఉన్నారని గుర్తుచేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల రష్మిక.. రణబీర్ కపూర్తో జోడీకడుతూ ‘యానిమల్’ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన ‘యానిమల్’ వరల్డ్లో గీతాంజలి పాత్రలో రష్మిక నటన చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
యానిమల్ సినిమాకు ఎంత నెగిటివిటీ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పాపులారిటీ మాత్రం సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో ‘పుష్ప ది రూల్’తో పాటు ‘రెయిన్బో’, ‘ది గర్ల్ఫ్రెండ్’, ‘ఛావ’ అనే సినిమాలు ఉన్నాయి.
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది సమంతతో చేసిన ఖుషి చిత్రం పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.
విజయ్ ప్రస్తుతం ‘గీతా గోవిందం’ డైరెక్టర్ పరశురామ్తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ లైన్లో పెట్టాడు.
జనవరి 18 , 2024
Sonakshi Sinha: సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ టార్గెట్ చేసిన నెటిజన్లు.. అసలు నిజం ఇదే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) అనే బాలీవుడ్ నటుడితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్న సోనాక్షి.. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంది. జూన్ 23న కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోనాక్షి నెట్టింట పంచుకోవడంతో పెళ్లి విషయం వెలుగుచూసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆసుపత్రి బయట సోనాక్షి సిన్హా కనిపించడం చర్చనీయాశంగా మారింది. పెళ్లైన ఐదు రోజులకే సోనాక్షి గర్భవతి అయ్యిదంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో వాస్తవమెంతా? సోనాక్షి ఎందుకు ఆస్పత్రికి వెళ్లింది? అందుకు గల కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
ఆస్పత్రి వీడియో వైరల్
ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తాజాగా నటి సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ ఇక్బాల్తో కలిసి వెళ్లారు. దీంతో ఆమెకు పెగ్నెన్సీ వచ్చిందన్న రూమర్లు ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది. దీంతో పెళ్లైన ఐదు రోజులకే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. చెకప్ చేయించుకోవడం కోసమే నవ దంపతులు ఆసుపత్రికి వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లై వారం కాకుండానే ప్రెగ్నెంట్ కావడం ఏంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
https://twitter.com/i/status/1806851946453574006
https://twitter.com/kapil9994/status/1806705767241715793
నిజం ఏంటంటే?
ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా.. సోనాక్షి సిన్హాకు స్వయానా తండ్రి. అయితే ఒత్తిడి కారణంగా శత్రుఘ్న కాస్త అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబయిలో కోకిలా బెన్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తండ్రిని యోగ క్షేమాలు తెలుసుకునేందుకు సోనాక్షి సిన్హా తన భర్తతో ఆసుపత్రికి వెళ్లినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాయి. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ కాదని క్లారిటీ ఇచ్చాయి.
విందుతో పరిచయం
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఓ విందులో తొలిసారి సోనాక్షి, జహీర్ ఇక్బాల్ కలిశారు. అక్కడ ఏర్పడిన పరిచయం తొలుత స్నేహంగా మారింది. రెండేళ్ల క్రితం ఇద్దరూ కలిసి 'డబుల్ ఎక్సెల్' ఫిల్మ్ కూడా చేశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురుంచినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే వారికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లితో ఈ రూమర్లకు సోనాక్షి జంట బ్రేక్ వేసింది. అయితే పెళ్లికి ముందే కాబోయే శ్రీమతికి రూ.3 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును జహీర్ గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
సోనాక్షి స్టార్డమ్
శత్రుఘ్న సిన్హా నట వారసురాలిగా సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి చిత్రం 'దబాంగ్' (Dabangg) బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన రాజో పాండే పాత్రలో సోనాక్షి అదరగొట్టింది. తన తర్వాతి చిత్రం అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో ‘రౌడీ రాథోడ్’ (Rowdy Rathore)లో కనిపించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు మారిపోయింది. ఆ తర్వాత వరుసగా ఓమై గాడ్, దబాంగ్ 2, యాక్షన్ జాక్సన్, లింగా, అకిరా, ఫోర్స్ 2, దంబాగ్ 3, డబుల్ ఎక్స్ఎల్ చిత్రాలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కకుడా, నికితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్నెస్ చిత్రాల్లో సోనాక్షి నటిస్తోంది.
జూన్ 29 , 2024
Oscar Award Winning Movies 2024: ఆస్కార్ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. ఇక ఆస్కార్ దక్కించుకున్న సినిమా అంటే వారి ఆసక్తి ఇక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయా చిత్రాలు అవార్డు సాధించేంత స్పెషాలిటీ ఆ సినిమాల్లో ఏముందోనని తెలుసుకునేందుకు వారు తెగ వెతికేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో అంగరంగ వైభవంగా అస్కార్ వేడుకలు జరిగాయి. ఇందులో 10 చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆయా చిత్రాల విశేషాలను YouSay మీ ముందుకు తెచ్చింది. అంతేకాకుండా ఆస్కార్కు నామినేట్ అయినా చిత్ర వివరాలను సైతం ఈ కథనంలో పొందుపరిచింది. ఆయా సినిమాల కథ, ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది అన్న విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆస్కార్ గెలిచిన చిత్రాలు
ఓపెన్ హైమర్ (Oppenheimer)
అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రానికి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోపర్ నోలాన్ (Christopher Nolan) దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే ఈ సినిమా.. ప్రముఖ అమెరికన్ సైంటిస్ట్ జె. రాబర్ట్ ఓపెన్హైమర్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్గా అతడి జర్నీ ఎలా మెుదలైంది? అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జపాన్లోని హీరోషిమా - నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? ఆ దాడి తర్వాత ఓపెన్హైమర్ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపే అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్ తో చూడొచ్చు. అయితే మార్చి 21 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది.
బార్బీ (Barbie)
గ్రెటా గర్విగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఒక ఫాంటసీ కామెడీ ఫిల్మ్. ఒక ట్రాన్స్ జెండర్ ఓ బార్బీ మధ్య జరిగే కథ ఇది. బార్బీ డాల్స్ కోసం నిజంగా ఒక లోకం ఉంటే... తన లోకం వదిలి సదరు బార్బీ డాల్ భూలోకంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది. బార్బీ డాల్ పట్ల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది. అసలు బార్బీ తన ప్రపంచం వదిలి భూలోకంలోకి ఎందుకు వచ్చింది? వంటి విషయాల సమాహారమే ఈ మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ‘బార్బీ’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ‘జియో సినిమా’ ఓటీటీ వేదికలో వీక్షించవచ్చు.
పూర్ థింగ్స్ (Poor Things)
ఈ సినిమా కథలోకి వెళ్తే.. అసాధారణ శాస్త్రవేత్త గాడ్విన్ బాక్స్టర్.. చనిపోయిన యువతికి తిరిగి జీవం పోస్తాడు. ఆమె మెదడును కడుపులో ఉన్న బిడ్డతో అనుసంధానం చేస్తాడు. దీంతో శిశువు తెలివితేటలు అసాధారణంగా పెరిగిపోతాయి. బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రయాణం మెుదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని డిస్నీ + హాట్స్టార్లో చూడవచ్చు.
అమెరిన్ ఫిక్షన్ (American Fiction)
అమెరికన్ ఫిక్షన్ సినిమా.. ఓ నవలా రచయిత చుట్టూ తిరుగుతుంది. కథలోకి వెళ్తే.. మాంక్ ఒక తెలివైన గొప్ప నవలా రచయిత. అతడి నవలలకు అకాడెమిక్ ప్రశంసలు లభించినా ప్రచురణకు మాత్రం పెద్దగా నోచుకోవు. నల్లజాతీయుడు కావడం చేత మాంక్కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీంతో విసుగు చెందిన మాంక్.. మనసు లోతుల్లో ఎప్పటి నుంచో దాగున్నా అభిప్రాయాలను ఓ పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో మాంక్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది.
అనాటమి ఆఫ్ ఏ ఫాల్ (Anatomy of a Fall)
ఈ సినిమా మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందింది. కథలోకి వెళ్తే.. శామ్యుల్, శాండ్రా భార్య భర్తలు. వారిద్దరు తమ బిడ్డ డానియేల్తో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు అనుమానస్పద స్థితిలో శామ్యుల్ చనిపోతాడు. పోలీసులు అతడి భార్య శాండ్రాపై అనుమానం వ్యక్తం చేస్తారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? శామ్యుల్ను హత్య చేసింది ఎవరు? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (The Zone of Interest)
కమాండెంట్ రూడొల్ఫ్ హాస్ తన భార్య, పిల్లలతో కలిసి చెరువుకు ఆనుకొని ఉన్న ఇంటిలో జీవిస్తుంటాడు. అతడి ఇంటి ఆవరణలో ఉండే గార్డెన్లో కొందరు బానిసలు పనిచేస్తుంటారు. ఓ రోజు చెరువులో తన పిల్లల మృతదేహాలు రుడోల్ఫ్కు కనిపిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లో ఉంది.
ది హోల్డోవర్స్ (The Holdovers)
టీచర్, స్టూడెంట్కు మధ్య ఉండే సంబంధాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ప్రిపరేషన్ స్కూల్లో క్రాంకీ హిస్టరీ టీచర్గా పనిచేస్తుంటాడు. అతడంటే విద్యార్థులకు చాలా భయం. స్కూల్కు క్రిస్మస్ సెలవులు రావడంతో కొందరు విద్యార్థులు హాలీడేస్కు వెళ్లలేకపోతారు. వారికి గార్డియన్గా క్రాంకీ ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో టీచర్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో రెంటల్ విధానంలో చూడవచ్చు.
మ్యాస్ట్రో (Maestro)
ఈ చిత్రం అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందింది. కండక్టర్ - స్వరకర్త లియోనార్డ్ బెర్న్ స్టెయిన్ ఓ కార్యక్రమంలో నటి ఫెలిసియాను చూసి మనసు పడతాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడటంతో ఇద్దరూ డేటింగ్కు వెళ్తారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారు. వారి వైవాహిక బంధం ఎంత మధురంగా సాగింది? ఈ ప్రయాణంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? అన్నది కథ. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లో ఉంది.
కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ (Killers of the Flower Moon)
లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1920లో ఒక్లాహోమాలోని ఓసేజ్ నేషన్ ల్యాండ్ కింద చమురు బయటపడుతుంది. ఆ తర్వాత నుంచి ఆ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఎఫ్బీఐ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ప్లాట్. ప్రస్తుతం ఈ సినిమా ఆపిల్ టీవీ ప్లస్లో అందుబాటులో ఉంది.
ఆస్కార్ నామినేషన్స్లో నిలిచిన చిత్రాలు
ఆస్కార్ గెలిచిన చిత్రాలతో పాటు ఈ అవార్డుల రేసులో నిలిచిన మరికొన్ని చిత్రాల విశిష్టతను ఓసారి తెలుసుకుందాం.
పాస్ట్ లైవ్స్ (Past Lives)
నోరా, హే సంగ్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. నోరా కుటుంబం దక్షిణ కొరియాకు వెళ్లిపోవడంతో వారు విడిపోతారు. ఇరవై సంవత్సరాల తర్వాత వారు తమ ఒకరికొరు ప్రేమలు ఉన్నట్లు గ్రహిస్తారు. వారు తిరిగి ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్లో రెంటల్ విధానంలో చూడవచ్చు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది.
సొసైటీ ఆఫ్ ది స్నో (Society of the Snow)
రగ్బీ బృందంతో ప్రయాణిస్తున్న విమానం.. ప్రమాదవశాత్తు ఆండీస్ మంచు పర్వతాల్లో కుప్పకూలుతుంది. ఈ ప్రమాదం నుండి కొందరు ప్రయాణికులు బయటపడతారు. అత్యంత కష్టతరమైన వాతావరణంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. బాహ్య ప్రపంచానికి తాను బతికే ఉన్నామని చెప్పేందుకు వివిధ రకాలు అన్వేషిస్తారు. మరి వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.
