శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో టోకెన్ రహిత సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, నిన్న (శనివారం) శ్రీవారిని 81,655 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 38,882 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.