

ఇషా తల్వార్
జననం : డిసెంబర్ 22 , 1987
ప్రదేశం: బాంబే, మహారాష్ట్ర, భారతదేశం
ఇషా తల్వార్ బాలీవుడ్ నటి. ఆమె ప్రధానంగా తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో గుండె జారి గల్లంతయిందే చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత మైనే ప్యార్ కియా, రాజా చెయి వేస్తే వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. మలయాళంలో ఐ లవ్ మి చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ బిజీ హీరోయిన్గా మారిపోయింది. అటు హిందీలోనూ ట్యూబ్ లైట్, జిన్ని వెడ్స్ సన్ని వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. మిర్జాపూర్ వెబ్ సిరీస్లో నటించిన ఇషా అక్కడ ఓవర్ నైట్లో స్టార్గా ఎదిగింది. తాజాగా నటించిన రన్ బేబి రన్(తమిళ్) చిత్రం హిట్ అయింది.
ఇషా తల్వార్ వయసు ఎంత?
ఇషా తల్వార్ వయసు 37 సంవత్సరాలు
ఇషా తల్వార్ ముద్దు పేరు ఏంటి?
ఇషా
ఇషా తల్వార్ ఎత్తు ఎంత?
5'3"(161cm)
ఇషా తల్వార్ అభిరుచులు ఏంటి?
ఇషా తల్వార్కు వంట చేయడం, యోగ చేయడమంటే చాలా ఇష్టం
ఇషా తల్వార్ ఏం చదువుకున్నారు?
ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది.
ఇషా తల్వార్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
సేయింట్ గ్జేవియర్ కాలేజ్ (ముంబై),
ఇషా తల్వార్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్లు?
మీర్జాపూర్, చమ్మక్, ఇండియన్ పోలీస్ ఫోర్స్
ఇషా తల్వార్ With Pet Dogs
ఇషా తల్వార్ In Modern Dress
ఇషా తల్వార్ In Bikini
ఇషా తల్వార్ In Saree
ఇషా తల్వార్ In Ethnic Dress
ఇషా తల్వార్ Hot Pics
ఇషా తల్వార్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Isha Viral Video
Insta Hot Reels
Isha Talwar Insta Reel
- Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ (Prabhas Upcoming Movies) లో పెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ షూటింగ్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్లో ‘ఫౌజీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే విధంగా ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు సాలిడ్ ప్రాజెక్ట్స్కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్కు ఒక స్టార్ డైరెక్టర్తో ప్రభాస్ తన సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేయనున్న చిత్రాలు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో.. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘మాస్టర్’, ‘లియో’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించి లోకేష్ కనగరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్తో 'కూలీ' అనే చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం హీరో కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నాడు. దాని తర్వాతనే ప్రభాస్-లోకేష్ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. హిందీ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీతో.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ (Rajkumar Hirani)తో సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కల అతి త్వరలోనే నెరవేరే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్కుమార్ హిరానీ - ప్రభాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నట్లు బీటౌన్లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’,’ పీకే’, ‘సంజు’, ‘డుంకీ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్కు సైతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరి కాంబోలో సినిమా పడితే అన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ప్రభాస్ మరో చిత్రం (Prabhas Upcoming Movies) చేయనునున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘సలార్’ (Salaar) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్ కటౌట్ తగ్గ యాక్షన్ సీన్స్తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాకు సీక్వెల్గా ‘సలార్ 2’ రానున్నట్లు గతంలోనే ప్రశాంత్ నీల్ ప్రకటించారు. సలార్ మూవీ ఎండింగ్లో సెకండ్ పార్ట్కు సంబంధించిన లింక్ కూడా చూపించారు. అయితే ఇటీవల తారక్ - ప్రశాంత్ నీల్ కాంబోలో 'NTR 31' ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత 'సలార్ 2'ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ యూనివర్స్లోకి ప్రభాస్! ‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు. అటువంటి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సినిమా చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి ప్రభాస్ పచ్చజెండా ఊపడంతో ఈ కలయికలో సినిమా రావడం కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు రంగం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుంత ప్రశాంత్ వర్మ చేతిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జై హనుమాన్’ (Jai Hanuman)తో పాటు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ చిత్రాన్ని ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రభాస్తో సినిమా ఉంటుందని సన్నిహిత చెబుతున్నాయి.నవంబర్ 05 , 2024
- HBD Tabu: టబు లైఫ్లో నాగార్జునతో పాటు ఇంతమంది హీరోలు ఉన్నారా?తెలుగు సినీ ప్రియులకు ఎంతో సుపరిచితురాలైన నటి టబు (Tabu). ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తోన్న టబు ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసింది. ‘కూలి నెంబర్ 1’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘ప్రేమ దేశం’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. తద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. ఇవాళ (నవంబర్ 4) టబు పుట్టిన రోజు. ఆమె 54వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టబు లైఫ్లోని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. 1971లో జన్మించిన టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. హైదరాబాద్లోనే పెరిగింది. తల్లి టబును ఒంటరి తల్లిగా పెంచింది. టబుకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. టబు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించింది. కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1982లో హిందీలో రిలీజైన 'బజార్' చిత్రం ఆమె ఫస్ట్ ఫిల్మ్. https://twitter.com/mimansashekhar/status/1710632340022591556 సాధారణంగా ఏ వ్యక్తికైనా ఒకటి లేదా రెండు నిక్ నేమ్స్ ఉంటాయి. కానీ టబూకి అలా కాదట. ట్యాబ్స్, టబ్స్, టబ్బీ, టోబ్లర్, టోబ్లెరోన్ ఇలా 100కు పైగాా ముద్దుపేర్లు ఉన్నాయట. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో టబు సూపర్ హిట్ చిత్రాలు చేసింది. ముఖ్యంగా నాగార్జున-టబు కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయ్యింది. వారు నటించిన ‘నిన్నే పెళ్లడతా’, ‘సిసింద్రీ’, ‘ఆవిడే మా ఆవిడా’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. హిందీ వచ్చిన ప్రేమ్ చిత్రం కోసం టబు 8 ఏళ్ల పాటు నిరీక్షించారు. శ్రీదేవి భర్త, నిర్మాత అయిన బోనీ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ ఇందులో హీరోగా చేశాడు. 1987లోనే ఈ మూవీ షూట్ స్టార్ట్ కాగా అనేక వాయిదాలు పడుతూ 1995లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రేమ్ సినిమా సెట్స్లోనే నటుడు సంజయ్ కపూర్తో టబు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. అయితే ఈ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. తెలుగు స్టార్ హీరో నాగార్జునతో టబు చాలా కాలం పాటు రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పదేళ్ల పాటు వీరు డేటింగ్లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. తాము మంచి స్నేహితులమని పలుమార్లు చెప్పినప్పటికీ ఎవరూ విశ్వసించలేదు. ఆ తర్వాత నిర్మాత సాజిద్ నడియాద్వాలాతో టబు ప్రేమాయణం సాగించింది. అతడి భార్య, నటి దివ్య భారతి మరణం తర్వాత వీరిద్దరు దగ్గరయ్యారు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్తోనూ టబు గాఢంగా ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాము 25 ఏళ్లుగా మంచి స్నేహితులమని, ఎలాంటి విషయాలనైనా షేర్ చేసుకునేంత చనువు తమ మధ్య ఉందని టబు వాటిని కొట్టిపారేసింది. అయితే అజయ్తో ఉన్న రిలేషన్ వల్లే టబు ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని బీటౌన్లో రూమర్లు ఉన్నాయి. 'భోలా' సినిమా ప్రమోషన్స్ సమయంలో టబుతో రిలేషన్పై అజయ్ దేవ్గన్ కూడా మాట్లాడారు. టీనేజ్ నుంచి ఒకరికొకరం తెలుసని, తమ మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్షిప్ ఉందని, ఒక్కోసారి తిట్టుకుంటామని కూడా వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ జింకను వేటాడిన కేసులో టబు పేరు కూడా వినిపించింది. 1998లో 'హమ్ సాథ్ సాథ్' షూటింగ్ సమయంలో ఈ ఘటన జరగ్గా ఆ సమయంలో టబు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం టబును నిర్దోషిగా పోలీసులు విడుదల చేశారు. తెరపై నిజమైన కన్నీళ్లు పెట్టే నటీమణులు చాలా మంది ఉన్నారు. కానీ టబు అలా కాదట. కెమెరా ముందు తాను నిజమైన కన్నీళ్లు పెట్టలేనని ఓ ఇంటర్వ్యూలో టబు చెప్పింది. అందుకే సెంటిమెంట్ సీన్స్లో తప్పనిసరిగా గ్లిజరిన్ వాడతానని తెలిపింది. ప్రస్తుతం టబు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలోనూ నటిస్తూ ట్రెండ్కు తగ్గట్లు దూసుకెళ్తోంది. 54 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల హీరోయిన్గా కనిపిస్తూ మెపిస్తోంది.నవంబర్ 04 , 2024
- Pushpa 2: రష్యా అధ్యక్షుడి నోట ఇండియన్ సినిమా మాట.. ‘పుష్ప 2’కి భారీ హైప్!భారతీయ సినిమాల ఖ్యాతీ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. గతంలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు ఇండియన్ స్టార్స్కు అసలు అహ్వానం వచ్చేవి కావు. గత కొన్నేళ్ల నుంచి ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాతి నుంచి విదేశాల్లోనూ మన భారతీయ చిత్రాలకు క్రేజ్ పెరిగింది. ఇందుకు అనుగుణంగా జపాన్, చైనా, రష్యా ఇలా విదేశీ భాషల్లోనూ మన సినిమాలు డబ్ అయ్యి అక్కడ నేరుగా రిలీజవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారతీయ సినీ పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పుతిన్ ఏమన్నారంటే? ఇండియా సభ్యదేశంగా ఉన్న ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ (BRICS) ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలో జరగనుంది. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రిక్స్ సభ్యదేశాలకు రష్యాలో తీయబోయే చిత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారా అన్న ప్రశ్నకు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉందని పుతిన్ తెలిపారు. 