• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌-లావణ్య

    నటుటు వరుణ్‌ తేజ్‌ -లావణ్య త్రిపాఠిల వివాహం ఘనంగా జరిగింది. ఇటలీలోని టస్కానీ వేదికగా నిన్న రాత్రి వీరి వివాహం జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్‌ మూడుముళ్లు వేశారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి నితిన్‌, ఆయన సతీమణి షాలినీతో హాజరయ్యారు, ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు.

    రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ‘హీరోయిన్’

    రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్‌ నటి గాయత్రీ జోషి తీవ్రంగా గాయపడ్డారు. సరదాగా గడిపేందుకు గాయత్రీ ఆమె భర్తతో కలిసి ఇటలీకి వెళ్లారు. అక్కడ జరుగుతున్న లగ్జరీ కార్ల పరేడ్‌లో వీరు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో గాయత్రీ, ఆమె భర్త ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఫెరారీ కారు, వ్యాన్‌ను ఢీకొంది. దీంతో ఫెరారీ కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఇద్దరు దంపతులు మరణించారు. గాయత్రీ ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.