• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WPL: గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం

    WPL: గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు బ్యాటర్ సోఫీ డివైన్ (99) స్వైర విహారం చేసింది. 9 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. అయితే దురదృష్టవశాత్తు సెంచరీకి ఒక పరుగు ముందే సోఫీ ఔట్‌ అయింది. అటు 37 పరుగులతో కెప్టెన్‌ స్మృతి మందనా రాణించారు. ఈ మ్యాచ్‌ ద్వారా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ రెండో విజయాన్ని నమోదు చేసింది.

    WPL: దుమ్మురేపిన గుజరాత్‌ బ్యాటర్లు

    WPL: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 4వికెట్లు నష్టానికి 188 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లపై గుజరాత్‌ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. గుజరాత్‌ బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్ (68),ఆష్లీ గార్డనర్ (41), మేఘన (31) రాణించారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2 వికెట్ల తీయగా, ప్రీతి బోస్‌, సోఫీ డివైన్ తలో వికెట్‌ పడగొట్టారు.

    ముంబయిపై 5 వికెట్ల తేడాతో యూపీ గెలుపు

    WPL: ముంబయి వరుస విజయాలకు యూపీ వారియర్స్‌ బ్రేకులు వేసింది. ముంబయి ఇండియన్స్‌ ఉమెన్‌ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 127 పరుగులను యూపీ జట్టు ఛేదించింది. యూపీ బ్యాటర్లలో తహ్లియా మెక్‌గ్రాత్ (38), గ్రేస్ హారిస్ (39) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లకు 127 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ముంబయి బ్యాటర్లలో హేలీ మాథ్యూస్ (35), వాంగ్ (32) రాణించారు. కాగా, WPLలో ముంబయి జట్టుకు ఇదే తొలి ఓటమి.