24 గంటలూ ఇండియన్ మూవీస్ వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్ సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. తమకు భారతీయ చిత్రాలంటే ఎంతో ఆసక్తి అని స్పష్టం చేశారు. ఇండియన్ మూవీస్ను రష్యాలో ప్రదర్శించడానికి తాము సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. వారి చిత్రాలను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. దీనిపై భారత ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు. https://twitter.com/RT_com/status/1847495389303144506 ‘పుష్ప’ దెబ్బకి రష్యన్లు ఫిదా! ఇటీవల కాలంలో భారతీయ చిత్రాలను రష్యన్లు ఎంతో ఆదరిస్తున్నారు. పుతిన్ తాజా వ్యాఖ్యలతో ఆ దేశంలో భారతీయ సినిమాల మార్కెట్ అమాంతం పెరగనుంది. అయితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రాన్ని 2021 డిసెంబర్ 8న రష్యాలో నేరుగా రిలీజ్ చేశారు. అక్కడి ప్రేక్షకులు పుష్ప చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. 774 స్కీన్లలో 25 రోజుల పాటు పుష్ప విజయవంతంగా ఆడింది. తద్వారా 10 మిలియన్ రూబెల్స్ను కలెక్ట్ చేసింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 13 కోట్లకు సమానం. అంతేకాదు రష్యాలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగానూ ‘పుష్ప’ రికార్డు సాధించింది. ‘పుష్ప 2’కి కలిసి రానుందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ లేటెస్ట్ కామెంట్స్ ‘పుష్ప 2’ టీమ్కు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చి ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లే లక్ష్యంగా ‘పుష్ప 2’ డిసెంబర్ 6న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రష్యాలో ‘పుష్ప’కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారతీయ సినిమాల ప్రమోషన్స్కు తాము సహకరిస్తారమని పుతిన్ సైతం తాజాగా స్ఫష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ‘పుష్ప 2’ని రష్యాలో గ్రాండ్గా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్తో పాటు ఫిల్మ్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఓవర్సీస్ రిలీజ్లో భాగంగా రష్యన్ భాషలోనూ ‘పుష్ప 2’ని డబ్ చేసి విడుదల చేస్తే అది మూవీ కలెక్షన్స్పై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి పుష్ప టీమ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి. హైప్ పెంచేసిన దేవిశ్రీ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందన్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్ అదిరిపోతుందంటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. లాక్ అయిన సినిమా ఫస్టాఫ్ను ఇప్పటికే తాము చూశామని, చాలా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్లో ఉందని చెప్పారు. ఫస్టాఫ్లోనే మూడు చోట్ల ఇంటర్వెల్ లెవల్ హై ఇచ్చే సీన్లు ఉన్నాయన్నారు. సుకుమార్ ఈ సినిమాను రాసిన విధానం, తీసిన తీరు, అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతం అంటూ సినిమాపై హైప్ పెంచేశారు. అటు 'పుష్ప 2' నేపథ్య సంగీతం కూడా తగ్గేదేలే అన్నట్లు ఉంటుందని చెప్పారు. https://twitter.com/Cinema__Factory/status/1845798162478272773 మృణాల్తో ఐటెం సాంగ్! ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మృణాల్ ఠాకూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పుష్ప టీమ్ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతకుముందుకు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్కు ఎంపిక చేసినట్లు కథనాలు వచ్చాయి. ఆమెను కాదని మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నట్లు ప్రచారమూ జరిగింది. ఇప్పుడేమో మృణాల్ ఠాకూర్ అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. https://twitter.com/villan_97/status/1845762894119801258అక్టోబర్ 19 , 2024

Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్ 3’.. సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు : అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, విజయ్ వర్మ, రాశిక దుగల్, హర్షిత గౌర్, షాజీ చౌదతరి తదితరులు
దర్శకులు : గుర్మిత్ సింగ్, ఆనంద్ అయ్యర్
సినిమాటోగ్రాఫర్ : సంజయ్ కపూర్
నిర్మాత : ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వాని
విడుదల తేదీ : జులై 5, 2024
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్లలో 'మీర్జాపూర్' (Mirzapur) ఒకటి. 2018లో తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు రాగా.. దానికి కొనసాగింపుగా 2020లో రెండో సీజన్ రిలీజైంది. ఈ రెండూ అంచనాలకు మించి సక్సెస్ కావడం, వీటిలోని బోల్డ్ కంటెంట్, డైలాగ్స్ యూత్ను ఆకట్టుకోవడంతో.. థర్డ్ సీజన్పై అందరి దృష్టి ఏర్పడింది. మూడో పార్ట్ కోసం యూత్తోపాటు ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘మిర్జాపూర్ సీజన్ 3’ (Mirzapur Season 3 Review) అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్లోకి వచ్చింది. 10 ఎపిసోడ్స్తో కూడిన ఈ మూడో సీజన్.. హిందీ, తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రసారం అవుతోంది. మరి గత సీజన్లలాగే మూడో పార్ట్ కూడా ఆకట్టుకుందా? అందరి అంచనాలను అందుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
గత సీజన్లలో ఏం జరిగిందంటే?
