రమ్య కృష్ణన్
ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
రమ్యకృష్ణ భారతీయ సినీ నటి. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ భార్య. 1985లో వచ్చిన భలే మిత్రులు సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. సూత్రధారులు చిత్రం ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందినప్పటికీ ఈమెకు చాలా ఏళ్లపాటు అవకాశాలు రాలేదు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన అల్లుడుగారు చిత్రం రమ్యకృష్ణ కెరీర్కు బ్రెక్ ఇచ్చింది. తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసన ఆమె నటించింది. నరసింహ చిత్రంలో సూపర్స్టార్ రజినీకాంత్తో పోటీపడి మరి నటించి నీలంబరి పాత్ర ద్వారా రక్తి కట్టించింది. అల్లరి మొగుడు, అల్లరిప్రియుడు, అల్లుడా మజాకా, ఆహ్వానం, ఘరానా బుల్లోడు, ధర్మచక్రం, మేజర్ చంద్రకాంత్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది. దాదాపు దశాబ్దకాలం అగ్రహీరోయిన్గా కొనసాగింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తోంది. బాహుబలి, శైలజారెడ్డి అల్లుడు, రిపబ్లిక్, రొమాంటిక్, గుంటూరుకారం వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన అద్భుత నటనను కనబరుస్తోంది.