• TFIDB EN
  • రోజా సెల్వమణి
    జననం : నవంబర్ 17 , 1972
    ప్రదేశం: తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
    రోజా సెల్వమణి వైసీపీ నేత, ప్రముఖ టాలీవుడ్ నటి. ఆమె తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పర్యాట శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ఉంటూనే పలు టీవీ షోల్లో జడ్జిగా వ్యవహరించారు. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ షోలకు జడ్జిగా వ్యవహరించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నగరి నుంచి ఓడిపోయారు. ప్రస్తుతం రోజా సెల్వమణి తన కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటోంది.

    రోజా సెల్వమణి వయసు ఎంత?

    రోజా సెల్వమణి వయసు 52 సంవత్సరాలు

    రోజా సెల్వమణి ఎత్తు ఎంత?

    5' 5'' (165cm)

    రోజా సెల్వమణి అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, షాపింగ్‌, రీడింగ్‌

    రోజా సెల్వమణి ఏం చదువుకున్నారు?

    బీఏ పొలిటికల్‌ సైన్స్‌

    రోజా సెల్వమణి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    శ్రీ పద్మావతి ఉమెన్స్‌ యూనివర్సిటి, తిరుపతి

    రోజా సెల్వమణి‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 57 చిత్రాల్లో రోజా నటించింది. తమిళంలో మరో 50 చిత్రాలకు పైగా హీరోయిన్‌గా చేసింది.

    రోజా సెల్వమణి‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    రోజా వెబ్‌సిరీస్‌లు చేయలేదు. అయితే బుల్లితెరపై వచ్చే జబర్దస్త్ షోలో జడ్జిగా చేసి అందరి దృష్టిని ఆకర్షిచింది.

    రోజా సెల్వమణి In Saree

    Images

    Actress Roja Selvamani

    Images

    Roja

    రోజా సెల్వమణి అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Roja Selvamani

