• TFIDB EN
  • పాయల్ వాధ్వా
    పాయల్ వాధ్వా.. ది ప్రెసిడెంట్ ఈజ్ కమింగ్ (2009), భూమి (2017), పెదవి దాటని మాటొకటుంది (2018) చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
    కథనాలు
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే! సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి (Sankranti) తరువాత సమ్మర్ సీజన్‌ (Summer Season) అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఉండటంతో యూత్‌, చిన్నారుల తల్లిదండ్రులు సమ్మర్‌లో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రతీ సమ్మర్‌లోనూ పెద్ద హీరోల సినిమాలు రెడీగా ఉంటాయి. అయితే 2024 సమ్మర్‌లో మాత్రం ఏ స్టార్‌ హీరొ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. వాస్తవానికి ‘దేవర’ (Devara), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి చిత్రాలను సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేశారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఈ సమ్మర్‌ మెుత్తానికి ఇద్దరు యంగ్‌ హీరోల సినిమాలే దిక్కుగా కనిపిస్తున్నాయి. అవి సరైన విజయం సాధిస్తే కలెక్షన్ల పరంగా ఆ చిత్రాలకు తిరుగుండదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  సమ్మర్‌లో ఆ చిత్రాలదే హవా! ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అప్‌కమింగ్‌ చిత్రాలు.. ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square), ‘ఫ్యామిలీ స్టార్‌’’ (Family Star). సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్‌' (Tillu Square Release Date) చిత్రం మార్చి 29న ధియేటర్స్‌లోకి రానుంది. అటు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసిన 'ఫ్యామిలీ స్టార్‌’' (Family Star Release Date) ఏప్రిల్‌ 5న థియేటర్స్‌లోకి రానుంది. ఈ చిత్రాలు మినహా మరే పెద్ద హీరో సినిమా ఈ సమ్మర్‌లో లేకపోవడంతో అందరి దృష్టి వీటిపైనే పడింది.  హిట్‌ అయితే కలెక్షన్స్‌ సునామే! ‘టిల్లు స్క్వేర్‌’, ‘ఫ్యామిలీ స్టార్‌’’ చిత్రాలు రెండూ కూడా యూత్‌ను టార్గెట్‌ చేసుకొని వస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో స్టూడెంట్స్ అందరూ కూడా సెలవులతో ఉంటారు. కాబట్టి ఇవి రెండూ కూడా రిలీజ్ అనంతరం మంచి సక్సెస్ అందుకుంటే వచ్చే కలెక్షన్స్ సూపర్‌గా ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇవి రెండూ కూడా ఆ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటాయో లేదో చూడాలి. కాగా ‘ఫామిలీ స్టార్’ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘టిల్లు స్క్వేర్’ను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. హిట్‌ కాంబో రిపీట్‌ అవుతుందా? ‘టిల్లు స్క్వేర్‌’కు ముందు సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్‌ (Mallik Ram) కాంబోలో వచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో సిద్ధు తన నటనతో, డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సిద్ధు కెరీర్‌లోనే ‘డీజే టిల్లు’ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మరోవైపు డైరెక్టర్‌ పరుశురామ్‌ పెట్ల, నటుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ (Geetha Govindam) ఘన విజయం అందుకుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సూపర్‌ హిట్‌ కాంబోలో వస్తున్న టిల్లు స్క్వేర్‌, ఫ్యామిలీ మ్యాన్‌ చిత్రాలు కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.  సమ్మర్‌పై కన్నేసిన ‘సుహాస్‌’ హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా తనని తాను నిరూపించుకున్న నటుడు సుహాస్ (Suhas). రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అనే మూవీతో రాబోతున్నాడు. అర్జున్ వైకే ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో బజ్‌ ఏర్పడింది. 
    మార్చి 21 , 2024
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్! టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.  సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది. 