లో క్యాపిటనో (Lo Capitano)
వలసదారులు పడే కష్టాలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. ఇద్దరు నల్లజాతి యువకులు యువకులు చేసే సాహస యాత్రనే ఈ చిత్రం కథ. యూరప్ చేరుకోవడానికి డాకర్ నుండి ఇద్దరు యువకులు సెడౌ, మౌసా బయలుదేరుతారు. గమ్యాన్ని చేరుకునే క్రమంలా వారికి ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎలా అధిగమించారు? చివరికి వారు యూరప్ చేరుకున్నారా? లేదా? అన్నది ప్లాట్.
పర్ఫెక్ట్ డేస్ (Perfect Days)
ఆస్కార్ నామినేషన్లో నిలిచి ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హిరాయామా అనే వ్యక్తి టోక్యోలో టాయిలెట్ క్లీనర్గా పని చేస్తూ సంతృప్తికరమై జీవితాన్ని అనుభవిస్తుంటాడు. క్యాసెట్ టేపులలో సంగీతాన్ని వింటూ, పుస్తకాలు చదువుతూ హాయిగా రోజులు గడుపుతుంటాడు. కొన్ని ఊహించని ఘటనలు అతడి జీవితంలో ఎనలేని మార్పులను తీసుకొస్తాయి.
ది టీచర్స్ లాంజ్ (The Teachers' Lounge)
కర్నా నోవాక్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటుంది. ఆమె స్టూడెంట్స్లో ఒకరు దొంగతనానికి సంబంధించి అనుమానితుడుగా ఉంటాడు. నిజా నిజాలు తెల్చేందుకు ఆమె రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్లో వీక్షించవచ్చు.
మార్చి 11 , 2024
Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!
ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతుండటంతో కొన్ని మూవీస్ ఆటోమేటిక్గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్తో వచ్చినా కూడా అవి అండర్ రేటెట్ ఫిల్మ్స్గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్లో వీక్షించవచ్చు.
కంచె (Kanche)
వరణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ కంచె. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్స్టార్లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్ తేజ్).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya)
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ.
పలాస 1978 (Palasa 1978)
రక్షిత్ అట్లూరి హీరోగా కరుణ కుమార్ డైరెక్షన్ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
మను (Manu)
బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్గా చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్ ఫండింగ్ రూపంలో నిర్మించారు. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీని చూడవచ్చు. కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
చక్రవ్యూహం: ది ట్రాప్ (Chakravyuham: The Trap)
అజయ్ లీడ్ రోల్లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్ (సుదీష్)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్, అమృత శ్రీనివాసన్ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్తో ఉండే హీరో లైఫ్లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
క్షణం (Kshanam)
అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
మే 04 , 2024
Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
యూట్యూబర్, బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ తనను మోసం చేశాడంటూ డాక్టర్ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్తో పాటు షణ్ముఖ్ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు.
‘గంజాయి తీసుకుంది నిజమే’
యాంకర్ ధనుష్.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్బాస్ ఫేమ్ గలాటా గీతు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.
ఆ వార్తలు అవాస్తవం : గీతూ
అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్ మాట్లాడారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్ రిలేషన్లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్ స్నేహితుల్లో ఒకరికి ఫోన్ చేసిందని తెలిపారు. వినయ్ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు.
‘అలా చేయడం సరికాదు’
ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.
మౌనిక చేసిన ఆరోపణలు ఇవే!
బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్తో పాటు షణ్ముఖ్పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్ భయపెట్టి అబార్షన్ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్ దగ్గర గంజాయి, డ్రగ్స్ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్ షణ్ముఖ్కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.
షణ్ముఖ్కు ఇది తొలిసారి కాదు!
షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్ బిగ్బాస్ సీజన్-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్మేట్ సిరి హనుమంత్తో హద్దులు మీరడంతో విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ రన్నర్ కావాల్సి వచ్చింది. ఆ సీజన్ విజేతగా సన్నీ నిలిచాడు.
బిగ్బాస్ ఎఫెక్ట్తో బ్రేకప్!
బిగ్బాస్ వెళ్లడానికి ముందు వరకూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దీప్తి సునైనాతో షణ్ముఖ్ డీప్ లవ్లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్ పడింది. అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో అన్న సంపత్ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది.
షణ్ముఖ్తో క్లోజ్.. వైష్ణవి లవ్ బ్రేకప్!
బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్ సిరీస్లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్తో చేసిన ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ సిరీస్ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్ రీల్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ సిరీస్కు ముందు వైష్ణవి.. బిగ్బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్సేతో చాలా క్లోజ్గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు సోషల్ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్వేర్ డెవలపర్ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్గా ఉండటంతో మెహబూబ్ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్ వచ్చాయి.
షణ్మఖ్ను ఫేమస్ చేసిన సిరీస్లు ఇవే!
2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ (The Software Developer) అతడి కెరీర్ను మలుపు తిప్పింది. యూత్లో ఎనలేని క్రేజ్ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్’ వంటి యూట్యూబ్ సిరీస్లలో నటించి షణ్ముఖ్ తన క్రేజ్ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్తోనూ షణ్మఖ్ మంచి పేరు సంపాదించాడు.
ఫిబ్రవరి 23 , 2024
The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్ క్లియర్ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం.
వివాదానికి బీజం:
సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.
కేరళ సీఎం ఆగ్రహం
'ది కేరళ స్టోరీ' ట్రైలర్.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.
సినిమాను బ్యాన్ చేయాలి
‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్, డీవైఎఫ్ఐ, ఐయూఎంఎల్ వంటి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.
తమిళనాడు అలెర్ట్
ది కేరళ స్టోరి రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్ సెల్వన్-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి.
సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు
‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.
సుప్రీంకోర్టు స్పందన
‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. మీరు దీని విడుదలను సవాల్ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది.
మే 03 , 2023
Deviyani Sharma: “సేవ్ ది టైగర్స్” ఫేమ్ దేవియాని శర్మ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers S1 & S2)సిరీస్తో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ‘దేవియాని శర్మ’ (Deviyani Sharma). ఇందులో చైతన్య కృష్ణ (Chaitanya Krishna)కు జోడీగా నటించిన ఈ భామ.. తన గ్లామర్తో ఆకట్టుకుంది. నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు (Some Lesser Known Facts about Deviyani Sharma) సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేవియాని శర్మ ఎవరు?
