• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తల్లిని కూడా కలవనివ్వరా?: భువనేశ్వరి

    ఏపీ పోలీసులు తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. రాజమండ్రిలో చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారు. తల్లిని కలిసేందుకు వస్తే తప్పేంటి అని ధ్వజమెత్తారు.

    5 నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర?

    చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. ఈనెల 5న కుప్పం నుంచి ప్రారంభించి రాయలసీమ జిల్లాల్లో కొనసాగించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న భువనేశ్వరి.. టీడీపీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. స్కిల్ స్కాం కేసులో కోర్టు తీర్పును అనుసరించి బస్సు యాత్రకు ప్లాన్ చేయనున్నట్లు తెలిసింది.