మీర్జాపూర్ మొదటి సీజన్లో గుడ్డు భయ్యా (అలీ ఫజల్), బబ్లూ పండిత్ (విక్రాంత్ మాస్సే) అనే ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) కోసం పనిచేయడం చూపించారు. ఆ సీజన్ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని పారిపోతాడు. దీంతో సీజన్ 2 ముగుస్తుంది. సరిగ్గా అక్కడి నుంచే సీజన్- 3 ప్రారంభం అవుతుంది.
మీర్జాపూర్ సీజన్ 3 కథేంటి
కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్కు కొత్త డాన్గా గుడ్డు భయ్యా అవతరిస్తాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్గా ఉంటుంది. మిర్జాపూర్ సీజన్ 2లో కాలీన్ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా, గుడ్డూ మధ్య ఘర్షణ మెుదలవుతుంది. మరోవైపు మున్నా భార్య సీఎం మాధురి (ఇషా తల్వార్) కూడా గుడ్డూ భయ్యాను బలహీనపరిచేందుకు శరద్ శుక్లాతో చేతులు కలుపుతుంది. అటు కాలిన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) కూడా మిర్జాపూర్ పీఠం కోసం అనూహ్యంగా తెరపైకి వస్తాడు. ఈ విపత్కర పరిస్థితులను గుడ్డూ భయ్యా ఎలా ఎదుర్కొన్నాడు? గుడ్డూ షూట్ చేశాక కూడా కాలిన్ ఎలా తిరిగొచ్చాడు? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలన్న సీఎం మాధురి లక్ష్యం నెరవేరిందా? లేదా? తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్ మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరాశపరచలేదు. గత సీజన్లలో కంటే ఇందులో ఆమె పాత్ర మెప్పిస్తుంది. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోసింది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. ఫజల్ అలీ తర్వాత ఆ స్థాయిలో విజయ్ వర్మ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా తన మార్క్ నటనతో మెప్పించారు. మిగిలిన పాత్రదారులు.. తమ రోల్స్కు పూర్తిగా న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
గత సీజన్లతో పోలిస్తే ఈసారి పొలిటికల్ డ్రామాను దర్శకులు ఎక్కువగా చూపించారు. డ్రామా అంతా మంచి ఇంటెన్స్గా క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్తో డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. మీర్జాపూర్ను దక్కించుకునే క్రమంలో వేసే ఎత్తులు, పైఎత్తులు, కుయుక్తులను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు, కొన్ని సస్పెన్స్ ఫ్యాక్టర్స్ ఆకట్టుకుంటాయి. అయితే మీర్జాపూర్ సిరీస్కు కేరాఫ్గా మారిన హింసను మాత్రం సీజన్లో చాలా వరకూ తగ్గించేశారు. అలాగే మున్నా భయ్యా పాత్ర లేకపోవడం, కాలిన్ భయ్యా పాత్రకు పెద్దగా స్కోప్ ఇవ్వకపోవడం ఈ సీజన్కు పెద్ద మైనస్గా మారింది. పైగా ఒక్కో ఎపిసోడ్ 45-50 నిమిషాలు ఉండటంతో సాగదీసిన ఫీలింగ్ కలిగింది. ఒకప్పటిలా బోల్డ్ డైలాగ్స్ కూడా లేకపోవడం యూత్కు నిరాశకు గురిచేయవచ్చు. ఇక కథలో నెక్స్ట్ ఏంటీ అన్న క్యూరియాసిటీ రగిలించడంలోనూ డైరెక్టర్స్ ఫెయిల్ అయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మీర్జాపూర్ సీజన్ 3 ఆకట్టుకుంటుంది. కానీ, మునుపటి సీజన్లతో ఈ సిరీస్ను పోలిస్తే మాత్రం వీక్షకులకు ఎదురుదెబ్బ తప్పదు.
టెక్నికల్గా..
సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సన్నివేశాల్లో లీనమయ్యేందుకు ఇది దోహదం చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని కలిగించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువ మాత్రం ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారగణం నటనట్విస్టులతో కూడిన పొలిటికల్ డ్రామానేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ఆశించిన స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడంసాగదీత సన్నివేశాలు గత సీజన్లతో పోలిస్తే యూత్ను అట్రాక్ట్ చేసిన బోల్డ్ డైలాగ్స్ లేకపోవడం
Telugu.yousay.tv Rating :3/5
జూలై 05 , 2024
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ (Prabhas Upcoming Movies) లో పెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ షూటింగ్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్లో ‘ఫౌజీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే విధంగా ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు సాలిడ్ ప్రాజెక్ట్స్కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్కు ఒక స్టార్ డైరెక్టర్తో ప్రభాస్ తన సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేయనున్న చిత్రాలు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో..
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘మాస్టర్’, ‘లియో’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించి లోకేష్ కనగరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్తో 'కూలీ' అనే చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం హీరో కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నాడు. దాని తర్వాతనే ప్రభాస్-లోకేష్ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
హిందీ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీతో..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ (Rajkumar Hirani)తో సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కల అతి త్వరలోనే నెరవేరే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్కుమార్ హిరానీ - ప్రభాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నట్లు బీటౌన్లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’,’ పీకే’, ‘సంజు’, ‘డుంకీ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్కు సైతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరి కాంబోలో సినిమా పడితే అన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో..