    Viral Videos

    View post on X

    Actress Roja Viral Video

    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?
    <strong>Bhagyashri Borse: పాన్ ఇండియా ఆఫర్‌ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్‌ వచ్చిన తగ్గని క్రేజ్‌!</strong>
    Bhagyashri Borse: పాన్ ఇండియా ఆఫర్‌ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్‌ వచ్చిన తగ్గని క్రేజ్‌! టాలీవుడ్‌ రైజింగ్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సేకు తొలి చిత్రంతోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్‌ ఫిల్మ్‌ మిస్టర్ బచ్చన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. అయితే ఈ అమ్మడి నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ భామకు మంచి ఫ్యూచర్‌ ఉంటుందంటూ కితాబు ఇచ్చారు. ఈ క్రమంలోనే భాగ్యశ్రీకి మరో బంపరాఫర్‌ దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి అందరి దృష్టిని ఆకర్షించింది. భాగ్యశ్రీ అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కాంత’ (Kaantha) ఒకటి. ‘నీలా’ ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయగా సినీ లవర్స్‌ నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేశారు. అంతేకాదు పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మంచి ఛాన్స్‌ కొట్టేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే దీని రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.&nbsp; https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196 1950 నేపథ్యంలో.. కాంత మూవీ పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ మూవీకి టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ ఫస్ట్‌ క్లాప్‌ కొట్టారు. కాగా, ఈ చిత్రాన్ని 1950 మద్రాసు నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో దుల్కర్ పాత్ర ఇప్పటివరకూ చేసిన చిత్రాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. భాగ్యశ్రీకి కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కిందని అంటున్నారు. వీరి మధ్య కెమెస్ట్రీ అదిరిపోతుందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే మెుదలవుతుందని ఫిల్మ్‌ వర్గాలు తెలియజేశాయి.&nbsp; ఏమాత్రం తగ్గని క్రేజ్‌! ‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్‌ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్‌ లభిస్తే ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; విజయ్‌ దేవరకొండ మూవీలోనూ.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు.
    సెప్టెంబర్ 09 , 2024
    Bhagyashri Borse: మరో బంపరాఫర్‌ కొట్టేసిన భాగ్యశ్రీ.. ఈ అమ్మడి దూకుడు మామూల్గా లేదుగా!&nbsp; యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. తాజాగా మరో బంపరాఫర్‌ కొట్టేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టాలీవుడ్‌లో చిన్నగా గేర్లు మారుస్తూ టాప్‌ హీరోయిన్‌ స్థాయికి భాగ్యశ్రీ ఎదుగుతోందంటూ ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.&nbsp; రామ్‌ సరసన హీరోయిన్‌గా.. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఓ సినిమాను ప్లాన్‌ చేస్తోంది. 'RAPO22' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty) డైరెక్టర్​ మహేష్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపికచేసినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ’రీసెంట్‌ సెన్సేషన్‌ భాగ్య శ్రీ తమ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం వల్ల ఈ చిత్రానికి మరింత అందం వచ్చింది’ అని సదరు సంస్థ పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను గురువారం (నవంబర్ 21) వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. గురువారం (నవంబర్ 21) పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1859100765832261753 రామ్‌ ఆశలన్నీ 'RAPO22' పైనే! 'RAPO22' రామ్‌ 22వ చిత్రంగా రానుంది. గురువారం(నవంబర్ 21) పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మెుదలుపెట్టనున్నారు. హై ఎనర్జీ న్యూ ఏజ్‌ స్టోరీగా ఇది రాబోతోన్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌లు దీన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే మూవీ సక్సెస్‌పైనే రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా రామ్‌కు సాలిడ్‌ హిట్‌ పడలేదు. ఆయన గత చిత్రాలు ‘రెడ్‌’, ‘ది వారియర్‌’, ‘స్కంద’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌ ‘బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా నిరాశ పరిచాయి. దీంతో 'RAPO22'తోనైనా హిట్‌ కొట్టి ఫ్యాన్స్‌ను సంతోష పెట్టాలని ఈ ఎనర్జటిక్‌ స్టార్ భావిస్తున్నారు. మరోవైపు 'మిస్టర్‌ బచ్చన్‌' ఫ్లాప్‌ నేపథ్యంలో భాగ్యశ్రీకి (Bhagyashri Borse) ఈ సినిమా సక్సెస్‌ కీలకం కానుంది.&nbsp; ఫ్లాప్‌ వచ్చినా ఏమాత్రం తగ్గని క్రేజ్‌! ‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్‌ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. ఇటీవల 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే రామ్ సరసన మరో క్రేజీ ఆఫర్‌ దక్కించుకొని ఆశ్చర్యపరిచింది.&nbsp; దుల్కర్‌కి జోడీగా పాన్‌ ఇండియా ఫిల్మ్‌ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయగా కొన్ని వారాల క్రితం పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్‌ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.&nbsp; https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196 విజయ్‌ దేవరకొండతోనూ..&nbsp; విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్‌ స్టార్‌ నాని (Hero Nani) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్‌ ఉంది. భాగ్యశ్రీ ప్రేమలో పడిందా? భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్లు ఇతర వార్తలు వచ్చాయి. 'ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది' అంటూ గతంలో ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్‌ చేస్తూ దానికి లవ్‌ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసి ఇండైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్‌ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెట్టారు.&nbsp;
    నవంబర్ 20 , 2024
    Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్‌ చేస్తున్నట్లు హింట్స్‌! యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రియుడితో కలిసి డేటింగ్‌ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ అమ్మడు లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టును పరిశీలిస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.&nbsp; భాగ్యశ్రీ ప్రేమలో పడిందా? ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే తన ప్రియుడితో కలిసి విహార యాత్రలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే 'ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది' అంటూ ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్‌ చేస్తూ దానికి లవ్‌ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసి ఇండైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్‌ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) ఫ్లాప్‌ వచ్చినా తగ్గని క్రేజ్‌! ‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్‌ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్‌ లభిస్తే ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయగా ఇటీవల పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్‌ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.&nbsp; https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196 రౌడీ బాయ్‌తోనూ.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్‌ స్టార్‌ నాని (Hero Nani) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్‌ ఉంది. భాగ్యశ్రీ నేపథ్యం ఇదే.. భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ? ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) దక్షిణాది సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్‌ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నారు. తన అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. మలయాళంతో పాటు తెలుగులోనూ పార్లర్‌గా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. అయితే దుల్కర్‌ తన ఫోకస్‌ మెుత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తెలుగులో వరుసగా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తూ రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌ వంటి టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.&nbsp; తెలుగు రైజింగ్‌ హీరోగా దుల్కర్‌! యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన రెండు, మూడు చిత్రాలతోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. తెలుగులో నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి మెప్పించాడు. తన అద్భుతమైన నటుడితో తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా, శత్రుదేశంలో పట్టుబడ్డ బందీగా తన విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీలో ప్రభాస్ ను పెంచి పెద్ద చేసే గురువు పాత్రలో నటించి మెప్పించాడు. ఓ రకంగా అది పరశురాముడి పాత్ర అని చెబుతున్నారు. ‘కల్కి 2’ లోనూ దుల్కర్‌ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది.&nbsp; డబ్బింగ్‌ చిత్రాలతోనూ గుర్తింపు డైరెక్ట్‌ తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో అతడు నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. దుల్కర్‌ నటించిన 9 వరకూ చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను పలకరించాయి. అందులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం', సాయిపల్లవితో చేసిన 'హేయ్‌ పిల్లగాడ', ‘అందమైన జీవితం’ వంటి చిత్రాలు తెలుగు యూత్‌ను ఎంతగానో ఆకర్షించాయి. దుల్కర్‌ మనవాడే అన్న ఫీలింగ్‌ను వారిలో కలిగించాయి. అలాగే ‘కురుప్‌’, ‘సెల్యూట్‌’, ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ వంటి యాక్షన్‌ చిత్రాలు సైతం మాస్‌ ఆడియన్స్‌లో మంచి గుడ్‌విల్‌ తెచ్చిపెట్టాయి. దీంతో తెలుగులో క్లాసు-మాసు కలగలిసిన హీరోగా దుల్కర్‌ మారిపోయాడు.&nbsp; కొత్త ప్రాజెక్ట్స్‌తో దూకుడు తెలుగులోనూ స్టార్‌ హీరో క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వరుసగా టాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్‌కు ఓకే చెబుతూ దుల్కర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి ‘లక్కీ భాస్కర్‌’ చిత్రంలో దుల్కర్‌ నటిస్తున్నాడు. అక్టోబర్‌ 31న ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత పవన్‌ సాధినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దుల్కర్‌ ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ కూడా విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో రైతు పాత్రలో దుల్కర్‌ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు స్టార్‌ హీరో రానా నిర్మాణంలో కొత్త ప్రాజెక్ట్‌ 'కాంత'ను పట్టాలెక్కించాడు. ఇందులో దుల్కర్‌కు జోడీగా టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. 1950 నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషించనున్నాడు. తమిళ డైరెక్టర్‌ సెల్వమణి సెల్వరాజ్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు.&nbsp; https://twitter.com/vamsikaka/status/1817427815249133673 https://twitter.com/imwpolitikos/status/1833028992456089818 https://twitter.com/Chrissuccess/status/1832279694118400071 ‘టైర్‌ 2’ హీరోలకు గట్టిపోటీ! టాలీవుడ్‌లో దుల్కర్‌ సల్మాన్‌ దూకుడు చూస్తుంటే టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ తప్పదని అనిపిస్తోంది. రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌, అడవి శేష్‌ తదితర హీరోలకు దుల్కర్‌ పోటీగా మారతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అతడు చేస్తున్న మూడు ప్రాజెక్టుల్లో కనీసం రెండు హిట్స్‌ అయినా అతడి గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. క్లాసిక్‌ లుక్స్‌తో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌లో దుమ్మురేప గల సత్తా అతడికి ఉండటంతో తెలుగు డైరెక్టర్ల ఫస్ట్‌ ఛాయిస్‌ అతడు అయ్యే పరిస్థితులు రావొచ్చని అంటున్నారు. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న నాగచైతన్య, రామ్‌, విజయ్ దేవరకొండ వంటి హీరోలు దుల్కర్‌ విషయంలో జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024