    మే 30 , 2024
    Game Changer: గేమ్‌ ఛేంజర్‌లో పుల్ సాంగ్స్ లేవు … షాకింగ్ న్యూస్ చెప్పిన ఎడిటర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున అంచనాలు పెంచుకున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ ఈ సినిమాపై హైప్‌ను మరింతగా పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం. సెన్సార్ పూర్తి సినిమా విడుదలకు కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది. తాజా సమాచారం ప్రకారం, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ చరణ్ డ్యుయల్ రోల్ ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఒక వైపు ఐఏఎస్ అధికారి పాత్రలో గౌరవంగా కనిపిస్తాడు. మరోవైపు, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్రలో పూర్తి మాస్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకోనున్నాడు. రామ్ చరణ్ ఈ రెండు పాత్రలకు సంబంధించిన షేడ్స్‌ను ప్రేక్షకులు తెగ ఆరాధిస్తారని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. అంజలి కీలకం ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ నటి అంజలి పాత్ర. ఈ పాత్ర సినిమాకు అసలైన మలుపు తీసుకురాబోతుందని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ అంజలి పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారని, ఈ పాత్ర ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. భారీ తారాగణం కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య ప్రతినాయకుడి పాత్రలో, శ్రీకాంత్, అంజలి ఇతర కీలక పాత్రలతో భారీ తారాగణం కనిపించనుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్, పాటలుపై ఆసక్తికర సమాచారం ఈ చిత్రం ట్రైలర్‌ను న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, సోషల్ మీడియాలో జరిగిన చిట్‌చాట్‌లో ఎడిటర్ రూబెన్స్ ఈ చిత్రంపై ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సినిమా థియేట్రికల్ కట్‌లో పూర్తి పాటలు లేకపోవచ్చని, వాటిని సినిమా విడుదలైన తర్వాత యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. https://www.youtube.com/watch?v=EqDlrimnMCE&pp=ygURZ2FtZSBjaGFuZ2VyIHNvbmc%3D ప్రొడక్షన్ హైలైట్స్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శంకర్ తనదైన శైలీలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం విశ్వాసంగా ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. ‘గేమ్ ఛేంజర్’ కథను, కథనాన్ని, ముఖ్యంగా పాత్రల విశిష్టతను తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
    డిసెంబర్ 31 , 2024
    Kalki 2898 AD: విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ క్యామియో కన్ఫార్మ్‌ చేసిన నాగ్ అశ్విన్.. రోల్స్ ఏమిటంటే? పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ చిత్రం గురువారం (జూన్‌ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌, టీజర్‌ ఇప్పటికే విడుదలవ్వగా.. వాటికి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌లతో పాటు కుర్ర హీరోలు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ సైతం నటిస్తున్నారని గత కొంత కాలంగా టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇది నూటికి నూరు శాతం నిజమని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్వయంగా వెల్లడించారు.  వీడియో వైరల్‌..! ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి చిత్రం.. రేపు (జూన్‌ 27) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. నాగ్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియాలో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ పేర్లను ప్రస్తావిస్తూ.. కల్కిలో భాగమైనందుకు ధన్యవాదాలు చెప్పారు. అటు ప్రభాస్‌ సైతం వారు సినిమాలో అతిథి పాత్రలు పోషించినందుకు థ్యాంక్స్‌ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. విజయ్‌ క్యామియోతో కల్కి థియేటర్లు బద్దలవుతాయని రౌడీ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.  https://twitter.com/AyyoEdits/status/1805955173459656978 విజయ్‌ పాత్ర అదేనా? తాజాగా కల్కి రెండో ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. అందులో విజయ్‌ దేవరకొండను చూపకనే చూపించారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్‌లో మహాభారత సంగ్రామం సీక్వెన్స్‌ను కొద్దిసేపు చూపించారు. ఇందులో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అర్జునుడితో తలపడ్డారు. అయితే అర్జునుడి పాత్ర ముఖాన్ని స్పష్టంగా చూపించలేదు. దీంతో అది విజయ్‌ కావొచ్చని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్వయంగా విజయ్ ఉన్నట్లు స్పష్టం చేయడంతో తమ హీరో అర్జునుడిగా కనిపించడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ప్రశ్నకు జూన్‌ 27న క్లారిటీ వచ్చే అవకాశముంది.  https://twitter.com/TheDEVERA_fan/status/1804410479642841242 సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా? కల్కి సినిమాకు సంబంధించి లేటెస్ట్ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి వీఎఫ్‍ఎక్స్‌లో ఎన్టీఆర్ పాత్రను ఈ చిత్రంలో మేకర్స్ చూపించనున్నారని తెలుస్తోంది. శ్రీకృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ చాలా సినిమాల్లో చేశారు. కృష్ణుడు అంటేనే తెలుగు వారికి ఆయనే గుర్తు వస్తారు. శ్రీకృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ ఉన్న విగ్రహాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ఎన్టీఆర్ ఉండాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. విశ్వామిత్రునిగా రాజమౌళి? కల్కి చిత్రంలో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) కూడా ఓ కీలక పాత్ర పోషించినట్లు స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. అయితే ఆయన విశ్వామిత్రుని పాత్రలో కనిపిస్తారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలోని కీలక సన్నివేశంలో రాజమౌళి పాత్ర తెరపైకి వస్తుందని అంటున్నారు. రెండు నుంచి మూడు నిమిషాల నిడివి లోపే రాజమౌళి పాత్ర ముగుస్తుందని సమాచారం. మరోవైపు డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ నుంచి కూడా ఓ క్యామియో ఉంటుందని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆర్‌జీవీ పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెబుతున్నారు. కల్కి కోసం ఆర్జీవీ ఫస్ట్‌ టైమ్‌ యాక్టర్‌గా మారడం గమనార్హం.
    జూన్ 26 , 2024
    పాయల్ వాధ్వా వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే పాయల్ వాధ్వా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree