• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు భారత్‌ సిద్ధం’

    2036లో ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు భారత్‌ సిద్ధంగా ఉంది ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో క్రీడా నైపుణ్యాలకు కొదవ లేదన్నారు, దేశం అనేక మంది ఛాంపియన్లను సృష్టించిందని చెప్పారు. నేడు గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది క్రీడలకు కేటాయించిన బడ్జెట్‌.. తొమ్మిదేళ్ల క్రితంనాటి బడ్జెట్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువని చెప్పారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్‌ గొప్ప ఆసక్తి కనబరుస్తోందని మోదీ పేర్కొన్నారు.

    ఒలింపిక్స్‌‌లో క్రికెట్

    అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చింది. వచ్చే ఏడాది (పారిస్‌) ఒలింపిక్స్‌లో కాకుండా.. లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ జరగనుంది. క్రికెట్‌తో పాటు ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ ఆటకు సైతం ఐఓసీ ఆమోద ముద్ర వేసింది. క్రికెట్‌ను చేర్చడం ద్వారా ఒలింపిక్స్ ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు టోర్నీని మరింత విస్తృత పర్చవచ్చని ఐఓసీ భావింస్తోంది.