    రోజా సెల్వమణి తల్లిదండ్రులు ఎవరు?

    నాగరాజు రెడ్డి, లలితా రెడ్డి

    రోజా సెల్వమణి‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఇద్దరు సోదరులు ఉన్నారు. వారి పేర్లు కుమారస్వామి రెడ్డి, రామ్‌ప్రసాద్‌ రెడ్డి.

    రోజా సెల్వమణి పెళ్లి ఎప్పుడు అయింది?

    ప్రముఖ తమిళ డైరెక్టర్‌ ఆర్‌.కే. సెల్వమణిని 2002లో రోజా పెళ్లి చేసుకుంది. సెల్వమణి.. 17 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

    రోజా సెల్వమణి Family Pictures

    Images

    Roja Images

    Images

    Roja Selvamani

    రోజా సెల్వమణి ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    సీతారత్నం గారి అబ్బాయి (1992), భైరవ ద్వీపం (1994) చిత్రాలతో రోజా తెలుగులో పాపులర్ అయ్యింది.

    రోజా సెల్వమణి లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో రోజా సెల్వమణి ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రోజా సెల్వమణి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ప్రేమ తప్పస్సు, సీతారత్నం గారి అబ్బాయి, భైరవద్వీపం, శుభలగ్నం, సమ్మక్క సారక్క తదితర చిత్రాల్లో ఆమె ముఖ్యపాత్రలు పోషించారు.

    రోజా సెల్వమణి బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    రోజా సెల్వమణి బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    రోజా సెల్వమణి కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌ వెజ్‌

    రోజా సెల్వమణి కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రోజా సెల్వమణి కు ఇష్టమైన నటి ఎవరు?

    రోజా సెల్వమణి ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    రోజా సెల్వమణి ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    రోజా సెల్వమణి ఫెవరెట్ సినిమా ఏది?

    రోజా సెల్వమణి ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    ఎరుపు, పింక్‌

    రోజా సెల్వమణి ఫేవరేట్‌ క్రీడ ఏది?

    కబడ్డి

    రోజా సెల్వమణి కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    కేరళ, గోవా

    రోజా సెల్వమణి వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    • Mahindra XUV-500 • Ford Endeavor • Chevrolet Cruze • Fortuner Car • Mahindra Scorpio • Chevrolet Cruze

    రోజా సెల్వమణి ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రోజా సెల్వమణి ఆస్తుల విలువ రూ.13 కోట్లుగా ఉంది.

    రోజా సెల్వమణి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    644K ఫాలోవర్లు

    రోజా సెల్వమణి సోషల్‌ మీడియా లింక్స్‌

    రోజా సెల్వమణి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నంది అవార్డ్స్‌ - 1991

      1991లో 'సర్పయాగం' చిత్రానికి స్పెషల్‌ జ్యూరీ అవార్డు గెలుచుకుంది.

    • నంది అవార్డ్స్‌ - 1994

      1994లో 'అన్న' చిత్రానికి ఉత్తమ సహాయనటిగా అవార్డు అందుకుంది.

    • నంది అవార్డ్స్‌ - 1998

      1998లో 'స్వర్ణక్క' చిత్రానికి ఉత్తమ నటి పురస్కారం కైవసం చేసుకుంది.

    • తమిళనాడు స్టేట్ ఫిల్మ్‌ అవార్డ్స్‌ - 1998

      1998లో 'ఉన్నిదతిల్‌ ఎన్నై కొడుతెన్‌' చిత్రానికి ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది.

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్ - 2010

      2010లో 'గోలిమార్‌' చిత్రానికి గాను ఉత్తమ సహాయనటి కేటగిరీలో నామినేట్‌ అయ్యింది.

    రోజా సెల్వమణిపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    ఏపీలోని వైఎస్సాఆర్‌ పార్టీ నాయకురాలిగా పవన్‌, చంద్రబాబుపై రోజా చేసిన ఘాటు విమర్శలు పలు వివాదాలకు కారణమయ్యాయి.

    రోజా సెల్వమణి కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    రోజా.. యునిక్‌ బ్యూటీ సెలూన్‌ను స్థాపించారు.

    రోజా సెల్వమణి కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    ఏపీలో ప్రముఖ రాజకీయ నాయకురాలిగా రోజా గుర్తింపు పొందింది. 1999లో టీడీపీ తరపున రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజా.. 2009 తర్వాత వైకాపాలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై 2022లో ఏపీ పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
    రోజా సెల్వమణి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రోజా సెల్వమణి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree