• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీజేపీ రెండో జాబితా విడుదల

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మహబూబ్‌నగర్ అసెంబ్లీకి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. త్వరలోనే పూర్తిస్థాయి జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అయితే ప్లాన్ ప్రకారమే బీజేపీ రెండో జాబితాలో ఒక్క అభ్యర్థి పేరు మాత్రమే ప్రకటించిందని టాక్ నడుస్తోంది.

    కిలోల కొద్ది బంగారం, వెండి సీజ్‌

    HYD: చందానగర్ పీస్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 5.65 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. నిజాం కాలేజ్ పరిసరాల్లో చేసిన తనిఖీల్లో గేట్‌ నంబర్‌ 1 వద్ద.. 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్‌ చేశారు. ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట నారాయణమ్మ కాలేజీ మెయిన్ రోడ్డు వద్ద ఓ కారులో రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్: రేవంత్

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు విమర్శలతో ఆసక్తికర ట్వీట్ చేశారు. కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్ మొదలైందని విమర్శించారు. ‘ఇది.. దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్ డౌన్. ఇది.. కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి చేస్తున్న కౌంట్ డౌన్. ఇది.. నిలువ నీడలేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం నినదిస్తున్న కౌంట్ డౌన్. ఈ 52 రోజుల కౌంట్ డౌన్ నియంత సర్కారుకు రాస్తున్న … Read more