• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంటింటికి కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డుల పంపిణీ

    వికారాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌ 6 గ్యారంటీ కార్డుల పంపిణీ చేశారు. ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ అందివ్వనున్న 6 గ్యారంటీలను ప్రజలకు ఆయన వివరించారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తికాకపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. ఆడబిడ్డ ఆత్మహత్యపై కేటీఆర్‌ అబద్దాలు చెబుతున్నారన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించడంటూ ఓటర్లను కోరారు.

    కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీకొట్టారు: జానా రెడ్డి

    కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామని జానారెడ్డి అన్నారు. ‘మా పథకాలను చూసి కేసీఆర్‌ తన పథకాలను మార్చుకున్నారు. మేనిఫెస్టోలో వచ్చిన పథకాలను కాంగ్రెస్ పార్టీని చూసి భయపడే వచ్చినవే. మేము చెప్పింది చేస్తాం. నిజంగా పథకాలు అమలులోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలి’ అని జానా రెడ్డి అన్నారు. మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి కేసీఆర్‌కు చలి జ్వరం పుట్టుకొచ్చిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే మేనిఫెస్టోను కాపీ కొట్టారన్నారు.