తెలంగాణ దేశానికే ఆదర్శం; గవర్నర్ తమిళిసై
తమ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రగతి సాధించిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ 2023 సమావేశాల సందర్భంగా గవర్నర్ శాసనసభలో ఉభయసభల నుద్దేశించి మాట్లాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్, ఇంటింటికీ నీరు, ఆసరా పెన్షన్లు, ఉచిత విద్యుత్, షాదీ ముబారక్, ఉద్యోగాల భర్తీ, మహిళలకు రిజర్వేషన్లు వంటి వాటితో గణనీయమైన అభివృద్ధి సాధించామని వివరించారు.