• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిజోరంలో ప్రశాంతంగా పోలింగ్

    మిజోరంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 52.73 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెర్చిప్‌ జిల్లాలో 60.37శాతం పోలింగ్‌ నమోదైంది. లౌంగల్లాయ్ జిల్లాలో 59.31 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

    ఆ రాష్ట్రల్లో రేపు తొలి విడత పోలింగ్

    ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. రేపు మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో పోలింగ్‌ జరుగనుంది. మిజోరంలో 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి నిన్న సాయంత్రంతో తెరపడింది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.