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ప్రభాస్ మరో చిత్రం (Prabhas Upcoming Movies) చేయనునున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘సలార్’ (Salaar) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్ కటౌట్ తగ్గ యాక్షన్ సీన్స్తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాకు సీక్వెల్గా ‘సలార్ 2’ రానున్నట్లు గతంలోనే ప్రశాంత్ నీల్ ప్రకటించారు. సలార్ మూవీ ఎండింగ్లో సెకండ్ పార్ట్కు సంబంధించిన లింక్ కూడా చూపించారు. అయితే ఇటీవల తారక్ - ప్రశాంత్ నీల్ కాంబోలో 'NTR 31' ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత 'సలార్ 2'ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ యూనివర్స్లోకి ప్రభాస్!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు. అటువంటి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సినిమా చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి ప్రభాస్ పచ్చజెండా ఊపడంతో ఈ కలయికలో సినిమా రావడం కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు రంగం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుంత ప్రశాంత్ వర్మ చేతిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జై హనుమాన్’ (Jai Hanuman)తో పాటు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ చిత్రాన్ని ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రభాస్తో సినిమా ఉంటుందని సన్నిహిత చెబుతున్నాయి.
నవంబర్ 05 , 2024
NTR 31: ట్రెండ్ బ్రేక్ చేసిన తారక్-ప్రశాంత్ నీల్.. ఎలాగంటే?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ అంతా తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తద్వారా తమ మూవీ కలెక్షన్స్ను అమాంతం పెంచుకుంటున్నారు. అదే సమయంలో సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ‘బాహుబలి’తో మెుదలైన ఈ పరంపర ప్రస్తుతం పీక్స్కు చేరుకుంది. ‘పుష్ప’, ‘సలార్’, హనుమాన్, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ వంటి చిత్రాలు రెండు పార్ట్స్గా రాబోతున్నాయి. పవర్స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సైతం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ఈ సీక్వెల్ ఫార్ములాకు జూ.ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సింగిల్ పార్ట్గా..
‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్కు కేరాఫ్గా మారిన ప్రశాంత్ నీల్ నుంచి సినిమా వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కూడా రెండు భాగాలుగా వస్తుందని అంతా భావించారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ‘కేజీఎఫ్’ రెండు భాగాలుగా రాగా, ‘సలార్’కు సీక్వెల్ కూడా ఉండనుండటంతో ఈ అభిప్రాయానికి వచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్ పార్ట్గా తీసుకురావాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించారట. సింగిల్ పార్ట్లోనే కంప్లీట్ చేయాలని ఆయన భావిస్తున్నారట. అంతేకాదు మరీ లెంగ్తీగా కాకుండా రన్ టైమ్ విషయంలోనూ తారక్-ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
సీక్వెల్స్ అవసరమా!
దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ (Baahubali) చిత్రంతో ఈ సీక్వెల్స్కు పునాది వేశారు. అప్పటినుంచి తెలుగులో వరుసపెట్టి సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. ముందుగా చెప్పుకున్నట్లు ‘పుష్ప’, ‘సలార్’, హనుమాన్, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే కథ పెద్దగా ఉండి సింగిల్ పార్ట్లో చెప్పడానికి వీలుకానప్పుడు సీక్వెల్స్ ప్లాన్ చేయడంలో తప్పు లేదు. ప్రేక్షకులు సైతం దీనిని స్వాగతిస్తారు. కానీ కథలో దమ్ము లేకుండా అధిక కలెక్షన్స్ రాబట్టాలన్న ఉద్దేశ్యంతో సీక్వెల్స్కు ప్లాన్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. దేవర విషయంలో ఇదే జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కథ పరంగా చూస్తే రెండు పార్టులుగా తీసేంత స్టఫ్ అందులో లేదని తొలి రోజు నుంచి నెటిజన్లు చెబుతూ వచ్చారు. తారక్ వన్ మ్యాన్ షో, అనిరుధ్ మ్యూజిక్తో సినిమా కలెక్షన్స్ పరంగా బాగా నెట్టుకొచ్చిందని పేర్కొన్నారు. కానీ తమ డబ్బులకు మాత్రం న్యాయం జరగలేదన్న ఫీలింగ్లో మెజారిటీ ఆడియన్స్ ఉన్నారు. ఇది గమనించిన ‘NTR 31’ ఆ రిస్క్ తీసుకోవద్దని భావించినట్లు సమాచారం.
