లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటలకు సెన్సెక్స్ 151 పాయింట్ల లాభంతో 66,174 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 19,858 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు ఉండడంతో మార్కెట్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్యూఎల్, సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, విప్రో, ఎంఅండ్ఎం, జేఎస్డబ్ల్యూ స్టీల్, షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. .