• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీధి కుక్కల దాడితో వ్యాపారవేత్త మృతి

    ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరాగ్‌ దేశాయ్‌(49) కన్నుమూశారు. మెదడులో తీవ్ర రక్తస్రావం వల్ల ఆదివారం ఆయన మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతవారం ఇంటికి సమీపంలో వీధి కుక్కలు దాడి చేయడంతో పరాగ్‌ దేశాయ్‌ కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరాగ్‌ మరణించారు. పరాగ్‌ మృతిపై రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.