టాలీవుడ్కు చెందిన ప్రముఖ యువ నటి.
దేవియాని శర్మ ఎక్కడ పుట్టింది?
న్యూఢిల్లీ
దేవియాని శర్మ పుట్టిన తేది?
మే 30, 1993
దేవియాని శర్మ వయసు ఎంత?
ఈ భామ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు (2024)
దేవియాని శర్మ తల్లిదండ్రులు ఎవరు?
సునీల్ శర్మ, నీనా శర్మ
దేవియాని శర్మ తోబుట్టువులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఒక సోదరి ఉంది. ఆమె పేరు సోనం శర్మ
దేవియాని శర్మ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?
ఈ నటి విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది.
దేవియాని శర్మ ఏం చదివింది?
ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది.
దేవియాని శర్మ ఎత్తు ఎంత?
165 సెం.మీ
దేవియాని శర్మ ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది?
2019 నుంచి ఆమె హైదరాబాద్లోనే నివసిస్తోంది.
దేవియాని శర్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది?
కెరీర్లో ప్రారంభంలో ఈ బ్యూటీ మోడల్గా చేసింది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో సైతం నటించింది.
దేవియాని శర్మ తొలి చిత్రం?
2020లో వచ్చిన ‘భానుమతి & రామకృష్ణ’ (Bhanumathi & Ramakrishna)సినిమాలో ఓ అతిధి పాత్రతో తొలిసారి తెరంగేట్రం చేసింది.
దేవియాని శర్మ తొలి వెబ్సిరీస్?
2020లో జీ5లో స్ట్రీమింగ్లోకి వచ్చిన 'అనగనగా' (Anaganaga).. ఆమె చేసిన తొలి సిరీస్. ఇందులో లీడ్ రోల్లో కనిపించి దేవియాని గుర్తింపు పొందింది.
దేవియాని శర్మ ఇప్పటివరకూ చేసిన చిత్రాలు/ సిరీస్లు?
‘భానుమతి & రామకృష్ణ’, 'రొమాంటిక్' (Romantic), సైతాన్ (Shaitan), సేవ్ ద టైగర్స్ 1 & 2 (వెబ్సిరీస్)
దేవియాని శర్మకు పాపులారిటీ తీసుకొచ్చిన చిత్రం/ వెబ్సిరీస్?
హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్లోకి వచ్చిన ‘సేవ్ ద టైగర్స్’ ఆమెకు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సిరీస్ ద్వారా అందం, అభినయంతో దేవియాని యూత్ను ఆకర్షించింది.
దేవియాని శర్మ హామీలు ఏంటి?
దేవియానికి ట్రావెలింగ్, పెయింటింగ్ అంటే చాలా ఇష్టమట.
దేవియాని శర్మకు ఇష్టమైన పెంపుడు జంతువు?
డాగ్
దేవియాని శర్మ పేవరేట్ హీరో, హీరోయిన్ ఎవరు?ఈ విషయాన్ని దేవియాని శర్మ ఏ ఇంటర్యూలోనూ పంచుకోలేదు.
దేవియాని శర్మ ఇన్స్టాగ్రామ్ ఖాతా?
https://www.instagram.com/deviyyani/?hl=en
https://www.youtube.com/watch?v=4ZnkBGYa4Gg
ఏప్రిల్ 04 , 2024
The Goat Life Review: పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ బెస్ట్ నటన.. ‘ది గోట్ లైఫ్’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, జిమ్మీ జీన్ లూయీస్, లీనా, సంతోష్ కీఝాత్తూర్, అకేఫ్ నజీం, శోభా మోహన్ తదితరులు
దర్శకుడు : బ్లెస్సీ
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రఫీ : సునీల్ కే.ఎస్
నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయీస్, స్టీవెన్ ఆడమ్స్, కే.జీ అబ్రహం
విడుదల తేదీ : 28-03-2024
‘సలార్’తో (Salaar) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అంతకుముందు అతడు చేసిన మలయాళ చిత్రాలు తెలుగులో డబ్ అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. సలార్లో ప్రభాస్ ఫ్రెండ్గా నటించి తాజాగా మంచి పేరు గుర్తింపు సంపాదించాడు. తాజాగా అతడు నటించిన ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ (The Goat Life : Aadujeevitham) మలయాళంతో పాటు తెలుగులోనూ ఇవాళ రిలీజైంది. బెన్యామిన్ రచించిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది (The Goat Life Review In Telugu)? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే.. కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి? బానిస సంకెళ్ళ నుండి నజీబ్ ఎలా బయటపడ్డాడు? తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను నజీబ్ కలుసుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే?
‘ది గోట్ లైఫ్’ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ను తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేము. అంతగా ఆ పాత్రలో లీనమై నటించాడు పృథ్వీ. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన జీవించేశాడు. కెరీర్ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. నటి అమలా పాల్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆమె తన పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాకు మనసులను హత్తుకునే కథను ఎంచుకున్నాడు. బానిసల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లకు కట్టాడు. ఫస్టాఫ్లో పృథ్వీ సౌదీకి రావడం.. అతడి పాస్పోర్టును లాక్కొని బానిసగా మార్చడం వంటివి చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు వచ్చే సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. సౌదీలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో కూడా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. సెకండాఫ్లో ఆ బానిస సంకెళ్ల నుంచి హీరో తప్పించుకోవడం, కనుచూపు మేర కనిపించే ఏడారిలో అతడు పడే కష్టాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇసుక తుఫాను సీక్వెన్స్ను చాలా బాగా తెరకెక్కించాడు డైరెక్టర్. అయితే సినిమాలో సింహాభాగం అంతా పృథ్వీరాజ్ పడే కష్టాలే చూపించడం ఆడియన్స్కు బోర్ కొట్టిస్తుంది. పైగా సినిమా స్లో నేరషన్తో మరి నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సుదీర్ఘమైన సినిమాను చూసినట్లు ఆడియన్స్ ఫీలవుతారు. కమర్షియల్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ది గోట్ లైఫ్’ అంతగా రుచించకపోవచ్చు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (The Goat Life Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అటు సినిమాట్రోగ్రాఫర్ కూడా చక్కటి ప్రతిభను కనబరిచాడు. సౌదీలోని ఎడారి పరిస్థితులను ఆ తన కెమెరా కళ్లతో అద్భుతంగా చూపించాడు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ అందించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రృథ్వీరాజ్ సుకుమారన్ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
స్లో నారేషన్కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 28 , 2024
అవతార్-2 కోసం ఎదురుచూస్తున్నారా? ఆలోపు ఈ 10 Sci-Fi సినిమాలు చూసేయండి
]గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ vol.1 (2014 )2001: ఏ స్పేస్ ఒడిస్సే ( 1968 )
ఫిబ్రవరి 14 , 2023
Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్.. రేపు ఎప్పుడంటే?
టాలీవుడ్లో రానున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ (Pushpa : The Rule) ఒకటి. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న దీని కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇటీవలే ‘పుష్ప 2 ‘టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా అది పాన్ ఇండియా స్థాయిలో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇదే ఊపులో రెండో సింగిల్కు కూడా చిత్ర యూనిట్ ముహోర్తం ఖరారు చేసింది.
రిలీజ్ ఎప్పుడంటే!
‘పుష్ప 2’ సెకండ్ సింగిల్ను రేపు (మే 23) ఉదయం 11:07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇందులో రష్మిక మందనతో బన్నీ చిందేయబోతున్నట్లు చెప్పింది. ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్ను ఫిదా చేస్తుందని చెప్పుకొచ్చింది. ‘పుష్ప పుష్ప..' సాంగ్తో ఇటీవల పుష్ప రాజ్ దుమ్మురేపాడు. ఇప్పుడు శ్రీవల్లి తన సామితో కలిసి మన మనసులు కొల్లగొట్టబోతుంది అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది. #Pushpa2SecondSingle హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ఆ పాటను మరిపిస్తుందా!
పుష్ప సినిమాలోని 'నా సామీ రారా సామీ' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్ మెలోడీగా వచ్చిన ఈ పాట అప్పట్లో యూత్ను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రష్మిక నడుమును బెండ్ చేసి వేసే హుక్ స్టెప్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ స్టెప్ను అప్పట్లో యూత్ రీల్స్ చేసి తెగ ట్రెండ్ చేశారు. ఇప్పుడు ‘పుష్ప 2’ నుంచి రాబోతున్న సెకండ్ సింగిల్.. రొమాంటిక్ సాంగ్ కావడంతో ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ‘నా సామి రారా సామీ’ రేంజ్లోనే ఈ పాట ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
https://www.youtube.com/watch?v=vdY5SFZBgnk
ఐటెం సాంగ్పై ఫోకస్! (Pushpa 2 Item Song)
‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ ఇప్పటికే విడుదలవ్వగా.. రొమాంటిక్ పాట రేపు (మే 23) ఫ్యాన్స్ను అలరించనుంది. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ దృష్టి ఐటెం సాంగ్ వైపు మళ్లింది. పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' సాంగ్ ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందే అందరికీ తెలిసిందే. ఇందులో సమంత (Samantha)తో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో 'పుష్ప 2' అదే రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఈ మూవీలో ఐటెం సాంగ్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అదే సమయంలో మరో నటిని తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించలేదు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్ కానుండటంతో త్వరగా సాంగ్ను రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
మే 22 , 2024
అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?
డిజిటల్ విప్లవంలో భాగంగా వచ్చిన కీలక మార్పు ఓవర్ ది టాప్(OTT). ఒకప్పుడు సినిమాలు థియేటర్లు, టీవీల్లోనే ప్రసారమయ్యేవి. కానీ, OTT వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ఫోన్ వినియోగంతో ఓటీటీ వినియోగం ఊపందుకుంది. అయితే, ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చ ఊపందుకుంది.
ఓటీటీ ప్లాట్ఫాంలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ, విస్తృతంగా ప్రజలకు చేరువయ్యింది మాత్రం కరోనా కాలంలోనే. థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేక్షకులకు వినోదం దూరమైంది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీవీల్లో, ఫోన్లలో సినిమాలు, సిరీస్లు చూడటానికి చాలామంది అలవాటు పడ్డారు. ఒక్కసారిగా యూజర్ బేస్ పెరిగిపోవడంతో ఓటీటీ ప్లాట్ఫాంలు ప్రేక్షకుడిని మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే, ఈ మార్కెట్ బిజినెస్ పెంచుకునే క్రమంలో కంటెంట్ పరంగా కొన్ని సంస్థలు దిగజారాయి. యూజర్లను త్వరగా అట్రాక్ట్ చేయడానికి బూతు పదాలు, బోల్డ్ సన్నివేశాలను ఎంకరేజ్ చేశాయి.
ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్కు సెన్సార్షిప్ లేదు. దీంతో విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఫిల్మ్ మేకర్స్కి పూర్తిగా రెక్కలొచ్చాయి. జనాలు ఆదరిస్తుండటం వీరికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. నటీనటులు కూడా ఇందుకు తగ్గట్టు నడుచుకోవాల్సి వచ్చింది. చిలికి చిలికి గాలివాన అయినట్లు క్రమంగా అసభ్యకర సన్నివేశాలు, బూతులు, అశ్లీలత, హింస తీవ్రత పెరిగిపోయింది. బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించని పదజాలాన్ని వాడేలా వ్యూయర్స్పై ఓటీటీ సిరీస్లు తీవ్ర ప్రభావం చూపాయి. తాజాగా వచ్చిన ‘రానానాయుడు’ ఇందుకు ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు.
ఈ సిరీస్పై ఒకప్పటి స్టార్ హీరోయిన్, బీజేపీ నేత విజయశాంతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
సెన్సార్షిప్ ఎందుకు లేదు?