ఎదురుచూపులకు చెక్
సాధారణంగా భారీ సక్సెస్ అందుకున్న చిత్రాలకే దర్శకులు సీక్వెల్స్ తీస్తుంటారు. రెండో పార్ట్కు సంబంధించిన సర్ప్రైజింగ్ లింక్ను తొలి భాగం ఎండ్లో పెట్టడం ద్వారా సీక్వెల్పై భారీగా అంచనాలు పెంచేస్తారు. ‘బాహుబలి’ నుంచి ఇది అందరూ చూస్తూ వచ్చిందే. అయితే కథను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆడియన్స్లో సదరు సినిమాపై పూర్తి సంతృప్తి అనేది వస్తుంది. ప్రస్తుతం సీక్వెల్స్ పరంపర కొనసాగుతుండటంతో రెండో భాగం చూస్తేనే అసలు కథ అంటే ఆడియన్స్కు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో పార్ట్ కోసం వారు నెలలు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా ఎదురు చూసి చూసి ఓ దశలో ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురయ్యే ప్రమాదం ఉంది. సెకండ్ పార్ట్స్ చూడాలన్న ఆసక్తి తమలో సన్నగిల్లుతున్నట్లు ఆడియన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘NTR 31’ విషయంలో తారక్- ప్రశాంత్ నీల్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
నవంబర్లో షూటింగ్!
NTR 31కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కథ కూడా ఆమ్మౌస్ట్ పూర్తైనట్లు సమాచారం. ఇందులో తారక్కు జోడీగా రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నవంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో తారక్ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. 2026 జనవరిలో 9న ఈ మూవీని లాంచ్ చేయాలని ప్రశాంత్ నీల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్. అందుకు తగ్గట్లు శరవేగంగా ఈ చిత్రాన్ని ఆయన ఫినిష్ చేస్తారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బంగ్లాదేశ్ నేపథ్యంలో..
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్ను రెండు వేరియేషన్స్లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
ఆ మూవీస్ తర్వాత సెట్స్పైకి!
తారక్ బాలీవుడ్లో ‘వార్ 2’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్లోనూ తారక్ పాల్గొన్నాడు. ఈ సినిమాలో తన కోటా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ‘NTR 31’ను పట్టాలెక్కించాలని తారక్ భావిస్తున్నట్లు సమాచారం. ‘వార్ 2’ పూర్తయితే ఇక పూర్తిస్థాయిలో ప్రశాంత్ నీల్కు డేట్స్ అడ్డస్ట్ చేయవచ్చని తారక్ అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్టోబర్ 09 , 2024
Top TV Hosts In South India: సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న బుల్లితెర భామలు వీరే!
దక్షిణాదిలో వెండితెరకు సమానంగా బుల్లితెర ఎదుగుతోంది. ఎంతో మంది మహిళా యాంకర్లు, సీరియల్ నటీమణులు టెలివిజన్ ఆడియన్స్ను అలరిస్తున్నారు. అదే సమయంలో సినిమా ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సక్సెస్ మీట్లకు హోస్ట్గా వ్యవహరిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. కొందరు సీనియర్ యాంకర్లు తమ మాటలతో మంచి గుర్తింపు సంపాదించగా.. ఇంకొందరు తమ బ్యూటీతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్ షో చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకొని పై స్థాయికి ఎదుగుతున్నారు. ఇలా దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ యాంకర్లు, నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మంజూష (Manjusha)
హీరోయిన్ మెటీరియల్లా అనిపించే యాంకర్ మంజూష.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. తన గ్లామర్ షోతో కుర్రకారు మతులు పొగొట్టే ఈ భామ.. ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్లు టీవీ, రియాలిటీ షోలలో కనిపిస్తుంటారు కానీ.. మంజూష మాత్రం సినిమా ఈవెంట్లకు మాత్రమే పరిమితమవుతూ వస్తోంది.
వర్షిణి (Varshini)
అందాల ఆరబోతలో అనసూయ, రష్మీలకు ఈ మధ్య కాలంలో యాంకర్ వర్షిణీ గట్టి పోటీ ఇస్తోంది. పటాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన వర్షిణి.. పలు సినిమాల్లోనూ నటించింది. ‘చందమామ కథలు’, ‘లవర్స్’, ‘మళ్లీ మెుదలైంది’, రీసెంట్గా ‘భాగ్ సాలే’ చిత్రాల్లో వర్షిణి మెరిసింది.
విష్ణు ప్రియ (Vishnu Priya)
తెలుగులో డ్యాన్స్ అద్భుతంగా చేసే అతికొద్ది మంది యాంకర్లలో ‘విష్ణుప్రియ’ ఒకరు. ఈ భామ కూడా ఒంపుసొంపులను ఒలికించడంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా యూట్యూబ్లో డ్యాన్సింగ్ ఆల్బమ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
అషూ రెడ్డి (Ashu reddy)
ఇన్స్టాగ్రామ్లో డబ్స్మాష్ వీడియోలు పోస్టు చేస్తూ కెరీర్ను ప్రారంభించిన అషూ రెడ్డి.. తన వీడియోలతో చాలా ఫేమస్ అయ్యింది. 'ఛల్ మోహన్ రంగా' వెండి తెరపై ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు బిగ్బాస్ సీజన్ 3లో కనిపించి అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే షోలలో కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.
సౌమ్యరావు (Sowmya rao)
జబర్దస్త్ షో ద్వారా తెలుగులో ఫేమస్ అయిన కన్నడ భామ సౌమ్య రావు.. తన కెరీర్ను తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రారంభించింది. 'రోజా' అనే సీరియల్లో తొలిసారి నటించి మెప్పించింది. తెలుగులో శ్రీమంతుడు సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై గ్లామర్గా మెరిసిపోతూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
శ్యామల (Shyamala)
అసూయపడే అందం, అలరించే యాంకరింగ్తో శ్యామల.. సుదీర్ఘ కాలంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటి సీరియళ్లలో అదిరిపోయే నటన కనబరిచినా శ్యామలా.. ఆ తర్వాత యాంకర్గా మారింది. 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ శ్యామల దూసుకెళ్తోంది.
