• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తనిఖీలో బట్టుబడ్డ రూ.300 కోట్లు

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా భారీగా డబ్బు, మద్యం, బంగారం, కానుకలు పట్టుబడుతున్నాయి. ఇలా ఇప్పటి వరకు మొత్తం రూ.307.2 కోట్లకు పైగా పట్టుబటినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే గత 24 గంటల్లో రూ.9.69కోట్ల నగదు పట్టుబడింది.

    నేడు తెలంగాణకు రాహుల్, ప్రియాంక

    నేడు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. సాయంత్రం 3:30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్న రాహుల్‌, ప్రియాంక.. బేగంపేట్‌ నుంచి హెలికాప్టర్‌లో రామప్ప టెంపుల్‌కు చేరుకోనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల తర్వాత సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రామప్ప గుడి నుంచి బయల్దేరనున్న బస్సు యాత్ర ములుగు చేరుకోనుంది. ములుగులో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్, ప్రియాంకలు ప్రసంగిస్తారు.

    నేడు మేడ్చల్, జడ్చర్లలో కేసీఆర్ సభ

    నేడు పాలమూరులో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. జడ్చర్ల, మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రజలకు వివరిస్తారు. ఈ రెండు సభలకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. జడ్చర్లలో ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు.

    ‘రూ.50 వేలకు మించి బయటకు తేవద్దు’

    తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేశారు. చందానగర్‌లో 5.5 కిలోల బంగారం పట్టుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా బంగారం సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరు కూడా 50వేలకు మించి నగదు బయటికి తీసుకురాకూడదని పోలీసులు తెలిపారు. ఒకవేళ 50 వేలకు మించి నగదుతో పాటు బంగారు నగలు బయటకు తీసుకువస్తే వెంట సరైన పత్రాలు ఉండాలి అని … Read more

    10న కాంగ్రెస్ జాబితా ఖరారు

    ఈ నెల 10న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 60 చోట్ల సింగిల్ అభ్యర్థి ఉండగా, 20 సెగ్మెంట్లలో ఇద్దరు చొప్పున.. మిగతా నియోజకవర్గాల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు. 8న స్క్రీనింగ్ కమిటీ భేటీ, 9న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నారు. 10న ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి తుది జాబితా ఖరారు చేయనున్నారు.