ఓటీటీలకు సెన్సార్షిప్ ఇవ్వడం ఒకరకంగా కాస్త కష్టతరమే. ఇదే విషయమై గతేడాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్కి సెన్సార్షిప్ ఉండాలనేది పిటిషన్ సారాంశం. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాధ్యాసాధ్యాలను వెల్లడించింది. వెబ్సిరీస్లు ఎక్కువ డ్యురేషన్ ఉండటం సమస్యకు ప్రధాన కారణమని కోర్టు అభిప్రాయపడింది. అన్ని గంటల సేపు కూర్చుని ఓ వెబ్సిరీస్ని సెన్సార్ చేయడం కాస్త ఇబ్బందికరమేనని తేల్చిచెప్పింది. పైగా, ఒక్కో దేశంలో ఒక్కో సెన్సార్షిప్ నిబంధనలు ఉంటాయని గుర్తు చేసింది. ఓటీటీ పరిధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది గనుక సెటాఫ్ రూల్స్ని డిజైన్ చేయలేమని తెలిపింది.
సెన్సార్ ఇస్తే ప్రయోజనకరమేనా?
రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రజలు సులువుగా ఆకర్షితులవుతారు. పైగా ఓటీటీ అందరికీ అందుబాటులో ఉండటం కారణంగా ఇలాంటి కంటెంట్కి తర్వగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించలేం. అందుకే సెన్సార్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. విద్వేశ పూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే కంటెంట్ని నివారించవచ్చు. ఓటీటీ కంటెంట్కి సెన్సార్ షిప్ ఇవ్వడం వల్ల హానికర కంటెంట్ నుంచి చిన్నపిల్లలను దూరంగా ఉంచవచ్చు.
ఎందుకు వద్దంటున్నారు?
ఓటీటీ కంటెంట్కి సెన్సార్షిప్ ఉండకకూదనే వాదన ఉంది. కొన్ని విషయాలపై ప్రజలకు సినిమాల ద్వారా పూర్తిగా అవగాహన కల్పించలేకపోవచ్చు. మరికొన్నింటిని విడమరచి చెప్పాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి వాటికి విఘాతం కలిగే అవకాశం ఉందనేది ప్రధాన వాదన. అలాగే ఫిల్మ్ మేకర్ల క్రియేటివిటీని అణచివేసే ముప్పు ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. సెన్సార్ ఇస్తే విభిన్నంగా సిరీస్లు తీసే ఫిల్మ్ మేకర్లను ఆలోచనలో పడేలా చేస్తుందని చెబుతున్నారు.
మంచి కన్నా చెడు ఎక్కువ..!
ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్తో ప్రేక్షకుడికి మంచి కన్నా ఎక్కువగా చెడు జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. బూతు పదాలకు ప్రభావితమై వాటినే ప్రేక్షకులు ఉచ్చరిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయమై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అలనాటి నటి విజయశాంతి ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటీటీ కంటెంట్కు సెన్సార్షిప్ ఉండాలనేది వారి వాదన.
ఈ ప్లాట్ఫాంలలో అధికంగా..
కొన్ని ఓటీటీ ప్లాట్ఫాంలో అడల్ట్ కంటెంట్కి కేరాఫ్గా నిలుస్తున్నాయి. ఆల్ట్ బాలాజీ, ఉల్లు యాప్, గప్చుప్, ఫనియో మూవీస్, హాట్షాట్, 8షాట్స్, ఫిజ్ మూవీస్ తదితర యాప్లు అడల్ట్ కంటెంట్ని పెద్దఎత్తున ప్రసారం చేస్తున్నాయి.
టాప్ అడల్ట్ ఓటీటీ సిరీస్లు(ఇండియా)..
క్లాస్ ఆఫ్ 2020
విద్యార్థుల చుట్టూ తిరిగే కథ ఇది. స్నేహితులే సరదాగా డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం చేసుకోవడం, రిలేషన్షిప్ మెయింటేన్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. మొత్తం 32 ఎపిసోడ్లు ఉంటుంది.
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్
జీవితంలో నిలబడటానికి నలుగురు అమ్మాయిలు ఏం చేయాల్సి వచ్చిందనేది సిరీస్ సారాంశం. అమెజాన్ ప్రైమ్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది.
మేడ్ ఇన్ హెవెన్
నేటి సమాజంలో పెళ్లిళ్లు జరుగుతున్న తీరు గురించి ఉంటుందీ వెబ్సిరీస్. 2019లో రిలీజైంది.
గందీబాత్
అడల్ట్ సిరీస్లలో దేశంలోనే గందీబాత్ ఫేమస్. చాలా బోల్డ్ సీన్లు ఇందులో ఉన్నాయి. ఐఎండీబీ రేటింగ్ కూడా నాసిరకంగా ఉంది.
మాయా: స్లేవ్స్ ఆఫ్ హర్ డిజైర్
మీరు కాస్త బలహీనులైతే ఈ సిరీస్ అస్సలు చూడొద్దు. గతం మర్చిపోయిన ఓ మహిళను తిరిగి మామూలు మనిషిని చేయడానికి సెక్స్ని ఓ కారకంగా చూపెడతారు.దీనికి ఐఎండీబీ రేటింగ్ 5.5 ఇచ్చింది.
వర్జిన్ భాస్కర్
రచయిత అయిన ఓ వ్యక్తి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథే ఇది. ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మించారు.
ఆశ్రమ్
ఆశ్రమాల్లో జరిగే వాటి గురించి ఆశ్రమ్ సిరీస్ తెలుపుతుంది. ఆశ్రమాల పేరిట జరిగే కార్యకలపాల గురించి చెబుతుంది.
రాత్రి కీ యాత్రి
2021లో ఈ సిరీస్ విడుదలైంది. రెడ్ లైట్ ఏరియా గురించి ఈ సిరీస్ వివరిస్తుంది.
మీర్జాపూర్
అమెజాన్ ప్రైమ్లో అప్పట్లో సంచలనంగా మారిందీ వెబ్సిరీస్. క్రైం, అశ్లీలం ఇందులో అధికంగా ఉంటుంది.
రానానాయుడు
ఇటీవల విడుదలైన ఈ సిరీస్లో అశ్లీలత అధికంగా ఉంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ గురించి తెలుపుతుంది. వీటితో పాటు తదితర సిరీస్లు అధికంగా అశ్లీలత, బూతు కంటెంట్ని కలిగి ఉన్నాయి.