దీప్తి నల్లమోతు (Deepthi Nallamothu)
కెరీర్ ప్రారంభంలో ఓ న్యూస్ ఛానెల్లో పనిచేసిన దీప్తి నల్లమోతు.. ఔనా.. నిజమా? అన్న డైలాగ్తో చాలా ఫేమస్ అయ్యింది. అంతకుముందు రవితేజ 'భద్ర' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బిగ్బాస్ తెలుగు సీజన్ 2లో హౌస్మేట్గా అడుగుపెట్టి తనకంటూ మంచి పేరు సంపాదించింది.
అనసూయ (Anasuya)
యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన గ్లామర్తో షోకే అందాన్ని తీసుకొచ్చింది. ఆ షో సూపర్ హిట్ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. జబర్దస్త్ క్రేజ్తో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్ బ్యూటీ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప’లో దాక్షాయణి పాత్రల్లో మెప్పించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
రష్మి (Rashmi)
జబర్దస్త్ షో (Jabardasth) ద్వారానే మంచి క్రేజ్ సంపాదించుకున్న మరో యాంకర్ రష్మి. జబర్దస్త్ స్కిట్లతో పాటు రష్మి అందాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి రీసెంట్ మూవీ భోళా శంకర్లోనూ రష్మి నటించింది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఈ చిన్నది అలరిస్తోంది.
శ్రీముఖి (Srimukhi)
యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోసే బుల్లితెర యాంకర్ ‘శ్రీముఖి’. వినోదాన్ని పంచే విషయంలో వారిద్దరి కంటే శ్రీముఖి ఓ మెట్టు పైనే ఉంటుంది. ఈ భామ కూడా తన గ్లామర్తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. జీ తెలుగు, స్టార్ మా వంటి ఛానెళ్లలో వచ్చే పలు షోలకు యాంకర్గా వ్యవహరిస్తూ శ్రీముఖి దూసుకెళ్తోంది. మధ్య మధ్యలో సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది.
వింధ్య (Vindhya)
తెలుగు యాంకర్లు అందరిదీ ఒక లెక్క అయితే.. వింధ్యది మరో లెక్క. తెలుగులో ఏకైక మహిళా స్పోర్ట్స్ యాంకర్ ఈమెనే. ఐపీఎల్ వచ్చినా, ప్రో కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్య తన యాంకరింగ్తో కనువిందు చేస్తుంటుంది. తన హాట్నెస్తో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది.
రచిత (Rachitha)
ప్రముఖ సీరియల్ నటి రచిత మహాలక్ష్మీ.. తన కెరీర్ను మోడల్గా ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన రచిత.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు, సీరియళ్లలో నటించింది. తెలుగులో ‘స్వాతి చినుకులు’ సీరియల్ ద్వారా ఎనలేని ఖ్యాతిని సంపాదించింది. ఆ సీరియల్ ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా నడిచిందంటే అందుకు కారణం రచిత అని చెప్పవచ్చు.
పల్లవి రామిశెట్టి (Pallavi Ramisetty)
బుల్లి తెరపై కనిపించే అందమైన సీరియల్ నటీమణుల్లో పల్లవి రామిశెట్టి ఒకరు. ‘ఆడదే ఆధారం’, ‘అత్తారింటికి దారేది’, ‘మాటే మంత్రం’, ‘పాపే మా జీవన జ్యోతి’ వంటి ప్రముఖ సీరియళ్లలో పల్లవి నటించింది. ‘అలీ 369’, ‘స్టార్ మహిళా’, ‘క్యాష్’ వంటి టెలివిజన్ షోలలోనూ ఈమె పాల్గొంది.
ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath)
‘కార్తిక దీపం’ సీరియల్తో ప్రేమి విశ్వనాథ్ చాలా పాపులర్ అయ్యారు. కేరళకు చెందిన ప్రేమి.. ‘కరుతముత్తు’ అనే మలయాళ సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. తెలుగులో గోరింటాకు, చెల్లెలి కాపురం వంటి సీరియళ్లలో అతిథి పాత్రలు పోషించింది. ‘మా ఉగాది వేడుక’, ‘మా వరలక్ష్మీ వ్రతం’ వంటి స్పెషల్ షోలలోను కనిపించి సందడి చేసింది.
ప్రీతి అస్రాని (Preeti Asrani)
గుజరాత్కు చెందిన ప్రీతి అస్రాని.. ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’, ‘మళ్లీ రావా’ వంటి చిత్రాల్లో చేసింది. 2016లో ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్ ద్వారా బుల్లితెరలోకి అడుపెట్టింది. ఇటీవల ‘9 అవర్స్’, ‘వ్యూహాం’ వంటి సిరీస్లలోనూ ప్రీతి మెరిసింది.
