• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గెలిపిస్తే సికింద్రాబాద్‌ను స్వర్గం చేస్తా: కేఏ పాల్

    ఎన్నికల్లో తనను గెలిపిస్తే సికింద్రాబాద్‌ను స్వర్గం చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నేడు తుకారం గేట్‌లోని మాంగర్ బస్తీలో పాల్ ఎన్నికల ప్రచారం నిర్శహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు తన పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని కేఏ పాల్ సూచించారు.

    ‘కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు’

    తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోందని కేఏపాల్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు ఉన్నారని తెలిపారు. వారు గెలిచి మళ్లీ ఆ పార్టీలోనే చేరుతారని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్న తమ వాళ్లను గెలిపించుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు.. అలాగే తెలంగాణ జనసేన, వైసీపీ పార్టీలను కూడా కేసీఆర్ వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీలో 60శాతం మంది బీసీలకు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేఏపాల్ స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో తమ పార్టీ అభ్యుర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.