ఏప్రిల్ 08 , 2023
RRR సినిమాకు ఆస్కార్ రావడంపై బాలీవుడ్ అక్కసు… మేకప్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు దుమారం
భారతీయ చిత్రాలు RRR, ది ఎలిఫెంట్ విస్పరర్ సినిమాలకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. దేశం మెుత్తం గర్వించింది. ఇలాంటి సమయంలో ఆస్కార్ను కూడా కొన్నారంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు మేకప్ చేసే షాన్ ముట్టాత్తిల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు.
తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటకు ఆస్కార్ ఇవ్వటం పట్ల అక్కసు వెళ్లగక్కడా షాన్.
నాటునాటుకు ఆస్కార్ ఇవ్వటం చాలా హాస్యాస్పదం. భారత్లో అవార్డులు కొంటారని అనుకున్నా. కానీ, ఇప్పుడు ఏకంగా ఆస్కార్స్. మనదగ్గర డబ్బుంటే ఏదైనా వస్తుంది. ఆస్కార్తో సహా” అన్నాడు.
View this post on Instagram A post shared by viral.fta (@viral.fta)
షాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. నీ మాటల్లో ఈర్ష్య స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు సినిమాకు ఆస్కార్ రావటం బాలీవుడ్లో చాలామందికి నచ్చలేదనే వాదన లేకపోలేదు. ఎందుకంటే, బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ వరకు టాలీవుడ్ సినిమాలు అక్కడ ఏలుతున్నాయి.
నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాలీవుడ్లో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడం ఇందుకు నిదర్శనం. ఈ కారణంగానే కొంతమంది నాటునాటుకి ఆస్కార్ రావటాన్ని ఓర్వలేక పోతున్నారని వినికిడి.
నాటునాటుకి ఆస్కార్ రావటం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. కానీ, బాలీవుడ్ నుంచి పెద్దగా స్పందన రాలేదు.
ఈ క్రమంలో మేకప్ ఆర్టిస్ట్ షాన్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని పెంచాయి. దీంతో ట్రోలర్స్ చేతికి పనిదొరికనట్లయ్యింది.
మార్చి 15 , 2023
Andrea Jeremiah: కనిపించి కనిపంచని సొగసులతో ఆండ్రియా అందాల దాడి.. చూడకుండా వెళ్లగలరా?
తమిళ్ హాట్ బ్యూటీ ఆండ్రియా జర్మియా తన తాజా హాట్ఫోటోలు షేర్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. విలక్షణ నటనకు పెట్టింది పేరుగా ఉన్న ఆండ్రియా ఒంపుసొంపులతో కుర్రకారు హార్ట్ బీట్ అమాంతం పెంచేసింది.
పింక్, బ్లాక్ కలర్ డ్రెస్లో ఫొటో షూట్లో ఆండ్రింగా హాట్ లుక్స్లో కనిపించింది. ఎద అందాలు కనిపించి కనిపించకుండా చూపిస్తూ కవ్విస్తోంది.
ఆండ్రియా జర్మియా తమిళ్తో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించింది. కార్తి హీరోగా నటించిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో పాపులారిటీ సంపాదించింది.
ఆ తర్వాత తెలుగులో సునీల్, నాగ చైతన్య కాంబోలో వచ్చిన తడాఖా చిత్రంలో మెరిసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఆండ్రియా తన పరువాల విందుతో కుర్రకారుకు కైఫెక్కిస్తుంటుంది.
తాజా ఫొటో షూట్లో ఇంపైన బ్యాక్ షోతో సొగసుల విందు చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్లో అందాల ఎర వేసింది
పొట్టి షార్ట్లో నడుము అందాలను చూపిస్తూ ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి
సోషల్ మీడియాలో తరుచూ యాక్టివ్ ఉండే ఈ తమిళ్ తెగింపు.. అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తుంటుంది
గతంలో ధనుష్, అనిరుధ్ రవిచందర్, ఫహాద్ ఫాజిల్ వంటి సెలబ్రెటీలతో ఆఫైర్స్ నడిపి వార్తల్లో నిలిచింది.
ఆండ్రియా తన తొలి చిత్రం 'కందా నల్ల ముదల్'(2005)తో సినిమాల్లోకి ఆరంగేట్రం ఇచ్చింది. స్టైలిష్గా కనిపిస్తూ, మంచి నటన కనబరుస్తూ గుర్తింపు తెచ్చుకుంది.
ఆండ్రియా జర్మియా ఇండస్ట్రీలోకి రాకముందు సింగర్గా కొనసాగింది. ఆండ్రియా పదేళ్ల వయసు నుంచే మంచి యాక్టివ్ పిల్ల. 'యంగ్ ఇసాదర్సు' ర్యాప్ బృంందంలో సాంగ్స్ పాడేది. కాలేజీలోనూ స్టేజ్ పర్ఫామెన్స్ చేస్తూ నటనపై తన అభిరుచిని చాటుకుంది.
ఆండ్రియా స్వస్థలం తమిళనాడులోని అరక్కోణం. ఆమె ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో 1985 డిసెంబర్ 21న జన్మించింది.
తడాఖా సినిమా ద్వారా తెలుగు తెరకు పరచయమైన ఈ సుందరాంగి ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అడపాదడపా తమిళ్ నుంచి తెలుగులోకి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
తెలుగులో అవకాశాలు రాకపోతేనేం.. అందాల ఆరబోతతో తమిళ్, తెలుగు కుర్రాళ్లను ఆకర్షిస్తునే ఉంది.
ప్రస్తుతం ఈ అందాల బామకు చేతినిండ పని ఉంది. పిశాసు-2, నో ఎంట్రీ, వట్టం చిత్రాల్లో నటిస్తోంది
ఫిబ్రవరి 14 , 2024
HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్-10 రేర్ పిక్స్ వైరల్
ఇప్పుడు హీరోయిన్ ఆదాశర్మ పేరు దేశమంతా మార్మోగుతోంది. ది కేరళ స్టోరీలో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక సినీ కెరీర్ ముగుస్తుందనుకున్న తరుణంలో ది కేరళ స్టోరీ హిట్తో మంచి కమ్బ్యాక్ ఇచ్చింది. నేడు హీరోయిన్ ఆదాశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదాశర్మ రేర్ పిక్స్తో పాటు ఆమె గురించి ప్రత్యేక విషయాలు మీకోసం..