వరలక్ష్మీ శరత్కుమార్ (Varalakshmi Sarathkumar)
ప్రముఖ స్టార్ జంట రాధిక - శరత్కుమార్ల తనయ వరలక్ష్మీ.. పలు సందర్భాల్లో బుల్లితెరపై మెరిసింది. జయ టీవీలో వచ్చిన 'ఉన్నాయ్ అరింధాల్' షోకు హోస్ట్గా వ్యవహించింది. అలాగే కలర్స్ తమిళ్ ఛానెల్లో వచ్చిన 'ఎంగ వీటు మపిల్లాయ్' షోలోనూ మెరిసింది. రీసెంట్గా తెలుగు వచ్చిన ‘హనుమాన్’ (Hanuman Movie)లో కీలక పాత్ర పోషించి వరలక్ష్మీ అందరి దృష్టిని ఆకర్షించింది.
వైష్ణవి గౌడ (Vaishnavi Gowda)
కన్నడలో బాగా పాపులర్ అయిన అందమైన బుల్లితెర నటీమణుల్లో వైష్ణవి గౌడ ఒకరు. ‘అగ్నిసాక్షి’ సీరియల్లో సన్నిధి పాత్రను పోషించి మెప్పించింది. బిగ్బాస్ కన్నడ సీజన్ 8లో హౌస్మేట్గా వెళ్లి తన క్రేజ్ను మరింత పెంచుకుంది.
దీపికా దాస్ (Deepika Das)
కర్ణాటకకు చెందిన దీపికా దాస్.. అక్కడ సీరియళ్లలో నటించి చాలా ఫేమస్ అయ్యింది. 2016లో వచ్చిన 'నాగిని' సీరియల్తో దీపిక బుల్లితెరపై అరంగేట్రం చేసింది. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో 2017లో 'డ్రీమ్ గర్ల్' అనే కన్నడ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.
ఫిబ్రవరి 22 , 2024

గుండె జారి గల్లంతయ్యిందే
రొమాన్స్
19 ఏప్రిల్ 2013 న విడుదలైంది

మీర్జాపూర్ సీజన్ 3
05 జూలై 2024 న విడుదలైంది

ఇండియన్ పోలీస్ ఫోర్స్
19 జనవరి 2024 న విడుదలైంది

చమక్
07 డిసెంబర్ 2023 న విడుదలైంది

రన్ బేబీ రన్
03 ఫిబ్రవరి 2023 న విడుదలైంది

మీర్జాపూర్ సీజన్ 2
23 అక్టోబర్ 2020 న విడుదలైంది

రాజా చెయ్యి వేస్తే
29 ఏప్రిల్ 2016 న విడుదలైంది
.jpeg)
మైనే ప్యార్ కియా
20 జూన్ 2014 న విడుదలైంది

గుండె జారి గల్లంతయ్యిందే
19 ఏప్రిల్ 2013 న విడుదలైంది
ఇషా తల్వార్ తల్లిదండ్రులు ఎవరు?
సుమన్ తల్వార్, వినోద్ తల్వార్
ఇషా తల్వార్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
విశాల్ తల్వార్
ఇషా తల్వార్ Family Pictures
ఇషా తల్వార్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
ఇషాా తల్వార్ ప్రధానంగా మీర్జాపూర్వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది.
ఇషా తల్వార్ లీడ్ రోల్లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో ఇషా తల్వార్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
ఇషా తల్వార్ కెరీర్లో అత్యత్తుమ పాత్ర ఏది?
మీర్జాపూర్వెబ్ సిరీస్లో ఆమె చేసిన మాధురి యాదర్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు అందించింది.
ఇషా తల్వార్ బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వీడియోలు?
ఇషా తల్వార్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇషా తల్వార్ ఒక్కో చిత్రానికి రూ. 40LAKHS వరకు ఛార్జ్ చేస్తోంది.
ఇషా తల్వార్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
నాన్ వెజ్
ఇషా తల్వార్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
ఇషా తల్వార్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
ఇంగ్లీష్, హిందీ
ఇషా తల్వార్ ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లాక్
ఇషా తల్వార్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
కేరళ
ఇషా తల్వార్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
ఇషా తల్వార్ సోషల్ మీడియా లింక్స్
ఇషా తల్వార్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
అమృత TV ఫిల్మ్ అవార్డ్ - 2013
తట్టతిన్ మరయతు చిత్రానికి గాను ఉత్తమ నటిం అవార్డు
ఏషియావిజన్ అవార్డ్ ఫర్ న్యూ సెన్సేషన్ ఇన్ యాక్టింగ్ - 2013
తట్టతిన్ మరాయతు
ఉత్తమ తొలి నటిగా ఖతార్లో ఇండియన్ మూవీ అవార్డ్ - 2013
తట్టతిన్ మరాయతు
ఇషా తల్వార్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
పిజా హట్,, మ్యాగి హాట్ హెడ్స్, డీలక్స్ పేయింట్స్, కయా స్కిన్ క్లినిక్ వంటి వాణిజ్య ప్రకటనల్లో నటించింది.
ఇషా తల్వార్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఇషా తల్వార్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్తో ఇక్కడ తెలుసుకోండి.