ప్రముఖ నటి ఆదాశర్మ.. ముంబయిలోని నేవీ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది.
పదో తరగతి పూర్తి చేసిన వెంటనే సినీ రంగ ప్రవేశం కోసం ఆదాశర్మ యత్నించింది. అయితే మరీ యంగ్గా ఉండటంతో పలు ఆడిషన్లలో ఆమెను రిజెక్ట్ చేశారు. 2008లో వచ్చిన ‘1920’ అనే హారర్ చిత్రంతో ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టారు.
‘1920’ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించిన ఆదాశర్మ.. హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. హయాతి పాత్రలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
‘హార్ట్ ఎటాక్’ ఫ్లాప్ అయినా ఆదాశర్మకు మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు.
తెలుగులో ఆదాశర్మ చేసిన చివరి సినిమా ‘కల్కి’. ఇందులో డాక్టర్ పద్మ అనే పాత్రలో ఈ భామ కనిపించింది. ఈ సినిమా కూడా కలిసిరాకపోవడంతో తెలుగులో అవకాశాలు మరింత సన్నగిల్లాయి.
అటు బాలీవుడ్లోనూ ఛాన్సెస్ రాకపోవడంతో ఆమె వెబ్సిరీస్లపై ఫోకస్ పెట్టింది. ‘పతి పత్ని ఔర్ పంగా’ అనే వెబ్ సిరీస్లో నటించింది. శివాని భట్నాగర్ అనే పాత్రలో మెప్పించింది.
హిందీలో ‘చుహాబిల్లి’ అనే థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్లో కూడా ఆదాశర్మ నటించింది. అలాగే ‘పియా రే పియా’ అనే ఒక మ్యూజిక్ వీడియోలోనూ కనిపించి సందడి చేసింది.
ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ అనే సినిమాలోనూ ఆదాశర్మ కీలక పాత్ర పోషించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ది కేరళ స్టోరీ సినిమాకు భాజపా పాలిత రాష్ట్రాలు రాయితీలు ప్రకటిస్తుంటే.. మరికొన్ని స్టేట్స్ మాత్రం షరతులు విధిస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలోనూ ఆదాశర్మ ఎంతో చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ఆదాశర్మ ఇన్స్టా ఖాతాను 7.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
https://telugu.yousay.tv/the-kerala-story-review-in-telugu-adah-sharmas-performance-brought-tears-reminds-me-of-another-kashmir-files.html
మే 11 , 2023
MRUNAL THAKUR: గ్లామర్ హద్దులు దాటేస్తున్న మృణాల్ థాకూర్… రెచ్చిపోయి అందాల ప్రదర్శన…
మృణాల్ థాకూర్ ఫేమ్ రోజురోజుకి పెరుగుతోంది. హిట్ సినిమాలు లేకపోయినా ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది.
మృణాల్ రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచుతోంది. సీతారామం చిత్రంలో చీరకట్టులో పద్ధతిగా కనిపించిన ఈ సుందరి… అందాల ఆరబోతకు అవదుల్లేవ్ అనేంతలా చెలరేగుతోంది.
ఇటీవల బికినీలో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొట్టింది ఈ వయ్యారి. మృణాల్ను అలా చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
View this post on Instagram A post shared by Shehla Khan (@shehlaakhan)
సీతారామంలో చూసిన ఆ అమ్మాయేనా ఇలా కనిపించిందని అనుకునేలోపు డోసు పెంచింది. సొగసుల వయ్యారాలు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది మృణాల్.
ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసిన మృణాల్ గురించే చర్చ. హాట్ అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ అమ్మడు.
ఎద, నాభి సొగసులను మూటగట్టి మత్తెక్కించే చూపులతో రెచ్చిపోతుంది మృణాల్. ఫస్ట్ లుక్ అనే మ్యాగ్జిన్ కోసం పరువాల ప్రదర్శన చేస్తోంది.
అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న మృణాల్ థాకూర్కి ఫ్యాన్ బేస్ క్రమంగా పెరుగుతోంది. ఇన్స్టా, ట్విటర్లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు.
తెలుగులో నాని 30 సినిమాలో నటిస్తుంది ఈ ముంబయి భామ. ఆంక్ మిచోలీ అనే బాలీవుడ్ చిత్రంలోనూ మెరవనుంది.
View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur)
టెలివిజన్ సీరియల్ యాక్టర్గా కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ లవ్ సోనియా చిత్రంతో బాలీవుడ్లో ఆరంగేట్రం చేసింది. తెలుగు, హిందీ, మళయాలం చిత్రాల్లోనూ ఆఫర్లు కొట్టేస్తుంది చిన్నది. యువత టార్గెట్గా సినిమాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఏప్రిల్ 19 , 2023
Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్పై ఊహించని ట్విస్ట్.. తెరపైకి ‘యానిమల్’ బ్యూటీ!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'పుష్ప: ది రైజ్' కి సీక్వెల్గా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ వాటిని రెట్టింపు చేసింది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
తృప్తి దిమ్రితో ఐటెం సాంగ్!
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో నటించిన బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ.. తన గ్లామర్తో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ‘పుష్ప 2’లో ఈ భామ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్ను తృప్తి రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రోమోలో ఏముందంటే?
సెకండ్ సాంగ్ ప్రోమోలో పూర్తిగా హీరోయిన్ రష్మిక మందన్ననే కనిపించింది. సాంగ్ సెట్లో రష్మిక మేకప్ వేసుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో కేశవ వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేస్తున్నారంటగా కదా ఆ పాటేందో చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు రష్మిక ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ పాట పాడుతుంది. మీరు కూడా ఈ ప్రోమోను ఓసారి చూసేయండి.
https://www.youtube.com/watch?v=sbp9M95-2rQ&t=19sv
పూర్తి సాంగ్ ఎప్పుడంటే?
పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్ అంటూ వివరించారు. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాట కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఆ రోజున ఫ్యాన్స్కు పండగే
భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Faasil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్కు పండగే అని చెప్పొచ్చు.
మే 23 , 2024